<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; కథన కుతూహలం</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=26&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>హొగినేకల్ &#8211; మధురాంతకం మహేంద్ర</title>
		<link>http://vaakili.com/patrika/?p=15069</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15069#comments</comments>
		<pubDate>Fri, 01 Sep 2017 02:08:36 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[సురేష్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15069</guid>
		<description><![CDATA[ఒక్కొకటిగా రాలుతున్న ఆకులతో అడవి మొత్తం బోడితలతో దర్శనమిస్తోంది. ఉక్కబోతలో గడ్డకట్టిన నిశ్శబ్దంలో ఒక మూలనుంచీ కనిపించని కోయిలొకటి విచారంగా కూస్తోంది.]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/Kanipincani-Koyila.jpg" alt="" title="Kanipincani Koyila" width="400" class="aligncenter size-full wp-image-15115" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఒ</span>క్కొకటిగా రాలుతున్న ఆకులతో అడవి మొత్తం బోడితలతో దర్శనమిస్తోంది. ఉక్కబోతలో గడ్డకట్టిన నిశ్శబ్దంలో ఒక మూలనుంచీ కనిపించని కోయిలొకటి విచారంగా కూస్తోంది.</p>
<p>మిట్టమధ్యాన్నపు ఎర్రటి ఎండ, పూడుకుపోతున్న చెరువులు, నట్టడివిలో కాలుతున్న జర్తె, బేసిన్ బ్రిడ్జ్ దగ్గర వరుసలు కట్టిన టమేటా బండ్లు,  తిరుపతి ఇరానీ హోటల్లో కవిత్వపు చర్చలూ, కబ్బన్ పార్కులో మామిడి పండ్ల అమ్మకం,  మానవప్రాణి కనిపించని ఒంటరి రైల్వే స్టేషన్ లో ఏకాకిలా జెండా ఊపుతున్న ష్టేషన్ మాష్టర్, దొంగ కుక్క మెడలో ఇరుక్కున్న మట్టి కుండ, తన మరణం వరకూ ఊరి చెరువును కబ్జా కానీకుండా ఆపిన చీకల సుబ్బమ్మ, అనంత దుఃఖదాయని హొగినేకల్ జలపాతపు ధ్వనీ&#8230;     </p>
<p>దాదాపు రెండు దశాబ్దాల నుంచీ కనిపించకుండా పోయిన రాయలసీమ కోయిల &#8216;మహేంద్ర&#8217; ఆ మధ్య దాకా వినిపించి పోయిన పాటలు ఇవన్నీ.     </p>
<p>కథ రాయటాన్ని జీవిత వాంఛగా మలుచుకున్న రచయిత మహేంద్ర.  లేకపోతే &#8220;ఏనుగుల రాజ్యం&#8221; అని రాయాలనుకొన్న నవలిక కోసం తలకోన నట్టడివిలో మధ్యలో ఏ రక్షణా లేకుండా కొన్ని రాత్రిళ్ళు గడిపి,  దానికి మూల్యంగా తన ప్రాణాన్ని ఎందుకు చెల్లిస్తాడు. </p>
<p>అట్లా అని &#8211; అది జీవిత వాంఛ కదా అని &#8211; పుంఖాను పుంఖాలుగా కథలు రాసి పాఠకుల్ని చిత్రవధ  చేసే ప్రలోభానికీ లోనుకాలేదు.  తీరాచూస్తే తన స్మృత్యర్ధం ప్రచురించిన &#8221; కనిపించని కోయిల&#8221; సంపుటంలో అన్ని కథలూ కలిపి &#8211; ఓ పదిహేను లోపే ఉన్నాయి- 1980 నుంచీ రాసినవి.  </p>
<p>అయితేనేం?</p>
<p>ప్రతి సన్నివేశంలో,  వాతావరణ చిత్రణలో, కథా సంవిధానంలో తన ముద్ర కనిపిస్తుంది. జాగ్రత్తగా వెతికితే మహేంద్ర ప్రతీ వాక్యాన్ని ఎంచి ఎంచి ఎంతో నిగ్రహంగా రాసినట్టు తెలుస్తుంది.  అలాంటి నిగ్రహం, నేర్పూ ఉన్న రచయితలు మనకు అరుదని మాత్రం చెప్పవచ్చు.   </p>
<p>అంతకు ముందు మహేంద్ర రాసిన &#8220;స్వర్ణ సీమకు స్వాగతం&#8221; నవలిక,  &#8220;పర్వవేలా తరంగాలు &#8221; కవిత్వం   సాహిత్యాభిమానులకు గుర్తుండే ఉంటాయి. తన &#8220;బేసిన్ బ్రిడ్జ్ దగ్గర, జర్తె, ముసలమ్మ మరణం, ఇంధనం&#8221; కథలు కోయిల పాటల్లా శాశ్వతంగా వినిపిస్తూనే ఉంటాయి &#8211; మన లోలోపల.  ప్రాణం పెట్టి కథ రాయటాన్ని ఒక విలువగా ఏర్పరిచి పోయిన మహేంద్ర గురించి &#8220;సితారా తీగె తెగిపోయింది. యవనిక జారిపోయింది&#8221; అన్నారు మునిపల్లె రాజు గారు  &#8216; కనిపించని కోయిల&#8217; కు ముందు మాటగా రాసిన తన &#8216;స్వప్న రసాయన శాస్త్రం&#8217;లో.     </p>
<p>&#8220;ఈ కథ ఒక సౌందర్య జీవన జలపాతం.  జలజలా పొంగిన సంతోషం. అగాధంలోకి దూకుతూ మధ్యలోన శిలగా నిలిచిపోయిన విషాదం. సాధారణ జీవనానంద విషాదాలకు అసాధారణ రసాత్మక వ్యాక్యాక్షర చిత్రణి&#8221;  అన్నారు వడ్డెర చండీదాస్ మహేంద్ర  రాసిన &#8216;హొగినేకల్&#8217; కథ గురించి.   </p>
<p>18-3-1987 ఆంధ్రప్రభ వార పత్రిక నుంచీ ఆ కథ ఈ నెల &#8216;వాకిలి&#8217; పాఠకులకోసం ప్రత్యేకం. </p>
<p>Story Clipping Credit: www.kathanilayam.com</p>
<hr/>
</div>
<p><iframe style="width: 880px; height: 1200px;" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/Hoginekal-Story-Mahendra.pdf" width="300" height="150" frameborder="0"></iframe></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15069</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>కర్తవ్యపాలనలోనే సత్యదర్శనం ఉందంటున్న విరాట్</title>
		<link>http://vaakili.com/patrika/?p=4935</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4935#comments</comments>
		<pubDate>Sat, 01 Feb 2014 00:12:14 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[మండువ రాధ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4935</guid>
		<description><![CDATA[<p>అశాంతికి కారణమైన అహాన్ని చంపుకోవడానికి అన్నింటినీ త్యజించి ఏకాకులుగా జీవించే ఋషులు, మహర్షులు నడిచిన బాటలో నడవాలని మనం తపన పడతాం. అయితే ఇలా ఏకాంతవాసులుగా మారిన వారికంటే కర్తవ్య నిర్వహణ గావిస్తూ తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండే వారికే ఎక్కువగా సత్యదర్శనం లభిస్తుందని తెలియచేస్తుంది స్టీఫన్ త్సయిక్ కథ (నవలిక) &#8216;విరాట్&#8217;.</p> <p>అన్ని బంధాలకు దూరంగా తనను తాను పోషించుకుంటూ స్వేచ్ఛగా ఉన్నాననుకుంటున్న వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నట్లు కాదు. ఇతరులకు సేవ చేసేవాడు, తన మన: శ్శక్తిని, శారీరక శక్తుల్ని కర్మలో నిమగ్నం చేసి ఫలితాన్ని భగవంతుని చేతికిచ్చేవాడే నిజమైన స్వతుంత్రుడని విరాట్ పాత్ర ద్వారా మనకి విశదపరిచిన త్సయిక్ ఆస్ట్రియా వాసి. యూదు జాతీయుడు. ఈయన ప్రపంచ ప్రసిద్ధ రచయితల్లో ఒకరు. విరాట్ నవలిక దాదాపు 40 భాషల్లోకి అనువదించబడి లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి.</p> <p>తొలి పరిచయం లోనే విరాట్ మానవమాత్రుడుగా అనిపించడు. ప్రేమమూర్తి, దైవాంశ సంభూతుడు అనిపిస్తాడు. అయినా కూడా ఎన్నో సమస్యలతో సతమతమౌతాడు. అవన్నీ తనకు తానే తెచ్చిపెట్టుకున్నట్లు అనిపిస్తుంది కాని ఆలోచిస్తే అవన్నీ మానవుడు మాననీయుడు అవడానికి విదుల్చుకుంటున్న ఒక్కో పొర అనిపిస్తుంది. లోకంలో ప్రేమ, త్యాగం, మంచితనం ఉండాలంటూనే వాటికి మించినది కర్తవ్య నిర్వహణ అంటాడు విరాట్.</p> <p style="text-align: center;">***</p> <p>వీరవాఘ రాజ్యంలో జీవిస్తున్న విరాట్ గొప్ప యోధుడు, ప్రతిభాశాలి, పవిత్రుడు, శాంతస్వభావి. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు గారి బావమరిది రాజ్యాన్ని కాజేసి తాను రాజవ్వాలనే దుర్బుద్ధితో కొంతమంది సైనికులని తన వైపుకు తిప్పుకుని అర్థరాత్రి అకస్మాత్తుగా రాజుపై దండెత్తుతాడు. రాజు యోధుడైన విరాట్ సహాయాన్ని కోరగా రాత్రికి రాత్రే శత్రువుల మీదికి దూకి వాళ్ళను తెగ నరుకుతాడు విరాట్. చీకట్లో జరిగిన యుద్ధంలో తాను ఎవరెవరిని చంపాడో చూడాలని వెళ్ళిన విరాట్ కి తన అన్న శవం కనపడుతుంది. తన తల్లి కడుపున పుట్టిన అన్నని స్వయంగా తెగనరికానన్న క్షోభతో ఇక కత్తి పట్టనని [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/radha.jpg"><img class="alignleft  wp-image-3556" title="radha" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/radha.jpg" alt="" width="161" height="170" /></a>అశాంతికి కారణమైన అహాన్ని చంపుకోవడానికి అన్నింటినీ త్యజించి ఏకాకులుగా జీవించే ఋషులు, మహర్షులు నడిచిన బాటలో నడవాలని మనం తపన పడతాం. అయితే ఇలా ఏకాంతవాసులుగా మారిన వారికంటే కర్తవ్య నిర్వహణ గావిస్తూ తామరాకు మీద నీటిబొట్టులాగా ఉండే వారికే ఎక్కువగా సత్యదర్శనం లభిస్తుందని తెలియచేస్తుంది <a title="Stefan Zweig" href="http://en.wikipedia.org/wiki/Stefan_Zweig">స్టీఫన్ త్సయిక్</a> కథ (నవలిక) &#8216;విరాట్&#8217;.</p>
<p>అన్ని బంధాలకు దూరంగా తనను తాను పోషించుకుంటూ స్వేచ్ఛగా ఉన్నాననుకుంటున్న వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నట్లు కాదు. ఇతరులకు సేవ చేసేవాడు, తన మన: శ్శక్తిని, శారీరక శక్తుల్ని కర్మలో నిమగ్నం చేసి ఫలితాన్ని భగవంతుని చేతికిచ్చేవాడే నిజమైన స్వతుంత్రుడని విరాట్ పాత్ర ద్వారా మనకి విశదపరిచిన త్సయిక్ ఆస్ట్రియా వాసి. యూదు జాతీయుడు. ఈయన ప్రపంచ ప్రసిద్ధ రచయితల్లో ఒకరు. విరాట్ నవలిక దాదాపు 40 భాషల్లోకి అనువదించబడి లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి.</p>
<p>తొలి పరిచయం లోనే విరాట్ మానవమాత్రుడుగా అనిపించడు. ప్రేమమూర్తి, దైవాంశ సంభూతుడు అనిపిస్తాడు. అయినా కూడా ఎన్నో సమస్యలతో సతమతమౌతాడు. అవన్నీ తనకు తానే తెచ్చిపెట్టుకున్నట్లు అనిపిస్తుంది కాని ఆలోచిస్తే అవన్నీ మానవుడు మాననీయుడు అవడానికి విదుల్చుకుంటున్న ఒక్కో పొర అనిపిస్తుంది. లోకంలో ప్రేమ, త్యాగం, మంచితనం ఉండాలంటూనే వాటికి మించినది కర్తవ్య నిర్వహణ అంటాడు విరాట్.</p>
<p style="text-align: center;">***</p>
<p>వీరవాఘ రాజ్యంలో జీవిస్తున్న విరాట్ గొప్ప యోధుడు, ప్రతిభాశాలి, పవిత్రుడు, శాంతస్వభావి. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు గారి బావమరిది రాజ్యాన్ని కాజేసి తాను రాజవ్వాలనే దుర్బుద్ధితో కొంతమంది సైనికులని తన వైపుకు తిప్పుకుని అర్థరాత్రి అకస్మాత్తుగా రాజుపై దండెత్తుతాడు. రాజు యోధుడైన విరాట్ సహాయాన్ని కోరగా రాత్రికి రాత్రే శత్రువుల మీదికి దూకి వాళ్ళను తెగ నరుకుతాడు విరాట్. చీకట్లో జరిగిన యుద్ధంలో తాను ఎవరెవరిని చంపాడో చూడాలని వెళ్ళిన విరాట్ కి తన అన్న శవం కనపడుతుంది. తన తల్లి కడుపున పుట్టిన అన్నని స్వయంగా తెగనరికానన్న క్షోభతో ఇక కత్తి పట్టనని ప్రమాణం చేస్తాడు. విరాట్ ని అర్థం చేసుకున్న రాజు కనీసం తన రాజ్యానికి న్యాయనిర్ణేతగా ఉండమని అభ్యర్థిస్తాడు. అంగీకరించిన విరాట్ ధర్మబద్ధంగా తీర్పులు ఇస్తూ గొప్ప న్యాయాధికారిగా కీర్తి గాంచుతాడు. అతను ఎవరికీ మరణశిక్ష విధించేవాడు కాదు.</p>
<p>ఒకరోజు కొంతమంది కొండప్రాంతపు వాళ్ళు ఒక యువకుడిని బంధించి తెచ్చి విరాట్ ముందు నిలబెడతారు. పదకొండు మందిని హత్య చేసిన అతన్ని శిక్షించమని కోరతారు. &#8220;నిజమేనా&#8221; అని అడిగిన విరాట్ ప్రశ్నకు ఆ యువకుడు సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. &#8220;సరైన సమాధానం ఇవ్వడం లేదు అయినా నిన్ను దయతలచి పదకొండు సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తున్నాను&#8221; అంటాడు విరాట్. అంతవరకూ మౌనంగా ఉన్న ఆ యువకుడు ఆవేశపడుతూ &#8220;ఇది దయ ఎలా అవుతుంది? ఒక్కసారిగా నన్ను చంపకుండా బంధించి జీవచ్ఛవంలా గడిపేట్లు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా చెరసాల జీవితం గడిపితే ఈ శిక్ష ఎంత అమానుషమో తెలుస్తుంది&#8221; అంటాడు.</p>
<p>మనసు వికలమైపోయిన విరాట్ ఒక నెలపాటు తాను జైలు శిక్ష అనుభవించి దానిలోని బాధను తెలుసుకోవాలనుకుంటాడు. నెలరోజులు అజ్ఞాతవాసంలోకి వెళుతున్నానని రాజుకి, కుటుంబ సభ్యులకి చెప్పి ఒక లేఖ రాసుకుని జైలుకి వెళతాడు. విరాట్ ని చూసి ఆశ్చర్యపోతున్న ఆ యువకుడితో &#8220;నువ్వు చెప్పిన మాటల్లో సత్యం ఉంది. తనకు అనుభవంలో లేని శిక్షలను ఇతరులకు వేయకూడదు. నెల రోజులు నేను నీకు బదులుగా శిక్ష అనుభవిస్తాను. నెల రోజుల తర్వాత వచ్చి ఈ లేఖను రాజుగారికి ఇవ్వు అయితే నువ్వు నెల తర్వాత వస్తానని మాట ఇవ్వు&#8221; అంటాడు. ఆ మాటలకు యువకుడు భోరున ఏడుస్తాడు పశ్చాత్తాపంతో.</p>
<p>చీకటిలో ఒంటరిగా మమతానురాగాలకు, రాగద్వేషాలాకు దూరంగా ఉన్న విరాట్ కు కొద్దిరోజుల్లోనే మనసు నిర్మలం అయిపోతుంది. జైలు జీవితం సంతోషంగా అనిపించసాగింది. కాని ఒకరోజు &#8216;నెల తర్వాత ఖైదీ రాకపోతే&#8217; అన్న ఆలోచన &#8211; ఈ ఆలోచన కలగగానే అతనికి ఒక్కసారిగా భయం కలిగింది. మనశ్శాంతిని కోల్పోయాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల తర్వాత రాజుతో ఆ యువకుడు వచ్చి విరాట్ ని విడిపిస్తాడు. ఈ సంఘటనతో విరాట్ కీర్తి రాజ్యమంతా ప్రాకుతుంది.</p>
<p>తన సింహాసనం ప్రక్కనే విరాట్ కి స్థానాన్ని ఇచ్చిన రాజుతో &#8220;న్యాయాధికారి పదవి నుండి నన్ను తప్పించండి. ఒకరి గురించి మరొకరికి న్యాయం చెప్పే అధికారం భగవంతుడికి తప్ప మరెవ్వరికీ లేదు. నేను ఇంట్లో ప్రశాంతంగా జీవించదలుచుకున్నాను&#8221; అని శలవు తీసుకుంటాడు.</p>
<p>ధ్యానం చేసుకుంటూ, అందరితో ఆత్మీయంగా మెలుగుతూ, దీనులకి సహాయం చేస్తూ సంతోషంగా గడుపుతున్న విరాట్ కు ఒకరోజు తన ఇంట్లో పనిచేస్తున్న బానిస ఆక్రందనలు వినపడతాయి. బానిస సరిగా పనిచేయలేదని రక్తం వచ్చేట్లు కొడుతున్న కొడుకుని పిలిచి బానిసని పంపించెయ్యమని చెప్తాడు. కొడుకు మండిపడుతూ &#8220;బానిసలు లేకపోతే మీ పనులు ఎవరు చేస్తారు? మీరు ఏనాడైనా పని చేశారా?&#8221; అని నిలదీస్తాడు. &#8220;ఇకనుండి మన పనులు మనమే చేసుకుందాం&#8221; అన్న విరాట్ కు &#8220;అది మా అభీష్టం కాదు. అలాంటప్పుడు మా అభీష్టాలపై ఆంక్షలు పెట్టి మమ్మల్ని మీరెలా శాసిస్తారు?&#8221; అన్నారు కొడుకులు అందరూ. కొడుకుల కళ్ళల్లోని దురహంకారాన్ని చూసిన విరాట్ &#8220;శాసించే వాడు ఇతరుల స్వాతంత్ర్యాన్ని అణచివేస్తాడని మీరు చెప్పింది నిజమే కాని ఆత్మని బానిసను చేసుకోవడం అన్నింటికన్నా నీచమైనది. శ్రమించేవాడి దగ్గరే భగవంతుడు ఉంటాడన్న విషయం నాకు అవగతమైంది&#8221; అంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.</p>
