<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; ఆవలి తీరం</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=1&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>ప్రవాస జీవితమే కథలు రాయించింది: శేషు శర్మ</title>
		<link>http://vaakili.com/patrika/?p=1478</link>
		<comments>http://vaakili.com/patrika/?p=1478#comments</comments>
		<pubDate>Thu, 28 Feb 2013 15:36:08 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ఆవలి తీరం]]></category>
		<category><![CDATA[పూడిపెద్ది శేషు శర్మ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=1478</guid>
		<description><![CDATA[<p>నేను విజయనగరం లో పుట్టి పెరిగేను. చిన్నప్పటి నుండి సంగీతం, నాట్యం నేర్చుకోవడంతో వాటిమీద చాలా మక్కువ. ద్వారం భావనారాయణ రావు గారు సృష్టించిన సంగీత-నృత్య నాటికలలో అతి చిన్నతనం నుండి పాల్గొనడంతో, అటువంటి ప్రక్రియలంటే నాకు విపరీతమయిన అభిమానం.</p> <p>మా నాన్నగారు కీర్తిశేషులు వడ్లమాని అన్నపూర్ణేశ్వర రావు గారి అధ్వర్యంలో రాఘవ నాటకోత్సవాలలో , విజయరామ నాట కోత్సవాలలో, లెక్కలేనన్నినాటకాలను చూసాను. రావూజీ నటనలో చాతుర్యం , గణేష్ పాత్రో మాటల్లో పటుత్వం నన్ను ముగ్ధురాల్ని చేసేవి. దాంతో నాకు డ్రామా అంటే ప్రాణం. అతి పిన్న వయస్సులోనైనా యన్నార్ నంది నాటకాలు చూసినప్పుడు నేను అనుభవించిన ఉద్వేగం మాటల్లో చెప్పలేను.</p> <p>విజయనగరంలో తరచుగా కవి సమ్మేళనాలు, సాహితీ సదస్సులు జరుగుతూండడం పరిపాటి. వాటికి విసుగు విరామం లేకుండా వెళ్ళే దాన్ని. సి. నారాయణ రెడ్డి గారి కవిత్వం విని మైమరచిపోయేదాన్ని. నేను చదివిన మొట్ట మొదటి కధ అవసరాల సూర్యారావు గారి &#8220;ఊరేగింపు&#8221; . అది చదివినప్పుడు మనసంతా వికలమయ్యి పోయింది. కధ అలా ఉండాలి అనుకునే దాన్ని. చందమామలో ఎప్పుడో ప్రచురింపబడ్డ &#8220;జ్ఞాపకార్ధం&#8221; అనే కధ , శంకరమంచి సత్యం గారి &#8220;ఒక రోజు &#8220;&#8230;ఎప్పుడో, ఎవరో వ్రాసిన కధ &#8220;కుక్కతోక&#8221;, అలాంటి కధలు నాకు చాలా ఇష్టం. సోమర్సెట్ మామ్, డాస్టావస్కీ, మాపసా వాళ్ళ కధలు, నవలలు అంటే నాకు చాలా ఇష్టం.</p> <p>బాలమురళిగారి గానం నాకు అమృతం . వెంపటి వారి నృత్యం నాకు స్వర్గం. సూక్ష్మం గా చెప్పాలంటే నాకు మంచి కధ చదవడమన్నా , మంచి సినిమా చూడడమన్నా , మంచి పాట వినడమన్నా చెప్పలే నంత సంతోషం. పాటల్లో మంచి సాహిత్యాన్ని మళ్ళీ, మళ్ళీ విని ఆనందించడం అలవాటు నాకు. &#8220;మనసున మనిషై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో&#8221;.. &#8221; అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే , శోకాలా మరుగున [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/sheshu_sharma.jpg"><img class="alignleft size-full wp-image-1703" title="sheshu_sharma" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/sheshu_sharma.jpg" alt="" width="135" height="169" /></a>నేను విజయనగరం లో పుట్టి పెరిగేను. చిన్నప్పటి నుండి సంగీతం, నాట్యం నేర్చుకోవడంతో వాటిమీద చాలా మక్కువ. ద్వారం భావనారాయణ రావు గారు సృష్టించిన సంగీత-నృత్య నాటికలలో అతి చిన్నతనం నుండి పాల్గొనడంతో, అటువంటి ప్రక్రియలంటే నాకు విపరీతమయిన అభిమానం.</p>
<p>మా నాన్నగారు కీర్తిశేషులు వడ్లమాని అన్నపూర్ణేశ్వర రావు గారి అధ్వర్యంలో రాఘవ నాటకోత్సవాలలో , విజయరామ నాట కోత్సవాలలో, లెక్కలేనన్నినాటకాలను చూసాను. రావూజీ నటనలో చాతుర్యం , గణేష్ పాత్రో మాటల్లో పటుత్వం నన్ను ముగ్ధురాల్ని చేసేవి. దాంతో నాకు డ్రామా అంటే ప్రాణం. అతి పిన్న వయస్సులోనైనా యన్నార్ నంది నాటకాలు చూసినప్పుడు నేను అనుభవించిన ఉద్వేగం మాటల్లో చెప్పలేను.</p>
<p>విజయనగరంలో తరచుగా కవి సమ్మేళనాలు, సాహితీ సదస్సులు జరుగుతూండడం పరిపాటి. వాటికి విసుగు విరామం లేకుండా వెళ్ళే దాన్ని. సి. నారాయణ రెడ్డి గారి కవిత్వం విని మైమరచిపోయేదాన్ని. నేను చదివిన మొట్ట మొదటి కధ అవసరాల సూర్యారావు గారి &#8220;ఊరేగింపు&#8221; . అది చదివినప్పుడు మనసంతా వికలమయ్యి పోయింది. కధ అలా ఉండాలి అనుకునే దాన్ని. చందమామలో ఎప్పుడో ప్రచురింపబడ్డ &#8220;జ్ఞాపకార్ధం&#8221; అనే కధ , శంకరమంచి సత్యం గారి &#8220;ఒక రోజు &#8220;&#8230;ఎప్పుడో, ఎవరో వ్రాసిన కధ &#8220;కుక్కతోక&#8221;, అలాంటి కధలు నాకు చాలా ఇష్టం. సోమర్సెట్ మామ్, డాస్టావస్కీ, మాపసా వాళ్ళ కధలు, నవలలు అంటే నాకు చాలా ఇష్టం.</p>
<p>బాలమురళిగారి గానం నాకు అమృతం . వెంపటి వారి నృత్యం నాకు స్వర్గం. సూక్ష్మం గా చెప్పాలంటే నాకు మంచి కధ చదవడమన్నా , మంచి సినిమా చూడడమన్నా , మంచి పాట వినడమన్నా చెప్పలే నంత సంతోషం. పాటల్లో మంచి సాహిత్యాన్ని మళ్ళీ, మళ్ళీ విని ఆనందించడం అలవాటు నాకు. &#8220;మనసున మనిషై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో&#8221;.. &#8221; అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే , శోకాలా మరుగున దాగి సుఖమున్నదిలే&#8217;&#8230;లాంటి సాహిత్యాలు వింటూంటే గొప్ప అనుభూతి కలుగుతుంది నాకు.. అలాంటి సాహిత్యాలలో ఏదో ఒకటి నా మెదడులో నిత్యం మ్రోగుతూనే ఉంటుంది.</p>
