<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; చదువు</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=29&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>ఊబిలో దున్న!!</title>
		<link>http://vaakili.com/patrika/?p=4708</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4708#comments</comments>
		<pubDate>Tue, 31 Dec 2013 16:19:51 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4708</guid>
		<description><![CDATA[<p>ఒక దున్న పోతు!</p> <p>గాలికి వదిలేస్తే పాపం… గడ్డి మేయడానికొచ్చి వాగులోని ఊబిలో తెలీక కాలు వేసి సగానికి పైగా దిగబడి పోయింది. ఎప్పుడు దిగబడిందో ఏమిటో, ఎవరూ పట్టించుకోరు దాన్ని!</p> <p>గొబ్బి మండలు నరుక్కుపోడానికి ఆ దారిన వచ్చిన ఒక రైతు ఆ దృశ్యం చూస్తాడు. దాన్ని బయటికి తీయడానికి నిశ్చయించుకుంటాడు. ఎవరినైనా సాయానికి పిలుద్దామంటే ఆ సమయానికి ఎవరూ అక్కడ కనిపించరు. బయటికి తీయగలడో లేదో తెలీదు. కానీ ప్రయత్నం మాత్రం తప్పని సరి అని భావిస్తాడు. ఊబిలో దిగబడి, బయటికి వచ్చే ప్రయత్నం ఏదీ చేయకుండా (చేసిందో లేదో తెలీదు) తన బరువు, బాధ్యత మొత్తం అతని మీద వేసి నిశ్చలంగా, రికామీగా ఉండిపోయే దున్నపోతు, మరో వైపు దాన్ని తిడుతూనే, దాన్ని బయటికి లాగడంలో గల బాధలన్నీ అనుభవిస్తూనే ఆ పని ని చీదరించుకుంటూనే, దాన్ని బయటికి లాగేంత వరకూ విశ్రమించని మనిషి. చివరికి రాఘవులు దున్న పోతును ఊబిలోంచి బయటికి లాగడంతో నవల పూర్తవుతుంది.</p> <p>వినుకొండ నాగరాజు గారి సంచలన నవల ఊబిలో దున్న!!</p> <p>ఇంతే కథ! ఇంకేం లేదు.</p> <p>అయితే ఇది ఇంత సులభంగా ముగియదు . అనుక్షణం పాఠకుడిని ఉత్కంఠకు గురి చేస్తూ ఏమవుతుందో అన్న ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది.</p> <p>కానీ ఈ కథనే రచయిత రాఘవులు పాత్ర ద్వారా ఈ కథ చెప్తూ ఉంటారు.</p> <p>రాఘవులు దున్నపోతుని చూసాక ఏమి చేయాలో తేల్చుకోలేని సందిగ్ధం లో పడతాడు.</p> <p>ఊబిలో దిగబడి పోయున్న్న దున్న పోతుని చూస్తూ చూస్తూ వదిలేయలేడు.. అలాగని ఒక్కడే దాన్ని బయటికి తీయడమా.. అసాధ్యం!</p> <p>పోనీ తన దారిన తాను పోదామా? ఒక ప్రయత్నమంటూ చేయకుండా పోలేడు.ఇన్ని సంఘర్షణల మధ్య రాఘవులు దాన్ని బయటకు తీయాలని నిర్ణయించుకుని పనిలో దిగుతాడు.</p> <p>ఆ పని లోకి దిగిన రాఘవులుకు దిగాక కానీ అదెంత కష్టమైన పనో తెలిసి రాదు. ఈ ప్రక్రియలో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sujatha_b.jpg"><img class="alignleft  wp-image-3526" title="sujatha_b" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sujatha_b.jpg" alt="" width="154" height="143" /></a>ఒక దున్న పోతు!</p>
<p>గాలికి వదిలేస్తే పాపం… గడ్డి మేయడానికొచ్చి వాగులోని ఊబిలో తెలీక కాలు వేసి సగానికి పైగా దిగబడి పోయింది. ఎప్పుడు దిగబడిందో ఏమిటో, ఎవరూ పట్టించుకోరు దాన్ని!</p>
<p>గొబ్బి మండలు నరుక్కుపోడానికి ఆ దారిన వచ్చిన ఒక రైతు ఆ దృశ్యం చూస్తాడు. దాన్ని బయటికి తీయడానికి నిశ్చయించుకుంటాడు. ఎవరినైనా సాయానికి పిలుద్దామంటే ఆ సమయానికి ఎవరూ అక్కడ కనిపించరు. బయటికి తీయగలడో లేదో తెలీదు. కానీ ప్రయత్నం మాత్రం తప్పని సరి అని భావిస్తాడు. ఊబిలో దిగబడి, బయటికి వచ్చే ప్రయత్నం ఏదీ చేయకుండా (చేసిందో లేదో తెలీదు) తన బరువు, బాధ్యత మొత్తం అతని మీద వేసి నిశ్చలంగా, రికామీగా ఉండిపోయే దున్నపోతు, మరో వైపు దాన్ని తిడుతూనే, దాన్ని బయటికి లాగడంలో గల బాధలన్నీ అనుభవిస్తూనే ఆ పని ని చీదరించుకుంటూనే, దాన్ని బయటికి లాగేంత వరకూ విశ్రమించని మనిషి. చివరికి రాఘవులు దున్న పోతును ఊబిలోంచి బయటికి లాగడంతో నవల పూర్తవుతుంది.</p>
<p>వినుకొండ నాగరాజు గారి సంచలన నవల ఊబిలో దున్న!!</p>
<p>ఇంతే కథ! ఇంకేం లేదు.</p>
<p>అయితే ఇది ఇంత సులభంగా ముగియదు . అనుక్షణం పాఠకుడిని ఉత్కంఠకు గురి చేస్తూ ఏమవుతుందో అన్న ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది.</p>
<p>కానీ ఈ కథనే రచయిత రాఘవులు పాత్ర ద్వారా ఈ కథ చెప్తూ ఉంటారు.</p>
<p>రాఘవులు దున్నపోతుని చూసాక ఏమి చేయాలో తేల్చుకోలేని సందిగ్ధం లో పడతాడు.</p>
<p>ఊబిలో దిగబడి పోయున్న్న దున్న పోతుని చూస్తూ చూస్తూ వదిలేయలేడు.. అలాగని ఒక్కడే దాన్ని బయటికి తీయడమా.. అసాధ్యం!</p>
<p>పోనీ తన దారిన తాను పోదామా? ఒక ప్రయత్నమంటూ చేయకుండా పోలేడు.ఇన్ని సంఘర్షణల మధ్య రాఘవులు దాన్ని బయటకు తీయాలని నిర్ణయించుకుని పనిలో దిగుతాడు.</p>
<p>ఆ పని లోకి దిగిన రాఘవులుకు దిగాక కానీ అదెంత కష్టమైన పనో తెలిసి రాదు. ఈ ప్రక్రియలో భాగంగా దున్నని లాగడానికి తన ప్రయత్నం తాను చేస్తూనే అతడు తన జీవితాన్ని, తాను ఈ స్థితికి చేరడానికి దారితీసిన పరిస్థితులను, జీవితంతో తన పోరాటాన్ని, విజయాలను, అపజయాలను నెమరేసుకుంటాడు.</p>
<p>దున్నని లాగడానికి అతను ఒక వ్యూహాన్ని రచిస్తాడు. చేతిలో ఉన్న కత్తితో దగ్గర్లోని పొదల్లోని గొలగ మండల్ని నరికి</p>
<p><img class="alignright size-medium wp-image-4710" title="oobilodunna2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/oobilodunna2-166x300.jpg" alt="" width="166" height="300" /></p>
<p>తెచ్చి ఊబిలో వేసి లోపలికి తొక్కి అప్పుడు బురద లో పట్టు దొరికాక దున్నని వాటి మీదుగా బయటికి తీసుకు రావాలని. ఈ వ్యూహ రచన అమలు జరుగుతూ ఉండగానే అతడి ఆలోచనా స్రవంతి సమాంతరంగా కొనసాగుతూ ఉంటుంది.</p>
<p>ఎన్నెన్నో ఆలోచనలు, వాటిలోనే ఎన్నో వైరుధ్యాలు<br />
మరో పక్క కారుతున్న చెమట&#8230; అలసి పోతున్న శరీరం, దున్నని ప్రాణాలతో కాపాడాలనే ధృడ నిశ్చయం, కాపాడగలనా లేదా అని సడలుతున్న ధైర్యం .. వీటన్నిటి మధ్యా రాఘవులు తో పాఠకుడు ప్రయాణిస్తాడు</p>
<p>డిగ్రీ చేతికొచ్చాక రాఘవులు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎక్కడా దొరకదు. ఎంత చిన్న ఉద్యోగమైనా సరే చేయడానికి సిద్ధ పడినా ప్రయోజనం లేక పోతుంది. తండ్రి కి పొలం ఉంటుంది . అప్పుడే కసి తో వ్యవసాయంలోకి దిగుతాడు. &#8220;ఒకడు నాకు ఉద్యోగం ఇచ్చేదేమిటి ? నేనే పది మందికి పని చూపిస్తాను&#8221; అనే ఆత్మ విశ్వాసంతో వ్యవసాయం మొదలు పెట్టి సఫలం అవుతాడు.</p>
<p>కొత్త కొత్త పద్ధతులు , సహకార వ్యసాయం అమల్లోకి తెస్తాడు. తన దగ్గర పని చేసే వాళ్ళకు రాబడిలో అయిదింట మూడొంతులు ప్రతిఫలంగా ఇస్తాడు. సమితి అధ్యక్షుడు అవుతాడు. చైతన్య వంతమైన కార్య క్రమాల్లో ఎన్నో రకాలుగా పాలు పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రాణానికి కూడా హాని ఏర్పడుతుంది. ఒక పక్క దానికి భయపడుతూనే మరో పక్క తన పని తాను చేసుకు పోతుంటాడు.</p>
<p>ఇవన్నీ ఆలోచిస్తూనే అతడు దున్నను లాగే కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. ఊబిలోని బురదను ఎత్తి పొస్తున్న కొద్దీ ఇంకా ఇంకా బురద చేరుతూ ఉంటుంది.పాములు కనిపిస్తుంటాయి. దున్న పోతు సహకారం ఏమీ ఉండదు. దానికి ఆహారం నీరు కావాలేమో అని అవి తెచ్చి ఇస్తూనే మరో పక్క శ్రమ ఎక్కువై పోయి, దున్నని బయటికి లాగలేనేమో అన్న భయంతో దున్న ని , బూతులు తిడతాడు , బాగా కొడతాడు.ఎంతగా అంటే రక్తం వచ్చేలాగా!</p>
<p>ఈ క్రమంలో రాఘవులు కూడా ఊబిలో దిగబడతాడు కూడా! అయితే ఎలాగో సంబాళించుకుని బయట పడతాడు. ఎంతో శ్రమకు గురవుతాడు.</p>
<p>దున్న కాలు రాఘవులు కాలి మీద పడి దాని బరువుకు అతని కాలు నలిగి పోతుంది.తీవ్రమైన బాధలో కోపంతో దున్నని చావగొడతాడు రాఘవులు.</p>
<p>శ్రమ ఫలించి దున్నని ఊబిలో నుంచి బయటికి తీయడంతో కథ ముగుస్తుంది</p>
<p>ప్రచురణ కర్తలు దీన్ని గుఢార్థ స్పురణల సాంకేతిక నవలగా పేర్కొన్నారు. వారు అలా చెప్పక పోయినా, ఈ నవల ఒక గూడార్థాన్ని స్ఫురింపజేస్తోందని నవల చదవడం మొదలు పెట్టిన కాసేపటికే రాఘవుల ఆలోచనాధోరణి వల్ల అర్థమై పోతుంది. ఊబి అనేది ఒక కుళ్ళు వ్యవస్థ. అందులో ఇరుక్కు పోయింది మనిషి. దున్న పోతుని మనిషిగా భావించ వచ్చు. లేదా కుళ్ళు, అవినీతి వంటి అవలక్షణాల ఊబిలో మునిగి పోయిన వ్యవస్థగా నైనా భావించ వచ్చు. దాన్ని సంస్కరించడానికి, ఆ కుళ్ళు నుంచి బయటికి లాగడానికి చదువుకున్న, వ్యక్తిత్వం కల్గిన మనుషులు నడుం కట్టాలి&#8230; ఇదే ఇందులోని గూడార్థం.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/Awardrejection.jpg"><img class="aligncenter size-medium wp-image-4711" title="Awardrejection" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/12/Awardrejection-300x205.jpg" alt="" width="300" height="205" /></a></p>
<p>నవల విశేషాలు:</p>
<p>రచయిత ఈ నవలకు మొదట పెట్టిన పేరు &#8220;దున్నపోతు&#8221; ! అయితే ప్రచురణ కర్తలు దాన్ని &#8220;జై కిసాన్&#8221; గా మార్చి, రచయిత అభ్యంతర పెట్టడం తో &#8220;ఊబిలో దున్న&#8221; అనే పేరు ఖాయం చేశారు. అంతకు ముందే ఎమెస్కో వేసిన నవల &#8220;జై జవాన్&#8221; బాగా అమ్ముడు పోయి ఉండటం వల్లనూ, కథ మొత్తం రైతు ఒక్కడే నడపటం వల్లనూ పబ్లిషర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే నాగరాజు గారు అందుకు ఒప్పుకోలేదు. ఆ &#8220;ఆడ రచయిత్రుల&#8221; రచనల స్ఫూర్తి తో తన నవలకు పేరు పెట్టడానికి ఆయన సుతారమూ అంగీకరించలేదు.</p>
<p>ఈ నవలకు 1974 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించగా దాన్ని రచయిత వినుకొండ నాగరాజు గారు తిరస్కరించారు.పైగా ఆ పైన &#8220;నేనెందుకు అవార్డును తిరస్కరిస్తున్నాను&#8221; అనే కవర్ పేజీతో తాను నడుపుతున్న &#8220;కమెండో&#8221; పత్రికను ప్రత్యేక సంచిక గా విడుదల చేసారు. అకాడమీ ప్రకటిత ఆశయాలకు అనుగుణం గా పని చేయడం లేదు కాబట్టి అవార్డును తిరస్కరిస్తున్నానని ఆయన ప్రకటించినా, కమెండో లోని వ్యాసాల విశేషాలు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. అవార్డులు తిరస్కరించని రచయితల పట్ల, అప్పటికే అవార్డులు స్వీకరించిన రచయితలు, కవుల పట్ల, వారి రచనల పట్ల చాలా చులకన భావాన్ని రచయిత వాటిలో వ్యక్తం చేశారు.</p>
<p>అంతే కాక ఈ నవల చదివే పాఠకులు ఒక మానసిక స్థాయిలో ఎదుగుదల కలిగిన వాళ్ళు అయి ఉండాలని కూడా ప్రకటించడం విస్మయాన్ని కలగ జేస్తుంది. ఇది పాఠకుల స్థాయిని కించ పరచడమే అవదా?? నవల రాసాక దాన్ని ఏ స్థాయి పాఠకులు చదవాలో రచయితే చెప్పడం సమంజసం ఎలా అవుతుంది ?</p>
<p>రచయిత సూచించినట్లు ఇది ఒక గూడార్థాన్ని సూచించే నవల అయినా, ఊబిలోంచి దున్నని లాగడం తో పోల్చినా , వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టడం అంత తేలికైన పనేమీ కాదు.</p>
<p>ఈ నవల ఒక తిరుగుబాటు నవలగా రచయిత అభివర్ణిస్తూ, అలాటి తిరుగుబాటు సాహిత్యానికి కూడా తాము అవార్డు ప్రకటిస్తున్నామని ప్రచారం చేసుకోబోయిన సాహిత్య అకాడమీ వాళ్ళని నడ్డి విరగదన్నినట్లు చెప్పుకున్నారు.<br />
అవార్డు ని తిరస్కరించడం వరకూ బాగానే ఉంది కానీ దానికి రచయిత చెప్పిన భాష్యం మరీ కొండంత గా కనిపిస్తుంది.<br />
ఇవన్నీ అలా ఉంచితే &#8230;</p>
<p>నవల్లో రాఘవులు &#8220;లెఫ్టిస్టు&#8221; గా కనిపిస్తాడు. (ఆ కారణం చేతనే అతనికి ఉజ్జోగం కూడా దొరకదు) !కనిపించిన మరుక్షణమే అందుకు విరుద్ధంగాప్రవర్తిస్తుంటాడు . కాస్త శాస్త్రీయ దృక్పథం, అభ్యుదయపు ఆలోచనలు ఉన్నాయే అని మనం సంబర పడే లోపు అతడి ఆలోచనలు పక్క దారి పడతాయి . ఆధునిక, అభ్యుదయ భావాలు కలిగిన వాడినని నవలంతా చెప్పుకుంటూనే మరో పక్క, దున్న దాని &#8220;కర్మ కొద్దీ&#8221; ఊబిలో దిగబడిందంటాడు. దాన్నలా వదిలేసి వెళ్ళి పోతే తాను &#8220;గోహత్య&#8221; చేసినట్లు అవుతుందని భావిస్తాడు.</p>
<p>&#8220;ఆడది మెత్త దనానికి ప్రతి రూపమవ్వాలి. ప్రకృతి లో ఇచ్చేది మగాడు, తీసుకునేది ఆడదీ! మగాడు చురుకు దనానికి, ఆడది స్థబ్దతకూ ప్రాతినిధ్యం వహిస్తున్నపుడు ఆ ప్రవృత్తులు ప్రకృతిని అనుసరించి అలాగే సాగాలి&#8221; అని తన భార్య స్థబ్దత ను అనుసరిస్తూ తను కల్పించే రక్షణ కోసం పాకులాడుతున్నందుకు సంతోషిస్తాడు. గర్భంతో ఉన్న భార్యను తల్చుకుని &#8220;చివరికి ఆడది ఒట్టి ఆపరేటస్&#8221; అని ఇట్టే తేల్చేస్తాడు.</p>
<p>రచయిత పుస్తకాన్ని అంకితం ఇచ్చిందెవరికో చూడండి!</p>