<p>నిర్జన నదీ తీరంలో కుటీరం నిర్మించుకుని అడవిలో దొరికే పండ్లతో కడుపు నింపుకోసాగాడు. కొన్ని ఏళ్ళ తర్వాత ఒకరోజు ఓ వేటగాడు, కుటీరం ముందు మెరుస్తున్న శరీరంతో కూర్చుని పశుపష్యాదులతో మాట్లాడుతున్న విరాట్ ని చూసి పరుగు పరుగున వెళ్ళి అందరికీ వింతని తెలియచేస్తాడు. విరాట్ ని చూడటానికి జనం గుంపులుగా రాసాగారు. రాజుకి విషయం తెలిసి విరాట్ ని చూడటానికి వచ్చి &#8220;మీ జీవితం ద్వారా జ్ఞానులు ఎలా జీవించాలో తెలియచేస్తున్నారు&#8221; అన్నాడు.<br />
&#8220;ఏకాంతవాసం చేసేవాడు తనకు తాను తప్ప ఇతరులకు బోధించలేడు. నేను చేస్తున్న పని వివేకమైనదో కాదో నాకు తెలియదు. నా జీవితాన్ని పాపాలకు దూరంగా గడుపుతున్నా- అంతే&#8221; అని అంటాడు. అతడు గొప్ప జ్ఞాని అన్న కీర్తి మళ్ళీ రాజ్యమంతా ప్రాకిపోతుంది.</p>
<p>కాలం గడిచే కొద్దీ పాపకర్మలకు పాశ్చాత్తాప పడేవాళ్ళు, జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు అడవికి వచ్చి విరాట్ కుటీరం ప్రక్కన కుటీరాలు నిర్మించుకోసాగారు. ఒకరోజు విరాట్ కుటీరం వదిలి అడవిలోకి వెళ్ళినపుడు ఒక సాధువు శవం పడి ఉండటం చూస్తాడు. అతనికి అంత్యక్రియలు జరిపించడానికి గ్రామస్తుల సహాయం తీసుకుందామని దాపున ఉన్న గ్రామానికి వెళతాడు. గ్రామంలో నడుస్తున్న విరాట్ తనవైపు నిప్పులు కక్కే కళ్ళతో ద్వేషంగా చూస్తున్న ఓ స్త్రీని గమనించి ఆశ్చర్యపోతాడు. ఆమె చూపులకు వణికిపోతాడు. &#8216;ఆమెకి నేనేం ద్రోహం చేశాను? ఎందుకు నన్ను అలా చూస్తుంది? కనుక్కోవాలి&#8217; అనుకుని ఆమె దగ్గరకి వెళ్ళి &#8220;నేను మనుషులకి దూరంగా బ్రతుకుతున్నాను. నేను నీకు ఏ హానీ చేయలేదు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నావు?&#8221; అని అడుగుతాడు. &#8220;కుటుంబంతో హాయిగా గడుపుతూ మమ్మల్ని పోషిస్తున్న నా భర్తకు సంసార బంధనాలు మిధ్య అనే భ్రమ కల్పించావు. నా భర్త మమ్మల్ని గాలికి వదిలేసి నీ బాటన నడవడానికి వెళ్ళాడు. నా ముగ్గురు బిడ్డలు తిండిలేక మరణించాడు&#8221; అంటూ ఆరోజే చనిపోయిన మూడవ బిడ్డ శవాన్ని చూపిస్తుంది. నోట మాట రాక నిశ్చేష్టుడైన విరాట్ ని &#8220;ఒక పని చేసే ముందు దీన్ని ఇతరులు అనుసరిస్తారేమో, పరిణామాలెలా ఉంటాయో అని ఆలోచించలేని వాడివి నువ్వేం మహాత్ముడివి?&#8221; అని నిలదీస్తుంది.</p>
<p>విరాట్ భయంతో కంపించిపోతాడు. మనిషి అపాదమస్తకం వణికిపోతాడు. అతనికి జ్ఞానోదయమయింది.</p>
<p>కుటీరాన్ని వదిలి రాజు దగ్గరకి వెళ్ళి &#8216;పని లేకుండా ఖాళీగా ఉండాలనుకోవడం లేదనీ, ఏదైనా సేవ చేసే అవకాశం కల్పించమనీ&#8217; అంటాడు. ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వబోయిన రాజుతో &#8216;సేవలు చేయించుకునే వాడు స్వతంత్రుడు కాదు. సేవ చేసే వాడే నిజమైన స్వతంత్రుడు&#8217; అన్న విరాట్ మాటలకు రాజు అహం దెబ్బ తింటుంది. విరాట్ కి పిచ్చెక్కిందేమో పరీక్షించాలనుకున్న రాజు అతన్ని కుక్కల సంరక్షకుడిగా నియమిస్తాడు. ఆ పనిని సంతోషంగా స్వీకరించిన విరాట్ ని చూసి ప్రజలందరూ అతనికి నిజంగానే పిచ్చెక్కిందనుకుంటారు రాజుతో సహా. కుటుంబ సభ్యులు అసహ్యించుకుని అతన్ని వదిలేస్తారు. అతను మరణించినపుడు అనాధ ప్రేతలను దహనం చేసేవాళ్ళు అతన్ని దహనం చేస్తారు. కుక్కలు మాత్రం రెండు రోజులు అన్నం తినకుండా రోదిస్తాయి.<br />
ఇదీ క్లుప్తంగా కథ.</p>
<p>సంసార బంధనాలను వదిలి దూరంగా కార్యశూన్యుడుగా బ్రతికే వ్యక్తి కూడా తెలిసో తెలియకో ఏదో ఒక కర్మని ఆచరిస్తూనే ఉంటాడు. దానికతడు బాధ్యుడు అవుతాడన్న నిజాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించాడు త్సయిక్. తాత్త్విక ప్రసంగాలు ఇస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన జిడ్డు కృష్ణమూర్తి, కిళ్ళీ బడ్డి నడుపుకుంటూ జీవనం గడిపిన నిసర్గదత్త చెప్పిందీ ఇదే. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన భర్త బుద్దుడిని, &#8216;కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మోక్షాన్ని పొందలేమా &#8211; మోక్షసాధనం కోసం సంసారాన్ని త్యజించాలా?&#8217; అని అడిగిన యశోధరకి బుద్దుడు చెప్పిన సమాధానమూ ఇదే.</p>
<p>ఈ నవలని తెలుగులోకి పొనుగోటి కృష్ణారెడ్డి గారు అనువదించారు. ఈ నవలికని కృష్ణారెడ్డిగారు తను పదో తరగతి చదివే రోజుల్లోనే చదివారట. తెలుగులోకి తీసుకురావాలనే తపనతో ఎవరితోనైనా అనువాదం చేయించాలనుకుని సాధ్యం కాక తనే ఆ పనికి పూనుకున్నారట. కృతకృత్యులయ్యారు. ఈ పుస్తకం కినిగే లో దొరుకుతుంది. లింకు: <a href="http://kinige.com/kbook.php?id=147&amp;name=Virat">http://kinige.com/kbook.php?id=147&amp;name=Virat </a></p>
<p style="text-align: center;">*********</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4935</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
		<item>
		<title>దాంపత్యం</title>
		<link>http://vaakili.com/patrika/?p=4675</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4675#comments</comments>
		<pubDate>Tue, 31 Dec 2013 16:14:57 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[మాలాకుమార్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4675</guid>
		<description><![CDATA[<p>రాజేశ్వరి భావుకురాలు. సగటు ఇల్లాలు. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. భర్త అభిప్రాయాలకు అనుగుణం గా నడుచుకోవాలని , ఇల్లు భర్త కు నచ్చినట్లుగా నడవాలనీ తెలుసు.అలాగే నడుచుకుంటుంది కూడాను. రాజేశ్వరి భర్త రమేష్ మంచివాడే దుర్మార్గుడేమీ కాదు. కాకపోతే ఆడవారికి స్పందించే గుణం వుంటుందని తెలీనివాడు. చీరలు నగల కోసం తపించిపోతూవుంటారని అనుకుంటాడు.అవి అమరుస్తే చాలు అనుకుంటాడు.రాజేశ్వరి అలాగే అనుగుణంగా నడుచుకునేది కూడా.కాని భర్త నోటిని భరించలేక పోయేది.అలాగే ఇద్దరు పిల్లలకు తల్లైంది. పిల్లలు చంద్రం, సరోజ కూడా తల్లికే చేరిక అయ్యారు. భర్త నుంచి ఏమాత్రం ఆప్యాయత పొందని రాజేశ్వరి పిల్లలే లోకంగా గడిపింది.అడుగడుగునా తండ్రి పరుషవాక్యాలు, ఎప్పుడేమి వినవలసి వస్తుందోనని తల్లి వణికిపోవటాలు వారికి చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి.అన్నిటికన్నా దారుణమైన విషయమేమిటంటే రాజేశ్వరిని ఇంట్లోనుంచి వెళ్ళిపోమని అరుస్తూవుండటము.ఒక్కసారి అని వూరుకునేవాడుకాదు, రాజేశ్వరి తలుపు తీసుకొని బయటికెళ్ళేదాకా అలా అరుస్తూ వుండేవాడు.ఆ అవమానాలన్నీ భరించింది.</p> <p>పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళు చేసుకొని జీవితం లో స్థిరపడ్డారు. రాజేశ్వరికి లోకమంతా శూన్యంగా అనిపించింది.కొంతమంది దంపతులలో పిల్లలు స్థిరపడినతరువాత, భర్త రిటైరయ్యి ఖాళీగా వున్నప్పుడు , ఇద్దరి మధ్య సానిహిత్యం ఏర్పడుతుంది. వీరి మధ్య అదీలేదు.అదే సమయము లో ఓసారి ఓచిన్న విషయానికే రెచ్చిపోయి రాజేశ్వరిని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మన్నాడు. ఈ సారి రాజేశ్వరి నిజంగానే వెళ్ళిపోయి , ఆ వీధి చివరనే ఓ గది అద్దెకు తీసుకొని వుంటుంది. పిల్లలిద్దరూ వస్తారు. తమతో హైదరాబాద్ రమ్మంటారు.తండ్రిని క్షమించమంటారు. వారి సంభాషణని గమనిస్తున్న కోడలు జానకికి రమ్మనిపిలవటానికి మామగారికి అహంకారము. వెళ్ళటానికి అత్తగారికి అభిమానం అడ్డొస్తోందని అర్ధం అవుతుంది.ఆ ఇంట్లో ఆవిడ కు అన్ని హక్కులూ వున్నాయి. ఆయన వెళ్ళిపొమ్మన్నంతమాత్రాన వెళ్ళిపోనవసరం లేదు. ఆయన తిడితే ఆవిడా తిట్టవచ్చు అని నచ్చచెపుతుంది అత్తగారికి.ఆవిడ స్థానం వదలకుండా హక్కులు ఎలా కాపాడుకోవచ్చో బోధిస్తుంది.తన మనసులోని భావాలనే జానకి బలపరుస్తున్నట్లుగా అనిపించి , ఇంటికి మహరాణిలా తిరిగి వస్తుంది.</p> [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mala-2.jpg"><img class="alignleft size-full wp-image-4678" title="mala-2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/mala-2.jpg" alt="" width="141" height="173" /></a>రాజేశ్వరి భావుకురాలు. సగటు ఇల్లాలు. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. భర్త అభిప్రాయాలకు అనుగుణం గా నడుచుకోవాలని , ఇల్లు భర్త కు నచ్చినట్లుగా నడవాలనీ తెలుసు.అలాగే నడుచుకుంటుంది కూడాను. రాజేశ్వరి భర్త రమేష్ మంచివాడే దుర్మార్గుడేమీ కాదు. కాకపోతే ఆడవారికి స్పందించే గుణం వుంటుందని తెలీనివాడు. చీరలు నగల కోసం తపించిపోతూవుంటారని అనుకుంటాడు.అవి అమరుస్తే చాలు అనుకుంటాడు.రాజేశ్వరి అలాగే అనుగుణంగా నడుచుకునేది కూడా.కాని భర్త నోటిని భరించలేక పోయేది.అలాగే ఇద్దరు పిల్లలకు తల్లైంది. పిల్లలు చంద్రం, సరోజ కూడా తల్లికే చేరిక అయ్యారు. భర్త నుంచి ఏమాత్రం ఆప్యాయత పొందని రాజేశ్వరి పిల్లలే లోకంగా గడిపింది.అడుగడుగునా తండ్రి పరుషవాక్యాలు, ఎప్పుడేమి వినవలసి వస్తుందోనని తల్లి వణికిపోవటాలు వారికి చిన్నప్పటి నుంచే అలవాటయ్యాయి.అన్నిటికన్నా దారుణమైన విషయమేమిటంటే రాజేశ్వరిని ఇంట్లోనుంచి వెళ్ళిపోమని అరుస్తూవుండటము.ఒక్కసారి అని వూరుకునేవాడుకాదు, రాజేశ్వరి తలుపు తీసుకొని బయటికెళ్ళేదాకా అలా అరుస్తూ వుండేవాడు.ఆ అవమానాలన్నీ భరించింది.</p>
<p>పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళు చేసుకొని జీవితం లో స్థిరపడ్డారు. రాజేశ్వరికి లోకమంతా శూన్యంగా అనిపించింది.కొంతమంది దంపతులలో పిల్లలు స్థిరపడినతరువాత, భర్త రిటైరయ్యి ఖాళీగా వున్నప్పుడు , ఇద్దరి మధ్య సానిహిత్యం ఏర్పడుతుంది. వీరి మధ్య అదీలేదు.అదే సమయము లో ఓసారి ఓచిన్న విషయానికే రెచ్చిపోయి రాజేశ్వరిని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మన్నాడు. ఈ సారి రాజేశ్వరి నిజంగానే వెళ్ళిపోయి , ఆ వీధి చివరనే ఓ గది అద్దెకు తీసుకొని వుంటుంది. పిల్లలిద్దరూ వస్తారు. తమతో హైదరాబాద్ రమ్మంటారు.తండ్రిని క్షమించమంటారు. వారి సంభాషణని గమనిస్తున్న కోడలు జానకికి రమ్మనిపిలవటానికి మామగారికి అహంకారము. వెళ్ళటానికి అత్తగారికి అభిమానం అడ్డొస్తోందని అర్ధం అవుతుంది.ఆ ఇంట్లో ఆవిడ కు అన్ని హక్కులూ వున్నాయి. ఆయన వెళ్ళిపొమ్మన్నంతమాత్రాన వెళ్ళిపోనవసరం లేదు. ఆయన తిడితే ఆవిడా తిట్టవచ్చు అని నచ్చచెపుతుంది అత్తగారికి.ఆవిడ స్థానం వదలకుండా హక్కులు ఎలా కాపాడుకోవచ్చో బోధిస్తుంది.తన మనసులోని భావాలనే జానకి బలపరుస్తున్నట్లుగా అనిపించి , ఇంటికి మహరాణిలా తిరిగి వస్తుంది.</p>
<p>స్తూలం గా &#8220;దాంపత్యం &#8220;కథ ఇది.</p>
<p>సగటు మగవాడు రమేష్. ఆడది అంటే అణిగిమణిగి వుండాలని అనుకొంటాడు.ఆమెకు స్వంత భావాలు వుంటాయని కాని, మనసు వుంటుందని కాని దానికి స్పందించే గుణం వుంటుంది అనికాని అతనికి తెలీదు.భర్త చెప్పిందే భార్యకు వేదం.అతని ఇష్టాయిష్టాలే ఆటోమేటిగ్గా ఆమెవి ఐపోతాయి.భర్త , ఇల్లు, పిల్లలు తప్ప ఆమెకేమీ వేరే ఆలోచనలు ఎదగవని అతని విశ్వాసము.ఆమెకు కావలసిన చీరలు నగలూ అన్నీ అతనే తీసుకొస్తాడు. ఆమెకేమీ లోటు చేయటం లేదు కదా అనుకుంటాడు. అది అతని తప్పు కాదు. అతను పెరిగిన వాతావరణం అది.</p>
<p>ఇక రాజేశ్వరి విషయానికొస్తే ,పుట్టింట్లో ఒక్కతే అమ్మాయని, మహాలక్ష్మిలా వెలిసింది అని , తలితండ్రుల, అన్నదమ్ముల మధ్య ఆప్యాయంగా గారంగా పెరిగిన అమ్మాయి.మాటలు కూడా దురుసుగా మాట్లాడుకోని , సంస్కారవంతమైన ఇంటి నుంచి వచ్చింది.అందరూ మామూలుగా తిట్టుకునే తిట్లు కూడా శూలాలా అనిపిస్తాయి. పైగా భావుకురాలు. మల్లెల సౌరభానికి, లలితమైన లలిత గీతాలకు కూడా స్పందించే మనసు.భర్త అభిప్రాయాలకు అణుగుణంగా నడుచుకోవాలని,అత్తవారింట్లో ఆమే ప్రవర్తించే పద్దతి మీదే పుట్టినింటి గౌరవం పెరుగుతుందని తెలిసినది.ఇల్లు భర్త మాటమీదే నడవాలని తెలుసు . అలాగే నడుచుకునేది కూడా.చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడే స్వాతంత్ర్యం ఆడవారికి వుండదని తెలీదు.</p>
<p>ఇటువంటి విరుద్దమైన స్వభావాలు కల భార్యా భర్త ల మధ్య జరిగినదే ఈ కథ . ఇది ఒక మామూలి, సగటు గృహిణి కథే కావచ్చు. చాలా మందికి రాజేశ్వరి అనుభవాల లాంటివి జరిగి వుండవచ్చు.కాని ఇందులో రాజేశ్వరి ఆలోచనలు, భావాలు చెప్పిన విధానము బాగుంది.భావుకురాలైన రాజేశ్వరి చిన్ని చిని కోరికలు కూడా తీర్చుకోలేకపోవటము , బాధపడటము , ప్రతిదానికి అడ్జెస్టైపోవటము, ఇద్దరి భావాల మధ్య తేడాను,ఇద్దరి మధ్య నున్న సంఘర్షణను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు రచయిత్రి.కాలమెంత మారినా అమ్మాయిల అదృష్టం మటుకు అంతగా మారలేదనిపిస్తుంది. ఈ తరం లో కొద్దిగా మేలేమో.ఈ కథలో అన్నిటికన్నా నాకు ఎక్కువగా నచ్చింది ముగింపు.చాలా వరకు ఇలాంటి కథలల్లో నాయిక ఇంటి నుంచి వెళ్ళిపోవటమో , లేక ఖర్మ ఇంతేననుకొని వుండిపోవటమో వుంటుంది. ఇందులో రాజేశ్వరి తిరిగి వచ్చినా తలవంచుకొని రాలేదు, మహారాణిలా వచ్చింది. తిరుగుబాటు జండా ఎగరేసింది.అది చాలా నచ్చింది.</p>