<p>ఇకపోతే రచయిత్రిగా ఆలోచిస్తే, చిన్నప్పుడు చాలెంజ్ గా చంధోబద్ధం గా పద్యాలు వ్రాయాలని అనిపించేది. ఏవో కొన్ని పద్యాలు వ్రాసేను. అంత చెప్పుకోదగ్గవేవీ కావు. కధలు అంటూ ఎప్పుడూ వ్రాయలేదు. మెడికల్ కాలేజీ లో చేరడం, పెళ్లి చేసుకోవడం, ట్రైనింగ్ పూర్తవకుండా అమెరికా రావడం జరిగి పోవడంతో, సాహిత్యం, సంగీతం అన్నీ మూల పడ్డాయి. అమెరికాలో ట్రైనింగ్, పిల్లల్ని కనడం, పెంచడం,</p>
<p>గైనికాలజిస్టు గా పని, మెడికల్ స్టూడెంట్స్ కి చెప్పే పాఠాలు.. వీటితో రోజులు గడ చిపోయేవి. ఒక రొటీన్ అయిపోయింది జీవితం. నాకు వీలయినంతగా, సంగీత కార్యక్రమాలని, నృత్య ప్రదర్శనలని నిర్వహిస్తూ ఉండేదాన్ని.</p>
<p>2</p>
<p>ఈ దేశం వచ్చిన మొదట్లో కథలు వ్రాయాలన్న ఆలోచన అంతగా ఉండేది కాదు. కాని, అమెరికాలో స్థిరపడ్డ ఆంధ్రుల ఆచారాల్లో తేడాలు, అలవాట్లలో మార్పులు , పిల్లల తరంతో కలిగే ఇబ్బందులు, దంపతుల మధ్య జరిగే మధనాలు&#8230; ఇవన్నీ చూసినప్పుడు, మనస్సులో జనించిన ఆలోచనలే నా కధలకు నాంది పలికించేయి. ఆ ఆలోచనలకు రూపకల్పనలే నా కధలు.</p>
<p>నేను ఈదేశం వచ్చిన పదేళ్ళకనుకుంటా ; అప్పుడే పెళ్లి చేసుకుని మొట్టమొదటిసారిగా భర్తతో అమెరికా వచ్చిన ఇరవై ఏళ్ళ యువతి నాకు తారస పడింది. ఒక్క పదేళ్ళ తేడా లోనే, నాలాగే తెలుగు దేశంలో పెరిగిన ఆ యువతి ఆలోచనా విధానం, క్రొత్త దేశం వచ్చినా కూడా, ఎటువంటి చీకు, చింతా లేకుండా ప్రవర్తిస్తున్న ఆమె తీరు చూసి, నాకు ముచ్చటేసింది; ఆశ్చర్యం కలిగింది. పదేళ్ళ క్రితం అదే పరిస్థితుల్లో అమెరికా వచ్చిన నాకు, ఆ పిల్లకి ఎంత తేడాయో , అనుకున్నా. అప్పుడు, నా మొదటి కధ &#8220;దృక్పథం&#8221; వ్రాసా. అప్పటినుండీ, అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి జీవితాల్లో నా దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్య అయినా, నేను అటువంటి పరిస్థితులను ఎదురుకోవలసి వస్తే ఏం చేస్తాను? అని దీర్ఘంగా అలోచించి, ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి అని శోధించి, కథ వ్రాసేదాన్ని. ఏ కథ వ్రాసినా, ఒక వ్యక్తి గురించి కాదు. సంఘపరం గా మన తెలుగు వారి సమస్యగా ఆలోచించి, కథ వ్రాసేదాన్ని. ఆ కథ లో ఏ సమస్య గురించి వ్రాస్తున్నానో, అటువంటి సమస్యని ఇంకొకరేవరైనా ఎదుర్కుంటూ ఉంటే , వాళ్ళకి ఊరట కలిగే టట్టు, వాళ్ళ మనస్సుకు ఉపశమనం కలిగేటట్టు నా కథ ఉండాలని నా ఆశయం.</p>
<p>అయితే, నా కథలు చదివిన కొంతమంది, స్వంతంగా ఇతివృత్తం అల్లడం చేతకాక, నాకు తెలిసిన వ్యక్తుల జీవితాలని బట్టబయలు చేస్తున్నాను, అని ఆరోపించడం నేను వినకపోలేదు. నా కధలు చాలా నిరాశగా  ఉంటాయి. అవి చదువుతే మూటా ముల్లే కట్టుకుని ఇండియా పారిపోవాలని అనిపిస్తుంది అని నా ముఖం ముందే అన్నవాళ్ళు లేకపోలేదు. నా కథలు చదువుతూంటే, ఇంకా చదవాలని, శైలి సులువుగా, ఎవరో కధ చెప్పుతున్నట్టు ఉంటుందని అన్నవాళ్లు చాలామంది ఉన్నారు.</p>
<p>చాలా రోజుల క్రితం నేను వ్రాసిన &#8221; నిర్ణయం&#8221; అన్న కథ చదివి, బాగా తెలిసిన స్నేహితుడు ఫోన్ చేసి అందులో ముఖ్య యువకుడి పాత్రకి అన్యాయం చేసేనని, ఇండియా నుండి అమెరికా వచ్చిన యువకులు అలావుండరని నాతో వాదించేడు. అదే కధ చదివిన డెబ్భై యేళ్ళ మామ్మగారు చికాగో నుండి ఫోన్ చేసి, అందులోని ముఖ్య యువతి పాత్రకి న్యాయం చేకూర్చానని; అబ్బాయిల దారుణమైన ప్రవర్తనని నలుగురి ముందు ధైర్యంగా చూపించానని ఎంతో మెచ్చుకున్నారు.</p>
<p>వృద్దాప్యం లో కలిగే సమస్యలతో సతమత మవుతున్న తల్లిదండ్రులు ఇండియా లో ఉంటే , అమెరికాలో సెటిల్ అయిపోయిన పిల్లలు ఎదుర్కునే మానసిక ఘర్షణ ని చూపించే కథ &#8220;అగాధం&#8221;. ఈ కథ కి వంగూరివారి కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఆ కథని  మట్టుకు ఎందఱో మెచ్చుకున్నారు. అమెరికాకి దశాబ్ధాల క్రితం వలస వచ్చి, ఇక్కడే రిటైర్ అయి, భార్య ఆరోగ్యం చెడిపోతే, అష్టకష్టాలు పడ్డ వృద్ధుడి కథ &#8221; ముసురుచీకట్లో మెరుపుకిరణం&#8221;. ఈ కథకు కూడా మొదటి బహుమతి వచ్చింది. భార్య చనిపోతే, ఆరోగ్యం చెడిపోయి నర్సింగ్ హోం లో నానా కష్టాలు పడుతున్న వృద్ధుడి జీవితంలో &#8220;చిరుదీపం&#8221; లా వచ్చిన మనవడి కథకి  రెండవ బహుమతి వచ్చింది. ఏభై ఏళ్ళ వయస్సులో భర్త పోతే తోడుకోసం వెతుక్కుని, నిరాశకు పాలైన ప్రౌఢ కధ &#8220;ఎండ మావులు.</p>
<p>&#8220;వాన ప్రస్థాశ్రమం &#8221; అన్న కధ చదివి, దానికి చలించి, తమిళంలోకి అనువాదం చేసేరు శ్రీమతి గౌరీ కృపానందన్ గారు. అది నాకు ఎంతో తృప్తి నిచ్చింది. ఫరవాలేదులే; నేనూ కథ వ్రాయగలను అనుకున్నాను ఆరోజు. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మావ గారితో సతమతమవుతున్న అమెరికా తెలుగు ఇల్లాలి కథ అది.</p>