<p>&#8220;వయసు మళ్ళిన అజ్ఞానానికి, మొక్కే నిర్భాగ్యులకూ, అల్పత్వానికి, అసమర్థతకు, ఆడతనానికి &#8230; పిరికి పందలకూ పరాన్న జీవులకు&#8230;.సానుభూతి తో అంకితం ..!&#8221;</p>
<p>అన్ని అవలక్షణాల్లో ఒకటిగా ఆడతనాన్ని కూడా ఒకటిగా రచయిత గుర్తించారు. ఇది మింగుడు పడని విషయం !</p>
<p>రాఘవులు ఒక పక్క దేవాలయాల మహాత్యాన్ని రాసే రచయితలని అసహ్యించుకుంటూనే, ఊబిలోకి కాళ్ళు దిగబడి పోతుంటే &#8220;భగవంతుడా, రక్షించ&#8221;మని వేడుకుంటాడు.</p>
<p>మళ్ళీ మరో వైపు తన అభ్యుదయం కబుర్లు ఆలోచనలు సాగుతూనే ఉంటాయి.</p>
<p>ఇలా రాఘవులు పాత్రలో అంతులేని వైరుధ్యాలు పేజీ పేజీకి గోచరమవుతుంటాయి. అందరూ సమానంగా ఎదగాలని కోరుతూనే, తన కింద అనేక మంది పని చేయాలనీ తాను వాళ్లకు నాయకుడిని కావాలనీ అంటాడు.</p>
<p>దున్నని కాపాడాక దాన్ని గ్రామం కోసం ఉపయోగించాలని, మంచి పనులు చేయాలని ఒక పక్క ఆలోచిస్తూనే మరో పక్క &#8220;నీ ముందు తరాలన్నీ నాకు కృతజ్ఞులై ఉండాలి&#8221; అని దర్పం ప్రదర్శిస్తాడు దున్నతో!</p>
<p>కొన్ని సార్లు రాఘవులు లో ఈ వైరుధ్య ధోరణి ఎంత ప్రబలంగా కనిపిస్తుందంటే మానవ సహజ బలహీనతల్ని ఆవిష్కరించడానికి రచయితే అతని పాత్రని అలా తీర్చి దిద్దారు ..అని అనిఅని సర్ది చెప్పుకోవాలేమో అనిపించేంత. కానీ రాఘవులు సాధించిన ప్రగతీ విప్లవ భావాలు అతని ఆలోచనలకు భిన్నంగా ఆవలి వైపు కనిపిస్తూ ఉంటాయి.</p>
<p>ఈ నవలా రచన చైతన్య స్రవంతి శైలిలో సాగుతుంది కాబట్టి ఆపకుండా చదివిస్తుంది. ఆసక్తి కరమైన శైలి. పదాలు, సహజ సిద్ధమైన వర్ణనలు!</p>
<p>రాఘవులు ఆలోచనలు ఎలా సాగినా అతడు ఊబిలోంచి దున్నను బయటికి తీయడానికి ఎంత శ్రమ పడ్డాడో అదంతా ఆ ఊబి ఒడ్డున కూచుని చూసిన ఫీలింగ్ పాఠకుడికి కల్గుతుంది. రాఘవులు చివరికి పొందిన అలసట పాఠకుడు కూడా పొందుతాడు. ఆ బురద, ఆ చల్లగాలి, ఆ రొచ్చు వాసన, ఆ దున్నపోతుని జలగ పీడించిన నొప్పి, జల జలా స్రవించిన దాని వెచ్చని రక్తం&#8230;ఆ దున్న నిస్సహాయత, రాఘవులు చావబాదుతున్నా కనీసం కొమ్ము విసరలేని దాని దైన్య స్థితి .. ఇవన్నీ పాఠకుడు కూడా అనుభూతి చెందుతాడు .</p>
<p>చివరిలో దున్న ఊబిలోంచి బయటకు రాబోయే సమయంలో నిస్సత్తువ తో చతికిల బడితే పిచ్చి కోపంతో దాన్ని రక్తం ఓడేలా చావబాది , మారడానికి ప్రయత్నించని మనుషులని ఈ రకంగా మార్పుకు సిద్ధం చేయవచ్చని స్ఫురింప జేస్తాడు రాఘవులు.<br />
ఎంతో ఉత్కంఠ తో నవల మొదలు పెట్టాక నవల సాగిన విధానం, కళ్ళకు కట్టినట్లు సాగే గమనం నవలను పూర్తీ చేయిస్తాయి. అయితే రాఘవులు వైరుధ్య ధోరణి పాఠకుడిని నిరుత్సాహానికి కు గురి చేస్తుంది.</p>
<p>మొత్తం మీద నవల పూర్తయ్యే సరికి &#8230; దున్నను ఊబిలోంచి లాగిన రాఘవులు కంటే ఎద్దు సాయంతో ధైర్యంగా ముందుకు సాగి పగ దీర్చుకున్న మునెమ్మ గొప్ప హీరోయిన్ అనిపించింది&#8230;.. నాకు! హెమింగ్వే &#8220;Old man and the sea&#8221; స్ఫూర్తి తో వచ్చిన నవలగా కేశవ రెడ్డి గారి &#8216;అతడు అడవిని జయించాడు&#8221; ను చాలా మంది గుర్తిస్తారు. అయితే ఈ నవల దానికంటే చాలా రోజుల ముందే హెమింగ్వే నవల స్ఫూర్తి తో రాసినట్లు స్పష్టమవుతుంది.</p>
<p>కొద్ది రోజుల క్రితమే కినిగే ఈ పుస్తకాన్ని ఈ బుక్ గా అందుబాటులోకి తెచ్చింది. తప్పక చదివి చూడండి.</p>
<p>కినిగే లింక్: http://kinige.com/kbook.php?id=2408&amp;name=Oobilo+Dunna</p>
<p style="text-align: center;">*** * ***</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4708</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>యాభయ్యేళ్ళ సూపర్ హిట్ నవల &#8220;చక్రభ్రమణం&#8221;</title>
		<link>http://vaakili.com/patrika/?p=4166</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4166#comments</comments>
		<pubDate>Thu, 31 Oct 2013 20:54:39 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4166</guid>
		<description><![CDATA[<p>కోతి కొమ్మచ్చి మొదటి భాగం లో ముళ్లపూడి ఇలా అన్నారోచోట.<br /> &#8220;ప్రజలకి కథలు చదివే రుచి చూపించి,అలవాటు చేసి,దాన్ని ఒక వ్యసనంగా పెంచి- పుస్తకాలు కొనుక్కుని, తిట్లు తిని, దిండు కింద దాచుకుని చదివి ఆనందపడేలా చేసిన కర్మ వీరులు, కార్యశూరులు నలుగురైదుగురు ఉన్నారు.</p> <p>కొ కొ కొ రా కో-<br /> కొవ్వలి లక్ష్మీ నరసింహారావు<br /> కొడవటిగంటి కుటుంబరావు<br /> కొమ్మూరి సాంబశివరావు<br /> కోడూరి కౌసల్యాదేవి<br /> రాధాకృష్ణ-</p> <p>కోడూరి (ఆరికెపూడి) కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవల సూపర్ సెన్సేషన్ &#8230; ఆడా మగా కూడా ఎగబడి ఆంధ్రప్రభ వారపత్రిక కొనుక్కుని, అద్దెకు తెచ్చుకుని, ఎరువు తెచ్చుకుని చదివి మురిసిపోయారు.</p> <p>‘ఈ కొ కొ రా కో ల తర్వాత మెగా రైటర్సు వచ్చారు. యద్దనపూడి సులోచనారాణి (సెక్రటరీ), ముప్పాళ్ళ రంగనాయకమ్మ (స్వీట్ హోం), యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం), మల్లాది వెంకట కృష్ణమూర్తి (తేనెటీగ) వంటివారు- ఆరణాలు అర్థరూపాయి రేట్లతో ఏడాదికి ఒక వెయ్యి పుస్తకాలు చెల్లడం కష్టమైన రోజుల నుంచి ఒక వారంలో పదివేల పుస్తకాలు అమ్మగల ఊపును తెచ్చారు’.</p> <p>అంటే రమణ భాషలోనే చెప్పాలంటే&#8230;</p> <p>వీళ్ళని ఇలా అనొచ్చు-<br /> య ము య మ </p> <p>1960, 70 ల్లో రచయిత్రులు తెలుగు పాఠకులని ఆడా మగా తేడా లేకుండా తమ గుప్పిట్లో కట్టి పడేసి సీరియల్స్ రాసిన కాలం! అదొక ప్రవాహం. ఐతే ఆ ప్రవాహం రెండు పాయలుగా , దేని అస్తిత్వం అది కోల్పోకుండా విడి విడిగానే ప్రవహిస్తూ సమానంగా జనాదరణ పొందాయి.</p> <p>వీటిలో ఒకటి పాఠకుల్ని, ముఖ్యంగా యువ మహిళా పాఠకులని కలల ప్రపంచంలో తేలియాడిస్తూ, ఊహా లోకాల్లో విహరింపజేస్తూ &#8230;వాస్తవానికి కుసింత దూరంగా ఉన్నా, పాఠకుల్ని ఊహల పల్లకీ ఎక్కించి ఊరేగించే రచనా ప్రవాహం. పడవలంతేసి కార్లూ, డిస్నీ మూవీస్ వాడి లోగో లాంటి ఆకాశ హర్మ్యాలూ,సొంత తోటలూ, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sujatha_b.jpg"><img class="wp-image-3526 alignright" title="sujatha_b" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sujatha_b.jpg" alt="" width="154" height="143" /></a>కోతి కొమ్మచ్చి మొదటి భాగం లో ముళ్లపూడి ఇలా అన్నారోచోట.<br />
&#8220;ప్రజలకి కథలు చదివే రుచి చూపించి,అలవాటు చేసి,దాన్ని ఒక వ్యసనంగా పెంచి- పుస్తకాలు కొనుక్కుని, తిట్లు తిని, దిండు కింద దాచుకుని చదివి ఆనందపడేలా చేసిన కర్మ వీరులు, కార్యశూరులు నలుగురైదుగురు ఉన్నారు.</p>
<p>కొ కొ కొ రా కో-<br />
కొవ్వలి లక్ష్మీ నరసింహారావు<br />
కొడవటిగంటి కుటుంబరావు<br />
కొమ్మూరి సాంబశివరావు<br />
కోడూరి కౌసల్యాదేవి<br />
రాధాకృష్ణ-</p>
<p>కోడూరి (ఆరికెపూడి) కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవల సూపర్ సెన్సేషన్ &#8230; ఆడా మగా కూడా ఎగబడి ఆంధ్రప్రభ వారపత్రిక కొనుక్కుని, అద్దెకు తెచ్చుకుని, ఎరువు తెచ్చుకుని చదివి మురిసిపోయారు.</p>
<p>‘ఈ కొ కొ రా కో ల తర్వాత మెగా రైటర్సు వచ్చారు. యద్దనపూడి సులోచనారాణి (సెక్రటరీ), ముప్పాళ్ళ రంగనాయకమ్మ (స్వీట్ హోం), యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం), మల్లాది వెంకట కృష్ణమూర్తి (తేనెటీగ) వంటివారు- ఆరణాలు అర్థరూపాయి రేట్లతో ఏడాదికి ఒక వెయ్యి పుస్తకాలు చెల్లడం కష్టమైన రోజుల నుంచి ఒక వారంలో పదివేల పుస్తకాలు అమ్మగల ఊపును తెచ్చారు’.</p>
<p>అంటే రమణ భాషలోనే చెప్పాలంటే&#8230;</p>
<p>వీళ్ళని ఇలా అనొచ్చు-<br />
య ము య మ <img src='http://vaakili.com/patrika/wp-includes/images/smilies/icon_smile.gif' alt=':-)' class='wp-smiley' /> </p>
<p>1960, 70 ల్లో రచయిత్రులు తెలుగు పాఠకులని ఆడా మగా తేడా లేకుండా తమ గుప్పిట్లో కట్టి పడేసి సీరియల్స్ రాసిన కాలం! అదొక ప్రవాహం. ఐతే ఆ ప్రవాహం రెండు పాయలుగా , దేని అస్తిత్వం అది కోల్పోకుండా విడి విడిగానే ప్రవహిస్తూ సమానంగా జనాదరణ పొందాయి.</p>
<p>వీటిలో ఒకటి పాఠకుల్ని, ముఖ్యంగా యువ మహిళా పాఠకులని కలల ప్రపంచంలో తేలియాడిస్తూ, ఊహా లోకాల్లో విహరింపజేస్తూ &#8230;వాస్తవానికి కుసింత దూరంగా ఉన్నా, పాఠకుల్ని ఊహల పల్లకీ ఎక్కించి ఊరేగించే రచనా ప్రవాహం. పడవలంతేసి కార్లూ, డిస్నీ మూవీస్ వాడి లోగో లాంటి ఆకాశ హర్మ్యాలూ,సొంత తోటలూ, లాన్లూ, కంపెనీలూ, వీటికి అధిపతి గా అందగాడైన హీరో!పౌరుషాలు, ఆత్మ విశ్వాస ప్రకటనలు, కాసిన్ని కన్నీళ్ళు అపార్థాలు, చివరికి సుఖాంతాలు. ఈ నవలలు వినోదానికే తప్ప వికాసానికి పనికొచ్చేవి కాదు! ఈ ప్రవాహాన్ని జాగ్రత్తగా నడిపించింది కోడూరి కౌసల్యా దేవి,యద్దనపూడి సులోచనా రాణి, మరియు ఆర్ సంధ్యా దేవి లాంటి మరి కొందరు రచయిత్రులు.</p>
<p>మరొకటి.. నేల విడిచి సాము చేయకుండా, మనిషి జీవితాన్ని, మనస్తత్వాలని విశ్లేషిస్తూ మధ్య తరగతి మందహాసాల్ని, జీవితంలోని ఒడిదుడుకుల్ని, తార్కికంగా రేగే ప్రశ్నల్ని ఆవిష్కరిస్తూ వినోదాన్ని కథ ద్వారా అందిస్తూనే మానసిక వికాసానికి దార్లు వేసిన రచనలు! ఆ తరం ఆడపిల్లల్లో మంచి సాహిత్యాన్ని చదివే అలవాటు పెంచింది ఈ తరహా రచనలే! రంగనాయకమ్మ, బీనాదేవి,వాసిరెడ్డి సీతాదేవి, పవని నిర్మల ప్రభావతి &#8230; వీళ్ళంతా ఈ వర్గం రచయిత్రులు</p>
<p>చక్రభ్రమణం నవల లో విషయం ఏమీ ఉండదు. పందొమ్మిదేళ్ళ అమ్మాయి రాసిన కుటుంబ కథ! మంచి మనస్తత్వాలు, అనురాగాలు, ఆప్యాయతలు, వాటి మధ్య కొద్ది అపార్థాలు, పశ్చాత్తాపాలు. వీటిని పేని అల్లిన కథ !!</p>
<p>అదీ ఆమె మొదటి నవల. పైగా బహుమతి పొందిన నవల. పత్రికా భాషలో చెప్పాలంటే అశేష పాఠకావళిని విశేషంగా ఆకట్టుకోవడం వల్ల సంచలన నవలగా మిగిలిన కథ! అన్నపూర్ణా బానర్ కి సూపర్ హిట్ దక్కించిన &#8220;డాక్టర్ చక్రవర్తి&#8221; సినిమాగా రూపొందిన నవల ఇది.</p>
<p>ఆంధ్ర ప్రభ అప్పట్లో నిర్వచించిన శుభకృత్ ఉగాది నవలల పోటీలో ఈ నవల ప్రథమ బహుమతి పొందింది. నవలల పోటీకి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ రచయిత గోపీ చంద్ అన్న పూర్ణా వారికి (ఆ బానర్ దే &#8220;<em><strong>చదువుకున్న అమ్మాయిలు</strong> </em>&#8221; సినిమాకి గోపీ చందే మాటల రచయిత) &#8220;ఈ నవల అద్భుతంగా ఉందనీ , దాన్ని సినిమా గా తీస్తే సూపర్ హిట్ అవడం ఖాయమనీ, నవల బయటికి వస్తే ఎవరో ఒకరు హక్కులు కొనేసే అవకాశం ఉంది కాబట్టి త్వర పడమనీ..సూచించారు .</p>
<p>ఈ విషయంలో కొంత తాత్సారం జరుగుతూ ఉండగా, నవల మార్కెట్లో విడుదలై మరింత ప్రజాదరణ పొందింది. ఇహ అప్పట్లో పాఠకులు ఎంత శ్రద్ధగాను, తీరికగానూ కూడా ఉండే వారంటే ఎంతోమంది పాఠకులు ఈ నవల్ని సినిమాగా తీయమని అన్న పూర్ణా బానర్ కి ఉత్తరాలు రాశారట. పైగా ఏ పాత్రకి ఏ నటి/నటుడు సరిపోతారో సూచిస్తూ!! నిజంగానే ఆ తర్వాత అన్న పూర్ణా సంస్థ పాఠకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ వారిలో మెజారిటీ సూచనల ప్రకారమే నటీ నటుల్ని ఎన్నిక చేశారు.</p>
<p>అన్నపూర్ణా అధినేత దుక్కి పాటి మధుసూదన రావు రాజమండ్రి వెళ్ళి ఈ నవల హక్కులు కొనేశారు. సంభాషణలు రాయమని కౌసల్యా దేవినే కోరారు కానీ &#8220;<em><strong>పెళ్ళి కావలసిన ఆడపిల్ల సినిమాకి మాటలు రాయడం కోసం ఊళ్ళు తిరగడం హోటళ్ళలో ఉండటం మంచిది కాదులెండి</strong></em>&#8220;అని ఆమె తల్లి దండ్రులు ఆ అవకాశాన్ని తిరస్కరించారు.</p>
<p>ఈ నవల ఎంతటి పాఠకాదరణ పొందిందంటే ఇది తెలుగు నాట పాఠకుల సంఖ్యనే ఏకంగా పెంచి పారేసిందంటారు. అందుకే అప్పటికి అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న కె.విశ్వనాథ్ పాఠకుల అంచనాలకు తగ్గట్టు తాను ఈ సినిమాని తీయగలనా అని సందేహించి, వచ్చిన అవకాశాన్ని కూడా తిరస్కరించి గురువు గారైన ఆదుర్తికే అప్పజెప్పారట.<br />
డాక్టర్ చక్రవర్తి సినిమా చూడని వారెవరూ దాదాపుగా తెలుగు నాట ఉండరు కాబట్టి, కథ గురించి ప్రస్తావించడం అనవసరమే! నిజానికి అదేమీ గొప్ప కథ కూడా కాదు. సినిమాలో కొన్ని చోట్ల చక్రవర్తి పాత్ర &#8220;నస&#8221; గా కూడా అనిపిస్తుంది. &#8220;ఎంత సేపటికీ విషయం తేల్చడేం&#8221;అని విసుగొస్తుంది కూడా!</p>