<p>కొన్ని కొన్ని చోట్ల రాజేశ్వరి భాధను చాలా బాగా చూపించారు.ఎంతసేపు రమేశ్ భార్య అనే అంటారు కాని ఆడవారి అస్తిత్వానికి నీడలేకుండా చేసిన సమాజం మీద కోపం తెచ్చుకొని , తండ్రిని అడుగుతుంది &#8220;నాన్నా ,పెళ్ళిచేసుకొని మరొకరికి ఇల్లాలైనంతమాత్రాన ఒక స్త్రీ లోని ప్రతిభ అణగారిపోవల్సిందేనా ?&#8221;అని. చదువుకున్నవాడు, సంస్కారవంతుడూ ఐన రాజేశ్వరి తండ్రి అచ్చం ఆడపిల్ల తండ్రిలాగే &#8220;ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీపురుషులు కలిసి జీవించాలనుకున్నప్పుడు నీలో ప్రత్యేకతలేమీ వుండకూడదు.అలావుండాలనుకోవటం ప్రకృతికి విరుద్దంగా నడవటమే &#8221; అంటాడు. ఈ భావం ఎన్ని శతాబ్ధాలు గడిచినా మారదా అని ఓ క్షణం బాధ అనిపిస్తుంది.అంతలోనే ఈ తరం ప్రతినిధి జానకి అత్తగారితో &#8221; ఈ ఇల్లు ఆయనదిలాగే మీది కూడాను.మాటలనే అధికారం ఆయనకే కాదు మీకూ వుంది.ఆయన పొమ్మంటే మీరూ పొమ్మనండి &#8220;అని నచ్చచెప్పటం చదివినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది.ఇలా విరుద్ధమైన భావాలు, తరాల మధ్య అంతరాలు బాగా చూపించారు. వ్రాసిన విధానము బాగుంది.మన పక్కింట్లోనే జరుగుతున్న సంగ్జటనల లాగే అనిపిస్తాయి.ఇలాంటి దంపతులు ఎక్కడో లేరు మనమధ్యనే వున్నారు.</p>
<p>ఈ కథను జి.యస్.లక్ష్మిగారు వ్రాసారు.ఇది &#8220;రచన&#8221; ఫిబ్రవరి 2002 మాసపత్రికలో , కథాపీఠం బహుమతి పొంది, ప్రచురించబడింది . మీరూ చదివి చూడండి, మీకూ ఈ కథ తప్పక నచ్చుతుంది.</p>
<p>కథ లింకు: <a href="http://srilalitaa.blogspot.in/2012/09/blog-post_28.html" target="_blank">http://srilalitaa.blogspot.in/<wbr>2012/09/blog-post_28.html</wbr></a></p>
<p style="text-align: center;">*** * ***</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4675</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>వెంటాడి వేటాడే  వెన్నెల దారి</title>
		<link>http://vaakili.com/patrika/?p=4257</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4257#comments</comments>
		<pubDate>Thu, 31 Oct 2013 20:53:06 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[వేణూశ్రీకాంత్ దార్ల]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4257</guid>
		<description><![CDATA[<p>అవధాని డిగ్రీలో చేరబోతున్న పద్దెనిమిదేళ్ళ కుర్రవాడు, అతని వేలువిడిచిన మేనమేమ భూషణం బాగా చదువుకుని సంఘంలో పేరు ప్రతిష్టలున్న పెద్దమనిషి. భూషణం బావ రామచంద్రం టెన్నిస్ ఛాంపియన్, ఆస్థి భార్య తరఫున వచ్చినదే అయినా ఆస్థిపరుడు మరియూ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. వీరు ముగ్గురూ ఏలూరులో ఉన్న పని చూసుకుని పొద్దుపోయే వేళకు రామచంద్రం సెకండ్ హాండ్ ఫోర్డ్ కారులో తణుకు బయలుదేరుతారు. బయలుదేరిన ఆరుమైళ్ళలోపే ఆగిపోయిన కారు మరి రెండు చోట్ల ట్రబుల్ ఇచ్చి ముందుకు కదిలినా తణుకుకు పదిహేను మైళ్ళదూరంలో నల్లజర్ల అడవిలోకి అడుగుపెట్టాక పూర్తిగా మొరాయించి ఆగిపోతుంది.</p> <p>అడవిలో ఒంటరిగా రాత్రిగడపలేక పైగా తణుకులో పొద్దున్నే కలెక్టర్ గారింట పెళ్ళికి వెళ్ళాలి కనుక కారుని ఎలాగైనా రిపేరు చేయాలని శతవిధాల ప్రయత్నిస్తూ రహదారికి కొంచెం దూరంలో ఉన్న పొదలలో కర్రకోసం వెతుకుతున్న రామచంద్రాన్ని పాము కాటేయడంతో అక్కడికక్కడే కూలిపోతాడు. అడవిలో చిరుతపులి తిరుగుతుందని విని భయపడుతున్న అవధాని ఏదో మంటని చూసి దెయ్యమనుకుని స్పృహ కోల్పోతాడు. రామచంద్రాన్ని రక్షించుకోలేకపోతున్నానని తాముకూడా దిక్కులేనిచావు చావబోతున్నామని భూషణం దదాపు ఖరారు చేసుకునే తరుణంలో పాముల వాడు సిద్దయ్య అతని కూతురు సూరీడు కనిపించి రామచంద్రాన్ని ప్రాణాపాయం నుండి తప్పించి వారికి ఆశ్రయం ఇస్తారు. అలా తమని కాపాడిన వారిద్దరితో ఈ పట్నవాసపు పెద్దమనుషులు ఇద్దరూ ఎలా ప్రవర్తించారనేది కథకు ముగింపు.</p> <p>దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసిన “నల్లజర్ల రోడ్” కథ స్థూలముగా ఇదీ, ఈ కథ 1964 లో ఆంధ్రపత్రికలో ప్రచురించబడినది. అయితే ఈ కథ జరిగిన కాలం మాత్రం 1940 అనుకోవచ్చు ఎందుకంటే తన జీవితంలో పాతికేళ్ళ క్రితం జరిగిన ఈ కథ/సంఘటనను అవధాని గారు ఊరి చివర కట్టుకున్న తన తోట బంగళాలో రచయిత మరికొందరు మిత్రులకు ఇచ్చిన విందు అనంతరం కబుర్లలో చెప్పినట్లుగా రాశారు. ఈ కథను పైపైన చదవడానికి ప్రయత్నించే నవతరం పాఠకులకు ములకథలో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/Tilak.jpg"><img class="alignright size-full wp-image-4260" title="Tilak" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/Tilak.jpg" alt="" width="226" height="320" /></a>అవధాని డిగ్రీలో చేరబోతున్న పద్దెనిమిదేళ్ళ కుర్రవాడు, అతని వేలువిడిచిన మేనమేమ భూషణం బాగా చదువుకుని సంఘంలో పేరు ప్రతిష్టలున్న పెద్దమనిషి. భూషణం బావ రామచంద్రం టెన్నిస్ ఛాంపియన్, ఆస్థి భార్య తరఫున వచ్చినదే అయినా ఆస్థిపరుడు మరియూ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. వీరు ముగ్గురూ ఏలూరులో ఉన్న పని చూసుకుని పొద్దుపోయే వేళకు రామచంద్రం సెకండ్ హాండ్ ఫోర్డ్ కారులో తణుకు బయలుదేరుతారు. బయలుదేరిన ఆరుమైళ్ళలోపే ఆగిపోయిన కారు మరి రెండు చోట్ల ట్రబుల్ ఇచ్చి ముందుకు కదిలినా తణుకుకు పదిహేను మైళ్ళదూరంలో నల్లజర్ల అడవిలోకి అడుగుపెట్టాక పూర్తిగా మొరాయించి ఆగిపోతుంది.</p>
<p>అడవిలో ఒంటరిగా రాత్రిగడపలేక పైగా తణుకులో పొద్దున్నే కలెక్టర్ గారింట పెళ్ళికి వెళ్ళాలి కనుక కారుని ఎలాగైనా రిపేరు చేయాలని శతవిధాల ప్రయత్నిస్తూ రహదారికి కొంచెం దూరంలో ఉన్న పొదలలో కర్రకోసం వెతుకుతున్న రామచంద్రాన్ని పాము కాటేయడంతో అక్కడికక్కడే కూలిపోతాడు. అడవిలో చిరుతపులి తిరుగుతుందని విని భయపడుతున్న అవధాని ఏదో మంటని చూసి దెయ్యమనుకుని స్పృహ కోల్పోతాడు. రామచంద్రాన్ని రక్షించుకోలేకపోతున్నానని తాముకూడా దిక్కులేనిచావు చావబోతున్నామని భూషణం దదాపు ఖరారు చేసుకునే తరుణంలో పాముల వాడు సిద్దయ్య అతని కూతురు సూరీడు కనిపించి రామచంద్రాన్ని ప్రాణాపాయం నుండి తప్పించి వారికి ఆశ్రయం ఇస్తారు. అలా తమని కాపాడిన వారిద్దరితో ఈ పట్నవాసపు పెద్దమనుషులు ఇద్దరూ ఎలా ప్రవర్తించారనేది కథకు ముగింపు.</p>
<p>దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసిన “నల్లజర్ల రోడ్” కథ స్థూలముగా ఇదీ, ఈ కథ 1964 లో ఆంధ్రపత్రికలో ప్రచురించబడినది. అయితే ఈ కథ జరిగిన కాలం మాత్రం 1940 అనుకోవచ్చు ఎందుకంటే తన జీవితంలో పాతికేళ్ళ క్రితం జరిగిన ఈ కథ/సంఘటనను అవధాని గారు ఊరి చివర కట్టుకున్న తన తోట బంగళాలో రచయిత మరికొందరు మిత్రులకు ఇచ్చిన విందు అనంతరం కబుర్లలో చెప్పినట్లుగా రాశారు. ఈ కథను పైపైన చదవడానికి ప్రయత్నించే నవతరం పాఠకులకు ములకథలో పాత్రలెవరు రచయిత చెప్పే కథలో పాత్రలెవరు అని చిన్న కన్ఫూజన్ వచ్చే అవకాశముంది కనుక శ్రద్దగా చదవ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.</p>
<p>ఈ కథ ప్రచురించిన గత నలభైతొమ్మిదేళ్ళలోనూ ఇప్పటికే ఆన్ లైన్లోనూ పత్రికలలోనూ ఎన్నో వ్యాసాలు వచ్చే ఉంటాయి అయినా ఈ కథ గురించి ప్రత్యేకంగా నాకు రాయాలనిపించడానికి గల కారణం ఈ తరం యువతకు ఒక మంచి కథను పరిచయం చేయాలని. మొదటి సారి తిలక్ కథలు పుస్తకం చదివినపుడు మొదట ఉన్న కథలలో నాకు కొన్ని కథలు అస్సలు నచ్చలేదు ఒక కవిగారు రాసిన కథలు కనుక భావుకత్వంతో నింపేసి ఉంటాయని ఆశించాను కానీ ఈ కథలలో మనుషులలోని కుళ్ళును కళ్ళకు కట్టినట్లు చూపించేవే ఎక్కువ. పైగా కథ అంటే ఒక స్థిరమైన ఫార్మాట్ లో ఉండాలని ఆశించేవారికి ఈ కథల పుస్తకంలోని కొన్ని కథలు కొరుకుడు పడవు నాలుగులైన్లలో ఒక చిన్న సంఘటన చెప్పి దానికి సమాజంలో వివిధవృత్తులు నేపధ్యాలలో ఉన్నవాళ్ళు ఎలా స్పందిస్తారో రాసేసి అదే ఓ కథ అంటారు. అలాంటి కథల మధ్య వైవిధ్యమైన కథనంతో ఉన్న ఈ కథ నాకు మొదటిసారి చదవగానే చాలా నచ్చేసింది.</p>
<p>మనుషులలోని వ్యక్తిగత స్వార్ధం ఎలా ఉంటుందనేది మేడిపండు విప్పి చూపించినట్లుగా తిలక్ గారు ఈ కథలో స్ఫుటంగా మనకు చూపిస్తారు. అలాగే మనుషులు ద్వంద్వ ప్రవృత్తితో సంధర్బానుసారంగా తమ తమ విలువలను నీతినియమాలను తమకనుగుణంగా ఎలా మార్చుకుని ప్రవర్తిస్తారో కూడా గమనించవచ్చు. ఈ కథలో నాకు నచ్చిన మరో అంశం ప్రకృతి వర్ణన, సాధారణంగా అందరూ అందంగా వర్ణించే వెన్నెలనీ రాత్రులనీ ప్రకృతినీ పరిస్థితులని పట్టి మనస్థితిని బట్టి ఎంతటి భయంగొలిపేవిగా ఉంటాయో తిలక్ గారు వైవిధ్యంగా ఆకట్టుకునేలా వర్ణిస్తారు.</p>
<p>మొదటి సారి ఈ కథ చదివినపుడు “నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు.” అంటూ మొదలయ్యే మొదటి లైన్ చదివి కథలోని శ్రోతలకు మల్లే నేను కూడా నవ్వుకున్నాను. కానీ సబ్జెక్ట్ తెలిసిన తరవాత కథలోని వర్ణనలు ఆకట్టుకున్నాయి. తెల్లవెంట్రుకలని వెండిదారాలతో పోల్చడం దగ్గర నుండి వెన్నెలని కాష్టభస్మంతోనూ పున్నమి నాటి ఎర్రని చంద్రుడిని మాననివ్రణంతో పోల్చడం వరకూ, అడవిలో ఆకుల మధ్యనుండి పడుతున్న వెన్నెలను నేలపై పాకుతున్న వందలకొద్ది కట్లపాములలా కొండపాములలా వర్ణించడం నుండి మృత్యువుతో పోరాడుతున్న మనిషిలోని రక్తకణాలు చేసే యుద్దం గురించి వర్ణించడం వరకూ కూడా చాలా వైవిధ్యంగా ఉండి ఆకట్టుకుంటాయి.</p>
<p>అలాగే కథలోని సిద్దయ్య సూరీడు ల పాత్రలు కూడా నాకు చాలా ఇష్టం. మంచితనానికి స్వచ్ఛతకు మానవత్వానికి మారుపేరులా ఉంటాయా రెండు పాత్రలూనూ. అసలైన స్వేచ్ఛకు నిర్వచనం చెప్పేవిధంగా బతుకుతున్న సూరీడు, కన్నకూతురి నిర్ణయాన్ని సమర్ధిస్తూ తనకి అండగా నిలబడే సిద్దయ్య పాత్రలు రెండూ కూడా 1964 ప్రాంతంలోనే రచయిత చాలా ఉదాత్తంగా మలిచారు అనిపించింది. ఇక అవధానిగారి కథ మీద కన్నా కాలుతున్న కొవ్వొత్తులపై ఆసక్తి చూపుతూ అవి ఎక్కడ అయిపోతాయో తాము చీకట్లో కూర్చోవాల్సి వస్తుందో అని విపరీతంగా భయపడే ఆచారి పాత్ర కానీ, అవధానిగారు కథనుండి దారి మరలి ఉపన్యాస ధోరణికి వెళ్తుంటే మళ్ళీ కథలోకి లాక్కొచ్చే నారాయణ పాత్ర కానీ, సంఘటన జరిగి పాతికేళ్ళుదాటినా ఆ అమాయకపు జీవితాల గురించి దిగులుపడుతూ అసలు తను చెప్పేసంఘటనను కథ అనడమే అవమానంగా భావించే అవధాని గారి పాత్రగానీ అన్నీకూడా కథ చదివిన చాలారోజుల వరకూ గుర్తుండిపోతాయి.</p>
<p>ఇక భూషణం రామచంద్రం లాంటి వాళ్ళని మనం ఇప్పటికీ ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం కథ రాసి ఇన్నినాళ్ళు అయినా కూడా వాళ్ళలాంటి వాళ్ళలో పెద్దగా మార్పు వచ్చినట్లు మనకి కనపడదు. అన్నిటికన్నా మిన్నగా రచయిత ఆ అడవి గురించి రాసినది చదివి ఆ దారెంట ప్రయాణిస్తుంటేనో దగ్గరలో ఉంటేనో ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ పరిసరాలను చూసి రావాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. నేను ఏదైనా అడవి మీదుగా ప్రయాణించాల్సి వచ్చిన ప్రతిసారీ కూడా ఆ పరిసరాలను పరికించి చూస్తూ ఈ కథ గుర్తు తెచ్చుకుని “ఇక్కడ ఎందరు సిద్దయ్యలు సూరీడులు ఉండి ఉంటారో” అని అనుకోని సంధర్బం లేదు అనేది పరమసత్యం. నాకు అమితంగా నచ్చిన ఈ మంచి కథను మీరూ చదివి ఆస్వాదించండి.</p>
<p>ఈ కథలో నాకు నచ్చిన కొన్ని లైన్స్.</p>
<p>“చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపెడతాయో మీకు తెలియదు”<br />
“హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు”<br />
“వీడి ఖర్మ! ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది”<br />
“అతను భార్యనెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి ఇచ్చిన ముప్పైనాలుగెకరాల్నీ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలిక జిజ్ఞాసువులు చాలామంది బాధపడేవారు పాపం”<br />
&#8220;మొదటినుండి నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన నా ఫోర్డు మారాం చేస్తోంది&#8221;<br />
“ఇప్పుడు రోడ్లూ, టెలిగ్రాఫ్ తీగలూ, పోలీసులు అన్నీ వచ్చి దొంగల్నీ, క్రూరమృగాల్నీ నాశనం చేశాయి. వాటితోపాటు వీరవరులూ, స్వధర్మనిరతులూ కూడా మాయమైపోయారు.”<br />
“వెలవెలబోతున్న వెన్నెల కూడా కాష్టభస్మంలాగా భయపెడుతోంది.”<br />
“మృత్యువుతో ముఖాముఖి. ముష్టాముష్టి యుద్దం చేస్తున్నాడు రామచంద్రం&#8230;&#8230; అవతలి ఒడ్డున ఈ బ్రతుక్కి యీ మధ్యకి యీ రహస్యానికి అవతలి తీరాన.”<br />
“అసలే అడవి. &#8230; అందులో కాళ్ళముందు శవం. శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖ జీవితానికీ, నౌకర్లకీ, అబద్దాలకీ, బేషజాలకీ అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి యింతకన్న ఆపద ఏముంది?”<br />
“ఆ నిముషంలో స్వార్దంకన్నా గొప్పశక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలూ, ఆశయాలూ అన్నీ ఆ ప్రాథమిక స్వార్ధానికి అంతరాయాన్ని కలిగించనంతవరకే. ప్రతీ మనిషి లోపల్లోపల ఒక పాము!”<br />
“సిద్దయ్య తదేకమైన తత్పరతతో గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉంది. భౌతికమైన ప్రపంచాన్నే శాసించే మనస్సుయొక్క శక్తిని నాకు చూస్తోన్నట్టు అనిపించింది.”<br />
“ఇష్టం లేకపోతే కాపురమెట్టా చెయ్యడం బాబూ నా కర్ధంకాదు”<br />
“ఒడ్డూ పొడుగూ నల్లటి పెద్ద జుట్టువున్న ఆమె ఆ అడవిలాగ స్వచ్ఛంగా, ప్రాకృతికంగా కనిపించింది.”<br />
“పది రూపాయల నోట్లు రెండూ ఉదయపు చల్లని గాలిలో పావురాలలా పల్టీలు కొట్టుతున్నాయి”</p>
<p>&nbsp;</p>
<p>కథ లింక్ (కౌముది సౌజన్యం తో):<br />