<p>నా &#8220;వేప పువ్వు&#8221; కధచదివి, ఎంతో ప్రసంశించారు ప్రొఫెసర్ శివుడు ప్రభాకర్ గారు. నాకు ఫోన్ చేసి, నా అనుమతి తీసుకుని , ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి, సీపీ బ్రౌన్ అకాడమి వెబ్ సైట్ లో ప్రచురించారు ఆయన. కొడుకు gay అని తెలిసి తల్లడిల్లి పోయిన తల్లిదండ్రుల కథ అది.</p>
<p>పాతికేళ్ళ సంసార జీవితంలో తనది అంటూ ఏదీ లేకుండా బతికి, పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్లు గడుపు కుంటూ ఉంటే, భర్త ఒక పరాయివాడులా , కేవలం శా సించే వాడులా కనిపించగా, తెగింపుతో తన నిర్ణయం తీసుకున్న స్త్రీ కథ &#8220;సర్ప్రైజ్ &#8220;. ఈ కథ నాకు తెలిసిన ఒకాయనకి చాలా నచ్చి తన చేత ఎలాగైనా చదివించాలని ప్రయత్నించేడని అతని భార్య చెప్పింది నాతో.</p>
<p>గత రెండేళ్లలో వ్రాసిన కధలు &#8221; మట్టికుండలు&#8221;, &#8220;విముక్తి&#8221;. జీవితం బుద్బుద ప్రాయమని, &#8220;Live while you are alive&#8221; అని చెప్పే కధ &#8220;మట్టి కుండలు&#8221;. అంత్యేష్టి క్రియలకు ప్రాధాన్యం ఇచ్చే ఆంధ్రుడికి కలిగిన ఆదరణ &#8220;విముక్తి&#8221; లో కనిపిస్తుంది.</p>
<p>3</p>
<p>నేను ఏ కధ, ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. కానీ, &#8220;అమర ప్రేమ&#8221; అన్న కథ మాత్రం ఒక ఆదర్శ వనిత ని ఉద్దేశించి వ్రాసిన కథ. భర్త ముప్ఫైఐదు ఏళ్ళ వయస్సులో భయంకరమైన కేన్సరుతో చనిపోతే, ఇద్దరు పసిపిల్లల్ని, అత్తగారి సహాయంతో అమెరికాలో సాకుతూ , చూసే వాళ్ళందరికీ తన భర్త తనతో నే ఉన్నాడన్న అభిప్రాయం కలిగేటట్టు నవ్వుతూ, ప్రవర్తించే ప్రేమమూర్తి ఆమె . కధ వ్రాసేముందు, ఆమెను సంప్రతించి, ఆమె అంగీకారం తెలిపిన తరువాత వ్రాసిన కధ &#8220;అమర ప్రేమ&#8221;.</p>
<p>నిజానికి, నేను గొప్ప రచయిత్రిని కాను. కేవలం, నా కంటికి కనిపించిన ఘట్టాలను తీసుకొని, అవి నా మనస్సులో సృష్టించిన భావాలని ఒక కథ రూపంలో, అతి సరళమైన వాడుక భాషలో అప్పుడప్పుడు  చెప్పగల అతి సాధారణ కధకురాలిని మాత్రమే. ఎందరో మహా కవులు, రచయితలు, రచయిత్రులు. వారందరి ముందు నేను ఏమాత్రం??</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=1478</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>అన్నీ ఊహాజనితమే!</title>
		<link>http://vaakili.com/patrika/?p=829</link>
		<comments>http://vaakili.com/patrika/?p=829#comments</comments>
		<pubDate>Fri, 25 Jan 2013 00:50:19 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ఆవలి తీరం]]></category>
		<category><![CDATA[చంద్ర కన్నెగంటి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=829</guid>
		<description><![CDATA[వరంగల్‌లో ఇంజనీరింగ్ చదివేరోజుల్లో రాయడం మొదలు పెట్టాను. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతి పత్రికల్లో నాలుగయిదు కథలు వచ్చాయి. కాలేజ్ చదువు ముగిశాక భిలాయిలో ఉద్యోగం రావడంతో ప్రవాసాంధ్ర జీవితం మొదలయింది. కాలేజ్ రీడింగ్‌రూంలో చదవడానికి అన్ని వార, మాస పత్రికలూ ఉండేవి కానీ అక్కడ ఏవీ దొరికేవి కాదు. ఒకటీ అరా తప్పించి రాయలేదు ఆరోజుల్లో. అక్కడినుంచి ఎమ్మెస్ చేయడానికి అమెరికా వచ్చినప్పుడూ అందులో ఏ మార్పూ కలగలేదు. అయితే తొంబైలలో SCIT న్యూస్ గ్రూప్ ఏర్పడటంతో ఇంటర్నెట్‌లో తెలుగువారికందరికీ అన్నీ పంచుకునేందుకు ఒక వేదిక దొరికింది. అందులోనే నా రచనావ్యాసంగం మళ్ళీ మొదలయింది. <p>రాయడానికీ, చదివేవాళ్ళకు చదవడానికీ ఎక్కువ సమయం పట్టదు కనక కవితలు రాసి పోస్ట్ చేసేవాడిని. తర్వాత తెలుగు సాహిత్యం కోసమే ప్రత్యేకంగా మొదలయిన తెలుసా గ్రూప్ లోనూ అదే కొనసాగింది. తొంభయి ఎనిమిదిలో ఈమాట వెబ్ పత్రిక ఆరంభించిన వారిలో ఒకరయిన  కె.వి.ఎస్.రామారావు గారి ప్రోద్బలంతో ఆ పత్రిక కోసం కథలు రాయడం మళ్ళీ మొదలుపెట్టాను.  అప్పట్నుంచీ అడపాదడపా ఆ పత్రికకేనో, తానా, ఆటా మహాసభల సావెనీర్ల కోసమో ఆయా సంపాదక మిత్రులు అడిగినప్పుడు (సిగ్గుచేటు, కొన్నిసార్లు అడగ్గా అడగ్గా) రాస్తూ ఉన్నాను. అంచేత ఈ మధ్యకాలంలో నేను రాసిందేమన్నా ఉంటే ఆ పాపమూ పుణ్యమూ రాయించినవారికే చెందుతాయి (దీనికి అఫ్సర్‌గారికి!).</p> <p>అసలు రాయడం వెనక కథ అది. ఇప్పుడు విషయానికి వద్దాం. నా రచనలపై అమెరికా ఎటువంటి ప్రభావం కలగజేసింది? అమెరికాలో అడుగు పెట్టకుంటే నా రాతలు కొనసాగేవేనా? చెప్పడం కష్టం. కథలు రాయడానికే పరిమితమయి ఉండేవాడినేమో! సాహితీమిత్రులు దొరకడమూ, సాహిత్యచర్చలు అందుబాటులోకి రావడమూ వంటి వాటికి అమెరికా రావడం కంటే ఇంటర్నెట్ కారణమేమో! కానీ ఇక్కడికి రాకపోయుంటే ఇంటర్నెట్ ఇంత విరివిగా వాడగలిగేవాడినా అన్నదీ ఒక అనుమానం. అదొక పార్శ్వం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇక్కడి జీవితం నా ఆలోచనను ప్రభావితం చేసి నా [...]]]></description>