<p>అద్భుతమైన సంగీతం, అందాలొలికే సావిత్రి, వ్యక్తిత్వం నిండిన ఆమె పాత్ర, ఏ ఎన్నార్ నటన..ఇవన్నీ కలిపి సినిమాని సూపర్ హిట్ చేశాయి.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/DrChakravarthy.jpg"><img class="aligncenter size-full wp-image-4242" title="DrChakravarthy" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/DrChakravarthy.jpg" alt="" width="525" height="332" /></a></p>
<p>రెండు దశాబ్దాల క్రితం వరకూ పాఠకులు వార పత్రికల్లో , కథలు చదివడమే కాక తార్కికంగా విశ్లేషిస్తూ ఉత్తరాలు రాసే వారు.(ఇప్పుడు చీల్చి చెండాడ్డానికి సోషల్ నెట్ వర్క్ లు ఉన్నాయనుకోండి)</p>
<p>చక్రభ్రమణం సీరియల్ ప్రచురించినన్ని రోజులూ అలా అసంఖ్యాకంగా పాఠకుల ఉత్తరాలు అంధ్ర ప్రభ ఆఫీసు నిండా నిండిపోయేవి. అన్నీ ప్రచురించడం సాధ్యం కాదని యాజమాన్యం చేతులెత్తేసింది కూడానూ. వాటి లోంచి పాఠకుల ఉత్తరాలు కొన్ని వాకిలి పాఠకులు సరదాగానూ, సీరియస్ గానూ చదువుకునేందుకు సేకరించాము!<br />
చాలా మంది మంది పాఠకులు &#8220;మీ (మా)ఆంధ్ర ప్రభలో&#8221; అంటూ పత్రికను own చేసుకుంటూ ఉత్తరాలు రాయడం అప్పట్లో సంప్రదాయంగా ఉండేదనుకుంటాను. <img src='http://vaakili.com/patrika/wp-includes/images/smilies/icon_biggrin.gif' alt=':-D' class='wp-smiley' /> </p>
<p>కథలోని ప్రతి అంశాన్నీ పాఠకులు నిశితంగా గమనిస్తూ ఉండేవారు కూడా! ఉదాహరణకి &#8230;<br />
కథలో&#8230; చక్రవర్తి దంపతులు తొలిసారి తమ ఇంటికి వచ్చిన సందర్భంలో మాధవి &#8221;కూర్చోండి టీ తెస్తాను&#8221; అంటుంది. ఐదారు వాక్యాల తర్వాత &#8221;కాఫీలయ్యాక చాలాసేపు కబుర్లలో పడ్డారు&#8221; అని రాశారు రచయిత్రి.<br />
ఈ సూక్ష్మమైన తేడాను కూడా గమనించి అప్పట్లో ఆంధ్రప్రభ పాఠకులొకరు ఎత్తి చూపుతూ లేఖ రాశారు.<br />
దీంతో ఈ సీరియల్ పుస్తకంగా వచ్చినపుడు &#8216;టీ&#8217;ని &#8216;కాఫీ&#8217;గా మార్చి తన పొరపాటు దిద్దుకున్నారు రచయిత్రి! ( వంటింట్లో టీ పొడి అయిపోయి, కాఫీ పెట్టి వుండొచ్చు &#8211; అని సమర్థించుకోవచ్చంటారా? సరే, మరి ఆ సంగతి ఆమె అతిథులకు చెప్పినట్టు ఎందుకు రాయలేదని మళ్ళీ అడుగుతారు పాఠకులు! )</p>
<p>కాఫీ అయితే ఏంటి, టీ అయితే ఏంటి అని విసుక్కుని రచయిత్రి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, నవలలో సవరించుకోడం గమనించ దగిన విషయం!<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/cb2.jpg"><img class="aligncenter size-full wp-image-4331" title="cb2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/cb2.jpg" alt="" width="554" height="701" /></a></p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/cb1.jpg"><img class="size-full wp-image-4329 aligncenter" title="cb1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/cb1.jpg" alt="" width="465" height="633" /></a></p>
<p>ఈ సీరియల్ కి బొమ్మలు వేసింది ఇక్కడ ఇలస్ట్రేషన్స్ లో శంకర్ అని కనిపిస్తున్నా.. అది బాపు గీత అని కాస్త గమనిస్తే తెలిసి పోతోంది.</p>
<p>ఈ నవల గురించి కోడూరి కౌసల్యా దేవి విజయ చిత్ర సినిమా పత్రికలో తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.</p>
<p><em><strong>&#8220;నేను మొదట రెండు మూడు కథానికలు వ్రాసి, ఆ అనుభవంతో &#8216;చక్ర భ్రమణం&#8217; అనే నవల వ్రాశాను. ధారావాహికంగా ప్రచురింపబడిన ఆ నవలకు విశేషాదరణ లభించడం, ఆ తర్వాత ప్రముఖ నిర్మాత శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు గారు చిత్రనిర్మాణానికి హక్కులు కావాలని అడగడం, అందుకు నే నంగీకరించడం జరిగింది. సగటు ప్రేక్షకునికి అర్థమయ్యే టైటిల్ కావాలంటే నేనే &#8216;డాక్టర్ చక్రవర్తి&#8217; పేరును సూచించాను.&#8221;</strong></em><br />
<em><strong> &#8211; కోడూరి కౌసల్యాదేవి (విజయచిత్ర 1974)</strong></em></p>
<p>19 ఏళ్ళ ప్రాయంలో ఆమె రాసిన మొదటి నవలకే అంత ప్రాచుర్యం లభించడం ఒక ఎత్తు అయితే, ఆ నవల లో ఆమే శైలి కూడా ప్రాథమిక స్థాయిలో కాక చేయి తిరిగినట్లుగానే పరిణతి చెంది కనిపిస్తుంది.</p>
<p>ఆ నవల తర్వాత ఆమె బహుశా &#8220;చక్రం&#8221; సెంటిమెంట్ తో మరి కొన్ని నవలలకు అలాటి పేర్లే పెట్టారు. అవి.. భాగ్యచక్రం, ధర్మచక్రం, సంసారచక్రం, దిక్చక్రం, చక్రవాకం, చక్రనేమి !!</p>
<p>గొప్ప మలుపులు, వగైరాలు లేక పోయినా ఆనాటి వాతావరణంలోని అనుబంధాలకు అద్దం పట్టిన ఉదాత్తమైన కథ ఇది. వ్యక్తిత్వం నింపుకున్న మాధవి పాత్ర పాఠకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.</p>
<p>అందుకే ఈ నవల తొలి నవలా చిత్రంగానే కాదు, అశేష పాఠకుల్ని సంపాదించుకున్న నవలగా కూడా సంచలనమే!<br />
కాసేపు వాకిలి పాఠకులంతా అరవయ్యో దశకంలోకి ప్రయాణిస్తూ, ఈ ఇలస్ట్రేషన్స్, పాఠకుల ఉత్తరాలు చూస్తూ నవల చదివి రండి <img src='http://vaakili.com/patrika/wp-includes/images/smilies/icon_smile.gif' alt=':-)' class='wp-smiley' /> </p>
<p>&nbsp;</p>
<p>పాఠకుల ఉత్తరాలు:<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra4.jpg"><img class="alignleft size-full wp-image-4244" title="chakra1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra4.jpg" alt="" width="300" height="854" /></a><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra2.jpg"><img class="alignleft size-full wp-image-4245" title="chakra2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra2.jpg" alt="" width="300" height="967" /></a><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra3.jpg"><img class="alignleft size-full wp-image-4246" title="chakra3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra3.jpg" alt="" width="210" height="460" /></a><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra1.jpg"><img class="alignleft size-full wp-image-4247" title="chakra4" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra1.jpg" alt="" width="300" height="350" /></a><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra5.jpg"><img class="alignleft size-full wp-image-4248" title="chakra5" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra5.jpg" alt="" width="300" height="372" /></a><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra6.jpg"><img class="alignleft size-full wp-image-4249" title="chakra6" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/11/chakra6.jpg" alt="" width="300" height="448" /></a></p>
<p><iframe id="doc_65952" src="//www.scribd.com/embeds/178651667/content?start_page=1&amp;view_mode=scroll&amp;show_recommendations=false" frameborder="0" scrolling="no" width="100%" height="600" data-auto-height="false" data-aspect-ratio="undefined"></iframe></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4166</wfw:commentRss>
		<slash:comments>15</slash:comments>
		</item>
		<item>
		<title>ఒక సిద్దార్థుడి జ్ఞానాన్వేషణ &#8211; హెర్మన్ హెస్ నవల &#8220;సిద్దార్థ&#8221;</title>
		<link>http://vaakili.com/patrika/?p=3967</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3967#comments</comments>
		<pubDate>Mon, 30 Sep 2013 18:18:49 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3967</guid>
		<description><![CDATA[<p>ఏమిటి జీవితం? ఎక్కడ ఆనందం? ఏది పరమార్థం? ఏది ఆవశ్యకం? ఏది అనుసరణీయం? ప్రశాంతత ఎక్కడ? బంధాల్లోనా? వాటిని తెంచుకోడం లోనా? జ్ఞానమంటే? ఏదీ అనుభవం లోకి రాకుండా &#8220;ఇదే జ్ఞానం&#8221; ఎని ఎలా గ్రహించడం?</p> <p>సిద్దార్థుడికి అన్నీ సందేహాలే! వాటికి సమాధానాలు కనుక్కోడానికి ఇల్లు వీడాడు. శ్రమణుల్లో కలిశాడు. సాక్షాత్తూ బుద్ధుడినే కలిశాడు. ఆ తర్వాత ఏమి చేస్తాడు? తీరాయా సందేహాలు? దొరికిందా శాంతి? లభించిందా జ్ఞానం?</p> <p>భారతీయ వేదాంత సారం, తత్వం, విజ్ఞానం , ఆధ్యాత్మికత లను పూర్తిగా ఒంటబట్టించుకోడానికి కాదు కదా, అందులో కనీసం కొంత భాగం అయినా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే జీవిత కాలం సరిపోదేమో! అలాటిది ఒక స్విస్ రచయిత జ్ఞానం అంటే ఏమిటి? అనే అంశం మీద భారతీయ గ్రంథాలు చదివి, ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి, ఆకళింపు చేసుకుని ఆ అంశాన్ని విస్తృతంగా చర్చిస్తూ ఒక జర్మన్ నవల రాశారంటే ఒక పెద్ద వింతే! కర్మ సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ,అద్వైతం,బ్రహ్మం వంటి పదాలే కొరుకుడు పడని సామాన్యులకు భగవద్గీత, ఉపనిషత్తులు చదివి వాటిని అర్థం చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాని పని. ఈ అంశాల్ని చర్చిస్తూ సాగే నవల &#8220;సిద్ధార్థ&#8221;! ఈ జర్మన్ నవలకు నోబెల్ సాహిత్య పురస్కారం కూడా లభించింది. దీన్ని ఆ తర్వాత ప్రపంచ భాషల్లోకి అనువదించారు. ఆంగ్లానువాదం నుంచి తెలుగులోకి శ్రీ బెల్లం కొండ రాఘవరావు గారు 1957 అనువదించగా పాత ఎమెస్కో వాళ్ళు దీన్ని వేశారు.</p> <p>ఇలాటి ఒక పుస్తకాన్ని అనువదించాలంటే కేవలం ఆంగ్ల భాష మీద పట్టు ఉంటే చాలదు. పుస్తకం లోని విషయాల మీద లోతైన అవగాహన ఉంటే తప్ప పాఠకుడికి సులభమైన రీతిలో క్లిష్టమైన విషయాల్ని వివరించే ప్రయత్నం సఫలం కాదు.</p> <p>అటువంటి ఒక సఫలీకృత ప్రయత్నమే ఈ నవల అనువాదం!</p> <p>నవల బుద్ధుడి కాలం లో నడుస్తుంది. నవలలో కథా నాయకుడు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sujatha_b.jpg"><img class="alignleft  wp-image-3526" title="sujatha_b" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sujatha_b.jpg" alt="" width="132" height="122" /></a>ఏమిటి జీవితం? ఎక్కడ ఆనందం? ఏది పరమార్థం? ఏది ఆవశ్యకం? ఏది అనుసరణీయం? ప్రశాంతత ఎక్కడ? బంధాల్లోనా? వాటిని తెంచుకోడం లోనా? జ్ఞానమంటే? ఏదీ అనుభవం లోకి రాకుండా &#8220;ఇదే జ్ఞానం&#8221; ఎని ఎలా గ్రహించడం?</p>
<p>సిద్దార్థుడికి అన్నీ సందేహాలే! వాటికి సమాధానాలు కనుక్కోడానికి ఇల్లు వీడాడు. శ్రమణుల్లో కలిశాడు. సాక్షాత్తూ బుద్ధుడినే కలిశాడు. ఆ తర్వాత ఏమి చేస్తాడు? తీరాయా సందేహాలు? దొరికిందా శాంతి? లభించిందా జ్ఞానం?</p>
<p>భారతీయ వేదాంత సారం, తత్వం, విజ్ఞానం , ఆధ్యాత్మికత లను పూర్తిగా ఒంటబట్టించుకోడానికి కాదు కదా, అందులో కనీసం కొంత భాగం అయినా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే జీవిత కాలం సరిపోదేమో! అలాటిది ఒక స్విస్ రచయిత జ్ఞానం అంటే ఏమిటి? అనే అంశం మీద భారతీయ గ్రంథాలు చదివి, ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి, ఆకళింపు చేసుకుని ఆ అంశాన్ని విస్తృతంగా చర్చిస్తూ ఒక జర్మన్ నవల రాశారంటే ఒక పెద్ద వింతే! కర్మ సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ,అద్వైతం,బ్రహ్మం వంటి పదాలే కొరుకుడు పడని సామాన్యులకు భగవద్గీత, ఉపనిషత్తులు చదివి వాటిని అర్థం చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాని పని. ఈ అంశాల్ని చర్చిస్తూ సాగే నవల &#8220;సిద్ధార్థ&#8221;! ఈ జర్మన్ నవలకు నోబెల్ సాహిత్య పురస్కారం కూడా లభించింది. దీన్ని ఆ తర్వాత ప్రపంచ భాషల్లోకి అనువదించారు. ఆంగ్లానువాదం నుంచి తెలుగులోకి శ్రీ బెల్లం కొండ రాఘవరావు గారు 1957 అనువదించగా పాత ఎమెస్కో వాళ్ళు దీన్ని వేశారు.</p>
<p>ఇలాటి ఒక పుస్తకాన్ని అనువదించాలంటే కేవలం ఆంగ్ల భాష మీద పట్టు ఉంటే చాలదు. పుస్తకం లోని విషయాల మీద లోతైన అవగాహన ఉంటే తప్ప పాఠకుడికి సులభమైన రీతిలో క్లిష్టమైన విషయాల్ని వివరించే ప్రయత్నం సఫలం కాదు.</p>
<p>అటువంటి ఒక సఫలీకృత ప్రయత్నమే ఈ నవల అనువాదం!</p>