<iframe id="doc_61603" src="//www.scribd.com/embeds/178067839/content?start_page=1&amp;view_mode=scroll&amp;show_recommendations=false" frameborder="0" scrolling="no" width="100%" height="600" data-auto-height="false" data-aspect-ratio="undefined"></iframe></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4257</wfw:commentRss>
		<slash:comments>14</slash:comments>
		</item>
		<item>
		<title>వెన్నెలరాత్రి వణికించిన అనుభవం</title>
		<link>http://vaakili.com/patrika/?p=3959</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3959#comments</comments>
		<pubDate>Mon, 30 Sep 2013 18:19:01 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[వేణు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3959</guid>
		<description><![CDATA[<p>కథను చక్కని శిల్పంగా చెక్కుతాడనీ, ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో నిర్దుష్టంగా మలుస్తాడనీ పేరు పొందిన రచయిత చాగంటి సోమయాజులు (చాసో) . ఆయన రాసిన కథల్లోనే విభిన్నమైనది ‘దుమ్ములగొండె’. అప్పటికే కుంకుడాకు, ఏలూరెళ్లాలి లాంటి రచనలతో పేరు తెచ్చుకున్న చాసో్ ఈ కథను ఆసక్తికరమైన నేపథ్యంతో అల్లాడు.</p> <p>ఈ కథ మొట్టమొదట సాహిత్య మాసపత్రిక ‘భారతి’ లో 1943 జులైలో వచ్చింది. 70 సంవత్సరాల క్రితం రాసిందైనా ఇప్పటికీ వన్నె తరగలేదు. మానవ స్వభావంలోని ఒక వాస్తవాన్ని వెన్నెల వెలుగులో చూపించిన కథ ఇది!</p> <p>కథాంశం చిన్నదే. ముగ్గురు జతగాళ్ళు సరదాగా కుమిలీ ఘాటీకి అర్థరాత్రి షికారుకు బయలుదేరటం, ఆ అనుభవం చివరికెలా పరిణమించిందీ అన్నది- ఇతివృత్తం. కథకుడి అనుభవంలోంచి అతడు చెబుతున్న మాటల ద్వారా&#8230; జరుగుతున్నది మనం గ్రహిస్తుంటాం.</p> <p>అర్థరాత్రి నాటకాలకనో, హరికథలకనో బృందాలుగా వెళ్ళటం ఒకప్పుడు గ్రామప్రాంతాల్లో మామూలే. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం పల్లెటూళ్ళలో కుర్రాళ్ళు అద్దె సైకిళ్ళ మీద దగ్గర్లోని బస్తీలకు ‘సెకండ్ షో’ చూడ్డానికి వెళ్ళేవాళ్ళు. మంచు కురిసి వణికించే డిసెంబరు చలి కూడా వాళ్ళ ఉత్సాహాన్ని తగ్గించేది కాదు.</p> <p>ఈ కథ విషయానికొస్తే&#8230; వెన్నెల రాత్రి కాలినడకన నడిచే ఆ స్నేహితులతో పాటే మనమూ ప్రయాణమవుతాం.</p> <p>కథ చెబుతున్న వ్యక్తి భావుకుడూ, సౌందర్యపిపాసీ మాత్రమే కాదు- ధైర్యం, ధీమా ఉన్న చమత్కారి కూడా. ‘నా అరికాళ్లు చెప్పుజోళ్ల కన్నా బలమైనవి. వేళ్లకి దెబ్బలు తగలకండా నిపుణతతో అడుగులు వెయ్యడం నా కాళ్లకి తెలుసు.’ అంటాడు. అంతేనా? ‘ఎక్కపెట్టిన రాళ్లని నా కాళ్లు కళ్లున్నట్టు తప్పించుకోగలవు’ అనీ చెబుతాడు.</p> <p>చలికాలం రాత్రుళ్ళు రోడ్డు మీద పొడుచుకొచ్చినట్టుండే రాళ్ళమీద చెప్పుల్లేకుండా నడవటంలో కష్టం తెలిసినవాళ్ళకి కథకుడి నడకలోని చాకచక్యం మరింత ప్రస్ఫుటమవుతుంది.</p> <p>ఆహ్లాదకరమైన ఆ రాత్రి &#8211; ‘వెన్నెల కర్పూరం లాగ వెలుగుతున్నాది’. ‘నల్లని నీడలో గోతిడు నీళ్లు వెన్నెలపడి తెల్లగా చెంగల్వపువ్వులాగ వికసించాయి’</p> <p>ఇంత హాయిగా కులాసాగా సాగుతున్న [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><strong><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/09/chaaso.jpg"><img class=" wp-image-4027 alignleft" title="chaaso" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/09/chaaso-227x300.jpg" alt="" width="204" height="270" /></a>క</strong>థను చక్కని శిల్పంగా చెక్కుతాడనీ, ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో నిర్దుష్టంగా మలుస్తాడనీ పేరు పొందిన రచయిత చాగంటి సోమయాజులు (చాసో) . ఆయన రాసిన కథల్లోనే విభిన్నమైనది ‘దుమ్ములగొండె’. అప్పటికే కుంకుడాకు, ఏలూరెళ్లాలి లాంటి రచనలతో పేరు తెచ్చుకున్న చాసో్ ఈ కథను ఆసక్తికరమైన నేపథ్యంతో అల్లాడు.</p>
<p>ఈ కథ మొట్టమొదట సాహిత్య మాసపత్రిక ‘భారతి’ లో 1943 జులైలో వచ్చింది. 70 సంవత్సరాల క్రితం రాసిందైనా ఇప్పటికీ వన్నె తరగలేదు. మానవ స్వభావంలోని ఒక వాస్తవాన్ని వెన్నెల వెలుగులో చూపించిన కథ ఇది!</p>
<p>కథాంశం చిన్నదే. ముగ్గురు జతగాళ్ళు సరదాగా కుమిలీ ఘాటీకి అర్థరాత్రి షికారుకు బయలుదేరటం, ఆ అనుభవం చివరికెలా పరిణమించిందీ అన్నది- ఇతివృత్తం. కథకుడి అనుభవంలోంచి అతడు చెబుతున్న మాటల ద్వారా&#8230; జరుగుతున్నది మనం గ్రహిస్తుంటాం.</p>
<p>అర్థరాత్రి నాటకాలకనో, హరికథలకనో బృందాలుగా వెళ్ళటం ఒకప్పుడు గ్రామప్రాంతాల్లో మామూలే. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం పల్లెటూళ్ళలో కుర్రాళ్ళు అద్దె సైకిళ్ళ మీద దగ్గర్లోని బస్తీలకు ‘సెకండ్ షో’ చూడ్డానికి వెళ్ళేవాళ్ళు. మంచు కురిసి వణికించే డిసెంబరు చలి కూడా వాళ్ళ ఉత్సాహాన్ని తగ్గించేది కాదు.</p>
<p>ఈ కథ విషయానికొస్తే&#8230; వెన్నెల రాత్రి కాలినడకన నడిచే ఆ స్నేహితులతో పాటే మనమూ ప్రయాణమవుతాం.</p>
<p>కథ చెబుతున్న వ్యక్తి భావుకుడూ, సౌందర్యపిపాసీ మాత్రమే కాదు- ధైర్యం, ధీమా ఉన్న చమత్కారి కూడా. ‘నా అరికాళ్లు చెప్పుజోళ్ల కన్నా బలమైనవి. వేళ్లకి దెబ్బలు తగలకండా నిపుణతతో అడుగులు వెయ్యడం నా కాళ్లకి తెలుసు.’ అంటాడు. అంతేనా? ‘ఎక్కపెట్టిన రాళ్లని నా కాళ్లు కళ్లున్నట్టు తప్పించుకోగలవు’ అనీ చెబుతాడు.</p>
<p>చలికాలం రాత్రుళ్ళు రోడ్డు మీద పొడుచుకొచ్చినట్టుండే రాళ్ళమీద చెప్పుల్లేకుండా నడవటంలో కష్టం తెలిసినవాళ్ళకి కథకుడి నడకలోని చాకచక్యం మరింత ప్రస్ఫుటమవుతుంది.</p>
<p>ఆహ్లాదకరమైన ఆ రాత్రి &#8211; ‘వెన్నెల కర్పూరం లాగ వెలుగుతున్నాది’. ‘నల్లని నీడలో గోతిడు నీళ్లు వెన్నెలపడి తెల్లగా చెంగల్వపువ్వులాగ వికసించాయి’</p>
<p>ఇంత హాయిగా కులాసాగా సాగుతున్న ప్రయాణంలో నక్క కనపడుతుంది. తర్వాత ముచ్చట్లలో దుమ్ములగొండె (హైనా) ప్రస్తావన వస్తుంది. తమ ఊరివాడైన దాసు పిరికితనం గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. (పశువులను లాక్కెళ్ళిపోయి ఆనవాళ్ళు కూడా లేకుండా తినెయ్యటం హైనాలకు అలవాటు. మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచటం కూడా చేస్తుంటాయి. విచిత్రమైన, వికృతమైన నవ్వు వీటి ట్రేడ్ మార్కు.)</p>
<p>అయితే కొద్దిసేపట్లోనే పరిస్థితి తారుమారవుతుంది. దుమ్ములగొండె ఆలోచనలతో కథకుడికి ధైర్యం క్షీణించిపోవటం మొదలవుతుంది.</p>
<p>అంతే! దారిలోని బండరాళ్లన్నీ దుమ్ముల గొండెల్లాగ కనబడ్డం మొదలెట్టేయి.</p>
<p>‘మా నడకకి కప్పలమోత మిలటరీ బేండు, కీటకాల మోత నా హృదయంలో మధురరసాన్ని ఊరిస్తూ అప్సరసల్ని కళ్లెదటికి తీసుకొస్తున్నాది’అన్న భావుకత్వం స్థానంలో<br />
భయకంపితమైన ఆలోచనలు పురివిప్పుతాయి. ‘కింకిణీస్వనం లంకిణీదేవి గుర్రులాగుంది. కప్పల ఆర్కెస్ట్రా కొండదేవత బలికి నరులని తీసుకుపోతున్న కిరాతుల డోలు వాయిద్య మైపోయింది’.</p>
<p>భయం గురించి పరిశోధన చేసిన శాస్త్రవేత్తలాగా చాసో దీన్ని అభివర్ణిస్తాడు. ‘భయం శరీరాన్నంతా ఆవహించడం అందరి అనుభవంలోనూ ఉండదు. సాధారణంగా భయం గుండెల్లో ఒక భాగాన్ని మాత్రమే పట్టుకొంటుంది. ఇంకో భాగం ధైర్యాన్ని ఉపాసన చేసి భయపిశాచిని గెంటేస్తుంది’కానీ తనను భయం పూర్తిగా వశం చేసుకుందనీ, శరీరాన్నంతా ఆవహించిందనీ చెప్పుకొస్తాడు.</p>
<p>ఆ భయం పక్కనున్న మిత్రుడు గిరిరావుకి కూడా అంటువ్యాధిలాగా వ్యాపిస్తుంది. వాళ్ళిద్దరికీ కాలు ముందుకుపడదు. ఇదంతా చూసి- అప్పటిదాకా నవ్వుతాలుగా మాట్లాడుతూ హుషారుగా ఉన్న మణ్యం లో కూడా భయంకరంగా ప్రవేశిస్తుంది భయం. ‘అమ్మో’అని పెద్ద కేక వేసి వెనక్కి తిరిగేటంత స్థాయిలో!<br />
మొత్తానికి ముగ్గురూ వెనుదిరిగి వేగంగా వచ్చేస్తారు. మనుషుల అలికిడీ, పశువుల సవ్వడీ విన్నాక- అప్పుడు తన పిరికితనానికి సిగ్గు వేస్తుంది.</p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/09/hyena.jpg"><img class="wp-image-4028 aligncenter" title="hyena" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/09/hyena-300x280.jpg" alt="" width="210" height="196" /></a></p>
<p style="text-align: center;">(దుమ్ములగొండె)</p>
<p>దుమ్ములగొండె అక్కడ ఉన్నదో లేదో కానీ, ఆ ఆలోచనలే వాళ్ళను వణికించేసి, సరదాయాత్రను అర్థాంతరంగా ఆపేసేలా చేస్తాయి. మనిషిలో భయం ప్రవేశించాలే గానీ , అదెంతగా నిర్వీర్యం చేసి నిస్సహాయుణ్ణి చేస్తుందో ఈ కథ గొప్పగా చిత్రించింది.</p>
<p>ప్రథమ పురుష కథనంగా దీన్ని మలిచివుంటే ఎలా ఉండేది? అప్పుడు ప్రధాన పాత్ర అనుభూతిని అంత గాఢంగా చిత్రించటం కుదిరివుండేది కాదు. పైగా ‘భ్రాంతిమదలంకారం’<br />
కీలకమైన ఈ కథలో ఆ భ్రమను పాఠకులకు విశ్వసనీయంగా చిత్రించటానికి ఉత్తమ పురుష కథనమే అత్యుత్తమనేది నిర్వివాదాంశం.</p>
<p><strong>పునర్ముద్రణల్లో శైలి ఖూనీ!</strong></p>
<p>చాసో కథలను విశాలాంధ్ర వారు పుస్తకంగా తెచ్చారు. 1968లో మొదటి ముద్రణ వచ్చింది. తర్వాత 1983, 88, 93, 97లలో కూడా పునర్ముద్రణలు వచ్చాయి. నా దగ్గర ఆరోదైన అక్టోబరు 2012 ముద్రణ ఉంది.</p>
<p>ఒక్క ‘దుమ్ములగొండె’ కథను పరిశీలించినా భారతిలో వచ్చిన ప్రచురణకూ , దీనికీ పాఠ్యభేదాలు ఎన్నో కనపడ్డాయి. మిగిలిన కథల్లో ఎన్ని మార్పులు జరిగి, పాఠకులకు అందుతున్నాయోనని బాధ వేసింది.</p>
<p>రచయితకు ‘ళ్ల ’అని ఉపయోగించే అలవాటు. కానీ విశాలాంధ్ర పుస్తకంలో వేసిన కథలో కొన్నిచోట్ల ‘ళ్ళ’ అని అచ్చేశారు.</p>
<p>‘వేళ్లకి దెబ్బలు తగలకండా..’<br />
‘ఒకరికి ఒకరం తీసిపోకండా..’<br />
‘మాట్లాడకండా’</p>
<p>ఇలా రాయంటం చాసో శైలిలో భాగం. కానీ విశాలాంధ్ర ప్రచురణలో ‘తగలకుండా’, ‘తీసిపోకుండా’, ‘మాట్లాడకుండా’ అని మార్చేశారు.</p>
<p>‘కప్పల ఆర్కెస్ట్రా మొత్తంమీద ఉద్భవం చేస్తున్న ‘హార్మొనీ’ వింటూ నడుస్తున్నాను’ అనే వాక్యంలో ‘ఉద్భవం’ బదులు ‘ఉధృతం’ అని మార్చేశారు.</p>
<p>‘వాకట్లో పెద్ద పువ్వులాగ పడ్డ కొబ్బరిచెట్టు నీడనీ, గోడమీద రంగవల్లికలుగా ఏర్పాటు అయిన తుప్పల నీడలనీ చూసి ఆనందిస్తూ &#8230;’ విశాలాంధ్ర ప్రచురణలో ఈ వాక్యంలో రెండు మార్పులు చేశారు- ‘వాకిట్లో’ అనీ, ‘రంగవల్లికల్లాగ’ అనీ.</p>
<p>విసంధులను సంధి చేయటం, పేరాలు కలిపెయ్యటం, ఫుల్ స్టాపులు తీసెయ్యటం లాంటివి చెప్పనే అక్కర్లేదు.</p>
<p>ఇవన్నీ ఆరు పేజీల ఒక్క కథలోని తేడాలే! పుస్తకంగా వచ్చినపుడు రచయిత తన కథలోని భాషను దిద్దటం వల్ల ఇలా జరిగిందని అనుకోనక్కర్లేదు. రీ ప్రింట్ అయినపుడు కంపోజింగ్ పాఠ్యాన్ని జాగ్రత్తగా చెక్ చేయకపోవటం వల్లనే ఇలా జరిగిందని తేలిగ్గానే గ్రహించవచ్చు.</p>
<p>ఒక రచనను ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇన్ని మార్పులూ చేర్పులతో పాఠకులకు అందించటం అంటే ప్రచురణకర్తలు రచయిత పట్ల అపచారం, పాఠకులకు అన్యాయమూ చేసినట్టే!</p>
<p>ఏడు దశాబ్దాల క్రితం ‘భారతి’ లో వచ్చిన ఈ ‘దుమ్ములగొండె’ కథను భారతి పేజీల్లోనే ఇక్కడ చదవండి&#8230;<br />
<iframe id="doc_15488" src="//www.scribd.com/embeds/170540945/content?start_page=1&amp;view_mode=scroll&amp;access_key=key-xrg073bxe5xwzrneibb&amp;show_recommendations=false" frameborder="0" scrolling="no" width="100%" height="600" data-auto-height="false" data-aspect-ratio="0.710007880220646"></iframe></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3959</wfw:commentRss>
		<slash:comments>16</slash:comments>
		</item>
		<item>
		<title>మందులేని వైరస్ “జెలసీ”</title>
		<link>http://vaakili.com/patrika/?p=3529</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3529#comments</comments>
		<pubDate>Wed, 31 Jul 2013 21:12:24 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[జగద్ధాత్రి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3529</guid>
		<description><![CDATA[<p>పొసెసివ్నెస్ , నిజానికి ఈ మాటకు సరైన తెలుగు మాట లేదు. మనది అనుకున్న దాన్ని ఇంకెవరూ తాకి ఉండకూడదు , మనకే సొంతం కావలనే ఫీలింగ్. ఇది ప్రేమలో కొంత వరకు బాపు రమణ చెప్పినట్టు “ అసూయ ప్రేమకు ఘాటైన ధర్మామీటర్” అంటే ఒప్పుకోవచ్చు కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇది జెలసీ గా రూపాంతరం చెందిందా చచ్చామన్న మాటే . పాపం ఇలా ఒకరి జెలసీ కి బలై పోయిన వ్యక్తులెందరో . అలాంటి ఒక కధ చలం “జెలసీ” . ఇందులో చలపతి రావు చాలా ఆదర్శవంతుడు. పెళ్ళయి మొగుడు పోయిన విధవనే పెళ్ళాడుతానని తలంచి అలాగే తన అభీష్టం నెరవేర్చుకున్నాడు , ఇంతవరకు బాగానే ఉంది.</p> <p>ఇది రచయిత తన మిత్రుడు గురించి చెప్పే కథ . తన ముందు ఎంతో ఆదర్శంగా నటించిన మిత్రుడు అసలు రూపం తెలుసుకున్న మరో మిత్రుని వ్యధ. రైల్ బండి అందక తిరిగి వఃచ్చి భార్యాభర్తలని ఎందుకులే డిస్టర్బ్ చేయడమని వరండా లో పడుకున్న మిత్రుడికి లోనుండి తన ఆదర్శవంతుడైన మిత్రుని అసలు రూపం ఎలా తెలుస్తుందంటే . ఆమె వేడికోలు గా మాటాడుతోంది ఏడుపు గొంతుతో , ఎందుకు అంటారా సదరు భర్త గారు వేస్తోన్న అద్భుతమైన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక. ఇంతకీ అంత సమాధానం చెప్పలేనంత గొప్ప ప్రశ్నలేమనగా , ఆమె మొదటి భర్త తొలి రాత్రి ఆమెను ముందుగా ఏమి చేసేడు ?, అతనితో ఆమె స్వర్గ సౌఖ్యం అనుభవించిందా ? మరి ఇప్పుడు తనతో ఉంటున్నప్పుడు ఆయనతోని అనుభవం గుర్తొస్తోందా? ఇంటికి వచ్చిన తన మిత్రుడి పట్ల కూడా ఆమెకు ఆకర్షణ కలిగిందా ?ఆయన పోతే తనని చేసుకున్నట్టు మళ్ళీ మరో వ్యక్తిని చేసుకుంటుందా ? ఆహా !!! మగ వాడా నీకు జోహార్లు !! ఈ అద్భుతమైన ప్రశ్నలకు సమాధానం ఆమె [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2012/12/j_jagati.jpg"><img class="alignleft size-full wp-image-352" title="j_jagati" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2012/12/j_jagati.jpg" alt="" width="151" height="162" /></a>పొసెసివ్నెస్ , నిజానికి ఈ మాటకు సరైన తెలుగు మాట లేదు. మనది అనుకున్న దాన్ని ఇంకెవరూ తాకి ఉండకూడదు , మనకే సొంతం కావలనే ఫీలింగ్. ఇది ప్రేమలో కొంత వరకు బాపు రమణ చెప్పినట్టు “ అసూయ ప్రేమకు ఘాటైన ధర్మామీటర్” అంటే ఒప్పుకోవచ్చు కానీ తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇది జెలసీ గా రూపాంతరం చెందిందా చచ్చామన్న మాటే . పాపం ఇలా ఒకరి జెలసీ కి బలై పోయిన వ్యక్తులెందరో . అలాంటి ఒక కధ చలం “జెలసీ” . ఇందులో చలపతి రావు చాలా ఆదర్శవంతుడు. పెళ్ళయి మొగుడు పోయిన విధవనే పెళ్ళాడుతానని తలంచి అలాగే తన అభీష్టం నెరవేర్చుకున్నాడు , ఇంతవరకు బాగానే ఉంది.</p>