			<content:encoded><![CDATA[<div><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/ck.jpg"><img class="alignleft size-full wp-image-934" title="ck" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/ck.jpg" alt="" width="127" height="132" /></a>వరంగల్‌లో ఇంజనీరింగ్ చదివేరోజుల్లో రాయడం మొదలు పెట్టాను. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతి పత్రికల్లో నాలుగయిదు కథలు వచ్చాయి. కాలేజ్ చదువు ముగిశాక భిలాయిలో ఉద్యోగం రావడంతో ప్రవాసాంధ్ర జీవితం మొదలయింది. కాలేజ్ రీడింగ్‌రూంలో చదవడానికి అన్ని వార, మాస పత్రికలూ ఉండేవి కానీ అక్కడ ఏవీ దొరికేవి కాదు. ఒకటీ అరా తప్పించి రాయలేదు ఆరోజుల్లో. అక్కడినుంచి ఎమ్మెస్ చేయడానికి అమెరికా వచ్చినప్పుడూ అందులో ఏ మార్పూ కలగలేదు. అయితే తొంబైలలో SCIT న్యూస్ గ్రూప్ ఏర్పడటంతో ఇంటర్నెట్‌లో తెలుగువారికందరికీ అన్నీ పంచుకునేందుకు ఒక వేదిక దొరికింది. అందులోనే నా రచనావ్యాసంగం మళ్ళీ మొదలయింది.</div>
<p>రాయడానికీ, చదివేవాళ్ళకు చదవడానికీ ఎక్కువ సమయం పట్టదు కనక కవితలు రాసి పోస్ట్ చేసేవాడిని. తర్వాత తెలుగు సాహిత్యం కోసమే ప్రత్యేకంగా మొదలయిన తెలుసా గ్రూప్ లోనూ అదే కొనసాగింది. తొంభయి ఎనిమిదిలో ఈమాట వెబ్ పత్రిక ఆరంభించిన వారిలో ఒకరయిన  కె.వి.ఎస్.రామారావు గారి ప్రోద్బలంతో ఆ పత్రిక కోసం కథలు రాయడం మళ్ళీ మొదలుపెట్టాను.  అప్పట్నుంచీ అడపాదడపా ఆ పత్రికకేనో, తానా, ఆటా మహాసభల సావెనీర్ల కోసమో ఆయా సంపాదక మిత్రులు అడిగినప్పుడు (సిగ్గుచేటు, కొన్నిసార్లు అడగ్గా అడగ్గా) రాస్తూ ఉన్నాను. అంచేత ఈ మధ్యకాలంలో నేను రాసిందేమన్నా ఉంటే ఆ పాపమూ పుణ్యమూ రాయించినవారికే చెందుతాయి (దీనికి అఫ్సర్‌గారికి!).</p>
<p>అసలు రాయడం వెనక కథ అది. ఇప్పుడు విషయానికి వద్దాం. నా రచనలపై అమెరికా ఎటువంటి ప్రభావం కలగజేసింది? అమెరికాలో అడుగు పెట్టకుంటే నా రాతలు కొనసాగేవేనా? చెప్పడం కష్టం. కథలు రాయడానికే పరిమితమయి ఉండేవాడినేమో! సాహితీమిత్రులు దొరకడమూ, సాహిత్యచర్చలు అందుబాటులోకి రావడమూ వంటి వాటికి అమెరికా రావడం కంటే ఇంటర్నెట్ కారణమేమో! కానీ ఇక్కడికి రాకపోయుంటే ఇంటర్నెట్ ఇంత విరివిగా వాడగలిగేవాడినా అన్నదీ ఒక అనుమానం. అదొక పార్శ్వం. ఇక అసలు విషయానికి వద్దాం. ఇక్కడి జీవితం నా ఆలోచనను ప్రభావితం చేసి నా రచనల్లో ప్రతిఫలించిందా? ఇండియాలో ఉన్నప్పటికంటే భిన్నంగా రాశానా? ఇదీ కష్టమైన ప్రశ్నే. మొదటినుంచీ మూసలో వొదగని కథలే రాద్దామన్న ఆలోచన ఉండేది (అదే ఒక మూస ఆలోచన అని తెలియదు కనక:-). నా అభిప్రాయాల్ని సూచనప్రాయంగా వెల్లడించడమే గానీ వాటిని రుద్దడమూ, లోకమంతా నా అభిమతానికి అనుగుణంగానే నడుచుకోవాలనుకోవడమూ అప్పుడూ చేసిన గుర్తు లేదు. పాఠకుడికంటే ఒక మెట్టు పైనున్నానన్న భ్రమ కూడా అప్పుడూ లేదనుకుంటాను. తీర్పులూ, బుద్ధులూ చెప్పడం కాక సానుభూతితో అర్థం చేసుకునే ప్రయత్నమే అప్పుడూ చేశాననుకుంటాను. అయితే అప్పుడు నేనేం చేస్తున్నానో, చేయడం లేదో అంత స్పష్టత ఉండేది కాదేమో! భిన్న జాతుల, భిన్న సంస్కృతుల సంపర్కంతో ఉదారవాదం నాలో బలపడి ఉండొచ్చు. అన్నిటికీ ఒకేరంగు పులమడం కాక ఏడు రంగులూ ఉండడాన్ని ఇష్టపడటం అలవాటయి ఉండొచ్చు. నాకు ఇవన్నీ తెలుసుకుందుకూ, ఇంకేం తెలియవో కూడా తెలుసుకునేందుకూ ఇక్కడి జీవితం కంటే కూడా ఇంటర్నెట్లో దొరికే సమాచారమూ, పత్రికలూ దోహదపడ్డాయి, పడుతున్నాయి.</p>
<p>చదవడంలో వచ్చిన మార్పు క్రమంగా కాల్పనికేతర సాహిత్యాన్ని ఇష్టపడడం. ఉద్వేగాలనుంచి ఆలోచన్లవైపు మొగ్గుతున్నానేమో! తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఇక్కడి కాల్పనిక సాహిత్యంలో కథలే ఎక్కువ చదివాను. ప్రత్యేకంగా అభిమాన రచయితలు ఎవరూ లేరు కానీ ఇష్టపడ్డ రచయితలు చాలామంది ఉన్నారు. హద్దులు చెరుపుతున్న కథ విశ్వరూపం అవలోకిస్తున్నాను. వస్తువు విషయానికి వస్తే ఇక్కడి జీవితం మాత్రమే ఆధారంగా చేసుకుని రాసినవి తక్కువే. ఇక్కడికి వచ్చాక రాసిన మొదటి కథ &#8220;భేష్!&#8221; అక్కడ జరిగినట్లు రాసిన కథే. &#8220;ఎక్కడ చెడు జరిగినా ఖండించడానికీ, పూనుకుని స్వయంగా దండించడానికీ ముందుకుదూకే మనకి చిన్న మంచిపని చేసినవాళ్లనూ అభినందించాలనీ, మెచ్చుకోవాలనీ ఆలోచనే రాదు&#8221; అన్న అక్కడి నా పరిశీలన ఆధారంగా దాన్ని విశ్లేషించుకుంటూ రాసిందది. తర్వాత రాసిన కథ ఈమాట మొదటి సంచిక కోసం. &#8220;మధ్య వ్యవధిలో నీడలు&#8221; ఇక్కడ విడిపోవడానికి సిద్ధపడిన కొత్త జంట గురించి.</p>