<p>నవల బుద్ధుడి కాలం లో నడుస్తుంది. నవలలో కథా నాయకుడు సిద్దార్థుడనే బ్రాహ్మణ యువకుడు. అతడు తన స్నేహితుడు గోవిందుడితో కల్సి తండ్రి వైదిక విద్యను అభ్యసిస్తూ అందులో సంతృప్తిని పొందలేక పోతాడు. ఏదో ఒక అశాంతి వేధిస్తూ ఉంటుంది. పూజలూ, అనుష్టానాలు అతనికి తృప్తిని ఇవ్వవు సరి కదా అంతులేని అశాంతి ఏదో అతన్ని వేధిస్తూ ఉంటుంది. అదేమిటో తెలీదు</p>
<p>బలవంతం మీద తండ్రిని ఒప్పించి మిత్రుడు గోవిందుడితో కల్సి శ్రమణుల్లో చేరతాడు. అక్కడా శాంతి లభించదు. అక్కడినుంచి బుద్ధుడి దగ్గరకు వెళ్తాడు. ఎంతోమంది భిక్షువులు ప్రజలు బుద్ధుడిని దర్శించి ఆయన మార్గంలో చేరి అనుసరిస్తుంటారు. గోవిందుడు కూడా బుద్ధుడి శిష్య గణంలో చేరతాడు. బుద్ధుడి ప్రవచనాలు సిద్దార్థుడికి నచ్చుతాయి. కానీ ఆయన్ని అనుసరించాలని అనిపించదు. ఆయన శిష్య గణంలో చేరాలని అసలే అనిపించదు. బుద్ధుడితో కొంత సంవాదం జరిగిన తర్వాత.. తాను ఏది అన్వేషించాలని బయలు దేరాడో అది ఎవరో చెప్తే విని కాక, తానే స్వయంగా తెలుసుకోవాలని , అక్కడ సెలవు పుచ్చుకుని బయలు దేరతాడు. &#8220;అహంత&#8221; ను జయించి, దాని నుంచి వీడి &#8220;తాను&#8221; అనే దాని అస్థిత్వం ఏమిటో తెలుసుకోవాల్ని అందుకు తగిన మార్గాన్ని తానే స్వయంగా వెదకాలని సిద్దార్థుడి అన్వేషణ.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/09/Hermann_hesse.jpg"><img class="alignright  wp-image-3969" title="Hermann_hesse" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/09/Hermann_hesse.jpg" alt="" width="133" height="186" /></a></p>
<p>అలా బయలు దేరిన సిద్ధార్థుడు దారిలో ఒక పడవ వాడి సహాయంతో నది దాటి మరో నగరంలోకి వెళ్తాడు. అక్కడ మహా సౌందర్య వతియైన కమల అనే వేశ్యను కలిసి తనకు కామ కళలో మెలకువలు నేర్పమని, ఆమె వద్ద శిష్యరికం చేయాలని ఉందని అడుగుతాడు. కమల మహా ప్రాక్టికల్ మనిషి. డబ్బు తీసుకువస్తేనే తన వద్ద ప్రవేశం అని చెప్తుంది. అతన్ని కామ స్వామి అనే వ్యాపారి వద్దకు పంపి పని ఇప్పిస్తుంది.</p>
<p>సిద్దార్థుడు కామ స్వామి వద్ద వ్యాపారానికి సహకరిస్తాడు తప్ప వ్యాపారాన్ని మనసుకు పట్టించుకోడు. కమల వద్ద కామ కళ లో మెలకువలు నేర్చుకుంటాడు తప్ప ఆమె మీద ప్రేమను పెంచుకోడు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు.</p>
<p style="text-align: right;">(హెర్మన్ హెస్)</p>
<p>అయితే క్రమంగా ఆ నీటి బొట్టు కాస్తా మద్యం, జూదం, స్త్రీలు వంటి వ్యసనాల మురికి కూపంలో కల్సి పోయి అందులోనే కొన్నాళ్ళు కూరుకు పోతాడు. అవి పూర్తిగా అతన్ని వశం చేసుకుని అధోగతికి చేరువయ్యాక ఒక రోజు మేలుకుంటాడు. ఆస్థి పాస్థులన్నీ విసర్జించి కట్టు బట్టలతో బయలు దేరి ఇదివరలో తాను దాటిన నదీ తీరానికి చేరతాడు. ఆ నాడు తనని నది దాటించిన పల్లెకారుడు వాసుదేవుడే పెద్దవాడై ఇప్పుడూ అక్కడే ఉంటాడు. అతని మాటలకు ఆకర్షితుడవుతాడు సిద్దార్థుడు. నది మనం చెప్పేవన్నీ శ్రద్ధగా వింటుందనీ, నది చెప్పేది కూడా శ్రద్ధగా వినమని వాసుదేవుడు చెప్పిన మాటలకు ముగ్ధుడై అతనితో పాటే అక్కడే నివసించడానికి నిర్ణయించుకుంటాడు. ఈ లోపు కమల తన సర్వాన్నీ బౌద్ద్జ భిక్షువులకు అర్పించి బుద్ధుడి దర్శనానికి పదేళ్ళ కొడుకు (సిద్దార్థుడి కొడుకే) బయలు దేరి వెళ్తూ దార్లో పాము కాటుకు గురై ఆ బిడ్డను సిద్దార్థుడికి అప్పగించి మరణిస్తుంది.</p>
<p>మళ్ళీ సిద్దార్థుడికి పుత్ర వ్యామోహం పట్టుకుంటుంది. దాంట్లోంచి ఎంత బయట పడాలని ప్రయత్నించినా పడలేక పోతాడు. ఆ బిడ్డ ఇంట్లోంచి పారిపోతే వెదుక్కుంటూ నగరానికి వెళ్ళాలనుకుంటాడు. నది దాటే ప్రయత్నంలో అతనికి నదిలో అసంఖ్యాక దృశ్యాలు కనిపిస్తాయి. అనేక వేల లక్షల స్వరాలు వినిపిస్తాయి. ఆ స్వరాల్లో కంఠాల్లో సంతోషం, దుఃఖం, వేదన, సాంత్వన ఇలా అన్నీ గోచరమవుతాయి. తన బాల్యం, వేదాంత విద్య, శ్రమణ జీవితం, కమలతో ప్రణయం, ఇవన్నీ కలగా పులగమై ఆ స్వరాలన్నీ చివరకు ఓంకారమై వినిపిస్తాయి. అతనికి ఆ క్షణాన నిర్వాణం కలుగుతుంది. అలనాడు బుద్ధుడికి బోధి వృక్షం కింద కల్గిన జ్ఞానోదయం సిద్దార్థుడికి ఆ నదీ తీరంలో గోచరమవుతుంది.</p>
<p>ఈ నవల్లో కొన్ని చోట్ల ఆసక్తి కరమైన చర్చలుంటాయి. సిద్ధార్థుడికి బుద్ధుడికి, సిద్ధార్థుడికి గోవిందుడికి,సిద్ధార్థుడికి వాసుదేవుడికి మధ్య జరిగే చర్చలు బోరు కొట్టించక మరింతగా చదవాలన్న ఆసక్తిని కల్గిస్తూ సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల, తత్వం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ నవల మృష్టాన్న భోజనం లాంటిదే!</p>
<p>ఒక బ్రాహ్మణ యువకుడికి స్వధర్మం పట్ల ఎందుకు విరక్తి కల్గింది? తండ్రి నేర్పిన మార్గాన్ని ఎందుకు వ్యతిరేకించాడు?బుద్ధుడంతటి వాడితో ఎందుకు చేరలేదు? అన్నీ త్యజించిన వాడు మళ్ళీ సంసార లంపటాల్లో ఎందుకు చిక్కుకున్నట్టు?</p>
<p>జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? దాన్ని పొందడానికి ఎవరినైనా ఆశ్రయించాలా? నిత్యమూ పఠనాలు, శ్రవణాలు సాధనలతో మామూలు జీవితానికి దూరంగా గంభీర ముద్రతో బతికేయాలా? ఇంతకీ జ్ఞాని ఎవరు? సంసార బంధాల్లో ఉన్నవాడు జ్ఞానాన్ని పొందటానికి అర్హుడు కాదా? అది అతని హృదయంలోనే లేదా?</p>
<p>ఈ నవలకు ముందు మాట రాసిన స్వామినాథన్ అంటారు &#8220;జ్ఞానం ఎక్కడుందో తెలీడానికి ఇతర ప్రాంతాలకు పోవాలి,అక్కడి వేరు రకమైన కలల్ని గూరిచి వినాలి..ఇవన్నీ అయ్యాక ఇంటికొచ్చి చూసుకుంటే ఇక్కడే (హృదయం లోనే) పూడి ఉన్న ధనం (జ్ఞానం) దొరుకుతుంది.&#8221;అని!</p>
<p>ఈ నవల్లో ఆకట్టుకునే విషయం &#8220;వినడం అనే కళ&#8221; గురించి నదిని ఉదాహరణగా తీసుకుని వివరించడం. వాసుదేవుడు నది నుంచి నేర్చుకోవాల్సిన కళగా శ్రద్ధతో వినడాన్ని సిద్దార్థుడికి బోధిస్తాడు. అతడి మాటల్ని సంపూర్ణ హృదయంతో అర్థం చేసుకున్న సిద్దార్థుడు నది నుంచి &#8220;నిశ్చలమైన హృదయంతో, నగ్నమైన ఆత్మతో, ప్రతీక్షతో, మనో వికారాలు లేకుండా, అభిప్రాయాలు లేకుండా &#8220;వినడం నేర్చుకుంటాడు. కంటికెదురుగా కనిపిస్తున్న దాన్ని as it is గా అంగీకరించడం నేర్చుకుంటాడు.</p>
<p>విజ్ఞానాన్ని ఒకరు బోధించ వచ్చు గానీ జ్ఞానాన్ని ఎవరికి వారే గ్రహించాలి. (జిడ్డు కృష్ణ మూర్తి కూడా ఇదే చెప్తారు ) అది వేరొకరి వద్ద అభ్యసించడమో , పుస్తకాల్లో అధ్యయనం చేయడమో సాధ్యం కాదు..!కనిపించిన ఏ డంబాచార స్వామీజీ ప్రవచనాలను వినడమో ఇందుకు ఎంత మాత్రమూ సహకరించదు జ్ఞాన సాధనకు సంసారమూ ఐహిక బంధాలూ అడ్డంకులు కావు, హృదయంలో జ్ఞాన జ్యోతి వెలుగుతూ ఉండాలే గానీ! ఇదే ఈ పుస్తక సారం!</p>
<p>1957 లో ఎమెస్కో ఈ పుస్తకాని ముద్రించినపుడు దీని వెల రూపాయి పావలా ! అప్పుడే దీన్ని 5000 కాపీలు వేశారు.దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించ బడ్డ ఈ నవలను 1972 లోశశి కపూర్ కథా నాయకుడిగా సినిమా కూడా తీశారు. యూ ట్యూబ్ లో లేదు. కాబట్టి అది దొరికే సక్రమ మార్గాలు అన్వేషించాల్సిందే!</p>
<p>ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక స్విస్ రచయిత భారతీయ వేదాంతాన్ని ఈ స్థాయిలో అధ్యయనం చేసి దానికి నవలా రూపం ఇవ్వడం ఒక అద్భుతమైన విషయం గా తోస్తుంది . ఈ పుస్తకానికి నోబెల్ కూడా లభించింది.<br />
ప్రపంచమంతటా తిరిగిన హెస్ ని భారతీయ వేదాంతం విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియానే కాక శ్రీలంక, బర్మా, సుమాత్రా , ఇండోనేషియా దేశాలు కూడా సందర్శించిన హెస్ తన యాత్రానుభవాలను A journey to the east అనే పేరుతో పుస్తక బద్ధం చేశాడు కూడా.</p>
<p>ఈ నవలను పాఠకుల సౌకర్యం కోసం ఇక్కడ ఇస్తున్నాము.<br />
<iframe id="doc_47506" src="//www.scribd.com/embeds/170542848/content?start_page=1&amp;view_mode=scroll&amp;access_key=key-vbw1xqk3lc3b8a8w00v&amp;show_recommendations=false" frameborder="0" scrolling="no" width="100%" height="600" data-auto-height="false" data-aspect-ratio="0.660557184750733"></iframe></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3967</wfw:commentRss>
		<slash:comments>25</slash:comments>
		</item>
		<item>
		<title>శరత్ దేవదాసు చక్ర పాణి ద్వారా&#8230;</title>
		<link>http://vaakili.com/patrika/?p=3519</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3519#comments</comments>
		<pubDate>Wed, 31 Jul 2013 21:11:11 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3519</guid>
		<description><![CDATA[<p>&#8220;ఇంకా ఎంత దూరం నాయనా?&#8221; ఈ డైలాగ్ వినగానే గుండె లోతుల్లోంచి దుఃఖం ఫెటిల్లున పగిలిన శబ్దం కంటి చివరి నుంచి వరదై చెంప మీదకు జారక పోతే అది దేవదాసు సినిమానే కాదు, వాడు నాగ్గాడే కాదు. తన మరణం తనకు సమీపంలో దర్శనమిస్తున్న ఆ చివరి క్షణాల్లో దేవదా పార్వతిని ఒక్క సారి, ఒకే ఒక్క సారి చూడాలని తపించే క్షణాలు దేవదాసు తో మమేకమై పార్వతి కోసం ఏడవని ప్రేక్షకుడెవరు తెలుగు నాట?</p> <p>ఒక మహా దృశ్య కావ్యం అంటే ఇదేనా? ఎప్పటికీ చెరిగి పోని ముద్రను గాఢంగా మనో ఫలకంపై చిత్రించేదేనా?</p> <p>దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళు అయిన సందర్భంగా అనేక వ్యాసాలు గురించి సినిమా పత్రికల్లో వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అప్పటి ఆ సినిమా విశేషాలతో ఆసక్తి చాలా ఆసక్తి కరంగా ఉండి, మరో సారి సినిమా చూడాలన్న కోరికను రేకెత్తించాయి. నేనుఅంతటితో ఆగక అవి చదువుతూ ఉన్న నేపథ్యంలో చక్రపాణి అనువదించిన &#8220;దేవదాసు&#8221; నవల ఇంకో సారి తీసి చదివాను. ఎంతో ఇష్టంగా !</p> <p>శరత్ నవలల కు నాకు చక్ర పాణి అనువాదాలు ఎంతో ఇష్టం . బి . శివ రామ కృష్ణ గారి అనువాదాల్లో నాకు భాషో భావమో మొత్తానికి ఏదో నచ్చలేదు. చక్రపాణివి సంక్షిప్త అనువాదాలైనా సూటీగా మనసుకు ఎక్కేలా ఉంటాయి. ఇటీవల మార్కెట్లో దొరుకుతోన్న వారి అనువాదాలు దొరికితే చదవమని రికమండ్ చేస్తాను. జ్ఞానద, బిందు గారబ్బాయి, పల్లీయులు, రాముని బుద్ధి మంత తనం ఇవన్నీ కూడా పాఠకుల్ని తెలుగు రైల్లో ఎక్కించి కలకత్తా తీసుకు పోతాయి. అసలు దేవదాసుని పక్కా తెలుగు వాళ్లలో కలిపేసింది చక్రపాణే.</p> <p>సినిమాలో అయినా, నవల్లో అయినా అందరి మనసుల్లోనూ చివరిగా నిలిచి పోయి అభిమానాన్ని సంపాదించుకునే పాత్ర &#8220;చంద్ర ముఖి&#8221;! నవల్లో చక్రపాణి చేతిలో తెలుగు పాఠకులకు పరిచయమయ్యే చంద్ర ముఖి బయటికి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/devadas1.jpg"><img class="alignleft size-full wp-image-3524" title="devadas1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/devadas1.jpg" alt="" width="391" height="464" /></a>&#8220;ఇంకా ఎంత దూరం నాయనా?&#8221; ఈ డైలాగ్ వినగానే గుండె లోతుల్లోంచి దుఃఖం ఫెటిల్లున పగిలిన శబ్దం కంటి చివరి నుంచి వరదై చెంప మీదకు జారక పోతే అది దేవదాసు సినిమానే కాదు, వాడు నాగ్గాడే కాదు. తన మరణం తనకు సమీపంలో దర్శనమిస్తున్న ఆ చివరి క్షణాల్లో దేవదా పార్వతిని ఒక్క సారి, ఒకే ఒక్క సారి చూడాలని తపించే క్షణాలు దేవదాసు తో మమేకమై పార్వతి కోసం ఏడవని ప్రేక్షకుడెవరు తెలుగు నాట?</p>
<p>ఒక మహా దృశ్య కావ్యం అంటే ఇదేనా? ఎప్పటికీ చెరిగి పోని ముద్రను గాఢంగా మనో ఫలకంపై చిత్రించేదేనా?</p>
<p>దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళు అయిన సందర్భంగా అనేక వ్యాసాలు గురించి సినిమా పత్రికల్లో వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అప్పటి ఆ సినిమా విశేషాలతో ఆసక్తి చాలా ఆసక్తి కరంగా ఉండి, మరో సారి సినిమా చూడాలన్న కోరికను రేకెత్తించాయి. నేనుఅంతటితో ఆగక అవి చదువుతూ ఉన్న నేపథ్యంలో చక్రపాణి అనువదించిన &#8220;దేవదాసు&#8221; నవల ఇంకో సారి తీసి చదివాను. ఎంతో ఇష్టంగా !</p>
<p>శరత్ నవలల కు నాకు చక్ర పాణి అనువాదాలు ఎంతో ఇష్టం . బి . శివ రామ కృష్ణ గారి అనువాదాల్లో నాకు భాషో భావమో మొత్తానికి ఏదో నచ్చలేదు. చక్రపాణివి సంక్షిప్త అనువాదాలైనా సూటీగా మనసుకు ఎక్కేలా ఉంటాయి. ఇటీవల మార్కెట్లో దొరుకుతోన్న వారి అనువాదాలు దొరికితే చదవమని రికమండ్ చేస్తాను. జ్ఞానద, బిందు గారబ్బాయి, పల్లీయులు, రాముని బుద్ధి మంత తనం ఇవన్నీ కూడా పాఠకుల్ని తెలుగు రైల్లో ఎక్కించి కలకత్తా తీసుకు పోతాయి. అసలు దేవదాసుని పక్కా తెలుగు వాళ్లలో కలిపేసింది చక్రపాణే.</p>