<p>ఇది రచయిత తన మిత్రుడు గురించి చెప్పే కథ . తన ముందు ఎంతో ఆదర్శంగా నటించిన మిత్రుడు అసలు రూపం తెలుసుకున్న మరో మిత్రుని వ్యధ. రైల్ బండి అందక తిరిగి వఃచ్చి భార్యాభర్తలని ఎందుకులే డిస్టర్బ్ చేయడమని వరండా లో పడుకున్న మిత్రుడికి లోనుండి తన ఆదర్శవంతుడైన మిత్రుని అసలు రూపం ఎలా తెలుస్తుందంటే . ఆమె వేడికోలు గా మాటాడుతోంది ఏడుపు గొంతుతో , ఎందుకు అంటారా సదరు భర్త గారు వేస్తోన్న అద్భుతమైన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక. ఇంతకీ అంత సమాధానం చెప్పలేనంత గొప్ప ప్రశ్నలేమనగా , ఆమె మొదటి భర్త తొలి రాత్రి ఆమెను ముందుగా ఏమి చేసేడు ?, అతనితో ఆమె స్వర్గ సౌఖ్యం అనుభవించిందా ? మరి ఇప్పుడు తనతో ఉంటున్నప్పుడు ఆయనతోని అనుభవం గుర్తొస్తోందా? ఇంటికి వచ్చిన తన మిత్రుడి పట్ల కూడా ఆమెకు ఆకర్షణ కలిగిందా ?ఆయన పోతే తనని చేసుకున్నట్టు మళ్ళీ మరో వ్యక్తిని చేసుకుంటుందా ? ఆహా !!! మగ వాడా నీకు జోహార్లు !! ఈ అద్భుతమైన ప్రశ్నలకు సమాధానం ఆమె చెప్పి తీరాలి చెప్పక పోతే ఊరుకోక హింశిస్తాడు.</p>
<p>ఇదండీ లోపల జరుగుతోన్న ఆదర్శ దాంపత్య భాగోతం .</p>
<p>అతి చిన్న కథ లో చలం ఇమిడ్చిన అతి భయంకరమైన ఎయిడ్స్ కంటే భయంకరమైన మనుష్య జాతికి ఆదిలోనే సోకిన మందులేని వైరస్ ఈర్ష్య గురించి ఎంత బాగా చెప్పేడు అనిపిస్తుంది. కొందరు అంతే బయటికి వెళ్ళి వచ్చాక తల పాగాలు తీసి వంకీలకి తగిలించినట్టు మర్యాదలు తీసేసి అసలు రంగులు బయట పెదతారు అంటాడు చలం.</p>
<p>అసలు ఈ జెలసీ అనేదే లేకుంటే లోకమిలా ఉండేదా ? అణువు నుండి బ్రహ్మాండం వరకు ఈ జెలసీ స్వరూపాలు మనం చూస్తూనే ఉన్నాం. వైయుక్తికమైన విషయాలనుండి ప్రాపంచిక యుద్ధాలవరకు ఏమి జరిగినా ఈ జెలసీ వలననే కదా .</p>
<p>స్త్రీ తన సొంత మైన ఆస్తి అని భావించిన క్షణం నుండి మగాడు ఆమెను మానసికంగా దైహికంగా ఎంత హింసకు గురి చేస్తున్నాడు. ఇంత ఆదర్శంగా పెళ్లాడిన భర్త అలా రోజూ హింసిస్తోంటే ఏమి సమాధానం ఇవ్వగలదు ఆ భార్య . ఆర్ధికంగా , అన్నీ విధాలా భర్త మీదే ఆధార పడిన ఒక స్త్రీ ఏమని ఎదిరించగలదు ? అతని నోరు ఎలా మూయించగలదు?</p>
<p>జాలేస్తుంది కదూ కానీ మనమందరము కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ జెలసీ కి గురయిన వాళ్లమే, ఏదో వైపున మనము ఉన్నాం ఇందులో.</p>
<p>ఏ తాత్వికుడు చెప్పినా , ఏ అధ్యాత్మిక గురువు చెప్పినా ముందు వదిలెయ్యమనేది జెలసీనే. ఆయనని కాదని మరో గురువు దగ్గరికి నువ్వెళ్ళావాని తెలిసిందో ఈ గురువు గారు జెలసీ బారిన పడతారు . నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్తితి ఇది . ఈ జెలసీ కి తన పర బేధా భావం లేదు . ఎవరి పట్ల అయినా కలగవచ్చు. ఈ వైరస్ కి టీకా మందులేవీ కనిపెట్టబడలేదు . కనిపెట్టలేరు కూడా . ఇది చదవడానికి ఒక మామూలు చిన్న కధ లాగే అనిపించినా ఇందులో ఉన్న విషయం మాత్రం ప్రపంచాన్ని కుదిపేసే రోగం . ఇది పోనీ అంటు రోగం కూడా కాదు స్వతహాగా మనం ఊపిరి పీల్చుకున్నంత సహజంగా మనలో ఉన్న ఇమిడి పోయిన దరిద్రపు జబ్బు .</p>
<p>ఒకే సమయం లో ఇరువురు మనుషులు ఒక మనిషి మనసు లో ఉండకూడదా? అన్న ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పగలమ్. అది ఒక స్త్రీ అయితే , అసలు ఆమెని, అయితే దేవతని లేదా బానిసని చేసి పడేశామేమే తప్ప , ఆమెలో లైంగికత ఉంటుందని ,దాన్ని గౌరవించాలని ఎప్పుడైనా మధ్య తరగతి మనస్తత్వం ఉన్న మనిషి ఆలోచించాడా ? ఇన్ని విషయాలను ప్రశ్నిస్తుందీ చిన్ని కథ .</p>
<p>నాటి చలం నుండి 70ల్లో ఓషో చెపుతోన్న విషయం స్త్రీ కి కూడా లైంగికత ఇష్టా ఇష్టాలు కామ ప్రకోపాలు, వ్యక్తిత్వం ఉంటాయని వాటిని మన్నించాలని. అబ్బే ఇలాంటివి ఎవరికీ పట్టినట్టుండవు . తనకి దక్కని ఆడది మరొకడికి దక్కకూడదని ఏదో చేస్తాడు ఒకడు .<br />
ఈ కథ కేవలం స్త్రీ దృక్పధం నుండి రాసినప్పటికి ఈ జెలసీ కి లింగ బేధం ఉండదు సుమండీ. ఇదే మునిపల్లె రాజు గారి ఒక కధలో ఎన్నేళ్ళకో తిరిగి వచ్చిన చెల్లెలుని తాను ఇష్టపడే బావ ఇష్టపడుతున్నాడని గ్రహించి , కొలనులో ఈత కొడుతుండగా ఆమెను చివరికి లోతుకీ తీసుకెళ్లి ముంచేస్తుంది . ఎంత మంది స్త్రీలలో, పురుషులలో మనమీ ఈసు అసూయ ని చూస్తున్నామో కదా . ఒక్కసారి మనల్ని మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలనిపించే కధ జెలసీ. నేనొక చిన్ని రెండు మాటల్లో ముగిస్తాను “ అణువంత అసూయే కదా అణిగి పోతుంది లెమ్మనుకున్నాను , అణ్వాస్త్రమై కూచుంది” ఎప్పుడో రాసుకున్న నా చిరు కవిత ఇది . జెలసీ చిన్న అణువు లో బ్రహ్మాండాన్ని ఇమిడ్చి నంత పెద్ద కధ . అందుకే ఈ కధను ఇలా పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను .</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3529</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=2983</link>
		<comments>http://vaakili.com/patrika/?p=2983#comments</comments>
		<pubDate>Fri, 31 May 2013 20:27:15 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[రమా సుందరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=2983</guid>
		<description><![CDATA[<p>&#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; మీద పుస్తక పరిచయం</p> <p>కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన &#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన &#8216;మొగుడు చచ్చిన&#8217; ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే కాదు; జ్ఞానం, దేహం కూడ నిరాకరించిన క్రూరత్వం నుండే చలం ప్రవక్తగా పుట్టాడు. ఇప్పుడు రమేశు అదే బాట పట్టాడు.</p> <p>ఎనిమిదో ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలైన కన్నెమ్మను, పూజలు (డిజైన్) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు, రెండు రయికలతో చుట్టింటికి (వంటిల్లు) పరిమితం చేసారు. “తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. మారుతల్లి ఆ ఇంటికి వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు. పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు.&#8221;</p> <p>అలాంటి కన్నెమ్మను నిండు యవ్వనంలో మడేలు మురుగుడు వలచాడు. కన్నెమ్మ బతుకులో వసంతం వచ్చింది. &#8220;మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.&#8221; మురుగుడు తెచ్చిన జిలేబినీ ఒకరికొకరు తినిపించుకొంటుండగా వెనుకనుండి గొడ్డలి తో పొడిచి అతని ప్రాణం తీసాడు తమ్ముడు రాజిరెడ్డి. ఏమీ ఎరగనట్లు భార్యతో, కన్నెమ్మతో అత్తారింటికి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="text-decoration: underline;"><strong><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg"><img class="alignleft size-full wp-image-1705" title="rama_sundari" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg" alt="" width="146" height="172" /></a>&#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; మీద పుస్తక పరిచయం</strong></span></p>
<p>కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన &#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన &#8216;మొగుడు చచ్చిన&#8217; ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే కాదు; జ్ఞానం, దేహం కూడ నిరాకరించిన క్రూరత్వం నుండే చలం ప్రవక్తగా పుట్టాడు. ఇప్పుడు రమేశు అదే బాట పట్టాడు.</p>
<p>ఎనిమిదో ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలైన కన్నెమ్మను, పూజలు (డిజైన్) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు, రెండు రయికలతో చుట్టింటికి (వంటిల్లు) పరిమితం చేసారు. “తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. మారుతల్లి ఆ ఇంటికి వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు. పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు.&#8221;</p>
<p>అలాంటి కన్నెమ్మను నిండు యవ్వనంలో మడేలు మురుగుడు వలచాడు. కన్నెమ్మ బతుకులో వసంతం వచ్చింది. &#8220;మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.&#8221; మురుగుడు తెచ్చిన జిలేబినీ ఒకరికొకరు తినిపించుకొంటుండగా వెనుకనుండి గొడ్డలి తో పొడిచి అతని ప్రాణం తీసాడు తమ్ముడు రాజిరెడ్డి. ఏమీ ఎరగనట్లు భార్యతో, కన్నెమ్మతో అత్తారింటికి చేరాడు. ఆ రోజు నుండి కడదాక, కన్నెమ్మ బతుకు పొంత కడవ బతుకయ్యి వదినె పుట్టింటికి ఊడిగం చేయటంలోనే గడిచిపోయింది. “అయిదు బారల ఎర్రప్రసను కోకను తుంటిదోపు (మొగుడు చనిపోయిన వాళ్లు కుచ్చిళ్లు పోయకుండా కట్టే కట్టు) కట్టుకొని, ఇంకొక కోకను చుట్టి చంకలో పెట్టుకొని వాళ్ల వెనకాలనే కన్నెమ్మ కూడా ఈ ఇల్లు కడప తొక్కింది”</p>
<p>ఎవరీ కన్నెమ్మ?</p>
<p>“కన్నెవ్వ మా మేనత్త ఆడబడుచు. ఆ ఇంట్లో పని చేయడం తప్ప ఎవరితో మాట్లాడటం నేను చూడలేదు, నా బాల్యంలో. ఎవరూ లేనప్పుడు నన్ను దగ్గరకు లాక్కొని ముద్దులు పెట్టుకొనేది.&#8221; అప్పుడు ఆమె కంట్లో తడికి సమాధానం స.వెం. రమేశుకు ఆమె ఎత్తుబడి (కర్మకాండలు) తరువాత తల్లి నుండి తెలిసింది.</p>
<p>ఈ కధ కాలం యాబ్భై అరవై యేళ్ళ క్రితమయి ఉండాలి. తెలుగు దేశాన ఉత్తరాదిన పుట్టిన చలం దక్షిణాన ఉన్న చదువురాని కన్నెమ్మను చేరలేదు. మడేలు మురగడితో ఆమె అనుభవానికి చాలా మూల్యం చెల్లించింది. ఈ దేశంలో పెళ్ళై భార్యలు ఉన్నఅన్ని వయసుల మగవాళ్ళు కూడా యధేచ్చగా, సునాయాసంగా కొనుక్కోగల, క్రీడించగల అతి చౌకైనా శృంగారం; యవ్వనంలో ఉన్న వితంతువు కన్నెమ్మకు నిషేధం. సహజాతిసహజమైన ఆమె మేని దాహం, ఆమె అనాధ మనసు కోరిన స్నేహం తన ప్రియ ప్రాణాన్ని బలిగొని ఆమెను కడదాక జీవన్మృతురాల్ని చేసింది.</p>
<p>ఇలాంటి ఇతివృత్తంతో కధలు కొన్ని వేలు వచ్చి ఉంటాయి. ఇక సినిమాలు చెప్పనక్కరలేదు. అందులో చాలా వరకు మనకు సంబంధం లేని లోకాల్లో, పరాయి వ్యక్తుల గురించి విన్నట్లు, చూసినట్లు ఉంటుంది. కాని రమేశు కధ నడక అసాధారణంగా ఉంటుంది. ఒక మగ రచయిత స్త్రీ పాత్రను సృష్టించినపుడు; ఆమె అంతరంగ ఆవిష్కరణ, కృతిమత్వం లేకుండా, బండతనం లేకుండా మాటలకందించటం కత్తి మీద సామే. అందుకోసం ఆడవాళ్ళ వగపు పట్ల దయ, ఔదార్యం ఉంటే సరిపోదు. వాళ్ళ హృదయపు లోతులను సృజించగలగాలి. వాళ్ళ గుండె చప్పుళ్ళు వినగలగాలి. వాళ్ళ మనసు సంవేదనలను భ్రాంతులు, భ్రమలు అంటించకుండా నికార్సుగా మన పరం చేయ గలగాలి. ఆ పని రమేశు అత్యధ్భుతంగా చేసి కూర్చున్నాడు ఈ కధలో.</p>
<p>ప్రకృతి లోని అన్ని జీవ రాశుల సృష్టి కార్యాలను అంగీకరించే మనుషులచేత; ఒక స్త్రీ మోహాన్ని, వాంఛనీ అంతే సహజంగా ఆమోదింపచేయటం సులభమైన పని కాదు. అందుకే మనుషులు అందుకోలేనీ, అందుకొన్నా అంగీకరించిన ఆడదాని దేహ కాంక్షలను మట్టితో చెప్పించాడు రమేశు. &#8220;ఎవరికీ పట్టనట్టు, ఊరంతా కలిసి వెలేసినట్టు ఆ మూలన పడి ఉండే నా దగ్గరకు పోతయ్య వచ్చి, నన్ను తాకి చూసినాడు. ఎన్నో నాళ్ల తరువాత ఒక మగోడి చెయ్యి తగిలేసరికి ఎంత నెమ్మది పడినానో. నీకు నేను ఉండానులే తొప్పర (బాధ) పడవద్దు అన్నట్టు నన్ను నిమిరినాడు. రెండు చేతుల నిండుగా నన్ను జవురుకొని జల్లలో పండుకోవెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఈ కానగమాను కింద చోటు చూపించినాడు. ఈ పొద్దో రేపో నాకొక కొత్త బతుకును ఇవ్వపోతా ఉండాడు.&#8221; అని నల్లమట్టి కుమ్మరి పోతయ్య స్పర్శకు పులకరించి పోతూ చెబుతుంది. “ఎవరు ఏమన్నా అనుకోండి, ఈ మాటను చెప్పే తీరాల. కుమ్మరోడి కింద తొక్కుడు పడిన చేరుమన్ను బతుకే బతుకు. ఆ ఇమ్ము (సుఖం) చవికొన్న వాళ్లకే తెలుస్తాది. కొవ్విన పుంజుకోడి కొప్పరించి మిందకు వస్తే ఒదిగి తోవ చూపిస్తాదే పెట్టకోడి, అట్ట మెదిగి పోయినాను పోతయ్య కాళ్ల కింద నేను.”</p>