<p>ఇక్కడి వాళ్ల కథలు తక్కువ రాయడానికి కారణం ఎంత తెలిసినా పైపైన మాత్రమే చూస్తున్న వీళ్ళ జీవితాలను లోతుగా తరచి చూడలేకపోవడం కావొచ్చు. ఇక్కడ ప్రైవసీకి ప్రాధాన్యత ఎక్కువ. అక్కడ అయినట్టు జీవితాలంత బట్టబయలు కావు. ఇక్కడికి వచ్చిన వాళ్ల బతుకులన్నీ దాదాపు ఒకేగాడిలో నడవడం వల్లనూ కావొచ్చు. లేని నాటకీయతను &#8211; సంభాషణల్లోనూ, సంఘటనల్లోనూ -  చొప్పించడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అసలు నాకు ఇక్కడి మన చరిత్రనూ, మానవ జీవితాన్నీ కాక ఎక్కడి జీవితాల్లోనయినా మాటల్లో పెట్టలేని, మరు నిమిషంలో పారిపోయే భావనలని మాత్రమే పట్టుకోవాలన్న కోరికే ఉందేమో! మొత్తానికి వస్తుపరంగా ఇక్కడి జీవితం పెద్దప్రభావం చూపలేదనే అనిపిస్తుంది. అందుకు విచారమూ లేదు, సంతోషమూ పడను. నా పాత్రలేవీ నిజ జీవితాల్లోంచి నడిచి వచ్చినవి కావు, రక్తమాంసాలతో జీవం తొణికిసలాడేవీ కాదు. ఆధారాలు లేవని చెప్పలేనేమో కానీ అన్నీ ఊహాజనితమే. అవి కూడా సారాంశమాత్రంగానే నా కథల్లో కనపడతాయనుకుంటాను. అందులోనూ అప్పటికీ ఇప్పటికీ తేడా లేనట్లే. ఇక శైలీ కథనాలలో కనిపించే మార్పులకు కాలమూ, రాతలో అనుభవమే కానీ ఇక్కడి జీవితం కారణం కానేకాదు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=829</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>అమెరికాలో తెలుగు డయాస్పోరా నేపథ్యంలో నా కథలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=76</link>
		<comments>http://vaakili.com/patrika/?p=76#comments</comments>
		<pubDate>Wed, 19 Dec 2012 21:15:25 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ఆవలి తీరం]]></category>
		<category><![CDATA[ఎస్. నారాయణస్వామి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=76</guid>
		<description><![CDATA[<p>చిన్నప్పటి నించీ కథలంటే ఇష్టం, చదవటమంటే  ఇష్టం. కథలు చెప్పడం కూడా ఇష్టమే. అయితే రాయాలి అనే కోరిక కలగలేదెప్పుడూ. సాహిత్యం అంటే ఒక కథనో నవలనో చదివి పడేసెయ్యడం కాదు, ఆలోచింపచేసే సాహిత్యం ఉన్నది, ఆస్వాదించాల్సిన సాహిత్యం ఉన్నది అని మొదటిసారి గ్రహింపుకి వచ్చింది వరంగల్లో ఇంజనీరింగ చదవడానికి ఆర్యీసీలో చేరినప్పుడు. రావిశాస్త్రి, కుటుంబరావు, బుచ్చిబాబు వంటి పేర్లు అప్పుడే పరిచయమయ్యాయి. ఆ తరవాత బాపట్లలో ఒక సంవత్సరం పాటు లెక్చరర్ ఉద్యోగం చేసినప్పుడు పరబ్రహ్మం అని నా రూమ్మేట్. అతను మంచి సాహిత్య పరిజ్ఞానం ఉన్న కుటుంబం నించి వచ్చాడు. అతనితో చర్చలు నా సాహిత్యాభిరుచికి పదును పెట్టాయి. అటుపైన రెండేళ్ళు కాన్పూరు  ఐఐటిలో ఎం.టెక్ చదివినప్పుడు అక్కడ ప్రవాసం ఉన్న తెలుగువారికోసం ఒక చిన్న తెలుగు లైబ్రరీ ఉండేది. దాన్ని నిర్వహించడం, దానికోసం విజయవాడనించి కొత్త పుస్తకాలు కొనుక్కు వెళ్ళడం చేస్తుండేవాణ్ణి. అప్పుడే మిత్రుల ప్రోద్బలంతో అక్కడి విద్యార్ధి జీవితం నేపథ్యంగా చిన్న చిన్న హాస్యనాటికలు రాశాను, తెలుగు సమితి ఉత్సవాల్లో ప్రదర్శించేవాళ్ళం. అక్కణ్ణించి అమెరికా వచ్చి పడ్డాను.</p> <p>నేను భారతదేశం విడిచి ఉండకపోతే రాయాలనే తపన బహుశా కలిగేది కాదు నాకు. అమెరికా వచ్చిన తొలి రోజుల్లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా గ్రంధాలయంలోని తెలుగు విభాగం ఒక పెన్నిధిలాగా దొరికింది నాకు. తెలుగు సాహిత్యాన్ని బాగా చదివాను ఆ రోజుల్లోనే. 1993-94 ప్రాంతాల్లో కంప్యూటర్ నెట్వర్కు మీద నడుస్తున్న గ్రూపులు పరిచయమయ్యాయి. అందులో SCIT అనే గ్రూపులో తెలుగుకి సంబంధించిన అనేక విషయాల మీద చర్చలూ, వాదోపవాదాలూ జరుగుతుండేవి. అక్కడే అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన చాలా మంది రచయితలు, కవులు, సాహిత్య ప్రేమికులు పరిచయమైనారు. అనేక రకాల సాహిత్యాన్ని లోతుగా చదివిన పరిజ్ఞానం ఉన్నవారు, అనేక రచనలు చేస్తున్నవారితో చర్చలు రసవత్తరంగా ఉండేవి. సాహిత్యాన్ని గురించీ, సమాజాన్ని గురించీ, అమెరికను సమాజంలో మనవారి ఉనికిని గురించీ కొత్త [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2012/12/kottapali1.jpg"><img class="alignleft size-full wp-image-302" title="kottapali" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2012/12/kottapali1.jpg" alt="" width="119" height="150" /></a>చిన్నప్పటి నించీ కథలంటే ఇష్టం, చదవటమంటే  ఇష్టం. కథలు చెప్పడం కూడా ఇష్టమే. అయితే రాయాలి అనే కోరిక కలగలేదెప్పుడూ. సాహిత్యం అంటే ఒక కథనో నవలనో చదివి పడేసెయ్యడం కాదు, ఆలోచింపచేసే సాహిత్యం ఉన్నది, ఆస్వాదించాల్సిన సాహిత్యం ఉన్నది అని మొదటిసారి గ్రహింపుకి వచ్చింది వరంగల్లో ఇంజనీరింగ చదవడానికి ఆర్యీసీలో చేరినప్పుడు. రావిశాస్త్రి, కుటుంబరావు, బుచ్చిబాబు వంటి పేర్లు అప్పుడే పరిచయమయ్యాయి. ఆ తరవాత బాపట్లలో ఒక సంవత్సరం పాటు లెక్చరర్ ఉద్యోగం చేసినప్పుడు పరబ్రహ్మం అని నా రూమ్మేట్. అతను మంచి సాహిత్య పరిజ్ఞానం ఉన్న కుటుంబం నించి వచ్చాడు. అతనితో చర్చలు నా సాహిత్యాభిరుచికి పదును పెట్టాయి. అటుపైన రెండేళ్ళు కాన్పూరు  ఐఐటిలో ఎం.టెక్ చదివినప్పుడు అక్కడ ప్రవాసం ఉన్న తెలుగువారికోసం ఒక చిన్న తెలుగు లైబ్రరీ ఉండేది. దాన్ని నిర్వహించడం, దానికోసం విజయవాడనించి కొత్త పుస్తకాలు కొనుక్కు వెళ్ళడం చేస్తుండేవాణ్ణి. అప్పుడే మిత్రుల ప్రోద్బలంతో అక్కడి విద్యార్ధి జీవితం నేపథ్యంగా చిన్న చిన్న హాస్యనాటికలు రాశాను, తెలుగు సమితి ఉత్సవాల్లో ప్రదర్శించేవాళ్ళం. అక్కణ్ణించి అమెరికా వచ్చి పడ్డాను.</p>