<p>సినిమాలో అయినా, నవల్లో అయినా అందరి మనసుల్లోనూ చివరిగా నిలిచి పోయి అభిమానాన్ని సంపాదించుకునే పాత్ర &#8220;చంద్ర ముఖి&#8221;! నవల్లో చక్రపాణి చేతిలో తెలుగు పాఠకులకు పరిచయమయ్యే చంద్ర ముఖి బయటికి చెప్పలేని మూగ బాధని పాఠకుల్లో కూడా సృష్టించి కానీ మాయమవదు. చంద్ర ముఖి దేవదాసు కోసం తాను పడే బాధను, తపనను మనలో కూడా నర నరానా నింపి కానీ వదలదు . నవల చదివాక చంద్ర ముఖికి ఫాన్ గా మారని వారెవరూ ఉండరేమో</p>
<p>ఆ నవలని ఆంద్ర జ్యోతి లో సీరియల్ గా ప్రచురించారట . ఈ నవలకు వడ్డాది పాపయ్య గారు వేసిన బొమ్మలు బంగారానికి అద్దిన తావి లాంటివి.</p>
<p>నవల లో దేవదాసు పారుల మధ్య చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహమే కనిపిస్తుంది. (అక్కినేని కూడా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యు లో ఇటీవల చెప్పారు ) ప్రేయసి కోసం ప్రాణాలొదిలిన అమర ప్రేమికుడి గా , ఖ్యాతికెక్కిన దేవదాసుకి నవలలో పార్వతి మీద ఆ స్థాయి ప్రేమ ఉన్నట్లు ఎక్కడా కనిపించదు సరికదా, పార్వతి పెళ్ళి అని తెల్సినా దేవదాసు పెద్దగా స్పందించడు, &#8220;ఎప్పుడట?&#8221; అని మాత్రమే అడుగుతాడు.</p>
<p>దేవదాసు పట్నం వెళ్లాక చదువు , ఇతర వ్యాపకాల్లో పడి పార్వతిని చాలా వరకు వదిలి వేశాడని రచయితే చెప్తాడు.</p>
<p>పార్వతి తన ప్రేమను ప్రకటించి &#8220;నీ పాదాల వద్ద చోటు ఇవ్వు దేవదా&#8221; అని అడిగాక కూడా దేవదాసు &#8220;నేను తప్ప నీకు గత్యంతరం లేదా పారూ&#8221; అనడుగుతాడు.</p>
<p>పాదాల వద్ద చోటు కోరడమంటే ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోడం కాదు, ఆత్మను స్వచ్ఛంగా సమర్పించుకోవడమే కదా! &#8220;ఇద్దరు ఒకటే&#8221; అన్న భావన వస్తే కానీ అంత మాట నోటి వెంట రాదు.</p>
<p>&#8220;మా అమ్మకి, నాన్నకి బొత్తిగా ఇష్టం లేదు. వాళ్ళకి ఎదురు తిరగమంటావా?&#8221; అని కూడా అడుగుతాడు.</p>
<p>పట్నం వెళ్ళాక పార్వతికి రాసిన ఉత్తరం లో &#8221; మీది కులీన కుటుంబం కాదు, పిల్లల్ని అమ్ముకునే ఇంటి పిల్లవు నువ్వు. మా అమ్మ నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. అసలు ఇంకో సంగతి! నిన్ను ప్రేమిస్తున్నట్లు నాకెప్పుడూ తోచలేదు. ఇవాళ కూడా నీ కోసం నా అంతరంగం ఎక్కువ తపించడం లేదు. ప్రయత్నించి మర్చిపో&#8221; అని రాస్తాడు.</p>
<p>నిజానికి ప్రేమ అంతా పార్వతి దే!</p>
<p>&#8220;నీ భర్త వయసెంతే&#8221; అని మనోరమ అడిగితే జమీందారు తో పెళ్లి కుదిరాక కూడా &#8220;పందొమ్మిది ఉంటాయి&#8221; అని నిర్భయంగా దేవదాసు వయసు చెప్తుంది. &#8220;మీరు కాళ్లకు పసుపూ నొసట కుంకుమా వృధాగా పెట్టుకుంటున్నారు. ఎవరిని భర్త అనాలో కూడా తెలీదు. అతడు నా భర్త కాక పోతేను, నా లజ్జా సంకోచాలకు అతీతుడు కాకపోతేను నేనిలా అతని కోసం చావడానికి కూచోను. చావడానికి సిద్ధంగా ఉన్న మనిషి విషయం తియ్యగా ఉంటుందా, చేదుగా ఉంటుందా అని ఎప్పుడూ ఆలోచించడు. అతని వద్ద నాకు రవ్వంత సిగ్గు కూడా లేదు&#8221; అని చెప్తుంది .</p>
<p>పార్వతి వ్యక్తిత్వం నవల్లో మొదటి నుంచి బలంగా కనిపిస్తుంది. అతడు ఉత్తరం రాశాక పార్వతి కఠినమై, మనసుని పూర్తిగా రాయి చేసుకుని ప్రవర్తిస్తుంది.అతడు మళ్ళీ వచ్చి &#8220;మా అమ్మా నాన్నల్ని ఒప్పిస్తాను,&#8221; అన్నపుడు &#8220;నీకేనా తల్లి దండ్రులున్నది? నాకు లేరా? వారి ఇష్టా యిష్టాలతో పని లేదా&#8221; అని ఆత్మ గౌరవంతో ప్రశ్నిస్తుంది</p>
<p>&#8220;నీకు రూపమే ఉంది కానీ గుణం లేదు. నాకు రూపమూ గుణమూ రెండూ ఉన్నాయి&#8221; పొమ్మంటుంది.</p>
<p>పెళ్ళి అయిన తర్వాత కూడా పార్వతి జీవితం మీద ఎలాటి ఆసక్తి లేకుండానే జీవిస్తుంది.</p>
<p>ఆ తర్వాత పార్వతి మీద ప్రేమ ఉన్నట్లు తన మనసు తానే గ్రహించలేని మూర్ఖ శిఖామణి పడే వేదన వర్ణనాతీతం. అతని మనోభావాలేవీ రచయిత వర్ణించడు. వరసగా జరుగుతున్న సంఘటనల ద్వారా మాత్రమే పాఠకుడికి అవి అవగతమవుతాయి. ఒక సంఘటన వెనుక ఒకటి అతని బాధను, వేదన తో కునారిల్లి పోవడాన్ని, ఆరోగ్యం దిగజారి పోవడాన్ని కొద్ది కొద్దిగా చిత్రిస్తూ సాగుతాయి . ఈ వరస క్రమమే చక్కని స్క్రీన్ ప్లే గా అమరి పోతుందేమో అనిపిస్తుంది.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/Devadasu3.jpg"><img class="aligncenter size-full wp-image-3523" title="Devadasu3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/Devadasu3.jpg" alt="" width="704" height="342" /></a></p>
<p>దేవదాసు వంటి వ్యక్తీ మీద ప్రేమ పెంచుకున్న చంద్ర ముఖి అద్భుతమైన పాత్ర ! దేవదాసు ని ఎంతగా గౌరవిస్తుందంటే , అతడిని బలవంతాన తీసుకు వెళ్లి చికిత్స చేసి కాపాడుకునే అవకాశం ఉన్నా అతడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అడ్డు చెప్పదు. అతడి కోసం వేదన పడటం , వెదుక్కోవడం మాత్రం మానదు . అందుకోసం ఆస్తులూ అమ్ముతుంది , తిరిగి వృత్తి వాతావరణం లొకీ ప్రవేశిస్తుంది .<br />
దేవదాసు నవల ఎన్నో భాషల్లోకి అనువాదమై అన్ని భాషల్లోనూ పాఠకుల్లో చర్చ జరగడానికి అభిమానులు ఏర్పడ్డానికి వివిధ భాషల్లో వచ్చిన సినిమా కూడా కావొచ్చునేమో!</p>
<p>కొన్ని పుస్తకాల్లో దేవదాసు ప్రేమ గురించి ఆ పుస్తకాల్లోని పాత్రలు కూడా చర్చించాయి. రంగ నాయకమ్మ గారి &#8220;ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది&#8221; కథలో సుధ,చంద్ర శేఖర్ ల మధ్య కొంత సంభాషణ నడుస్తుంది. ఈ సంభాషణ నడుస్తూ ఉంటే మనకి కూడా అందులో పాల్గొనాలనిపించేలా ఉంటుంది సరదాగానూ, సీరియస్ గానూ!</p>
<p>రంగనాయకమ్మ గారి ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది! &#8230; కథ నుంచి..</p>
<hr />
<p>ఇది ఇద్దరి మధ్య సంభాషణ</p>
<p>సుధ- ‘‘అసలు &#8230; దేవదాసుకీ పార్వతికీ పెళ్ళయితే , వాళ్ళ జీవితం ఎలా వుండేదంటారు?’’</p>
<p>చంద్రశేఖర్ తెల్లబోయాడు- ‘‘ఇప్పుడు దేవదాసు గుర్తొచ్చాడా?’’</p>
<p>‘‘ఎప్పుడూ గుర్తొస్తాడు&#8230; నేనడిగింది చెప్పండి!’’<br />
‘‘దేవదాసుకీ పార్వతికీ పెళ్ళా? అసలెలా అవుతుంది?’’<br />
‘‘ఎలాగో అయిందనుకోండీ!&#8230; దేవదాసే పెద్దవాళ్ళని ధిక్కరించాడనుకోండీ.’’<br />
‘‘అలా అయితే ఇంకేం? చాలా బాగుంటుంది’’<br />
‘‘బాగుంటుందా? అలాక్కాదు. సరిగ్గా ఆలోచించి చెప్పండి.’’<br />
అతను నవ్వాడు -‘‘ఏమీ బాగుండదంటే సరిగ్గా ఆలోచించినట్టా?’’</p>
<p>సుధ కూడా నవ్వింది- ‘‘మీరసలు కాస్సేపు ఆలోచించి తర్వాత చెప్పండి’’ అని మొరాయించింది.<br />
‘‘కొత్తగా ఆలోచించటాని కేముంది? పెళ్ళయితే సుఖంగానే వుండేవాళ్ళు. వాళ్ళ ప్రేమ మీద నాకేం సందేహం లేదు’’.<br />
సుధ వెటకారంగా చూసింది- ‘‘అంత గొప్ప ప్రేమయితే మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది పార్వతి చేతిలో లేదనుకోండీ. దేవదాసు చేతిలో ఉందిగా?’’<br />
‘‘దేవదాసు చేతిలో వుండడం నిజమే గానీ, ఆ సంగతి దేవదాసుకే తెలీదండీ! ‘పెద్దవాళ్ళు వొప్పుకోకపోతే ఇంకేం చెయ్యగలం?’ అనుకున్నాడు మొదట. అతనికి తెగింపు వచ్చేటప్పటికి , అతని చెయ్యి దాటిపోయింది. అతని చేతిలో మాత్రం ఏం వుంది? మొదట్లో అతను అమాయకంగా వున్నాడు కాబట్టి, అతని ప్రేమని శంకిస్తారా? ఆ ప్రేమ ఎంత నిజమో తర్వాత జీవితంలో రుజవైంది కదా? ఇంకో స్త్రీని కన్నెత్తి చూడలేదు.’’<br />
‘‘&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;&#8230;..’’</p>
<p>‘ప్రేమకి సార్థకత కలిసి జీవించటమే అనుకోండీ. కాదనను. కానీ అది అసంభవమైతే మనసుల్లో ప్రేమ అంతా అబద్ధమేనా? దేవదాసూ పార్వతీ విడిపోయారని నాకెప్పుడూ అనిపించలేదు’’ అని ఇక దానికి తిరుగులేదు అన్నట్టు వూరుకున్నాడు.</p>
<p>సుధ తెగ ఆశ్చర్యపడి పోయింది- ‘‘వాళ్ళిద్దరూ విడిపోనే లేదూ? కలిసే ఉన్నారా? ఎక్కడా? అంతరాత్మల్లోనా? ఆహా! ఏం వేదాంతం మాట్లాడుతున్నారండీ ! దేవదాసూ పార్వతీ ‘ఇద్దరం కలిసే వున్నాం’ అనుకుంటూ సుఖంగా వుండలేకపోయారేం?’’<br />
‘‘మీ లెక్చెరర్ ని వొదిలేసి ఇందులో పడ్డారేం?’’ అని నవ్వాడతను.<br />
‘‘మీరలా తప్పించుకోకండి మరి. ఈ ప్రేమ వ్యవహారాల్లో నాకు చాలా సందేహాలున్నాయి. దేవదాసు ప్రేమ మీద నేనో వ్యాసం కూడా రాశాను.’’<br />
‘‘ఏం రాశారు?’’ నవ్వుతూనే అడిగాడు.<br />
‘‘మీకేవిటో హేళనగా వుంది నా రీసెర్చి మీద. మీరు నా సందేహాలన్నీ తీర్చేస్తే నా అభిప్రాయాలు మార్చుకుంటానుగా?’’ అని మళ్ళీ వాదంలోకి దిగింది. ‘‘అసలు పార్వతి అంత సాహసంగా అర్థరాత్రి వొచ్చి అడక్కపోతే దేవదాసుకి ప్రేమా గీమా ఏం లేదు. ఇంకా చదువుకునేవాడు. జమీందార్ల పిల్లని పెళ్ళి చేసుకునేవాడు. అంతే.’’</p>
<p>‘‘నేనలా అనుకోను. మీరు దేవదాసు మీద కోపంతో ఉన్నారు. అందుకే అలా ఆలోచిస్తున్నారు. పార్వతి వొచ్చి అడక్కపోయినా , పార్వతికి పెళ్ళయి వెళ్ళిపోయిం తర్వాత దేవదాసు చాలా బాధపడేవాడు. ఆమెతో అతనికి ఆ రకం స్నేహం వుంది, ఆత్మీయత వుంది. ఇష్టం వుంది.’’<br />
‘‘ఎన్నివున్నా అదంతా ప్రేమ కాదు. చాలా తొందరగానే మర్చిపోయేవాడు.’’</p>
<p>‘‘సరే, అలాగే అనుకోండి. పోనీ పార్వతి అడిగింతర్వాతే అతనికి ప్రేమ తెలిసిందనుకోండి. పార్వతే అతని మనసులోకి ప్రేమ ఊహ తెచ్చింది. నిజమే. అతని ప్రేమ ఎప్పుడు ప్రారంభమైతేనేం? ఎలా ప్రారంభమైతేనేం? &#8211; ప్రేమని ఎవరో ఒకరే ముందు బయటపెడతారు. రెండోవారు తర్వాత దాన్ని గురించి ఆలోచిస్తారు. అడిగిన వ్యక్తికే ప్రేమ వుందనీ, రెండో వ్యక్తికి లేదనీ అనుకుంటామా? ఇద్దరూ ఒకేసారి అడుగుతారా? ఎవరో ఒకరు ముందు అడుగుతారు’’.<br />
&#8230;&#8230;.</p>
<p>చంద్రశేఖర్- ‘‘భూమి మీద వున్న పదార్థాలన్నీ భూమ్యాకర్షణకి అంటుకుపోయి వున్నట్టు, మనుషుల ప్రవర్తనలు సంఘ ప్రభావాలకు లోబడిపోయి వుంటాయి. ఆ గాడిలో పడి బతికే కోట్ల మంది సామాన్యుల్లో దేవదాసు ఒకడు. వాళ్ళ కుటుంబానికి డబ్బు వుంటే వుండొచ్చు. అతని మనసుకి ప్రేమ తెలిసింది గానీ, అది ఫలించేలాగ చేసుకోవడానికేం చెయ్యాలో, ఎవరికి ఎదురుతిరగాలో, అతనికి సరైన సమయంలో తెలీలేదు. దాని ఫలితం అతనే అనుభవించాడు కదా? అసలు, రచయిత అదే చెప్పదల్చుకున్నాడు. పెద్దవాళ్ళు, ఆస్తుల రంధి తోటీ, సాంప్రదాయాల రంధితోటీ, పిల్లల జీవితాల్ని ధ్వంసం చేసేస్తారని చెప్పాడు, కథలో!.. ’’</p>
<p>సుధ వింటూనే వుంది.</p>
<p>చంద్రశేఖర్ ఉత్సాహంగా సాగించాడు- ‘‘నాకర్థమైనంతవరకూ , రచయితలు రెండు రకాలుగా రాస్తారు. కొందరు &#8211; మనుషులెలా జీవించాలో చెప్తారు. కొందరు- ఎలా జీవించకూడదో చెప్తారు. శరత్ రాసిందంతా రెండో రకంలోనే. ‘దేవదాసు’ చదివి పూర్తిచేసింతర్వాత మన మనసులు చాలా భారంగా అయిపోవూ? ‘వాళ్ళిద్దరికీ పెళ్ళయితే ఎంత బాగుండేది! పోనీ, ఎక్కడికైనా పోయి సుఖంగా బతికినా బాగుండేది’ అనిపించదూ? ఒక్క క్షణం అలా అనిపించిందంటే , రచయిత మనకి చాలా నేర్పాడన్నమాట. ’’</p>
<hr />
<p>నవల చివరి భాగం మొత్తం సినిమా లాగే వేదనా భరితంగా ఉంటుంది . చదువుతున్న కొద్దీ ఊరే బాధ &#8230; వేదన !<br />
నవల చివర్లో రచయిత ఇలా అంటాడు ..(ఇది సినిమాలో కూడా ఉంటుంది, మొత్తం కాకపోయినా)</p>
<p>&#8220;ఇప్పుడు, ఇంతకాలమైనాక పార్వతి ఏమైందో ఎలా ఉందొ నాకు తెలియదు . తెలుసుకోవాలనే కోరిక కూడా లేదు . దేవదాసు గురించే నాకు చాలా దుఃఖంగా ఉంటుంది . ఈ కథ చదివితే మీకు కూడా నా మాదిరేగానే దుఖం కలగవచ్చు. అయినా దేవదాసు వంటి దౌర్భాగ్యులతో, నిగ్రహం లేని వారితో , పాపిష్టులతో ఎప్పుడైనా మీకు పరిచయం కలిగితే వాళ్ళ కోసం మీరు కొంచెం ప్రార్థించండి . కనీసం అతని వంటి చావు మాత్రం ఎవ్వరికి రాకూడదని కోరండి . మరణం వాళ్ళ నష్టమేమి లేదు కాని ఆ సమయంలో ప్రేమ పూరితమైన కర స్పర్శ లలాటానికి సోకాలి . ఆఖరికి ఒకటైనా కరుణా పూరితమైన ముఖం చూస్తూ ఈ జీవితం అంతం కావాలి . చివరికి ఒక కంటి నుంచైనా కన్నీటి బిందువు రాలటం చూసి ప్రాణాలు వదలాలి &#8221;</p>
<p>నిజానికి మరణం చేయి చేతికి అందేంత సమీపం లో ఆసన్నమై దర్శనమిచ్చినపుడు, చెంత చేరి వొడిలో చేర్చుకోబోయే టపుడు ఈ లలాట స్పర్శ లు , కరుణా పూరితమైన ముఖాలు చూడటం ఇవన్ని పోయే ప్రాణానికి తెలుస్తాయా ?</p>
<p>&nbsp;</p>