<p>వస్తువులు తమను మనుషులుగా వ్యక్తీకరించుకోవటం ఈ కధకు గల ప్రత్యేకత. కధ జరుగుతున్న స్థలంలో, కాలంలో తను లేని లోటును పూడ్చటానికి, రచయిత అక్కడ వున్న గృహ పరికరాల ద్వార కధను చెప్పించాడు. కడుపులో దాచుకొన్న క్షోభని, బ్రతుకంతా నోరు విప్పి చెప్పని కన్నెమ్మ కధను చెప్పుకొన్నది పొంతకడవ, ఎత్తు బొట్ట, దొంతిగుడవ,బియ్యం జల్లెడ, చింకి చాప, రాగి చెరవ, అంబటి బాన, ఊదర బుర్ర, తూకు వెళుకు (తూర్పు వెలుగు). &#8220;ఇంకా సాకలి సొలుపు తీరలేదా&#8221; అనే దెప్పిపొడుపు మాట వెనుక అంతరార్ధం అంచలంచలుగా చెప్పుకొన్నాయి ఈ వస్తువులు. మధ్యలో ‘అయ్యో కూతురా, మడేలుకు ఒళ్లు అప్పగించేసిందా కన్నెమ్మ’ అన్న ఊదర బుర్రను తీవ్రంగా మందలించాయి. ‘ఒసే ముయ్యే. మనుసులు నిన్ను ఊది ఊది, వాళ్ల లోపలి కువ్వాళం అంతా నీలో చేరిపొయినట్టు ఉండాది.&#8217; అని ఎకసెక్కం చేసాయి. ఆమె దుఃఖాన్నీ తమ సొంతంగా భావించి వల వలా ఏడ్చాయి. పొంత కడవ మాత్రం ఆమె కధ విన్న తరువాత తల్లడిల్లిపోయింది. &#8216;పగలు పొద్దుగూకులూ కాగికాగి కాలిపోయే నాకు, కడకు మిగిలేది మసే కదా. పండగపూట కూడా పొంతకడవకు అంత పసుపూకుంకుమా పెట్టరే. ఇంటిల్లిపాదికీ ఇంత ఊడిగం చేసే నన్ను, కడాన ఉలవరించుకొని పొయిననాడు దిబ్బలోనే కదా వేసేది. ఓటి మంగలానికి ఉండే మతింపు కూడా పొంతకడవకు ఉండదే.. నా బతుకు మాదిర బతుకే కదా ఆయమ్మది కూడా.&#8217; అని తల పోసి వగచింది.<br />
మేనల్లుడు కూడ &#8216;సాకలి సొలుపు తీరితే కదా&#8217; అనగానే దినమంతా కూడూనీళ్ళు ముట్టకుండా అర్ధరాత్రి పుట్టినింటి నుండి తెచ్చుకొన్న రాగిచెరవను కావలించుకొని పొగిలి పొగిలి ఏడుస్తుంది కన్నెమ్మ. ఆ ఏడుపును చూసిన పొంతకడవ తను కూడ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి చుక్క పుట్టే పొద్దుకు పగిలిపోతుంది.</p>
<p>‘ఓస్ ఆడోళ్ళు చేసే ఎలాంటి పనైనా మేము చేసేయగలం&#8217; అనే అహంకారం ఎంత అమానుషమో, &#8216;ఆడది ఎంత పనైనా తన కుటుంబం కోసమే కదా చేసేది&#8217; అంటూ దాన్ని సహజ సూత్రంగా స్వీకరించటం కూడా అంతే అన్యాయం. స్త్రీ శ్రమని ఉపరితలం నుండి చూడటం, తేలిక చేయటం ఇక్కడే మొదలౌతుంది. ప్రతిపని మర నొక్కి చేసే రోజులు కావవి. నడుమును విల్లులా వంచాలి, భుజ కండరాలను పూర్తి స్థాయిలో ఉపయోగ పెట్టాలి. చేతులు, కాళ్ళు నిరంతరం శ్రమించాలి. పొద్దు పొడిచింది మొదలు, ఊరు గురకలు పెట్టేవరకు ఎడతెరిపిలేని, సృజనాత్మకత లేని వెట్టి చాకిరి అది. &#8216;దేవత, అనురాగమయి, త్యాగమయి&#8217; పిలుపులు మాత్రమే (అదీ పొదుపుగా) భత్యంగా వచ్చే దగాకోరు దోపిడి. (కన్నెమ్మకు ఆ జీతం, భాగ్యం కూడ లేవనుకోండి). రచయిత చుట్టింట్లో పీట వేసుకొని దినమంతా కూర్చొన్నా కూడ ఆ శ్రమను అంత సజీవంగా అక్షరాల్లో పెట్టటం అసాధ్యం. ఒక రోజులో ఒక స్త్రీ చేసే కష్టాన్ని రచయిత తను కూడ చేసి ఉంటేనే అలా రాయగలడు అన్పిస్తుంది ఆ వర్ణన చదివితే. ఆ భాగం మాత్రం మీరు చదవాల్సిందే.</p>
<p>ఇక రచయిత భాషా, వస్తుపరిజ్ఞానం అపరిమితం. గతంలో విరివిగా వాడి, ఇప్పుడు సాహిత్యంలోను, మ్యూజియం లోనూ మాత్రమే కనిపిస్తున్న గ్రామీణ శ్రమలను, వస్తుసంపదను ఆయన మన కళ్ళకు కట్టించాడు. ముఖ్యంగా కుమ్మరి కుండలు చేసిన చేసే వైనం మన ముందు సాక్షాత్కరింపచేసాడు.</p>
<p>&#8220;మరునాడు తెల్లవారి లేచి మబ్బు (తొక్కి పెట్టిన మట్టి ముద్ద) పక్కనే సారెను పెట్టి, సారెను గిరగిర తిప్పుతా దాని మీద నన్ను పెట్టి చేతి ఒడుపును చూపించినాడు. ఆ ఒడుపుకు పులకరించిపొయిన నా ఒళ్ళు తీరుతీరున సాగింది. నేను పంతెను అయినాను, పటువను అయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లి మూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పు అటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవక పంటి, కడవ, కలి కడవ, పొంత కడవ, బాన, చాకలి బాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము,పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము… ఒక తీరు కాదు ఒక తెన్ను కాదు, వాడు చేతిలో ఏమి మరులమందు పెట్టుకొని నన్ను ముట్టుకొన్నాడో, నేను ఇన్ని పెడలుగా పొడలు కట్టినాను.&#8221; ఇవి మట్టి చేత రచయిత పలికించిన పలుకులు.</p>
<p>నెళవు (పరిచయం), పసను (రంగు), రెయ్యికోళ్ళు(కీచురాళ్ళు), ఇర్లనాటికో వెల్లనాటికో (అమావాస్యకో పౌర్ణమికో), కడంగి (ప్రయత్నించి), ఉల్లము (మనసు) లాంటి అచ్చతెలుగు పదాలు పాఠకులను ఉర్రూతలూగిస్తాయి.</p>
<p>ఈ కధను స్మరించుకొంటున్న సందర్భంలో కధ గురించి కొందరి అభిప్రాయాలు కూడ ఉటంకిస్తే బాగుంటుందనిపించింది.</p>
<p>&#8220;వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు,కనిపించే చిత్రం చాటున మూసుకు పోయిన కళ్ళని చూసి నమ్మకాల దారపు పోగులు తెగిపోతున్నసమయంలో, తాను నమ్మినదాన్ని శ్వాసించి, జీర్ణించి, అనుభవించి వ్యక్తీకరించే కృషి చేస్తున్నాడు రమేష్. పిచుకల కధలుతోనో, రయికముడి ఎరుగని బ్రతుకుల వ్యధలనో తన గొంతుకతో వినిపించాడు.కొత్త వడ్లతో చేసిన మొలక బియ్యం సారం అనుభవిస్తున్నత ఆనందం వుంది రమేశ్ కథలలో.&#8221; రమేశ్ కధల గురించి ఒక పాఠకురాలు హరిత అభిప్రాయం.</p>
<p>“ఒకమనిషిని మరొక మనిషి చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ఆ మనిషిలో ఒక లోపాన్ని వెతికి దాన్ని తురుఫు ముక్కలా వాడుకుని ఆమెని ఆ ఒక్క మాటతో కుప్పకూలేలా చెయ్యడం అనే రాజకీయం ఎంతకాలంగానో నడుస్తూనే వుంది . మానవజీవితావసరమైన ఒకానొక సుఖాన్ని ఒక లిప్త కాలం అనుభవించడం నేరం అయిపోయిన అస్వతంత్ర కన్నెమ్మ అనగా ఎంత? ఏడ్చి ఏడ్చి పొంతకుండ పగిలిపోయింది .కన్నెమ్మ ఇంకా ఎంతకాలం అట్లా కన్నీళ్ళు ఇగరబెట్టుకుంటూ బ్రతకాలి? జీవితం, తిండి ,వస్తువులు.అన్నిటా స్థానీయత తొణికిసలాడే కథ. ‘రవిక ముడి ఎరగని బ్రతుకు’ అక్షరాలను దృశ్యాలుగా మలిచే చిత్రకారుడు రమేష్ .పాఠకులని తన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించే మాంత్రికుడు.అచ్చతెలుగు అతని స్వంతం.” -సత్యవతి పి. (రచయిత్రి)</p>
<p>“అది ఒక కన్నీటి గాధ.&#8217;రయిక ముడి ఎరుగని బ్రతుకులు&#8217; లో నా చిన్నప్పటి మహనీయ స్త్రీమూర్తులు ఎందరో నా మనసులో మెదిలాడారు.వేకువనే లేచి గబగబ అన్నం వండి, పొద్దున్నే పిల్లలకింత పెట్టి తానింత టిపినులో పెట్టుకొని పొలం కూలీకి పరుగులు తీసిన అమ్మ,గర్భాశయ కేన్సర్ తోనే ఇంటిల్లిపాదికీ వండివార్చిచాకిరీ చేసిన అమ్మమ్మ,తలజడ వేసుకోటం మాని, ముడి తోనే దూది ఉన్ని నేకి తనవాళ్ళ కడుపులు నింపిన నాయనమ్మ,ఎన్నని చెప్పేది ఎందరిని తలుచుకునేది?ఆ దృశ్యాలెన్నో రమేశ్ మన కళ్ళకు కట్టాడు.”- నూర్ భాషా రహంతుల్లా (డిప్యూటి కలెక్టర్, విజయవాడ).</p>
<p>మట్టిని తవ్వితే మాణిక్యాలు దొరుకుతాయి. పల్లెటూర్లలో నులకమంచాల్లో ముడుచుకొని ఉన్న ముసలమ్మలను కదిలిస్తే నాణ్యమైన జీవితాలు లభిస్తాయి. ఎటొచ్చి వినదగ్గ వారే వినాలి.రాయదగ్గ వారే రాయాలి. మరుగున పడ్డ, మసిగుడ్డలుగా మారిన మహోన్నత స్త్రీ మూర్తుల చీకటి గాధలను, ధవళ హృదయాలను సమస్త లోకానికి ఎరిక పర్చవా రమేశు! నీ సత్యమైన తీక్షణ దృష్టితో,నీ కధనా కౌశలంతో, నీ విశిష్ట భాషా పరిజ్ఞానంతో!</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=2983</wfw:commentRss>
		<slash:comments>23</slash:comments>
		</item>
		<item>
		<title>మరపురాని కథ&#8230;  రావిశాస్త్రి ‘మాయ’!</title>
		<link>http://vaakili.com/patrika/?p=2697</link>
		<comments>http://vaakili.com/patrika/?p=2697#comments</comments>
		<pubDate>Tue, 30 Apr 2013 21:10:36 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[సి. హెచ్ వేణు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=2697</guid>
		<description><![CDATA[<p>రా.వి.శాస్త్రి గారి ‘ఆరు సారా కథల’ను ఇరవై ఏళ్ళ కిందట మొదటిసారి చదివాను. అప్పటికే అవి రాసి 30 సంవత్సరాలు దాటింది.<br /> రెండక్షరాల సారా చుట్టూ అల్లిన ఈ కథల శీర్షికల్లోనూ రెండక్షరాలే. (పాపి, మాయ, న్యాయం, మోసం, పుణ్యం, మోక్షం).</p> <p>వీటిలో&#8230; ఇన్నేళ్ళలో నేను మర్చిపోని కథానికల్లో ‘మాయ’ ఒకటి. సారా వ్యాపారం చేసుకునే ముత్యాలమ్మను పోలీసు హెడ్డు అక్రమంగా జైల్లో పెట్టటం, కేసు కోర్టు విచారణ, వాదనల తర్వాత ఆమె ఎలా బయటికి వచ్చిందన్నది స్థూలంగా కథ.</p> <p>కథ ఇంతే! కానీ కథనం గురించి చెప్పాలంటే ఎంతో ఉంది!</p> <p>ఈ ‘మాయ’ కథానికను ఈ లింకులో చదవొచ్చు: http://www.scribd.com/doc/135355638/Maaya<br /> ఇలాంటి లింకు ఇచ్చాక- అధిక ప్రసంగం మాని పక్కకి తప్పుకోవటం మర్యాద అని తెలుసు. </p> <p>కానీ మంచి సినిమాలోని అపురూప సన్నివేశాలను ఇష్టంగా గుర్తు చేసుకుంటామే&#8230; అలాగ ఈ కథలో, కథనంలో నాకు నచ్చినవేమిటో ఓసారి గుర్తు చేసుకుంటాను.<br /> ఇంగ్లీష్ వారి వీరాభిమాని<br /> ఇంగ్లీష్ వారి గుణగుణాల్ని వర్ణించడంలో వళ్ళు తెలీని ఓ పెద్ద ప్లీడరు న్యాయవాద వృత్తిలోకి కొత్తగా ప్రవేశిస్తున్న మూర్తికి హితబోధ చేయటంతో ఈ కథానిక మొదలవుతుంది.</p> <p>ఇంగ్లిష్ వాడిని ‘గొప్ప మాయగాడు’ అని వర్ణించే సందర్భంలో ఆ ప్లీడరు ‘‘ఆనంద పారవశ్యంలో నిమీలిత నేత్రుడై మాటాడతాడు’’. ఈ సందర్భంలో రావిశాస్త్రి మార్కు చురక- ‘‘ఆయనే కాని ఆడదైతే ఏ ఇంగ్లిష్ వాడితోనో ఒకడితో ఏనాడో లేచిపోయుండును’’!</p> <p>‘వేశ్యలు వీధిగుమ్మాలు కనిపెట్టుకునుంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వేళ్ళాడుతాయి. కొంగలు రేవుని కాసుకునుంటాయి. సామ్యం బావులేదు. కాని మనం చెయ్యవలసిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకునుండాలి. ’ అని ప్రబోధిస్తాడు పెద్ద ప్లీడరు.</p> <p>కొంచెం పచ్చిగా చెప్పినా ఇది వాస్తవమే కదా?</p> <p>‘‘&#8230; సివిల్ కేసవనీ, క్రిమినల్ కేసవనీ, సాక్ష్యంతోనే సంబంధం కానీ, సత్యంతో సంబంధం లేదు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/05/raavisastry.jpg"><img class="alignleft size-full wp-image-2729" title="raavisastry" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/05/raavisastry.jpg" alt="" width="153" height="234" /></a>రా.వి.శాస్త్రి గారి ‘ఆరు సారా కథల’ను ఇరవై ఏళ్ళ కిందట మొదటిసారి చదివాను. అప్పటికే అవి రాసి 30 సంవత్సరాలు దాటింది.<br />
రెండక్షరాల సారా చుట్టూ అల్లిన ఈ కథల శీర్షికల్లోనూ రెండక్షరాలే. (పాపి, మాయ, న్యాయం, మోసం, పుణ్యం, మోక్షం).</p>
<p>వీటిలో&#8230; ఇన్నేళ్ళలో నేను మర్చిపోని కథానికల్లో ‘మాయ’ ఒకటి. సారా వ్యాపారం చేసుకునే ముత్యాలమ్మను పోలీసు హెడ్డు అక్రమంగా జైల్లో పెట్టటం, కేసు కోర్టు విచారణ, వాదనల తర్వాత ఆమె ఎలా బయటికి వచ్చిందన్నది స్థూలంగా కథ.</p>
<p>కథ ఇంతే! కానీ కథనం గురించి చెప్పాలంటే ఎంతో ఉంది!</p>
<p>ఈ ‘మాయ’ కథానికను ఈ లింకులో చదవొచ్చు: <a href="http://www.scribd.com/doc/135355638/Maaya">http://www.scribd.com/doc/135355638/Maaya</a><br />
ఇలాంటి లింకు ఇచ్చాక- అధిక ప్రసంగం మాని పక్కకి తప్పుకోవటం మర్యాద అని తెలుసు. <img src='http://vaakili.com/patrika/wp-includes/images/smilies/icon_smile.gif' alt=':)' class='wp-smiley' /> </p>
<p>కానీ మంచి సినిమాలోని అపురూప సన్నివేశాలను ఇష్టంగా గుర్తు చేసుకుంటామే&#8230; అలాగ ఈ కథలో, కథనంలో నాకు నచ్చినవేమిటో ఓసారి గుర్తు చేసుకుంటాను.<br />
ఇంగ్లీష్ వారి వీరాభిమాని<br />
ఇంగ్లీష్ వారి గుణగుణాల్ని వర్ణించడంలో వళ్ళు తెలీని ఓ పెద్ద ప్లీడరు న్యాయవాద వృత్తిలోకి కొత్తగా ప్రవేశిస్తున్న మూర్తికి హితబోధ చేయటంతో ఈ కథానిక మొదలవుతుంది.</p>
<p>ఇంగ్లిష్ వాడిని ‘గొప్ప మాయగాడు’ అని వర్ణించే సందర్భంలో ఆ ప్లీడరు ‘‘ఆనంద పారవశ్యంలో నిమీలిత నేత్రుడై మాటాడతాడు’’. ఈ సందర్భంలో రావిశాస్త్రి మార్కు చురక- ‘‘ఆయనే కాని ఆడదైతే ఏ ఇంగ్లిష్ వాడితోనో ఒకడితో ఏనాడో లేచిపోయుండును’’!</p>
<p>‘వేశ్యలు వీధిగుమ్మాలు కనిపెట్టుకునుంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వేళ్ళాడుతాయి. కొంగలు రేవుని కాసుకునుంటాయి. సామ్యం బావులేదు. కాని మనం చెయ్యవలసిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకునుండాలి. ’ అని ప్రబోధిస్తాడు పెద్ద ప్లీడరు.</p>
<p>కొంచెం పచ్చిగా చెప్పినా ఇది వాస్తవమే కదా?</p>
<p>‘‘&#8230; సివిల్ కేసవనీ, క్రిమినల్ కేసవనీ, సాక్ష్యంతోనే సంబంధం కానీ, సత్యంతో సంబంధం లేదు ’’అని ఘంటాపథంగా చెప్పేస్తాడు. అందుకే- న్యాయం, ధర్మం, సత్యం మాటలు పేలించాలనీ, కానీ అంతా మాయేనని తెలుసుకోమంటాడు.<br />
ఎందుకంటే ‘‘పద్ధతే’’ అలా ఉంది.</p>
<p>పద్ధతి అంటే వ్యవస్థ అని అర్థం చెప్పుకోవచ్చు. ‘‘ఇందులో మనం ఏం చేసినా సరే, పాపం మనకెలా అంటుకుంటుందదీ? అంటుకోడానికి వీల్లేదు’’ అని సమర్థించుకుంటూ వాదిస్తాడు.</p>
<p>పాపభీతి అనేది చెడుపనులు చేయకుండా నిరోధిస్తుందా? కష్టమే. పైగా వాళ్ళకు ఆత్మసమర్థన తోడైతే ఎలా ఉంటుందో ఈ ప్లీడరు మాటలే తేటతెల్లం చేస్తాయి.</p>
<p>కవిత్వంలాంటి వచనం<br />
రావిశాస్త్రి గారి రచనల్లో కవిత్వ సదృశమైన వచనం వాక్యాలకు ఒక తూగునూ, లయనూ ఇస్తుంది. ఆ వచనంలో వ్యంగ్యం, వాస్తవం జోడుగుర్రాల్లా పరుగులు తీస్తుంటాయి.</p>
<p>సరదా సంభాషణైనా, నిస్సహాయ నిర్వేదమైనా హత్తుకునేలా చెప్పటం ఆయన రచనల స్వాభావిక లక్షణం. చూడండి ఈ వాక్యాలు- ‘‘&#8230; పాపాలన్నీ జడ్జీలవి. ఖర్చులన్నీ పార్టీలవి. లంచాలన్నీ సాక్షులవీ, గుమస్తాలవీ. ఫీజులన్నీ మనవి’’<br />
‘‘నా మొగుడు సారాపాలైపోనాడు. నా యాపారం పోలీసోళ్ళ పాలైపోనాది. నా కూతురు కుక్కలపాలైపోనాది.’’</p>
<p>రావిశాస్త్రి తన కథల్లో మనుషులను వర్ణించే తీరు విచిత్రంగా ఉంటుంది. ఈ ‘మాయ’కథలో జామీను మనిషిని ‘గెద్దలాంటి మనిషి’ గా పోల్చి, ‘అతని పక్కనే మరో గెద్దలాంటి మనిషున్నాడు. అతను మరో జామీను మనిషి’ అంటారు. ఇక ముత్యాలమ్మ మొగుడు ‘కునుకు కుక్క’లా నిల్చున్నాడని వర్ణిస్తారు.</p>