<p>నేను భారతదేశం విడిచి ఉండకపోతే రాయాలనే తపన బహుశా కలిగేది కాదు నాకు. అమెరికా వచ్చిన తొలి రోజుల్లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా గ్రంధాలయంలోని తెలుగు విభాగం ఒక పెన్నిధిలాగా దొరికింది నాకు. తెలుగు సాహిత్యాన్ని బాగా చదివాను ఆ రోజుల్లోనే. 1993-94 ప్రాంతాల్లో కంప్యూటర్ నెట్వర్కు మీద నడుస్తున్న గ్రూపులు పరిచయమయ్యాయి. అందులో SCIT అనే గ్రూపులో తెలుగుకి సంబంధించిన అనేక విషయాల మీద చర్చలూ, వాదోపవాదాలూ జరుగుతుండేవి. అక్కడే అమెరికాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన చాలా మంది రచయితలు, కవులు, సాహిత్య ప్రేమికులు పరిచయమైనారు. అనేక రకాల సాహిత్యాన్ని లోతుగా చదివిన పరిజ్ఞానం ఉన్నవారు, అనేక రచనలు చేస్తున్నవారితో చర్చలు రసవత్తరంగా ఉండేవి. సాహిత్యాన్ని గురించీ, సమాజాన్ని గురించీ, అమెరికను సమాజంలో మనవారి ఉనికిని గురించీ కొత్త విషయాలు అవగాహనలోకి రాసాగాయి. కొత్త ఆలోచనలు కలగసాగాయి. తెలుగుపత్రికల్లో ప్రచురితమవుతున్న సమకాలీన కథల పట్ల కొంత అసంతృప్తి మొలకెత్తింది. ఇంతకంటే బాగా మనం రాయలేమా అనిపించింది. అలా కొంచెం కసితో, కొంచెం గీరతో మొదటి కథ రాశాను.</p>
<p>రెండో కథ &#8220;తుపాకి&#8221; కి 1999 లో వంగూరి ఫౌండేషను వారి కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. కొన్ని పత్రికల్లోనూ, మూడు నాలుగు కథల సంకలనాలలోనూ చోటు చేసుకుంది, ఇంటా బయటా కథకుడిగా నాక్కొంచెం పేరు తెచ్చిపెట్టింది. కథ అంటే రాస్తానుగానీ దాన్ని ఎక్కడ ప్రచురించాలనేది ఆ రోజుల్లో పెద్ద సమస్య. భారత్‌లో పత్రికలకి పంపించాలంటే ప్రింటు తీసి, ఆయా పత్రికల చిరునామా సంపాదించి ఎయిర్ మెయిల్లో పంపాలి. వాళ్ళెవరూ తిరిగి సమాధానం రాసేవారు కాదు. కథని వేసుకుంటున్నారో తిరస్కరించారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈమాట వెబ్ పత్రిక మొదలయింది. వ్యవస్థాపక సంపాదకుల్లో ఒకరైన కె.వి.యెస్. రామారావుగారు నా పట్ల శ్రద్ధ చూపించేవారు. కథ పంపేదాకా వదిలిపెట్టేవారు కాదు. 1999 &#8211; 2002 మధ్యలో సుమారు 15 కథలు రాశానంటే, కేవలం ఆయన ప్రోద్బలమే.</p>
<p>ఆ తరవాత స్వాతి మాస పత్రికలో ఒక కథ, విపులలో ఒక అనువాద కథ ప్రచురితమైనాయి. విపులకి కథ పంపినప్పుడు అప్పటి సంపాదకులు చలసాని ప్రసాదరావుగారికి ఉత్తరం రాశాను. ఆయన వెంటనే జవాబు రాశారు, ఎంతో ఆప్యాయంగా ప్రోత్సహిస్తూ. నా కర్తవ్య నిర్దేశం కూడా చేశారు ఆయనే &#8211; నిజజీవితంలోనించి మన స్వంతమైన కథలు రాయాలని. అటుపై కొద్ది మాసాలకే ఆయన అస్తమయం గొప్ప లోటు. ఐతే ఆయన ఉపదేశం మాత్రం నా మనసుకి బాగా పట్టింది. అమెరికా జీవితం మీదనూ, అమెరికాలో భారతీయ ఇమిగ్రెంటు కమ్యూనిటీ మీదనూ దృష్టి పెట్టాను. అలాగని నాకథలన్నీ సమస్యల గురించే కాదు. కొన్ని సరదా కథలు, కొన్ని ప్రహసనాల్లా అనిపించే గల్పికలు. శైలిలో కూడా కొన్ని ప్రయోగాలు చేశాను &#8211; ఒక తల్లి గొడవ, పూర్వజన్మ వాసన, లోకస్ట్ వాక్ కార్నర్లో .. వంటి కథల్లో. ఆ సమయంలో రాసిన చాలా కథలు ఈమాట జాలపత్రికలోనే తొలిసారి వెలుగు చూశాయి. కొన్ని కథలు ఇక్కడ జరిగే వివిధ తెలుగు సభల జ్ఞాపికలు (సావనీర్లు)లో ప్రచురితమయ్యాయి. ఈమాటలో ప్రచురితమైన కథలు కొన్నిటిని రచన శాయిగారు తమ రచన పత్రికలో మళ్ళీ ప్రచురించారు. ఇదే సమయంలో తానా పత్రిక సంపాదకులుగా, తదుపరి తెలుగునాడి పత్రిక సంపాదకులుగా డా. జంపాల చౌదరిగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది.</p>
<p>1998 లోనే మొదలైన డెట్రాయిట్ తెలుగు సాహిత్య సమితి వ్యవస్థాపక సభ్యుడిగా మొదటి నాలుగేళ్ళు సమితి కార్యకలాపాలు నిర్వహించాను. నెలకోసారి కలుసుకుని సాహిత్య చర్చలు జరపడమే కాక, భారత్ నించి వచ్చి ఇక్కడ పర్యటిస్తూ ఉండిన ప్రముఖ రచయితలు, కవులు చాలా మందితో గోష్టులు నిర్వహించాము. ఈ కార్యక్రమాలు ఇంకా ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఐతే ఈ చర్చలలో స్థానికుల స్వీయరచనలకి పెద్ద పీట వెయ్యలేదు ఎప్పుడూ. ప్రముఖ కథా రచయిత ఆచార్య ఆరి సీతారామయ్యగారు కూడా ఈ ప్రాంతంలోనే నివాసమున్నారు, చిరకాలంగా నాకు మిత్రులు, ఈ సమితిలో కీలక సభ్యులు మొదటినించీ. ఐనా మా స్వంత రచనల గురించి కానీ, లేక ఇతరత్రా అమెరికా తెలుగు రచయితల రచనల గురించి కానీ పెద్దగా చర్చించుకోలేదు ఎప్పుడూ. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది కొంచెం విచారించాల్సిన విషయం అనిపిస్తోంది. ఇతరత్రా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న తెలుగు సాహిత్య సభల్లో కూడా అమెరికను తెలుగు సాహిత్యాన్ని కూలంకషంగా చర్చకి పెట్టిన సందర్భాలు నాకు తోచటంలేదు. ఐతే నేను ఈ సభలకి హాజరైనది తక్కువే. అమెరికాని పర్యటిస్తున్న తెలుగు సాహితీవేత్తలతో ముచ్చటించినప్పుడు వారెవరూ అమెరికా తెలుగు సాహిత్యాన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఈ విషయంలో కవిత్వం కోంచెం మెరుగు పరిస్థితిలో ఉన్నదేమో గాని కథల పరిస్థితి అంతంత మాత్రమే. తెలుగు కథానికని ప్రాణంగా చూసుకునే సాహితీవేత్తలకి కూడా అమెరికా తెలుగు రచయితలు ఏం రాస్తున్నారు అనే అవగాహన కానీ, కుతూహలం కానీ ఉన్నట్టు నాకనిపించలేదు. సహజంగానే రచయిత పని ఒంటరితనంలో మునిగి ఉంటుంది. నేరుగా ముఖాముఖి చర్చించుకునేందుకు, తన రచనని బేరీజు వేసుకునేందుకు సహృదయులైన పాఠక విమర్శకులు తరచు దొరకరు. రచయితగా ఎదిగేందుకు తోటి రచయితలతో చర్చలు ఉపయోగపడతాయేమోనని అనిపిస్తూనే ఉంటుంది.  కానీ ఆచరణలో మాత్రం జరగలేదు.</p>