<p>&#8220;ఒక్కరి కంటి నుంచైనా కన్నీటి బిందువు రాలడం &#8220;చూసి&#8221; ప్రాణాలు వదలాలి&#8221; . ఈ కోరిక ఉండటం సమంజసమో కాదో మరి !!</p>
<p>దేవదాసు నిజానికి అదృష్ట వంతుడే ! రెండు నిర్మల మైన ప్రేమలని పొందగలిగినందుకు . ఆ ప్రేమల్లో కనీసం ఒకదాన్ని అయినా హృదయ పూర్వకంగా స్వీకరించి సొంతం చేసుకోలేని నాడు , నిలుపుకుని , జీవితాన్ని సుఖమయం చేసుకోలేని నాడు ఆ అదృష్టం ఎందుకు ? చావడానికి కాక పొతే ??<br />
అదే చేసాడు దేవదాసు<br />
దేవదాసు ని ఒక పక్కన అసహ్యించుకునెలా చేస్తూనే మరో పక్క అతని కోసం కన్నీరు పెట్టించ గలిగే నవల.</p>
<p>దేవదాసు నవల లింక్:<br />
<iframe class="scribd_iframe_embed" src="http://www.scribd.com/embeds/150630739/content?start_page=1&#038;view_mode=scroll&#038;access_key=key-16xmbtgupq0dkf0ssch5&#038;show_recommendations=false" data-auto-height="false" data-aspect-ratio="0.708006279434851" scrolling="no" id="doc_8456" width="650" height="500" frameborder="0"></iframe></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3519</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>పి. సత్యవతి గారి పెళ్లి ప్రయాణం కథ</title>
		<link>http://vaakili.com/patrika/?p=3286</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3286#comments</comments>
		<pubDate>Wed, 03 Jul 2013 23:47:27 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3286</guid>
		<description><![CDATA[<p>పి. సత్యవతి గారి కథలైనా, వ్యాసాలైనా, ఒకసారి చదివి, కన్వీనియెంట్ గానో, యధాలాపంగానో మర్చిపోయేవి కాదు. నెమ్మదిగా రాజుకునే ఆలోచనలు మహా ప్రవాహమై వెంటాడేలా చేసే రచనలు ఒక్కొక్కటీ! మనల్ని మనకే పరిచయం చేస్తాయి అవి . మనల్ని గురించి మనమే కాసేపు కూచుని ఆలోచించు కోవాలనే తపన రేకెత్తిస్తాయి . ఆత్మలు వాలిన చెట్టు, మెలకువ, అమ్మకేం తీసుకెళ్లాలి, నాన్న ఇలా ప్రతి కథా &#8220;ఈ పాయింట్ ని ఆలొచించడం నేనెలా మర్చిపోయాను?&#8221; అన్న ప్రశ్న చదివిన ప్రతి సారీ భుజం చరుచుకునేలా, నాలుక్కరుచుకునేలా చేస్తాయి . . పెద్ద పెద్ద అజెండా ప్రకటన లేకుండా, నీతి పాఠాలు లేకుండా, డైడాక్టిక్ గా ఉండక, చెప్పాలనుకున్న విషయాన్ని సన్నని సూదితో నొప్పి తెలీకుండా లాఘవం గా నర నరాల్లోకీ ఎక్కించే రచనలు !</p> <p>అలాటి మంచి కథల్లో ఒక మరీ మంచి కథ &#8220;పెళ్ళి ప్రయాణం&#8221; !ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచికలు వెలువరించే రోజుల్లో చాలా మంచి కథలు వచ్చాయి వాటిల్లో శ్రీరమణ గారి &#8220;ధనలక్ష్మి,&#8221; కుప్పిలి పద్మ &#8220;నిర్ణయం&#8221; ఇంకా అనేక మంచి కథలు నాకు వాటిల్లోనే దొరికాయి. అలా 1995 నాటి ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక లో &#8220;పెళ్ళి ప్రయాణం&#8221; కథ వచ్చింది. పెద్ద హడావుడి, వర్ణన లేని ఎత్తుగడతో మొదలయ్యే కథ &#8220;కొంచెం పెద్దగా&#8221; అనిపించి, చివర్లో చదవాలని పక్కన పడేశాను. చివర్లో చదవడం వల్ల కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ, ప్రతి పేరాకి అమ్మమ్మనో, మేనత్తనో, పెద్దమ్మ నో , స్నేహితురాళ్ళ తల్లుల్నో గుర్తు చేసుకుంటూ &#8220;అవును, నిజమే, నిజమే&#8221; అని ఆశ్చర్య పోతూ చదివాను. ఇందులో పతివ్రత పిన్ని పాత్ర మా అత్తదే! ఈ పిన్ని పాత్ర ప్రతి ఇంట్లోనూ ముందు తరంలోనో, నడుస్తున్న తరంలోనూ తప్పక ఉండి తీరుతుంది. మిగతా పాత్రలకు కూడా ప్రతి రూపాలు ఎక్కడో ఒక చోట ఎదురు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg"><img class="alignleft size-full wp-image-946" title="sujatha" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg" alt="" width="96" height="133" /></a>పి. సత్యవతి గారి కథలైనా, వ్యాసాలైనా, ఒకసారి చదివి, కన్వీనియెంట్ గానో, యధాలాపంగానో మర్చిపోయేవి కాదు. నెమ్మదిగా రాజుకునే ఆలోచనలు మహా ప్రవాహమై వెంటాడేలా చేసే రచనలు ఒక్కొక్కటీ! మనల్ని మనకే పరిచయం చేస్తాయి అవి . మనల్ని గురించి మనమే కాసేపు కూచుని ఆలోచించు కోవాలనే తపన రేకెత్తిస్తాయి . ఆత్మలు వాలిన చెట్టు, మెలకువ, అమ్మకేం తీసుకెళ్లాలి, నాన్న ఇలా ప్రతి కథా &#8220;ఈ పాయింట్ ని ఆలొచించడం నేనెలా మర్చిపోయాను?&#8221; అన్న ప్రశ్న చదివిన ప్రతి సారీ భుజం చరుచుకునేలా, నాలుక్కరుచుకునేలా చేస్తాయి . . పెద్ద పెద్ద అజెండా ప్రకటన లేకుండా, నీతి పాఠాలు లేకుండా, డైడాక్టిక్ గా ఉండక, చెప్పాలనుకున్న విషయాన్ని సన్నని సూదితో నొప్పి తెలీకుండా లాఘవం గా నర నరాల్లోకీ ఎక్కించే రచనలు !</p>
<p>అలాటి మంచి కథల్లో ఒక మరీ మంచి కథ &#8220;పెళ్ళి ప్రయాణం&#8221; !ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచికలు వెలువరించే రోజుల్లో చాలా మంచి కథలు వచ్చాయి వాటిల్లో శ్రీరమణ గారి &#8220;ధనలక్ష్మి,&#8221; కుప్పిలి పద్మ &#8220;నిర్ణయం&#8221; ఇంకా అనేక మంచి కథలు నాకు వాటిల్లోనే దొరికాయి. అలా 1995 నాటి ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక లో &#8220;పెళ్ళి ప్రయాణం&#8221; కథ వచ్చింది. పెద్ద హడావుడి, వర్ణన లేని ఎత్తుగడతో మొదలయ్యే కథ &#8220;కొంచెం పెద్దగా&#8221; అనిపించి, చివర్లో చదవాలని పక్కన పడేశాను. చివర్లో చదవడం వల్ల కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ, ప్రతి పేరాకి అమ్మమ్మనో, మేనత్తనో, పెద్దమ్మ నో , స్నేహితురాళ్ళ తల్లుల్నో గుర్తు చేసుకుంటూ &#8220;అవును, నిజమే, నిజమే&#8221; అని ఆశ్చర్య పోతూ చదివాను. ఇందులో పతివ్రత పిన్ని పాత్ర మా అత్తదే! ఈ పిన్ని పాత్ర ప్రతి ఇంట్లోనూ ముందు తరంలోనో, నడుస్తున్న తరంలోనూ తప్పక ఉండి తీరుతుంది. మిగతా పాత్రలకు కూడా ప్రతి రూపాలు ఎక్కడో ఒక చోట ఎదురు పడక మానవు.</p>
<p>ఆ తర్వాత ఆ పుస్తకాన్ని వీలైనంత మందికి ఇచ్చి ఆ కథను స్నేహితులతో పంచుకుని ఆ పైన భద్రంగా దాచుకున్నాను.</p>
<p>&nbsp;</p>
<p>పల్లె లో జరుగుతున్నా కజిన్ శ్రీలక్ష్మి పెళ్ళికి జయ తన తల్లితో పాటు వస్తుంది . ఆ పెళ్లి కి ఇంకా ఆమె పెద్దమ్మ, పిన్ని , ఇతర బంధువులు అందరూ వస్తారు . ఆ పెళ్లి లో కలిసిన మూడు తరాల స్త్రీలు, వారి జీవితాలను ఏదో ఒక రకంగా ప్రభావితం చేయడమో లేక నిర్దేశించడమో చేసిన పురుషులు , నోరు పెట్టుకుని కొందరు, సేవలు చేస్తూ కొందరు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే గృహిణులు &#8230; పల్లెలో ఉంటూ అభివృద్ధి పథంలో ఆలోచించే యువకులు, పట్నం చేరి స్వార్థం తో ప్రవర్తించే మరి కొందరు, ఎన్నేళ్ళు వచ్చినా తమకేం కావాలో తెలుసుకోలేక తల్లి దండ్రులు చూసే పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసే డాక్టరేట్ యువతులు .. ఇలా అనేక పాత్రలు కనిపిస్తాయి, వివిధ దృక్పథాలకు, ఆలోచనలకు పత్రీకలు గా !</p>
<p>ఈ కథలో జరిగే పెళ్లికి పెద్ద ప్రాముఖ్యం ఏమీ ఉండదు . పాత్రలన్నీ తమ జీవితాల్ని తాము తరచి చూసుకుంటూ తమను తాము వేసుకున్న ప్రశ్నలే అనేక విషయాలను, మారి పోతున్న మానవ సంబంధాలను చర్చకు పెడతాయి . ఉన్న ఆస్తులను అమ్మి, గ్రామాలను వదిలి నగరాలకు పోతున్న వలస జీవులు పొందు తున్నదేమిటి, భూమిని నమ్మి గ్రామాల్లోనే ఉన్న రైతులు పొందనిది ఏమిటి అనే ప్రశ్న రాజు అందరిలోనూ రేకెత్తిస్తాడు . సినిమా హాళ్ళు ,బ్యుటి షియన్ల తో సహా ప్రతిదీ అందుబాటులో ఉండే సంపన్న గ్రామాలు నగరాలకు ఏ మాత్రమూ తీసి పోక పోయినా, ప్రశాంతమైన జీవితం అందుబాటులో ఉన్నా ఉరకలు పరుగుల నగర జీవితానికి పరుగులు పెట్టె వారిని ఈ కథ ప్రశ్నిస్తుంది .</p>
<p>ఇక ఈ కథలోని స్త్రీల విషయానికొస్తే తనకేమి కావాలో నిర్ణయించుకునే అధికారాన్ని తనే తీసుకుని జీవితాన్ని మలచుకున్న స్త్రీ జయ తల్లి అయితే, కొద్దో గొప్పో నోరు పెట్టుకుని భర్తని అదుపులో పెట్టిందన్న పేరుతొ బతికేస్తుంది జయ పెద్దమ్మ ! వీళ్ళిద్దరి కంటే భిన్నమైనది పతివ్రత పిన్ని పాత్ర . నిరంతరం భర్త వెన్నంటి ఉండి నానా రకాల సేవలు చేస్తూ, ఆ తను లేక పొతే భర్త బతక లేడేమో అన్న భ్రమలో తనను తానూ మభ్య పెట్టుకుంటూ , చూపరులను మభ్య పెడుతూ , ఆ భ్రమ తన భర్తకు కూడా ఉందని తనను తానూ నమ్మించుకుంటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికే పతివ్రత పిన్ని పాత్ర మీద చాలా జాలి వేస్తుంది . సత్యవతి గారి కథల్లో ఇలా ఆత్మ వంచన చేసుకునే స్త్రీ పాత్రలు తరచూ కనిపిస్తూ ఆలోచనలని రెకెత్తిస్తాయి. సూపర్ మామ్ సిండ్రోమ్ ,ఒక రాజ్యం కథ ఇంకా మరి కొన్ని కథల్లో ఇలాటి పాత్రలని చూడవచ్చు .</p>
<p>ఈ కథలో ఆమె ఆ ఇంటి ఆడపిల్లల జీవితాలు ఆ కుటుంబ పెద్ద ఆధిపత్యానికి, కుటుంబ రాజకీయాలకు ఎలా ప్రభావితమై పోయాయో స్పష్టంగా చూపిస్తారు . భర్తను కోల్పోయి, దిక్కు లేక ఉన్న కాస్త ఆస్తిని అన్న చేతిలోనో తమ్ముడి చేతిలోనో పెట్టి, వాళ్ళింట్లోనే పని మనిషులుగా బతికే పాత తరం స్త్రీల నుంచి, భర్తలు చేసే పనులను నిలదీసి అడగలేక ఆ స్ట్రెస్ ని భరించ లేక హిస్టీరియా పేషంట్లు గా మారిన స్త్రీల వరకు, డాక్టరేట్ చేసినా అమ్మ చెప్పగానే అలంకరించుకుని &#8220;నలుగురి కంటా &#8221; పడాలని అలంకరించుకుని వడ్డనకు బయలు దేరే 30 ఏళ్ళ సుధ నుంచి కోరుకున్న మనిషి అందుబాటులోనే ఉన్నా తల్లి దండ్రులను కాదనలేక తల వచ్చి వాళ్ళు చుసిన అబ్బాయితోనే తాళి కట్టించుకునే పెళ్లి కూతుఋ శ్రీ లక్ష్మి వరకు వరకు అనేక జీవితాలు .</p>
<p>నలుగురైదుగురు ఆడపిల్లలున్న ఆ నాటి కుటుంబాల్లో ఏదో ఒక విధంగా ఆడ పిల్లలకు పెళ్లి చేసి వదిలించుకోవడం తప్ప , వారికి కూడా పిత్రార్జితంలో భాగం ఇవ్వాలని తోచని తండ్రులను ఈ కథ నిలదీస్తుంది</p>
<p>ఈ కథ నేపధ్యాన్ని సత్యవతి గారు ఇటీవల విడుదల అయిన &#8216;కథ-నేపథ్యం&#8221; లో వివరించారు . ఈ కథలోని పాత్రలన్నీ ఆమె దాదాపుగా స్వయంగా చూసినవే . &#8220;తమాషా ఏమిటంటే ఆ రోజుల్లొ నాకు ఆడవాళ్ళలో రెండే రకాల వాళ్ళు కనిపించే వాళ్ళు . చాలా మంచి వాళ్ళు, గయ్యాళి వాళ్ళు . బ్రతుకంతా పతి సేవ కే అన్నట్లు అడుగులకు మడుగులోట్టే స్త్రీలు, బాగా అలంకరించుకుని ఖరీదైన దుస్తులలో ఉండి , అందరి మీదా అధికారం చలాయిస్తూ తమ మాటకి ఎవరైనా ఎదురు చెప్తే అరిచి పోట్లాడి అఘాయిత్యం చేసే స్త్రీలు, మాట మాట కి కళ్ళు తుడుచుకునే స్త్రీలు, దెప్పుతూ సాధిస్తూ ఉండే వాళ్ళు, గట్ట్టిగా నవ్వని వాళ్ళు, సూటిగా ఎదుటి వాళ్ళ మొహం లోకి చూసి మాట్లాడని వాళ్ళు ఇలా ఎంతోమంది నా తోటి స్త్రీలు నా దృష్టి లోకి వచ్చారు . వీళ్ళంతా నా వాళ్ళే ! వాళ్ళు అందరినీ ఒక అభద్రతా భావం అస్తమానం వెంటాడుతూ ఉంటుందని, తమ ఉనికిని కాపాడుకోడానికి చేసే ప్రయత్నమే ఈ పాతివ్రత్యం, గయ్యాళి తనం రెండూ నని అర్థమైంది . ఈ కపటం లో తమని తము మరచి పోయిన పరాయి తనంలో వాళ్ళు జీవితంలో రాజీపడి పోతున్న విధం నన్ను చాలా కష్ట పెట్టింది &#8221; అని విశ్లేషిస్తారు సత్యవతి.</p>
<p>ఇంతకంటే స్త్రీల ప్రవృత్తులను ఎవరైనా అర్థం చేసుకోగలరని,. వివరించగలరని అనుకోను . ఈ విశ్లేషణ లోంచి పుట్టిందే ఈ కథ . అలాగే పట్నాలకు పోతున్న వలసలు, ఆడ పిల్లలకు ఆస్తి లో వాటా లేక పోవడం వంటి విషయాలు తను బాధ పెట్టాయని ఆమె అంటారు . ఈ కథలో ఈ విషయం మీద అర్థ వంతమైన చర్చ జరుగుతుంది .</p>
<p>ఈ చర్చతర్వాత నిజంగా ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతాం .</p>
<p>ఇలాటిస్త్రీలను, వారి స్థితి గతులనుచూసిన తర్వాత, చదువు తనను ప్రతి విషయాన్ని గురించి ప్రశ్నించడం నేర్పిందని చెప్తారు రచయిత్రి .ఎలా ఉండాలో ఒకవైపు నుంచి, అదే సమయంలో ఎలా ఉండకూడదో మరో వైపు నుంచి అర్థమైందని అంటారు .<br />
రచయిత్రి చెప్పినట్లు &#8220;పెళ్లి ప్రయాణం&#8221; కథలో మూడు దశాబ్దాల జీవితం ఉంది<br />
మూడు తరాల స్త్రీలున్నారు .<br />
వారి వ్యధలు ఉన్నాయి.అవన్నీ కథగా రూపు దిద్దుకున్నాయి .<br />
అసలు పెళ్లి ప్రయాణం కథ చదవడం తప్ప ఆ కథకు గొప్ప పరిచయం లేదు.</p>
<p>పెళ్ళి ప్రయాణం కథ, తానా ప్రచురించిన కథ-నేపథ్యంలో లభిస్తోంది. ఈ పుస్తకం కినిగె లో ఈ పుస్తకం కూడా దొరుకుతోంది.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3286</wfw:commentRss>
		<slash:comments>15</slash:comments>
		</item>
		<item>