<p>ముత్యాలమ్మను పరిచయం చేసిన తీరు రచయిత నైపుణ్యానికి ఓ మచ్చుతునక -<br />
‘‘ఒకప్పుడామె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయుంటుంది. చాలా రోజుల క్రిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది. ’’</p>
<p>ఆమె ప్రస్తుతం ఎలా ఉందో నేరుగా రచయిత ఎక్కడా వర్ణించలేదు. ఒకప్పుడు ఎలా ఉండేదో మాత్రమే అంచనాగా సూచించారు. చాలు! చెప్పదల్చిందంతా స్పష్టంగా బొమ్మ కట్టింది. కాస్త వ్యంగ్యం కూడా అద్దుకుని ఆమె దు:స్థితి అంతా పాఠకుల మనసుల్లోకి అనితర సాధ్యంగా బదిలీ అయిపోయింది.</p>
<p>ఈ వాక్యాల సారాన్ని వేరే ఏ రకంగా చెప్పబోయినా- రావిశాస్త్రి గారి వాక్యాలతో పోలిస్తే పేలవంగానే ఉంటాయని కచ్చితంగా చెప్పొచ్చు!</p>
<p>ముత్యాలమ్మ మొగుడు ‘‘సారా తప్ప వొణ్నం ముట్టడు’’. జామీను మనిషికి ఆమె నిస్సహాయత, పేదతనం బాగానే తెలుసు. కానీ జాలీ, దయా&#8230; ఇలాంటి గుణాలే కనపడవు అతనిలో. ఆమె ద్వారా తనకు వచ్చే కమీషనే ముఖ్యం. ఎందుకంటే అతడు దళారీ. నిజాన్ని జంకూ గొంకూ లేకుండా తలకిందులు చేయటంలో నేర్పరి. అందుకే ఫీజు కింద వందకు తక్కువ ముత్యాలమ్మను అడగొద్దని మూర్తికి సలహా ఇస్తాడు. ఇవ్వగలదా అనే సందేహపడితే ‘‘పులిసుంది ఇవ్వకేం చేస్తుంది!’ అని పచ్చి అబద్ధం చెప్తాడు.</p>
<p>ఈ లోపాయకారీ వ్యవహారాన్ని ముత్యాలమ్మ ఇట్టే గ్రహించేస్తుంది. సారా వ్యాపారం ఆమెకు మంచి చేయకపోయినా లోకంలోని చెడుగులన్నిటినీ గ్రహించేలా చేసింది. అనుబంధాల మీద నమ్మకం కోల్పోయేలా చేసింది. విరక్తితో ఆమె చెప్పే వాస్తవాలు ఎవరికైనా కంగారు పుట్టిస్తాయి. ఆవేదన కలిగిస్తాయి.</p>
<p>కట్ట తెగి ప్రవహించిన వేదన<br />
ఏకబిగిన ఏరులాగా సాగే ముత్యాలమ్మ వాగ్ధోరణి ఈ కథలో ప్రత్యేకం. అది అసహజమనిపించదు. కారణం ఆమె చెప్పే మాటల్లోని కఠోర సత్యాలే. ఎదుట ఉన్నది మూర్తి లాంటి మంచి లాయర్ కాబట్టి ఆమె బర్ స్ట్ అయి, మనసు విప్పి చెప్పుకుందని అర్థం చేసుకోవచ్చు.<br />
ఆమె పెను విషాదం సుదీర్ఘమైన దు:ఖంగా సాగి మాటలై పొంగుతుంది.</p>
<p>‘మోనోలాగ్’లా ఆమె చెపుతూపోతుంటే మూర్తి అవాక్కయి వింటుంటాడని ఊహించుకోవచ్చు. మరి దళారీ జామీను మనిషి రియాక్షన్ ? అంతకుముందే ‘‘నీకు నాను కాణిస్తే అందల సగం గుంజుతాడు’’ అని అతణ్ణి స్కాన్ చేసేసింది ముత్యాలమ్మ. వాడిక ఏమనాలో తోచక బిక్కచచ్చి నోర్మూసుకుని ఉండుంటాడు.</p>
<p>‘‘డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను. డబ్బుకి, సదివిన సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు నాయ్యేన్నమ్ముతున్నారు&#8230;.. అమ్మకం! అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరేట్నేదీ లోకంలో’’ అని ఆమె చెప్పే మాటల్లో ఎవరూ కాదనలేని చేదు నిజాలున్నాయి.</p>
<p>‘‘&#8230; పేనం మీద ఇసుగెత్తి పోయున్నాను. కన్నతండ్రే కాదు, కట్టుకున్న మొగుడే కాదు, కడుపున పుట్టిన పిల్లలే కాదు- ఒవురన్నా నాకు నమ్మిక నేదు. ఆ కాడి కొచ్చినాక మరింక నాను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే! ’’</p>
<p>‘‘&#8230; పీడరు బాబూ! సారా టూబులూ, గాజు గలాసులూ దాసుకున్నాను గాని కన్నకూతుర్ని దాసుకోనేకపోనాను. ఏం బతుకు బాబూ నాది?’’</p>
<p>‘‘సీ! ఏటీ యాపారం? ఏటీ బతుకూ? అని నా మనసు మనుసంతా ఇరిగిపోయింది’’</p>
<p>ఎంత కష్టంలో ఉన్నా ఇతరులపై ఆధారపడకూడదనే ఆత్మగౌరవం ఆమెది. ‘‘నీ కష్టం నా మీదెందుకుండాల? ఇవ్వనేకపోతే యింట్లో అంట్లు తోమిస్తాను.’’ అంటుంది. ‘‘ సారా అమ్మకానికి దిగి, తాగేవోళ్ళని సెడిపేను, నాను సెడ్డాను ’’ అని అనే పశ్చాత్తాపం కూడా ఆమెలో ఉంది.</p>
<p>సరే, చివరకు ప్లీడర్ మూర్తి గట్టిగా క్రాస్ పరీక్ష చేసి ఇద్దరు సాక్షుల్లో ముఖ్యుణ్ణి బోల్తా కొట్టిస్తాడు. ‘మంచు విడిపోయినట్టుగా’ కేసు సులభంగా విడిపోతుంది.</p>
<p>కానీ అదంతా జరిగింది అతడి వాదనా పటిమ వల్ల కాదు. దానికి కారణం వేరు. ముత్తేలమ్మ అదేమిటో చెప్పేసరికి మూర్తికి<br />
నీరసం వచ్చేస్తుంది. ఒక్కసారిగా చప్పబడిపోయి ముత్యాలమ్మ దగ్గర డబ్బు ససేమిరా తీసుకోడు.</p>
<p>‘‘చేసేదేం లేక, వణుకుతున్న చేతుల్తో డబ్బు తిరిగి పట్టుకు వెళ్ళిపోయింది ముత్యాలమ్మ’’</p>
<p>లోకమంతా చెడేనని తిరుగులేని నమ్మకం ఏర్పరచుకున్న ఆమెకు మూర్తి మంచితనం అనూహ్యం. అందుకే ఈ సందర్భంలో ఆమె చేతులు వణకటం!</p>
<p>తప్పుడు కేసుల మాయల నుంచి బయటపడటానికి ముత్యాలమ్మ లాంటి బడుగు జీవులకు ఎంత కష్టం.. ఎంత ప్రయత్నం&#8230; ఎంత బాధ!</p>
<p>ఈ వ్యవస్థలో ముత్యాలమ్మలకు కొదవ లేదు. మూర్తి లాంటివాళ్ళు ఎంతమంది ముందుకొచ్చి ఎంతవరకూ వారికి సాయపడగలుగుతారు?</p>
<p>ఇలాంటి ప్రశ్నలు రేపుతూ, ఆలోచింపజేస్తూ ముగుస్తుంది ఈ కథ.</p>
<p>పెద్ద ప్లీడరూ, ముత్యాలమ్మా స్వీయానుభవాలతో లోకం గుట్టు విప్పి చెప్పినపుడు మూర్తి గాభరా పడతాడు. అతడే కాదు; ఆ జీవితసత్యాలు పాఠకులకూ గాభరా పుట్టించి ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి!</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=2697</wfw:commentRss>
		<slash:comments>10</slash:comments>
		</item>
		<item>
		<title>స్లోగన్లు లేని విప్లవం కథ మన్నం సింధు మాధురి &#8220;కాళావు&#8221;</title>
		<link>http://vaakili.com/patrika/?p=2103</link>
		<comments>http://vaakili.com/patrika/?p=2103#comments</comments>
		<pubDate>Mon, 01 Apr 2013 12:43:43 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[కత్తి మహేష్ కుమార్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=2103</guid>
		<description><![CDATA[<p>కొన్ని కథలు జీవితాల్ని పరిచయం చేస్తాయి. ‘అసలు ఇలాక్కూడా ఉంటాయా జీవితాలు’ అని సామాన్యులు ఆశ్చర్యపోయే నిస్సహాయమైన,అసాధారణమైన,అద్భుతమైన అభాగ్యుల జీవితాల గురించి కొందరే తమ రచనల ద్వారా పరిచయం చేస్తారు. అలాంటి ఒక కథ ‘కాళావు’. అలాంటి ఒక సాహసి మన్నం సింధు మాధురి.</p> <p>మొట్టమొదటిసారిగా కథ చదివినప్పుడు ఒకరకమైన గగుర్పాటుకి లోనయ్యాను. మళ్ళీ చదివినప్పుడు మరింత ఎక్కువయ్యింది. ఎంచుకున్న నేపధ్యం, వాడిన శైలి, వాడైన శిల్పం, వొడుపు ఉన్న యాస, జానపదసాహిత్యాన్ని పోలిన కథనగుణం అన్నీ కలగలిపి ఒక క్లాసిక్ కథగా నిలపగలిగిన తీవ్రత ఉంది ఈ కథలో అనిపించింది.</p> <p>&#8220;జీవితం అంటే ఏంటి? మనస్సంటే? శరీరం అంటే ఏంటి? ఈ మూడిటికీ ఉన్న బంధం ఎలాంటిది. ఒకదానికొకటి ఎందుకు ఎదురు తిరుగుతయ్యి. ఒకే దిశలో ఎందుకు నడవవు. మనస్సుకీ శరీరానికీ ఏంటి మెలిక. కాస్సేపు మనసుని ఎందుకు పక్కకి తొయ్యలేము. నాకేనా అందరు ఆడాళ్లకీ ఇంతేనా. అర్థం కాలేదు.&#8221; ఒక జోగిని ప్రశ్న ఇది. బసివినిని చేసి మగాళ్ళ కామవాంఛల్ని లాంఛనంగా తీర్చమని బలవంతం చెయ్యబడిన ఒక స్త్రీ ప్రశ్న ఇది. మొదటి మగాణ్ణి సహజంగానే నావోడని instinctiveగా నమ్మి ప్రేమించే primordial స్త్రీ మనస్తత్వపు ప్రశ్న ఇది. చాలా లోతైన ఘాఢమైన ప్రశ్న. ఇంత profound ప్రశ్న అడిగిన కాళావు మనసు, బ్రతుకు, భవిష్యత్తుని ఆర్తిగా తనలో ఇముడ్చుకుని ఒక దేవరహస్యంలాగా, కాటిపాపడి మాయలాగా మనకు పరిచయం చేసి, మనలో కాళావుని ప్రతిష్టించి, పూజింపజేసే కథ ఇది.</p> <p>కాటిపాపడి రాకతో ఒక డాక్టర్ గారి అమ్మాయి మనసులో రేగిన జ్ఞాపకాల తుట్టెతో మొదలౌతుంది కథ. ఆ అమ్మాయి ధృక్కోణంలో ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా కాళావు, కాళావు తమ్ముడు ప్రత్యక్షమౌతారు. కథ మన కళ్లముంది సాగుతుంది. కాళావుని బసివిని చెయ్యడం. గవాక్షం (గవాచం) వెలుగుతో కాళావు మౌనసంభాషణలు. మొదటి రాక్షస రతితో మానవత్వం లేని, మనిషితత్వం కోల్పోయిన మగాళ్ళనే మనుషులతో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/03/katti.jpg"><img class="alignleft size-full wp-image-2263" title="katti" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/03/katti.jpg" alt="" width="159" height="169" /></a>కొన్ని కథలు జీవితాల్ని పరిచయం చేస్తాయి. ‘అసలు ఇలాక్కూడా ఉంటాయా జీవితాలు’ అని సామాన్యులు ఆశ్చర్యపోయే నిస్సహాయమైన,అసాధారణమైన,అద్భుతమైన అభాగ్యుల జీవితాల గురించి కొందరే తమ రచనల ద్వారా పరిచయం చేస్తారు. అలాంటి ఒక కథ ‘కాళావు’. అలాంటి ఒక సాహసి మన్నం సింధు మాధురి.</p>
<p>మొట్టమొదటిసారిగా కథ చదివినప్పుడు ఒకరకమైన గగుర్పాటుకి లోనయ్యాను. మళ్ళీ చదివినప్పుడు మరింత ఎక్కువయ్యింది. ఎంచుకున్న నేపధ్యం, వాడిన శైలి, వాడైన శిల్పం, వొడుపు ఉన్న యాస, జానపదసాహిత్యాన్ని పోలిన కథనగుణం అన్నీ కలగలిపి ఒక క్లాసిక్ కథగా నిలపగలిగిన తీవ్రత ఉంది ఈ కథలో అనిపించింది.</p>
<p>&#8220;జీవితం అంటే ఏంటి? మనస్సంటే? శరీరం అంటే ఏంటి? ఈ మూడిటికీ ఉన్న బంధం ఎలాంటిది. ఒకదానికొకటి ఎందుకు ఎదురు తిరుగుతయ్యి. ఒకే దిశలో ఎందుకు నడవవు. మనస్సుకీ శరీరానికీ ఏంటి మెలిక. కాస్సేపు మనసుని ఎందుకు పక్కకి తొయ్యలేము. నాకేనా అందరు ఆడాళ్లకీ ఇంతేనా. అర్థం కాలేదు.&#8221; ఒక జోగిని ప్రశ్న ఇది. బసివినిని చేసి మగాళ్ళ కామవాంఛల్ని లాంఛనంగా తీర్చమని బలవంతం చెయ్యబడిన ఒక స్త్రీ ప్రశ్న ఇది. మొదటి మగాణ్ణి సహజంగానే నావోడని instinctiveగా నమ్మి ప్రేమించే primordial స్త్రీ మనస్తత్వపు ప్రశ్న ఇది. చాలా లోతైన ఘాఢమైన ప్రశ్న. ఇంత profound ప్రశ్న అడిగిన కాళావు మనసు, బ్రతుకు, భవిష్యత్తుని ఆర్తిగా తనలో ఇముడ్చుకుని ఒక దేవరహస్యంలాగా, కాటిపాపడి మాయలాగా మనకు పరిచయం చేసి, మనలో కాళావుని ప్రతిష్టించి, పూజింపజేసే కథ ఇది.</p>
<p>కాటిపాపడి రాకతో ఒక డాక్టర్ గారి అమ్మాయి మనసులో రేగిన జ్ఞాపకాల తుట్టెతో మొదలౌతుంది కథ. ఆ అమ్మాయి ధృక్కోణంలో ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా కాళావు, కాళావు తమ్ముడు ప్రత్యక్షమౌతారు. కథ మన కళ్లముంది సాగుతుంది. కాళావుని బసివిని చెయ్యడం. గవాక్షం (గవాచం) వెలుగుతో కాళావు మౌనసంభాషణలు. మొదటి రాక్షస రతితో మానవత్వం లేని, మనిషితత్వం కోల్పోయిన మగాళ్ళనే మనుషులతో ఘర్షణ. తన జాగృతమైన మనసుతో సంఘర్షణల వివరణల మధ్య సాగుతుంది.</p>
<p>&#8220;అరుద్దాం అనుకునే అంతలో ఏదో భయంకరమైన అవయవం నా శరీరంలో ప్రవేశించింది, ఒక చెయ్యి నా నోటిని మోసేసింది. బలవంతపు నెప్పి, వళ్ళంతా కొట్టి పడేసిన పచ్చి పుండులా ఎదురుదెబ్బ తిన్న కాలిబొటన వేలికి జొన్న మోడు కస్సున దిగబడిన నెప్పిలాంటి ఒక నెప్పి, దీన్ని నాకిచ్చి, తలకిందకొన్ని నోట్లు ఉంచి రాత్తిరి రెండింటికి గౌడు ఎప్పి పోయాడు&#8221; అంటూ కాళావు మొదటి అనుభవాన్ని రచయిత్రి వర్ణించిన తీరు చదివితే, పాఠకుడికళ్లలోనూ వెలుగు మాయమై కాళావుకు గవాక్షంలో కనిపించిన నల్లవెలుగే కనిపించక మానదు. ఎదుటివాళ్లకు మాత్రమే సుఖ్ఖాన్నిచ్చే ఈ కాళావు దు:ఖంలో తనకున్న ఒకేఒక్క ఆటవిడుపు కాటిపాపడి మాయ. ఆ మాయపుచ్చే కాస్సేపటి ఆనందమే. ఇంతలో గర్భం. తుంచడానికి అందరి ప్రయత్నం. గౌడు ఆసరాకొసం వెళితే గుండెపగిలే ఒక నిజం. అంత ఘర్షణలోనూ కాటిపాపడి &#8220;ఇదే ఆసరా.దీంతోనే జీవితం.&#8221;అనే ఎరుకలో బిడ్డడి జన్మం. మూడు నెలలు కాగానే మళ్ళీ కాళావుకి దినదిన మరణం. గౌడుతో పాటూ గౌడుసావాసగాడితో సహవాసం. ఈ అన్నింటి మధ్యా పిల్లాడు పెరగడం. పెరుగుతున్న పిల్లడి ఇబ్బందికరమైన ఐడెంటిటీ ప్రశ్నల మధ్య పెల్లుబికే అవాజ్యమైన ప్రేమ. పసిమనసుకు <a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/03/sindhu1.jpg"><img class="size-full wp-image-2228 alignright" title="sindhu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/03/sindhu1.jpg" alt="" width="152" height="177" /></a>అర్థమైన తల్లికష్టాన్ని తీర్చడానికి ఎనిమిదేళ్ళ కొడుకు చేసే యుద్ధం. చివరిగా కాటిపాపడి మాయతో విజయం.</p>
<p>ఒక రచయితకు భావపుష్టి, పలుకుబడి ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యం సాంస్కృతిక సంపద &#8211; Cultural capital. ఆ సాంస్కృతిక సంపద పుష్కలంగా కలిగిన రచయిత్రి మన్నం సింధు మాధురి. వ్యవసాయం కోసం కోస్తాప్రాంతం నుంచీ కర్ణాటక గంగావతి ప్రాంతానికి వలసవెళ్ళిన కుంటుంబాల నేపధ్యం గలిగిన సింధు మాధురి కథల్లో ఆ తెలుగు కన్నడ మిశ్రమ సంస్కృతి ప్రతిఫలిస్తూ ఉంటుంది. Culture in trasition తోపాటూ ఒక సొగసైన యాస మట్టివాసనల్ని వెదజల్లుతూ ఉంటుంది. రాసే విధానంలో సహజంగా మాట్లాడిన తీరు ప్రతిఫలిస్తూ సహజత్వం ఉట్టిపడుతుంది. కొన్ని పదాలు, కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ఠక్కున అర్థంకాకున్నా, భావం ఎక్కడా చెడని శిల్పం, ఒడుపు రచయిత్రి సొంతం.</p>
<p>అక్కడక్కడా పాత్రల సహజ ప్రవృత్తి, వాళ్ళకే తెలీని సైద్ధాంతిక మూలాల్లోంచీ కొన్ని భావప్రకటనల్ని పదాల్లో పలికించి పాఠకుడిలో రసస్పందన కలిగించడం (మిగతా కథలతో పాటూ) కాళావు ప్రత్యేకత. స్కూల్లో కొడుకుపేరు పరమేశ్వరుడు అని రాస్తున్నప్పుడు ‘ఉన్నాడో లేడో తెలియనివాడు ఇలా ఉపయోగపడ్డాడు’ అని దేవుడిపై నిరసన ప్రదర్సించినా, గౌడుతోపాటూ వచ్చే మగాళ్లను ‘పొలం మీద పడిమేసే దేవరదున్నలు. అంబోతుల జాతి’ అని ఈ సడించుకున్నా, ‘పుట్టంగానే లోకం కుళ్ళు భరించలేక కేర్ కేర్ న ఏడిశాడు’ అని పుట్టిన బిడ్డ ఏడుపుని అభివర్ణించినా అన్నీ కథకురాలికే చెల్లు. కాళావు వివిధ దశల్లో వివిధ మూడ్స్ లో గవాక్షాన్ని దాని వెలుగునీ చూసి అనుభవించిన తీరుని రచయిత్రి పదాలతో పెయింట్ చేసిన విధానం అద్భుతం.</p>