<p>ఇక్కడ రెండు మంచి అనుభవాలు చెప్పుకోవాలి. రెండూ తానా సభలకి సంబంధించినవే. 2000 సంవత్సరంలో జరిగిన ఒక ప్రత్యేక తానా సదస్సు సావనీరుకి కన్నెగంటి చంద్ర సంపాదకులుగా ఉన్నారు. నేనూ ఒక కథ పంపించాను. కొన్నాళ్ళయ్యాక, కొంత ఎడిట్ చేశాను, చూడండి ఇది మీకు ఆమోదమేనా అని చంద్ర నాకు మెయిల్ పంపారు. కథ చదవడం మొదలు పెడితే అది నా కథలాగా అనిపించలేదు. నేను పంపిన వెర్షనుతో పోల్చుకుంటే మొదటి రెండు పేజీలు ఎగిరిపోయాయి. మిగతా కథలో కూడా కొన్ని భాగాలు కత్తిరించబడినాయి. మొదట చాలా కోపమూ ఉక్రోషమూ వచ్చాయి, నా కథని ఇలా చిన్నాభిన్నం చేస్తారా అని. కొంచెం తమాయించుకుని చదివితే ఎడిట్ చేయబడిన వెర్షనులో చెప్పాల్సిన కథ అంతా ఉండడమే కాక, కథనం మరింత బిగుతుగా వడిగా సాగింది. చిన్నకథల్లో ఉండాల్సిన బిగువుని గురించి ఛెకోవ్ అన్నాడని చెప్పబడే కథారచన సూక్తికి ఇది మంచి ఉదాహరణ. ఎడిట్ చేసిన వెర్షనే చివరికి ప్రచురితమైందని వేరే చెప్పనక్కర్లేదు. చంద్ర స్వయంగా రచయిత, అంతేకాక మంచి సాహిత్యం రుచి తెలిసిన వారు కావడం వల్ల ఆ పని చెయ్య గలిగారు కానీ అందరు సంపాదకుల వల్లా జరగదిది.</p>
<p>రెండో అనుభవం 2005 డెట్రాయిట్ తానా సభల సావనీరుతో. సీతారామయ్యగారు, మద్దిపాటి కృష్ణారావుగారు సంపాదకులు. దీనికి కూడా ఒక కథ ఇచ్చాను. ఈ సారి సంపాదకులు Anonymous peer review పద్ధతి పాటించారు. కథని మరొక రచయితకి ఇచ్చి వారి నించి విమర్శ అందుకుని మళ్ళీ రచయితకి అందజేసి, ఆ విమర్శ ప్రకారం కథని మెరుగు పరచడం దీని ఉద్దేశం. కథా రచయిత ఎవరో విమర్శకులకి తెలియదు, విమర్శకులెవరో రచయితకి తెలియదు. నా కథకి బదులుగా నా చేతికందిన విమర్శని ఏం చేసుకోవాలో నాకర్ధం కాలేదు కొంతసేపు. ఆ విమర్శకులు చేసిన కంప్లెయింటు అర్ధమయింది గానీ, దాన్ని కథకి ఎలా అన్వయించాలో, ఎలా మెరుగు పరచాలో అర్ధం కాలేదు. విమర్శనీ నా కథనీ మార్చి మార్చి ఓ పది సార్లు చదివాను. సుమారొక వారం రోజులు ఆలోచించాను. అప్పుడు మెల్ల మెల్లగా దారి కనబడ్డం మొదలు పెట్టింది. సమస్య ఏవిటంటే, నేను రాసిన వాక్యాల మీద నాకు చాలా ప్రేమ. బహుశ ప్రతి రచయితకీ ఉంటుందేమో. చూస్తూ చూస్తూ ఏ వాక్యాన్నీ తొలగించడం ఇష్టం ఉండదు. ఆ ప్రేమ ఎంత గుడ్డిగా ఉంటుందంటే అనవసరపు వాక్యాలు, అతకని వాక్యాలు కథకి అడ్డం పడుతున్నాయని కూడా గ్రహించలేనంత. అలా ఆ విమర్శ దృష్ట్యా ఎడిటింగ్ మొదలు పెట్టినాక, కథని ఇంకా మెరుగు పరచేందుకు కూడా దారులు కనబడసాగినై. అలా కథ మొత్తం తిరగరాశాను. సంపాదకులు పాపం నా కథ కోసం ఓపికగా వేచి ఉన్నారు. మూలమైన కథ ఒకటే అయినా కాగితం మీద ప్రత్యక్షమైన రూపంలో మొదటి వెర్షనుకీ ఎడిట్ చేసిన వెర్షనుకీ చాలా తేడా వచ్చింది. ఖాండవవనం అనే పేరిట ప్రచురితమైన ఈ కథ నా కథల్లో నాకు చాలా తృప్తినిచ్చినది.</p>
<p>కథలకి ఇతివృత్తాలను ఎంచుకోవడంలో అడపాదడపా భారతీయ నేపథ్యపు కథలు రాస్తూ ఉన్నా, ముఖ్యంగా నా దృష్టి అమెరికా సమాజం మీదనే ఉన్నది ఇప్పటికీ. ఐతే నేను రాస్తున్నది డయాస్పోరా సాహిత్యమా కాదా అని పట్టించుకోలేదు. అసలు ఈ డయాస్పోరా సాహిత్యం అనే మాట సుమారు గత పది పన్నెండేళ్ళుగా వినిపిస్తున్నది తెలుగు సాహిత్యానికి సంబంధించి. నేను ఏ విధంగానూ పరిశోధకుణ్ణి కానుగనక దీనికి సంబంధించిన మూలాల్లోకి వెళ్ళలేను కానీ నాకు అర్ధమైనంతలో డయాస్పోరా అంటే తండ్రి తాతల దేశాన్ని వదిలి వేరే దేశానికి వలస వెళ్ళిన సమాజం, అక్కడ తమది కాని సంస్కృతి మధ్యలో మైనారిటీగా బతుకుతున్న సమాజం. డయాస్పోరా సాహిత్యం అంటే అటువంటి సమాజం రాసుకున్న సాహిత్యం. మాతృదేశంలో ఉత్పన్నమవుతూ ఉన్న సమకాలీన సాహిత్యానికీ అదే సమయంలో డయాస్పోరా ప్రజలు రాసుకుంటున్న సాహిత్యానికీ సహజంగా కొన్ని తేడాలు ఉంటాయి. డయాస్పోరా సాహిత్యానికి కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది విడిచివచ్చిన మాతృదేశంతో అనుబంధం. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశంతో అనుబంధం అంటే, ఊరు, రాష్ట్రం, దేశమే కాదు, తల్లిదండ్రులు, చుట్టాలు, మిత్రులు .. ఇదే ఆలోచనని ఇంకొంచెం పొడిగిస్తే భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా. వీటన్నిటి ప్రస్తావన అమెరికను తెలుగు కథల్లో తప్పకుండా ఉంటూనే ఉన్నది. డయాస్పోరా సాహిత్యంలో కనబడే స్పష్టమైన ఇంకో లక్షణం చుట్టూతా వ్యాపించి ఉన్న మెజారిటీ సంస్కృతితో జరిగే సంఘర్షణ. అంటే పోరాటం మాత్రమే కాదు, రెండు సంస్కృతులు ఢీకొన్నప్పుడు భావాల మార్పిడి కొంత జరుగుతుంది. తద్వారా మనుషుల్లో, వ్యవస్థలో కొంత మార్పు వస్తుంది. ఇమిగ్రెంటు అనుభవాల్లో ఇది చాలా ఆసక్తికరమైన విషయం.</p>