		<title>రచయితలు సరైన భాష వాడకపోతే, అది భాష మీద కుట్రే</title>
		<link>http://vaakili.com/patrika/?p=2693</link>
		<comments>http://vaakili.com/patrika/?p=2693#comments</comments>
		<pubDate>Tue, 30 Apr 2013 21:12:07 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=2693</guid>
		<description><![CDATA[<p>ఒక మనిషి ఒక పుస్తకం చేతిలోకి తీసుకున్నాడనుకోండి. మొదటి వాక్యం అర్థమైతేనే రెండో వాక్యంలోకి వెళ్తాడు. మొదటి పేరా అర్థమైతేనే రెండో పేరాలోకి వెళ్తాడు. మంచినీళ్లు తాగుతూ ఉంటే అవి కడుపులోకి ఎలా దిగిపోతాయో, పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లోని విషయాలు అలా మెదడులోకి వెళ్లిపోతూ ఉండాలి&#8221; &#8211;కదా ! అయితే ఇదే ఈ కథ సారాంశం!</p> <p>కుట్ర కథ గురించి : రంగనాయకమ్మ గారు భాష విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే !! ఏది రాసినా సులభమైన రీతిలో, క్లిష్టమైన విషయాలు సైతం పాఠకుడికి త్వరగా అర్థమయ్యేలా సులభ రీతిలో విడదీసి వివరిస్తారు. సరళమైన వాడుక భాష వాడతారు. &#8220;వాడుక భాషే రాస్తున్నామా&#8221; అనే పుస్తకం కూడా రాసిన సంగతి మనలో చాలా మందికి తెలుసు. ఆమె రాసిన కథల్లో నాకు బాగా నచ్చే కథ, చదివి &#8220;అబ్బ, నిజమే &#8220;అనుకున్న కథా ఒకటి ఉంది. దాని పేరు &#8220;కుట్ర&#8221;</p> <p>కథకు నేపథ్యం : కథ అంతా కమ్యూనిస్టు సాహిత్యం గురించి సాగుతుంది. కానీ ఈ కథలోని అంశాలు కమ్యూనిస్టు పుస్తకాలకే కాక, మామూలు సాహిత్యానికి, రచయీతలు రాసే భాషకీ కూడా వర్తిస్తాయి.</p> <p>మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు కాదు కానీ, స్నేహితుల ప్రోద్బలం వల్ల కమ్యూనిస్టు పత్రికలకు చందాలు కడుతూ ఉండేవారు. కమ్యూనిస్టు సాహిత్యం అంటే ఇంట్లో వాళ్ళకి విరక్తి కలగడానికి, కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆలోచనలు &#8220;అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం&#8221; గా మా మెదళ్ళలో రూపు దిద్దుకోడానికి ఆ తెలుగు పుస్తకాలే కారణం.</p> <p>వాటిలో సోవియట్ భూమి లో ఫొటోలు మాత్రం మాకు బాగా నచ్చి క్లాసు పుస్తకాలకు అట్టలు వేసుకోడానికి వాడేవాళ్లం!</p> <p>మేము చిన్న పిల్లలుగా ఉన్నపుడు విద్యార్థి సంఘాల వాళ్ళు గోడల మీద, గోడ పొడుగునా జేగురు రంగులో రాసే విప్లవ నినాదాలు ఆసక్తి తో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg"><img class="size-full wp-image-946 alignleft" title="sujatha" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg" alt="" width="96" height="133" /></a>ఒక మనిషి ఒక పుస్తకం చేతిలోకి తీసుకున్నాడనుకోండి. మొదటి వాక్యం అర్థమైతేనే రెండో వాక్యంలోకి వెళ్తాడు. మొదటి పేరా అర్థమైతేనే రెండో పేరాలోకి వెళ్తాడు. మంచినీళ్లు తాగుతూ ఉంటే అవి కడుపులోకి ఎలా దిగిపోతాయో, పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లోని విషయాలు అలా మెదడులోకి వెళ్లిపోతూ ఉండాలి&#8221; &#8211;కదా ! అయితే ఇదే ఈ కథ సారాంశం!</p>
<p><strong>కుట్ర కథ గురించి</strong> : రంగనాయకమ్మ గారు భాష విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే !! ఏది రాసినా సులభమైన రీతిలో, క్లిష్టమైన విషయాలు సైతం పాఠకుడికి త్వరగా అర్థమయ్యేలా సులభ రీతిలో విడదీసి వివరిస్తారు. సరళమైన వాడుక భాష వాడతారు. &#8220;వాడుక భాషే రాస్తున్నామా&#8221; అనే పుస్తకం కూడా రాసిన సంగతి మనలో చాలా మందికి తెలుసు. ఆమె రాసిన కథల్లో నాకు బాగా నచ్చే కథ, చదివి &#8220;అబ్బ, నిజమే &#8220;అనుకున్న కథా ఒకటి ఉంది. దాని పేరు &#8220;కుట్ర&#8221;</p>
<p><strong>కథకు నేపథ్యం</strong> : కథ అంతా కమ్యూనిస్టు సాహిత్యం గురించి సాగుతుంది. కానీ ఈ కథలోని అంశాలు కమ్యూనిస్టు పుస్తకాలకే కాక, మామూలు సాహిత్యానికి, రచయీతలు రాసే భాషకీ కూడా వర్తిస్తాయి.</p>
<p>మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు కాదు కానీ, స్నేహితుల ప్రోద్బలం వల్ల కమ్యూనిస్టు పత్రికలకు చందాలు కడుతూ ఉండేవారు. కమ్యూనిస్టు సాహిత్యం అంటే ఇంట్లో వాళ్ళకి విరక్తి కలగడానికి, కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆలోచనలు &#8220;అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం&#8221; గా మా మెదళ్ళలో రూపు దిద్దుకోడానికి ఆ తెలుగు పుస్తకాలే కారణం.</p>
<p>వాటిలో సోవియట్ భూమి లో ఫొటోలు మాత్రం మాకు బాగా నచ్చి క్లాసు పుస్తకాలకు అట్టలు వేసుకోడానికి వాడేవాళ్లం!</p>
<p>మేము చిన్న పిల్లలుగా ఉన్నపుడు విద్యార్థి సంఘాల వాళ్ళు గోడల మీద, గోడ పొడుగునా జేగురు రంగులో రాసే విప్లవ నినాదాలు ఆసక్తి తో చదివే వాళ్లం తప్ప, ఒక్క ముక్కా అర్థమైన పాపాన పోలా!</p>
<p>కొంత ఎదిగి, కాలేజీ రోజులకు వచ్చాక, ఆ పుస్తకాలను తెలుగులో కంటే ఇంగ్లీష్ లో చదివి కొంత అవగాహన ఏర్పరచుకోవచ్చనే విషయం అర్థమైంది.అంత చక్కగా ఉంటుంది ఆ తెలుగు.</p>
<p>&#8220;కుట్ర&#8221; కథ కూడా నేను అప్పుడే చదివాను. దాంతో ఆ కథ మరింత నచ్చింది</p>
<p><strong>సంగ్రహంగా కథ</strong> : కథ లో వాతావారణం 70లు, 80 ల్లోది !కొంతమంది విప్లవ కారులు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నారని కేసు నమోదవుతుంది. కోర్టులో వాద ప్రతివాదనలు పూర్తయ్యాక ఆ రోజు జడ్జి తీర్పు ఇవ్వాల్సి ఉంది. జడ్జి చాలా మంచి వాడు. చట్టం కంటే న్యాయం మీద నమ్మకం ఉన్నవాడు. ఉద్యోగం పోతే పోయిందిలే అని న్యాయ ప్రకారమే తీర్పులిచ్చే వాడూనూ!</p>
<p>ఆయన తీర్పు ప్రకటించే ముందు ప్రసంగిస్తాడు. విప్లవకారుల ఆలోచనలన్నీ చక్కగా ఉన్నాయని మెచ్చుకుంటాడు. దేశం లో ప్రజలు ఆకలితో, నిరుద్యోగంతో బాధ పడుతూ ఉంటే మరో పక్క లంచగొండితనం, అధిక ధరలు, అరాచకత్వం పెచ్చు మీరినపుడు అలాంటి ప్రభుత్వాన్ని కూల దోయకుండా ఎవరుండగలరు? దేశ ద్రోహులు తప్ప?&#8221; అని రక రకాలుగా విప్లవ కారుల్ని అభినందిస్తాడు.</p>
<p>&#8220;<strong>విప్ల కారుల్ని దేశ భక్తులుగా భావించి వదిలిపెడుతున్నాను&#8230;.</strong>&#8221; అని జడ్జి ప్రకటించగానే కోర్టు హాల్ నిండా గుమి కూడిన విప్లవకారుల మద్దతు దారులు హర్ష ధ్వానాలు చేయబోతారు పాపం !!</p>
<p>జడ్జి ఆ వెంటనే&#8221; <strong>కానీ, మీరు కుట్రే పన్నారు. విప్లవం రాకుండా చెయ్యడానికి..</strong>&#8220;అంటాడు. జనానికి ఏమీ అర్థం కాదు.</p>
<p>ఇక జడ్జి, విప్లకారులు రాసిన , ప్రచారం చేస్తున్న విప్లవ సాహిత్యం లో వాడిన భాషని మొత్తం చీల్చి చెండాడటం మొదలు పెడతాడు. ఇలాగేనా రాసేది? అని వాళ్ల మీద విరుచుకు పడతాడు.</p>
<p>విప్లవకారులు రాస్తున్న భాషే కొరుకుడు పడక, ప్రజలకు వారి భావాల్ని అందకుండా చేస్తోందని, అదొక బ్రహ్మ పదార్థం గా మారిందని చీవాట్లు పెడతాడు.</p>
<p>వాళ్ళ విప్లవ సాహిత్యంలోంచి కొన్ని లైన్లు ఉదహరించి, కోర్టు హాల్లో ఉన్న వాళ్ళని వివరించమని అడుగుతాడు . జడ్జి. ఎవరూ సరిగా వివరించలేకపోతారు. ప్రజల కోసమే రాస్తున్నామని మీరు చెప్తున్నది నిజమే అయితే, ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాయనివి ప్రజలకు చేరతాయని ఎలా భావిస్తారు మీరు? అని నిలదీస్తాడు</p>
<p>కథలో జడ్జి ఉదహరించిన కొన్ని వాక్యాలు, వాటి మీద ఆయన విసుర్లూ</p>
<p>&#8220;<strong>అడగబడింది, కోరబడింది,చెప్పబడింది..అని బడులు గుప్పిస్తారేమయ్యా? మీ తాతలూ తండ్రులూ ఇలాంటి బడుల భాష మాట్లాడగా విన్నారా ఎప్పుడైనా? &#8220;అన్నం పెట్టబడింది</strong>&#8221; అని మీ తల్లులు ఎప్పుడైనా అన్నారా?&#8221;</p>
<p>&#8220;<strong>హరి జనులు, గిరిజనులకు భూములు ఇవ్వాలి&#8221; &#8211;&#8221;హరిజనులు గిరిజనలు భూములు ఇవ్వాలా? ఎక్కడ దెచ్చీ? వాళ్ళకేడ్చినయ్యా ఇంకోళ్ళకివ్వడానికీ?</strong>&#8221;</p>
<p>&#8220;<strong>దేశంలో ఉప్పు, బట్టలకు కొరత ఏర్పడింది &#8221; నూలు బట్టలూ, సిల్కు బట్టలూ ఉండటం ఎరుగుదుము కానీ ఉప్పుబట్టలూ, తీపి బట్టలూ ఉంటాయని ఎరగను సుమండీ..</strong></p>
<p>&#8220;<strong>స్త్రీలు, హరిజనుల పైన అత్యాచారాలు చేశారు&#8221; &#8211;స్త్రీలు హరిజనుల మీద అత్యాచారాలు చేశారట. స్త్రీల మీద అత్తలూ, భర్తలూ వేసే అభాండాలు చాలక ఇదొకటా?&#8221;</strong></p>
<p>ఇలా జడ్జి అనేక స్టేట్మెంట్లు, ప్రకటనలు , వాక్యాలు విప్లవ సాహిత్యం నుంచి పట్టుకొచ్చి, అవి మామూలు జనానికి ఎంత మాత్రమూ అర్థమయ్యే రీతిలో లేవని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. కోర్టు హాలులో ఉన్న విప్లవ కారుల సానుభూతి పరులు కూడా నసుగుతూనే అవి తమకు ఎంత మాత్రమూ అర్థం కావని ఒప్పుకుంటారు.</p>
<p>చివరికి జడ్జి విప్లవకారులకు పదేళ్ల జైలు శిక్ష వేస్తాడు. ఎందుకూ? ప్రభుత్వం మీద కుట్ర పన్నినందుకు కాక, విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు చేరకుండా కఠొరమైన భాష వాడినందుకు. భాష మీద ఇంట కుట్ర చేసినందుకు!!</p>
<p>ఈ పదేళ్ళూ జైల్లో తోటి ఖైదీలతో మాట్లాడి వాడుక భాష నేర్చుకోమంటాడు. పాత తెలుగు రచయితల పుస్తకాలన్నీ చదివి సరళమైన భాష నేర్చుకుని అర్థమయ్యే తెలుగు రాయమని జైలుకు పంపుతాడు.</p>
<p>కథలో ప్రతి వాక్యమూ ఎంతో ఆసక్తి కరంగా నడుస్తుంది. రంగనాయకమ్మగారి సహజ హాస్య ధోరణి చాలా చోట్ల బాగా నవ్విస్తుంది.మొహమాటం లేకుండా విప్లవసాహిత్య కారులను పెట్టే చీవాట్లు,వ్యంగ్యాలు పాఠకుడికి &#8216;అవునవును&#8221; అనిపిస్తూ కథ మొత్తాన్ని ఆసక్తి కరంగా నడిపిస్తాయి.</p>
<p><strong>కథను ఈ లింక్ లో చదవొచ్చు</strong>: http://www.scribd.com/doc/135952758/Kutra</p>
<p><strong>రచయితలూ-భాష</strong> : ఈ కథ కేవలం విప్లవ కారుల అయోమయపు తెలుగు ని మాత్రమే చర్చిస్తుంది. కానీ ఇది రచయితలు అందరూ పట్టించుకోవలసిన సీరియస్ విషయం. చాలా మంది రచయితలు సులభంగా చెప్పవలసిన విషయాన్ని పేరాల కొద్దీ రాసి కాంప్లికేట్ చేసే ప్రతిభను సొంతం చేసుకుని ఉంటారు. అలాగే కొంతమంది భావుకత పేరుతో సులభ విషయాన్ని సంక్లిష్టం చేస్తారు.</p>
<p><strong>కొందరు రచయితల సంక్లిష్టమైన భాష</strong> : వడ్డెర చండీ దాస్ గారి భాష స్కూలు రోజుల్లో ఉన్నపుడు అసలు అర్థమయ్యేది కాదు నాకు. ఆ భావ ధారను , తాత్వికతను అర్థం చేసుకునే పరిణతి కొంతయినా సాధిస్తే తప్ప అది వీలు పడదని మాత్రం అర్థమైంది. అయినప్పటికీ ఇప్పటికీ అనుక్షణికం చదువుతుంటే అక్కడక్కడ ఆగి పోయి, కాసేపు అబ్బుర పడటమూ, మరి కొన్ని చోట్ల ఇబ్బంది పడటమూ చేస్తుంటాను.</p>
<p>అలాంటి గాఢత ఈ మధ్య కాశీభట్ల వేణుగోపాల్ గారి నవలల్లో చూస్తున్నాను . కానీ కాశీభట్ల గారు చాలా చోట్ల అనేక పదాలను వాక్యాల్ని కలిపేసి రాస్తుండటం మాత్రం నాకసలు కొరుకుడు పడనే పడదు. ఒకటికి నాలుగు సార్లు ఆ వాక్యాన్ని చదవాల్సి వస్తుంది. అసలు అలా కలిపేసి రాయడం కష్టం కూడానే అనిపిస్తుంది.</p>
<p>సరే&#8230;. రాయడం ఆయనకు కష్టం అయినా కాక పోయినా పాఠకుడికి ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగానే అర్థం చేసుకోడం మాత్రం కష్టమే!</p>
<p>ఈ విషయాన్ని ఒకసారి నేను ఒకచోట ప్రస్తావిస్తే, కొంతమంది మిత్రులు &#8220;అవునవును &#8220;అని ఒప్పుకున్నారు. మరి ఎవరూ చెప్పరేం ఈ విషయాన్ని? అని అడిగితే &#8220;మనం అలా చెప్తే బాగుంటుందా? ఎవరూ చెప్పడం లేదుగా&#8221; అన్నారు ఒకరు. ఎవరూ చెప్పకపోతే ఎప్పటికీ అదే సరైన ధోరణిగా చెలామణి అయిపోతుందిగా!</p>
<p>రచయిత స్థాయి ఏదైనా reader friendly గా రాయాల్సిన అవసరం ఉందని మాత్రం నేను నమ్ముతాను.</p>
<p>నికషం నుంచి కొన్ని వాక్యాలు &#8220;<strong>వచ్చిన వాడికి ఆడవాళ్ళు కుంపట్లన్జుపుతోన్నారు</strong>&#8221;</p>
<p>&#8220;<strong>సంథింగీజ్రాంగ్</strong> &#8221; (మూడు సార్లు చదివితే తప్ప ఇది some thing is wrong అని తట్టలేదు . మొదటి సారే అర్థమైన పాఠకులకు అభినందనలు )</p>
<p><strong>డొన్మెక్మిక్రై</strong> (dont make me cry )</p>
<p>నికషం లోనే కాక ఇతర రచనల్లో సైతం ఈ ధోరణి కనిపిస్తుంది . నేనైతే ఆసక్తి చదువుతూ చదువుతూ ఇలాంటి వాక్యాల దగ్గర ఆగి పోతూ, ఒక్కోసారి వదిలేస్తూ పోయాను కూడా! చదవడాన్ని కుంటు పరిచే రాత పాఠకుడి ఆసక్తిని కూడా కుంటు పడేస్తుంది</p>