<p>జానపదకథలు చెప్పే తీరులాంటి నెరెటివ్ కారణంగా ఒక మిస్టరీ, ఒక ఉత్తేజం, ఒక అద్భుత గాథలా ఈ కథ గోచరించడంతోపాటు విషయంలోని ఘాఢత, తీవ్రత పాఠకుడికి సమస్య పట్ల తీవ్ర నిరసనతోపాటూ సహానుభూతిని కలిగిస్తుంది. స్లోగన్లు లేని సైలెంట్ విప్లవ గాథ, కాళావు కథ.</p>
<p><a href="http://www.scribd.com/doc/96722685/Kallavu-Mannam-Sindhu-Madhuri-Story-The-Sunday-India">http://www.scribd.com/doc/96722685/Kallavu-Mannam-Sindhu-Madhuri-Story-The-Sunday-India</a></p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=2103</wfw:commentRss>
		<slash:comments>15</slash:comments>
		</item>
		<item>
		<title>ఎండిన జీవితంలో ఓ నీటి చుక్క అలజడి!</title>
		<link>http://vaakili.com/patrika/?p=791</link>
		<comments>http://vaakili.com/patrika/?p=791#comments</comments>
		<pubDate>Fri, 25 Jan 2013 00:45:20 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[ఆలమూరు సౌమ్య]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=791</guid>
		<description><![CDATA[&#8220;మన సమాజం మహా క్రూరమయినది&#8230;.కరుణ రసాన్ని వాహికగా చేసుకుని నేను నా ఆగ్రహాన్ని ప్రకటిస్తాను. అది కథలో వాచ్యంగా ఉండకపోవడం దాని బలహీనత కాదు-బలమే!&#8221; అని నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో విమర్శకులకు జవాబు చెప్పగల మేటి కథకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు. కథా రచయితగా అమిత అనుభవజ్ఞుడు. ఈయన కథల్లోని కథా వస్తువు మన చుట్టు జరిగే సంఘటనలే. మనం నిత్యం వాడే వస్తువులే. కళ్ళజోడు, ఇంగువ, ముసురు, మబ్బు విడిచిన ఎండ ఇలాంటివన్నీ ఆయన కథా వస్తువులే. మధ్యతరగతి బతుకు బాధల్ని విన్నంత, కన్నంత అక్షరీకరించారు. సుబ్బరామయ్యగారి కథలు మధ్య తరగతి జీవితాలలో సమస్యలకు అద్దాలు. అలాంటి ఒక అద్దమే &#8220;నీళ్ళు&#8221;. కరువు ప్రాంతాలనుండి నీళ్ళు సమృద్ధిగా దొరికే ప్రాంతానికి ఉద్యోగం కోసం వలస వచ్చిన ఒక యువకుని కథే &#8220;నీళ్ళు&#8221;. ఈ కథ చదివితే, నీరు మన జీవితంలో ఇంత ప్రాముఖ్యతని సంతరించుకుందా అని ఆశ్చర్యపోకమానరు. &#8220;అక్కడ నీటి చుక్క కనిపించదు. అన్ని కాలల్లోనూ ఒకటే కరువు. బావులన్నీ పాతాళంలోకి వెళ్ళే సొరంగాల్లాగా ఉంటాయి. తొంగి చూస్తే అడుగున ఏమీ కనిపించదు. పెద్దతాడు బొక్కెనకుకట్టి లోపలికి వదులుతూ వుంటే ఎంతకూ నీళ్ళు తగలవు. చివరకు బొక్కెన రాళ్ళ మీద పడిన శబ్దం వినిపిస్తుంది&#8221;. అది నిరాశ, నీరసం తప్ప నీరు ప్రవహించని ప్రాంతం. ఒక బిందెడు నీటి కోసం చాలా దూరం పోయి, డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. పొరపాటున చేయి తగిలి, తెచ్చుకున్న నీటిబిందె జారిపడితే, అసహనం పెచ్చులు మీరి, కన్నబిడ్డనైనా చావబాదడానికి వెనుకాడని దుస్థితి. నీటిచుక్కలు లెక్కబెట్టుకుని వాడుకోవాల్సిన పరిస్థితి నుండి బోల్డంత నీటిని ఒకే చోట చూసే మహదవకాశం వస్తే ఆ యువకుడి ఆనందాన్ని మాటల్లో చెప్ప సాధ్యమా! అతనికి, ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని వింతల్లో ఇదీ ఒకటి. కృష్ణా నది విస్తారంగా ప్రవహించే ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది. ఒక ఎండిన జీవితంలో చల్లని నీరు ప్రవహిస్తే వచ్చే [...]]]></description>
			<content:encoded><![CDATA[<div><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sowmya_a.jpg"><img class="alignleft size-full wp-image-958" title="sowmya_a" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sowmya_a.jpg" alt="" width="150" height="118" /></a>&#8220;మన సమాజం మహా క్రూరమయినది&#8230;.కరుణ రసాన్ని వాహికగా చేసుకుని నేను నా ఆగ్రహాన్ని ప్రకటిస్తాను. అది కథలో వాచ్యంగా ఉండకపోవడం దాని బలహీనత కాదు-బలమే!&#8221; అని నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో విమర్శకులకు జవాబు చెప్పగల మేటి కథకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు. కథా రచయితగా అమిత అనుభవజ్ఞుడు. ఈయన కథల్లోని కథా వస్తువు మన చుట్టు జరిగే సంఘటనలే. మనం నిత్యం వాడే వస్తువులే. కళ్ళజోడు, ఇంగువ, ముసురు, మబ్బు విడిచిన ఎండ ఇలాంటివన్నీ ఆయన కథా వస్తువులే. మధ్యతరగతి బతుకు బాధల్ని విన్నంత, కన్నంత అక్షరీకరించారు. సుబ్బరామయ్యగారి కథలు మధ్య తరగతి జీవితాలలో సమస్యలకు అద్దాలు. అలాంటి ఒక అద్దమే &#8220;నీళ్ళు&#8221;. కరువు ప్రాంతాలనుండి నీళ్ళు సమృద్ధిగా దొరికే ప్రాంతానికి ఉద్యోగం కోసం వలస వచ్చిన ఒక యువకుని కథే &#8220;నీళ్ళు&#8221;. ఈ కథ చదివితే, నీరు మన జీవితంలో ఇంత ప్రాముఖ్యతని సంతరించుకుందా అని ఆశ్చర్యపోకమానరు.</div>
<div></div>
<div><em>&#8220;అక్కడ నీటి చుక్క కనిపించదు. అన్ని కాలల్లోనూ ఒకటే కరువు. బావులన్నీ పాతాళంలోకి వెళ్ళే సొరంగాల్లాగా ఉంటాయి. తొంగి చూస్తే అడుగున ఏమీ కనిపించదు. పెద్దతాడు బొక్కెనకుకట్టి లోపలికి వదులుతూ వుంటే ఎంతకూ నీళ్ళు తగలవు. చివరకు బొక్కెన రాళ్ళ మీద పడిన శబ్దం వినిపిస్తుంది&#8221;.</em></div>
<div></div>
<div>అది నిరాశ, నీరసం తప్ప నీరు ప్రవహించని ప్రాంతం. ఒక బిందెడు నీటి కోసం చాలా దూరం పోయి, డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. పొరపాటున చేయి తగిలి, తెచ్చుకున్న నీటిబిందె జారిపడితే, అసహనం పెచ్చులు మీరి, కన్నబిడ్డనైనా చావబాదడానికి వెనుకాడని దుస్థితి. నీటిచుక్కలు లెక్కబెట్టుకుని వాడుకోవాల్సిన పరిస్థితి నుండి బోల్డంత నీటిని ఒకే చోట చూసే మహదవకాశం వస్తే ఆ యువకుడి ఆనందాన్ని మాటల్లో చెప్ప సాధ్యమా! అతనికి, ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని వింతల్లో ఇదీ ఒకటి. కృష్ణా నది విస్తారంగా ప్రవహించే ప్రాంతంలో ఉద్యోగం వచ్చింది.</div>
<div></div>
<div>ఒక ఎండిన జీవితంలో చల్లని నీరు ప్రవహిస్తే వచ్చే ఆనందం ఆ యువకుడి సొంతం. అరగంటకొకసారి నీళ్ళు తాగుతాడు. ఒక గ్లాసు నీటిలో ప్రతీ చుక్కనూ ఆస్వాదిస్తూ తాగుతాడు. కళ్ళతో చూస్తూ, రుచిని అనుభవిస్తూ, గొంతులో నుండి నీరు జారుతుంటే ఆనందాన్ని మమైకం చేసుకుంటూ తాగుతాడు. ఆ అబ్బాయికి మాత్రమే నీటి &#8216;రుచి&#8217; తెలుసు. పొద్దున్న, సాయంత్రం గంటలతరబడి స్నానం చేస్తూ ఉంటాడు. అమ్మ పేరున ఒక బకెట్, చెల్లాయి పేరున ఒక బకెట్ నీళ్ళు పోసుకుంటూ ఉంటాడు. అతడికి ఏది చూసినా నీటిలాగే కనిపిస్తుంది. ఒక అందమైన యువతి కళ్ళని చూసి &#8220;<em>ఆమె కళ్ళు చెంపకు చారడేసి ఉండి తళతళ లాడుతున్న నీళ్ళను గుర్తు తెస్తాయి</em>&#8221; అంటాడు. నీరు లేక తన చెల్లాయి జబ్బుపడి కళావిహీనంగా తయారయ్యిందిగానీ రోజూ నీళ్ళు తాగితే ఈ అమ్మాయిలాగే తన చెల్లి కూడా అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తాడు. నీరు తాగడం వల్లే తను అందరికన్నా ఆరోగ్యంగా ఉన్నానని ఆనందపడుతుంటాడు. నాగరికతకూ, సౌభాగ్యానికి, ఆరోగ్యానికీ నీళ్ళే కారణమని పునఃనిర్వచిస్తాడు. తను రోజూ భోజనం చేసే హొటెల్ లో &#8220;<em>మంచినీళ్ళ పంతులుగారు</em>&#8221; అని బిరుదు కూడా సంపాయిస్తాడు.</div>
<div></div>
<div>నీళ్ళని బాగా ఖర్చు చెయ్యడం వచ్చిందిగానీ డబ్బులను నీళ్ళలా ఖర్చు చెయ్యడం రాలేదు. మరి, అమ్మ చెల్లాయిలకు పైసా పైసా మూటకట్టి పంపిస్తేనే కదా నీటిచుక్కలు లెక్కెటి కాస్త ఎక్కువ కొనుక్కోగలరు! తనకి డబ్బెందుకు! నీళ్ళున్నాయిగా! కృష్ణనిండా ఉన్నాయి. అవసరాలకు సరిపడినంత డబ్బు ఉంటే చాలు. పెద్ద చెల్లికి పెళ్ళి చేసేసి, చిన్న చెల్లిని, అమ్మని తన దగ్గరకు తెచ్చేసుకుని వాళ్ళ జీవితాల్లో పన్నీటి జల్లులు కురిపించాలన్నది అతని ఆశ. ఇది అర్థం చేసుకోలేని మిత్రులు అతనిని హేళన చేస్తారు. నీళ్ళను ఆశ్వాదించడం జబ్బు అంటారు. మానసిక వ్యాధి అనీ, వెర్రితనం అని నొక్కివక్కాణిస్తారు. &#8220;<em>అధర్మం పెరిగితే అంతే, నీటిచుక్క దొరకదు.</em>&#8221; అంటూ ధర్మపన్నాగాలు వల్లిస్తారు. అతను బాధపడతాడు. వెర్రి ఆవేశంతో ఊగిపోతాడు. &#8216;లేనితనం&#8217; తన తప్పెలా అవుతుంది అంటూ తన నిస్సహాయతను అవహేళన చేసిన వారిపై విరుచుకుపడతాడు. &#8220;<em>అవును నిజమే &#8211; మా వూళ్ళూ, మా ప్రాంతమూ వట్టి దౌర్భాగ్యపువే. నీళ్ళ కరువు ఉంటే దౌర్భాగ్యం కాక మరేమిటి? అయినా మధ్య నేనేందుకు వెర్రివాణ్ణవుతాను</em>!&#8221; అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.</div>
<div></div>
<div>తనే నీరు, నీరే తన్ను అన్నట్టు భావించే ఆ యువకుడిని, నీటి విలువ ఏ మాత్రమూ గుర్తించే అవకాశం లేని/రాని అదృష్టవంతులు ఎగతాళి చేయడంతో అవమానం తో కృంగిపోయి కృష్ణ లో దిగి, ఆలోచనల్లో మునకవేస్తూ, అప్రయత్నంగా ఆ నీటికే అంకితమైపోతాడు.</div>
<div></div>
<div>నీటిని అమితంగా ప్రేమించిన అతన్ని, నదిలోని చల్లని నీరు మనసారా దగ్గరకు తీసుకుంది, తనలో ఐక్యం చేసుకుంది. మరెప్పుడూ దూరమవలేనంతగా పొదువుకుంది.</div>
<div></div>
<div>&#8220;<em>నది తన దోవన తాను భీకరంగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి పోతున్నది. ఎక్కడో కొన్ని వందలమైళ్ళ దూరంలో మారుమూల పల్లెటూళ్ళో పూరియింట్లో నిద్రలో వున్న తల్లిప్రేగు కదిలింది</em>&#8220;.</div>
<div></div>
<div><strong>అంతే</strong> !</div>
<div></div>
<div>
<div>
<div><span style="color: #222222; font-family: arial, sans-serif;">ఈ కథ చదువుతున్నంతసేపు మన గుండె తడి అవ్వకమానదు. కళ్ళు చెమర్చక మానవు. చదివాక ఒక గుటక నీరు తాగాలనిపించక మానదు. మొదటిసారి ఈ కథ చదివినప్పుడు చలించిపోయాను. నన్ను వెంటాడి తరిమిన కథల్లో ఇదొకటి. నీళ్ళకి ఇంత ప్రాముఖ్యత ఉందా అని ఆశ్చర్యపోయాను. నీరు ప్రాణికి అత్యవసరమైనదే అయినా రోజువారీ జీవితంలో </span>మనం గుర్తించని అతి సాధారణమైన విషయాల్లో ఇదీ ఒకటి. ఎవరైనా ఊరికే నీరు పారబోసినప్పుడల్లా నాకీ కథ గుర్తొస్తూ ఉంటుంది. <span style="color: #222222; font-family: arial, sans-serif;">ఎవరైనా దాహంతో ఆత్రంగా నీళ్ళు తాగితే ఈ కథ గుర్తొస్తుంది. అంతెందుకు, నాకు దాహమేసినప్పుడలా ఈ కథ గుర్తొస్తుంది. అప్పటివరకూ &#8220;ఆమె పల్చటి మెడ బంగారువన్నెలో మెరిసిపోతోంది. తను నీరు తాగుతుంటే గొంతులోనుండి నీరు పారదర్శకంగా కనిపిస్తోంది&#8221; లాంటి వాక్యాలే చదివిన నాకు &#8220;&#8230;గ్లాసును చేతిలోకి తీసుకుని దాన్ని నీళ్ళతో నింపి చెయ్యి పైకెత్తి ఒక్క నిముషంసేపు దానివంక కన్నార్పకుండా చూశాడు. గ్లాసులో నీళ్ళు తెల్లగా మిలమిల లాడుతున్నాయి. అతడు నెమ్మదిగా ఆ గ్లాసు నోటిదగ్గర వుంచుకుని గుక్క తర్వాత గుక్కగా నింపాదిగా తాగాడు. తాగుతున్నప్పుడు తల్లి<wbr>నీ, చెల్లెళ్ళనీ తలుచుకుని మరీ తాగుతాడు&#8221;. అన్న వాక్యాలు చూడగానే ఒక్కసారిగా ఎవరో గట్టిగా పట్టి కుదిపినట్టయ్యిం<wbr>ది. </wbr></wbr></span>కరువు ప్రాంతం నుండి వచ్చిన వారి ఆవేదన, బాధలను ప్రతీ వాక్యంలోనూ చూపించగలిగారు సుబ్బరామయ్యగారు.</div>
<div></div>
<div><span style="color: #222222; font-family: arial, sans-serif;">సహజంగా, సమృద్ధిగా లభించాల్సినదేదైనా కొరవడితే అది ఎంత బాధో కదా! శారీరక వికలాంగం ఎంత కష్టమో ప్రాకృతిక వికలాంగం కూడా అంతే కష్టం! అది గుర్తించకపోవడం, అవహేళన చెయ్యడమే అవకరం, మానసిక వైకల్యం. కథలో అతడి జీవితంలో నీరు మాత్రమే ఇంకిపోయింది. కానీ అతన్ని ఎగతాళి చేసిన వారి జీవితాల్లో మానవత్వం, సహృదయం, కరుణ, జాలి అన్నీ ఇంకిపోయాయి. ఇది అంతకన్నా పెద్ద దౌర్భాగ్యం కదూ! బహుసా, వాళ్ళని చూసి కూడా జాలి పడాలేమో! మానవ సహ</span>జమైన వనరులు వారికి కరువైనందుకు.</div>
<div></div>
<div><span style="color: #222222; font-family: arial, sans-serif;">ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించక తప్పదు. ప్రకృతి సహజమైన కరువు మన చేతిల్లో లేనిది అనుకుందాం. మనుషులు పెంచి పోషిస్తున్న కరువు మాటేమిటి? ఒక ఊరిలో నీరు కొంతమందికే అందుబాటులో ఉండడం, కళ్ళెదుట కనబడుతున్న నీటిపై ఆక్షలు విధించడం లాంటివి. నా చిన్నతనంలో మా వీధిలో ఒకే ఒక్క మున్సిపల్ కొళాయి ఉండేది. వీధి చివర ఉన్న గేటింటి మామ్మగారింట్లో ఒకటి ఉండేది. ఎండాకాలంలో బావులు ఎండిపోయినప్పుడు మున్సిపల్ కొళాయి నీళ్ళే అన్నిటికీ ఆధారం. అటువంటి పరిస్థితుల్లో గేటింటి మామ్మగారింట్లో నీళ్ళకి వాళ్ళ కులస్థులు మాత్రమే అర్హులు. మిగతావారికి నిషిద్ధం. </span>ఒకవేళ మామ్మగారింటినుండి వీధి కొళాయిలో నీళ్ళు పట్టుకోవడానికి ఎవరైనా వస్తే వారు పూర్తిచేసి వెళ్ళిపోయేవరకూ ఇతరులు దరిదాపులకి కూడా పోరాదు. ఒకవేళ పొరపాటున ఎవరి నీడైనా పడిందా బిందెడు నీళ్ళు కిందపారబోయడానికి కూడా వెనుకాడేవారు కాదు.</div>
<div></div>
<div><span style="color: #222222; font-family: arial, sans-serif;">ఇవన్నీ ఎప్పుడో పాతికేళ్ళ కిందటి మాటల్లే అని కొట్టిపారేయొచ్చు. కాదేమో! తరచి చూస్తే ఇప్పటికీ ఇలాంటివీ ఉన్నాయి అనడంలో నాకేమాత్రం సందేహం లేదు. కాకపోతే కాస్త రంగు, రూపు మార్చుకున్నాయి. బహుసా, </span>మతాలు, కులాలు కూడా మార్చుకున్నా<span style="color: #222222; font-family: arial, sans-serif;">యేమో!</span></div>
<div></div>
</div>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=791</wfw:commentRss>
		<slash:comments>42</slash:comments>
		</item>
	</channel>
</rss>