<p>ఈ లక్షణాలు కొన్నిటిని ఒక కథ ఉదాహరణగా చర్చిస్తే ఉపయోగంగా ఉంటుందేమో. ఇండియన్ వేల్యూస్ అనే కథ తీసుకుందాం.</p>
<p>http://www.eemaata.com/em/issues/200101/607.html</p>
<p>ఈ కథలో నేరుగా కనిపించే పాత్రలెవరూ భారత్ లో పుట్టి అమెరికాకి వలస వచ్చినవారు కాదు. అంచేత భారతదేశం అంటే ఏవిటి అని వారికి స్వీయానుభవం లేదు. కానీ కథకి మూలసూత్రమైన ఇండియన్ వేల్యూ సాంఘికంగా చాలా బలమైన కాన్సెప్టు. కథలో నేపథ్యంలో మాత్రమే కనిపించే తలిదండ్రుల ద్వారా ఈ ఆలోచన కథలోకి దిగుమతి అయింది. ఎంత చదువుకున్నా, ఎన్ని విజయాలు సాధించినా ఆడపిల్ల &#8220;ఆడ&#8221; పిల్లే, ఆమెకి తగిన వరుణ్ణి వెతికి పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత తమమీద ఉన్నది అని విశ్వసించి, దానికి తగిన చర్యలు చేపట్టినవారు వాసంతి తలిదండ్రులు. కొడుకు ఎంత ఎదిగొచ్చినా కోడలు సెలక్షన్ లో తమ ప్రమేయం కూడా ఉండాలి అని భావించి తదనుగుణంగా ప్రవర్తించిన కృష్ణ తలిదండ్రులు ఇక్కడ దిగుమతి అయిన సంస్కృతికి ప్రతినిధులు. భారతదేశమంటేనూ సంస్కృతి అంటేనూ నాస్టాల్జియా వంటి మధురోహలు ఏమీ ఇక్కడ కనబడవు గానీ, తమ అధీనంలో ఉన్నంతవరకూ ఆ సంస్కృతి చాయల్ని నిలబెట్టుకోవాలనే తొలితరం ఇమ్మిగ్రెంటు మనస్తత్వం వీరిలో ఉన్నది. కథలో ఒక తమాషా ఏవిటంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాసంతి, కృష్ణ ఇద్దరూ తమ తలిదండ్రుల ఆలోచననీ, విధి విధానాలనీ కొంత వరకూ అంగీకరించి ఆమోదించారు. ఎందుకలా అంగీకరించారో కథలో వాళ్ళే చెబుతారు. వాళ్ళసలు మొదటనే అంగీకరించి ఉండకపోతే అసలు కథే లేకపోవును. ఉన్నా అది తరాల మధ్య జరిగే సంఘర్షణగానో ఇంకోటిగానో ఉండేది. వాసంతి, కృష్ణలకి కాంట్రాస్టుగా నీరజ పాత్ర ఉన్నది. వాసంతి ఒప్పుకున్న కల్చరల్ హెజెమనీని (cultural hegemony) నీరజ ఎప్పటికీ ఒప్పుకోదు. నీరజ, వాసంతి ప్రాణస్నేహితులైనా నీరజ భావజాలం కానీ, ప్రవర్తన కానీ వాసంతి మీద ఏమీ ప్రభావం చూపించలేదు. కథ చివరిలో జరిగే క్లైమాక్స్ సన్నివేశంలో కృష్ణ ప్రవర్తన, వాసంతికి కలిగిన గ్రహింపు, చివరి పర్యవసానం &#8211; వారిద్దరూ పెరిగిన నేపథ్యము, చుట్టూతా ఉన్న సంస్కృతి, వారి సహజమైన వ్యక్తిత్వము &#8211; అన్నీ కలిసిన ఫలితం. కృష్ణ స్థానంలో మరో వెంకట్ ఉంటే వాసంతిని బతిమాలుకుని సుముఖురాల్ని చేసుకుని తను చేసింది తప్పుకాదని నిరూపించి పెళ్ళికి ఒప్పించేవాడేమో. వాసంతి స్థానంలో మరో లతిక ఉండి ఉంటే ఆ వెంకట్ మాటలు నమ్మేదో, లేక చెప్పు తీసుకుని అతని దవడ పగలగొట్టేదో. ఐతే అక్కడ ఉన్నది వాసంతి, కృష్ణ కాబట్టి కథ అలా పరిణమించింది. కథ మొదట్లో దిగుమతి భావజాలపు సూచనలు నేపథ్యమంతా పరుచుకుని ఉన్నట్టే అమెరికను సమాజపు, అందునా న్యూయార్కు నగరపు భావజాల సూచనలు కథ చివర్లో నేపథ్యంలో పరుచుకుని ఉన్నాయని, రెండు సంస్కృతుల మధ్యనా జరిగే సంఘర్షణ నేరుగా యుద్ధంలా కాక, ఆయా పాత్రల ద్వారా, ఆ పాత్రల వ్యక్తిత్వం ద్వారా పరోక్షంగా జరుగుతుందని రచయితగా నేను అనుకుంటున్నాను.</p>
<p>అమెరికను సమాజం నేపథ్యంగా నేను రాసిన, రాస్తున్న కథలన్నిటిలోనూ, సరదాగా రాసిన కథల్లో కూడా, ఇటువంటి సంఘర్షణని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నాను. తెలుగు వలసవారు రాసినదంతా డయాస్పోరా సాహిత్యమే. కాదని ఎవరూ అనలేరు. అందులో కొన్నిరకాల విషయాలే ఎక్కువగా ఉన్నాయి, మిగతా విషయాలు లేవూ అంటే &#8211; అంతే మరి, మన వలసవారికి ఆ విషయాలే ఇప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయాల్లాగా కనిపిస్తున్నాయి అన్న మాట &#8211; మాతృదేశాన్ని గురించి నాస్టాల్జియా, నివాసం ఉన్న దేశ సంస్కృతిని గురించి కొంచెం ఎగతాళి, లేదా ఇదే గొప్పది అనుకునే ఒక అభిమానం, పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, ఉద్యోగపు అభద్రత, రెండు సంస్కృతుల భేదాలు &#8211; ఇంకా ఇల్లాంటివి .. ప్రస్తుతానికి ఇంకా ఇవే మనవారికి ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఇతివృత్తాలు. అందుకే అవే మన సాహిత్యాన్ని నింపుతున్నాయి. ఈ విషయాలకి పరిమితమైనందువల్ల మనవాళ్ళు రాస్తున్నది డయాస్పోరా సాహిత్యం కాదు అనే వాదనకి అర్ధం లేదు. ఈ సాహిత్యం కొత్త పుంతలు తొక్కాలి అంటే వలస సామాజిక స్పృహలో కొత్త ప్రశ్నలు ఉదయించాలి, దానికి కొత్త అనుభవాలు రావాలి &#8211; ఉదా. ఒక తెలుగు కుటుంబపు అబ్బాయి ఇరాకులోనో ఆఫ్ఘనిస్తానులోనో సైనికుడిగా పనిచేస్తే? తమాషాగా, ఈ విషయంలో నిజజీవిత అనుభవాలకంటే సాహిత్యం వెనకబడి ఉన్నదని నా అనుమానం. నిజజీవితం చవిచూసిన అనుభవాల్ని నిజాయితీగా సాహిత్యంలో ప్రతిబింబించడానికి బహుశా ఇంకొంచెం సమయం పడుతుంది.</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=76</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
	</channel>
</rss>