<p>కథలో చక్కని భాష, ఎలాంటి అయోమయానికీ చోటివ్వని సరళమైన భాష కథతో పాటుగా పాఠకుడికి ఆసక్తి కల్గిస్తుంది.</p>
<p>అసలు చలం ఒక గొప్ప మాట అన్నాడు &#8221; <strong>తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి -ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు!</strong></p>
<p><strong>సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోరిక’</strong> &#8211;,చలం, ఇది నీ కోరికే కాదు &#8230;. సర్వ పాఠకుల కోరికా ఇదే! కాకపోతే రచయితలెప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు కాబట్టి వాళ్ళు రాసింది మనం చదవాలే కానీ, ఇలా ఉందేంటి? అలా రాశారేంటి? అని అడక్కూడదు. అర్థం కాలేదని అసలే బయట పడకూడదు. వీలైనంత గాంభీర్యం వహించి తల పంకించాలి.</p>
<p><strong>భాషా విమర్శకులేమన్నారు ?</strong></p>
<p>కథల్లో నవలల్లో వాడే భాష పట్ల రచయితలు ఒక్కోసారి ఎంత నిర్లక్ష్యంగానో లేక ఏమరుపాటుగానో ఉంటారో రాచమల్లు రామ చంద్రా రెడ్డి గారు &#8220;అనువాద సమస్యలు&#8221; పుస్తకం లో ఆసక్తి కరంగా ఉదాహరణలతో సహా వివరిస్తారు. ఒక్కొక్కటీ చూడండి&#8230;ఈ ఉదాహరణలు అన్నీ ఆ పుస్తకం నుంచి తీసుకున్నవే!</p>
<p>1.కీర్తిశేషుడు బుచ్చిబాబు ప్రసిద్ధ రచయిత. అనేక కథలూ, నాటికలూ, ‘<strong>చివరికి మిగిలేది</strong>’ అనే సుప్రసిద్ధ నవలా రాసినవాడు.</p>
<p>‘కాలచక్రం నిలచింది’ అనేది ఆయన కథల్లో ఒకటి. దానిలో ఒక పాత్ర ‘విల్లు’ వ్రాసిగాని ‘విమానం ఎక్కడం మూర్ఖత్వం’ అంటాడు. ఈ వాక్యంలో వున్నది అన్వయదోషం కాదుగానీ, చెప్పదలచుకున్న భావాన్ని వ్యక్తం చేయడంలో అసమర్థత కనిపిస్తున్నది. అనగా, భావానికి తగిన వాక్య నిర్మాణం చేతగాకపోవడం. ‘విల్లు రాయకుండా విమానం యెక్కడం మూర్ఖత్వం’ అని ఆ వాక్యం రాసి వుండవచ్చు.</p>
<p>రచయిత చెప్పదలచుకున్న భావం అది ‘విల్లు రాసి గాని విమానం యెక్కకూడదు ; యెక్కడం మూర్ఖత్వం’ అని రాసినా ఆ భావం స్పష్టంగా వ్యక్తమౌతుంది.</p>
<p>రచయిత ఉద్దేశం అస్పష్టంగానైనా మనకు తెలుస్తున్నది కనుక యీ వాక్యంలోని దోషం అసమర్థ వాక్యనిర్మాణం అని చెప్పగలుగుతున్నాం. రచయిత ఉద్దేశం చూచాయగా కూడా మనకు బోధపడకపోతే దాన్ని అయోమయం అంటారు.</p>
<p>2. యద్దనపూడి సులోచనారాణి గారు తెలుగు నవలా రచయితలలో ప్రసిద్ధులు.</p>
<p>&#8230; ఆమె నవలలు యేవీ చదవలేదు గానీ, ఆమె రాసిన ‘కీర్తి కిరీటాలు’ యిటీవల యాదృచ్ఛికంగా నా కండ్లబడితే , చూద్దామని మొదలుపెట్టి, మొదటి ప్రకరణంలో మొదటి వాక్యం చదివినాను.</p>
<p>రెండవ వాక్యం చదవబోతే యిలా ఉంది : ‘<strong>విజయవాడ 25 కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర &#8230;</strong>’ యిక చాలు అనిపించింది. పుస్తకం మూసేసినాను. మైలు రాయి మీద కిలోమీటర్లు యెందుకుంటాయి! అవి కిలోమీటర్లైతే దాన్నిమైలురాయి అని యెలా అంటారు!</p>
<p>మైలుకూ, కిలోమీటరుకూ భేదం తెలియదా రచయితకు? తెలిసేవుంటుంది. కానీ, ఆలోచించకుండా నవలలు రాసిపారెయ్యడం అలవాటైంది మన నవలాకారులకు. ఒక యద్దనపూడినే యెందుకనాలి గానీ , తెలుగు నవలా సాహిత్య చరిత్రలో ‘మైలురాళ్ళు’ చాలా వున్నాయి.</p>
<p>3. ఆర్. సంధ్యాదేవి రాసిన ‘నీలిమహల్ ’ అనే నవల యీ మధ్య యెక్కడో కనిపించింది. కొత్త రచయితలాగుందే అనుకుంటూ అట్ట తిప్పినాను. లోపలి అట్ట మీద ఆమె రాసిన యిరవై నవలల పట్టీ వుంది. యిరవై నవలలు రాసిన రచయిత పేరు అంతవరకు నాకు తెలియకపోవడం నా తప్పే అనుకుంటూ మొదటి ప్రకరణం చదవబోయినాను.</p>
<p>యిలా మొదలైంది : ‘<strong>ఎస్టేటంతా కోలాహలంగా సంతోషంగా సందడిగా వుంది. ప్రతి వక్కరి కళ్ళల్లో వెలుగు వెన్నెలలు వెదజల్లనారంభించాయి.</strong>’ రెండవ వాక్యం చదివేటప్పటికి నా తల తిరిగిపోయింది. ఆ వాక్యంలో క్రియ యేదో తెలుస్తున్నది గానీ, కర్త యేదో, కర్మ యేదో తెలియడం లేదు. వాక్యం మళ్ళీ మళ్ళీ చదివినా నాకు తెలియలేదు. ఆ వాక్యంలో ‘వెలుగు వెన్నెలలు’ అనేది కర్త అంటారా, కర్మ అంటారా? భగవంతునికే తెలియాలి.</p>
<p>నా కనిపించే దేమిటంటే, మొత్తం ఆ వాక్యమే తెలుగు పాఠకుల కర్మ; దానికి కర్త సంధ్యాదేవి గారు; క్రియ భగవంతుడు!</p>
<p>అసలు రహస్యం యేమిటంటే- కొంతసేపు తర్వాత నాకు అర్థమైంది- ‘వెదజల్లు’ అనే మాటకు అర్థమేమిటో రచయితకు తెలియదు. అర్థమే తెలియనప్పుడు, ఆ క్రియ అకర్మకమో, సకర్మకమో యెలా తెలుస్తుంది! అందువల్లనే ఆ వాక్యం మన కర్మ అయింది.</p>
<p>4.‘అయిష్టత’అనే మాట అటు వ్యాకరణ బద్ధమూ కాదు, యిటు వ్యావహారికమూ కాదు.</p>
<p>ఆశ్చర్యకరమైనదేమిటంటే, కుటుంబరావు గారి ‘నీకేం కావాలి’ అనే పెద్ద కథ (కుటుంబరావు సాహిత్యం- ఐదవ సంపుటం)లో యీ వాక్యం వుంది : ‘కస్తూరి తన అయిష్టతలు అందరికీ చెబుతుంది గాని తన ఇష్టాలింకోరికి చెప్పదు.’ యిష్టం, యిష్టాలు అనే మాటల్లో తకారం లేదు గదా. అయిష్టం, అయిష్టాలు అనే మాటల్లో తకారం యెందుకు రావాలి!</p>
<p>5. (భాషలోని దోషాల గురించి కుట్ర కథ రాసిన రంగనాయకమ్మ గారు కూడా రా.రా కి ఒక తప్పు విషయంలో చిక్కారు.)</p>
<p>రంగనాయకమ్మ గారి ‘అమ్మ’ అనే కథల సంపుటిలో మొదటి కథ పేరు అదే.</p>
<p>ఆ కథలో ఒక వాక్యం యిది : ‘అందరిలాగే ఆయన ఓ ఘడియ విస్తుపోయినట్లు చూసి మళ్ళా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు’. గడియ అంటే రచయితకు అర్థం తెలిసినట్టు లేదు. క్షణమో, కొద్ది క్షణాలో అనుకున్నట్లుంది. గడియ అంటే 24 నిమిషాలు. ఒకరోజుకు 60 గడియలు.</p>
<p>6. అల్లం శేషగిరిరావు గారు తెలుగులో వేటకథల నిపుణుడుగా ప్రసిద్ధుడు. ‘మంచి ముత్యాలు’ అనే ఆయన కథల సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.</p>
<p>ఆ సంపుటిలోని ‘వఱడు’ అనే రెండవ కథ చివరిభాగంలో ఈ వాక్యాలు వున్నాయి : ‘<strong>చిన్నయ్య కేంపు విడిచి రోడ్డెక్కిపోయాడు. వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. వీపు మీద హరికేన్ లాంతరూ, వాటరు బాటిలూ ఒకదాన్నొకటి కొట్టుకుంటూ టకటకలాడటం కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. వెన్నెల పొడిచి పిండారబోసినట్టుంది’</strong>.</p>
<p>ఇక్కడ రచయిత ‘కర్ణాకర్ణిగా’ అనే మాటను తప్పుగా వాడినట్టు అనిపిస్తుంది. ఆ మాటకు ‘అస్పష్టంగా’ అనే అర్థం వుందని ఆయన అనుకున్నట్లుంది. అదొకటే కాదు. ‘వెన్నెల పొడిచి’ అనడం కూడా. నెల పొడుస్తుంది గానీ, వెన్నెల పొడవదు. వెన్నెల కాస్తుంది.</p>
<p>ఈ ఉదాహరణల్లో రా.రా ఎత్తి చూపిన దోషాలు మామూలు పాఠకుడికి, అచ్చ తెలుగు నుడికారం తెల్సిన సగటు పాఠకుడికి సులభంగా దొరికిపోయేవే! చదువుతూ ఉండగానే &#8220;ఇక్కడ ఏదో తేడాగా ఉందే&#8221; అని పసిగట్టేవే! అయితే మామూలు పాఠకులు &#8220;ఇవన్నీ సహజమే&#8221; అని వదిలి వేయడమూ ..రా రా వంటి విమర్శనాగ్రేసరులు వాటిని చీల్చి చెండాడ్డమూ జరుగుతుందన్న మాట <img src='http://vaakili.com/patrika/wp-includes/images/smilies/icon_smile.gif' alt=':-)' class='wp-smiley' /> </p>
<p>అమ్మకు ఆదివారం లేదా అనే 50 కథల సంపుటి లో ఈ &#8220;కుట్ర కథ కూడా ఉంది . ఇది అన్ని పుస్తకాల దుకాణాలతో పాటు కినిగే లో ఈ బుక్ గా కూడా లభిస్తుంది. http://kinige.com/kbook.php?id=923&amp;name=Ammaki+Adivaram+Leda</p>
<p>కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా చదివితే వాక్య నిర్మాణ దోషాలు,అన్వయ దోషాలు ఇవాళ వస్తున్న తెలుగు కథలు, నవలల్లో చాలా దొరుకుతాయి కానీ సగటు పాఠకుడికి వాటిని ఎత్తి చూపడం కంటే ముఖ్యమైన పనులుంటాయి కదా ! ఏమంటారు ??</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=2693</wfw:commentRss>
		<slash:comments>33</slash:comments>
		</item>
		<item>
		<title>సరి కొత్త భావాల్ని స్ఫురింపజేసే కథ &#8220;కురూపి&#8221;</title>
		<link>http://vaakili.com/patrika/?p=2116</link>
		<comments>http://vaakili.com/patrika/?p=2116#comments</comments>
		<pubDate>Mon, 01 Apr 2013 12:39:13 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=2116</guid>
		<description><![CDATA[కుటుంబరావు గారి పాత్రల్లో అసాధారణ సౌందర్య వతులూ, మేధా సంపన్నులు ,ఆరడుగుల అంద గాళ్ళు ఉండరు. మన చుట్టూ ఉండే సాదా సీదా మనుషులు,వాళ్ళ మానవ సహజమైన కక్షలు, కార్పణ్యాలు, కుళ్ళూ, కుట్రా,ప్రేమా, మోహం అన్నీ ఉంటాయి. మొత్తం మీద జీవితం  స్పష్టం గా ప్రతి బింబిస్తూ  కనిపిస్తుంది . అందుకే ఆయన కథలు చదువుతుంటే అదేదో పెద్ద సాహిత్యం టాగ్ తగిలించిన పుస్తకాలు చదువుతున్న ఫీల్ రాదు. గొప్ప విశ్లేషణ&#8230; ప్రతి రచనలోనూ  వరద కృష్ణమ్మ లాంటి ఫ్లో గుక్కతిప్పుకోనివ్వకుండా అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తుంది. దాదాపు 8000 పేజీల సాహిత్య సృష్టి! <p>ఇప్పటికీ చదివినపుడల్లా విస్తు పోతుంటాను. అంత సాహిత్యాన్ని  ఎలా సృష్టించారని! ఆయన కథల్లో నాకు దాదాపుగా నచ్చనివి ఏమీ లేవు. కొన్ని మరీ మరీ నచ్చి మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదివినవి ఉన్నాయి. వాటిలో ఒకటి &#8220;కురూపి&#8221; పెద్ద కథ ! ఈ కథ ఆయన రచనల్లో చాలా మందికి నచ్చే కథ!<br /> బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పది ! అది జీవితాల్లో వెలుగు నింపుతుంది&#8230;  అది శాశ్వతమైనది  ! ఇదీ కథ</p> ఈ అంశం తో ఎన్నో కథలు వచ్చి ఉండ లేదేమో !! కురూపి కథ మాత్రం ఒక సారి చదివిన తర్వాత అలా మనసులో ఎప్పటికీ నిల్చి ఉండి పోతుంది . ఇందులో కథానాయిక సరస్వతి అనాకారి .  రచయితా ఆమె అనాకారి అని ఊరుకుంటాడు తప్ప ఆ అనాకారి తనాన్ని వర్ణించడు. విమర్శకుడు రాచమల్లు రామ చంద్రా రెడ్డి గారు ఆ పేరుతోనే విభేదిస్తారు . ఏదో ఒక శారీరక లోపం లేకుండా కురూపి అని ఈ కథకు పేరు పెట్టారని, అనాకారులంతా కురూపులు కాదని అంటారాయన. కుటుంబరావు గారి స్త్రీ పాత్రలు వేటికవే ప్రత్యేకం గా ఉంటాయి . పార్వతి, రాజ్యం,లక్ష్మి, సరోజ,శాంత, శారద ,ఇందిర,శ్యామల &#8230;.. [...]]]></description>
			<content:encoded><![CDATA[<div><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg"><img class="alignleft size-full wp-image-946" title="sujatha" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg" alt="" width="96" height="133" /></a>కుటుంబరావు గారి పాత్రల్లో అసాధారణ సౌందర్య వతులూ, మేధా సంపన్నులు ,ఆరడుగుల అంద గాళ్ళు ఉండరు. మన చుట్టూ ఉండే సాదా సీదా మనుషులు,వాళ్ళ మానవ సహజమైన కక్షలు, కార్పణ్యాలు, కుళ్ళూ, కుట్రా,ప్రేమా, మోహం అన్నీ ఉంటాయి. మొత్తం మీద జీవితం  స్పష్టం గా ప్రతి బింబిస్తూ  కనిపిస్తుంది . అందుకే ఆయన కథలు చదువుతుంటే అదేదో పెద్ద సాహిత్యం టాగ్ తగిలించిన పుస్తకాలు చదువుతున్న ఫీల్ రాదు. గొప్ప విశ్లేషణ&#8230; ప్రతి రచనలోనూ  వరద కృష్ణమ్మ లాంటి ఫ్లో గుక్కతిప్పుకోనివ్వకుండా అక్షరాల వెంట పరుగులు పెట్టిస్తుంది. దాదాపు 8000 పేజీల సాహిత్య సృష్టి!</div>
<p>ఇప్పటికీ చదివినపుడల్లా విస్తు పోతుంటాను. అంత సాహిత్యాన్ని  ఎలా సృష్టించారని! ఆయన కథల్లో నాకు దాదాపుగా నచ్చనివి ఏమీ లేవు. కొన్ని మరీ మరీ నచ్చి మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదివినవి ఉన్నాయి. వాటిలో ఒకటి &#8220;కురూపి&#8221; పెద్ద కథ ! ఈ కథ ఆయన రచనల్లో చాలా మందికి నచ్చే కథ!<br />
బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పది ! అది జీవితాల్లో వెలుగు నింపుతుంది&#8230;  అది శాశ్వతమైనది  ! ఇదీ కథ</p>
<div>ఈ అంశం తో ఎన్నో కథలు వచ్చి ఉండ లేదేమో !! <strong>కురూపి</strong> కథ మాత్రం ఒక సారి చదివిన తర్వాత అలా మనసులో ఎప్పటికీ నిల్చి ఉండి పోతుంది . ఇందులో కథానాయిక సరస్వతి అనాకారి .  రచయితా ఆమె అనాకారి అని ఊరుకుంటాడు తప్ప ఆ అనాకారి తనాన్ని వర్ణించడు. విమర్శకుడు రాచమల్లు రామ చంద్రా రెడ్డి గారు ఆ పేరుతోనే విభేదిస్తారు . ఏదో ఒక శారీరక లోపం లేకుండా కురూపి అని ఈ కథకు పేరు పెట్టారని, అనాకారులంతా కురూపులు కాదని అంటారాయన.</div>
<div>కుటుంబరావు గారి స్త్రీ పాత్రలు వేటికవే ప్రత్యేకం గా ఉంటాయి . పార్వతి, రాజ్యం,లక్ష్మి, సరోజ,శాంత, శారద ,ఇందిర,శ్యామల &#8230;.. ఎవరికీ వాళ్ళే అద్భుత పాత్రలు. కాని సరస్వతి మాత్రం వీళ్ళు అందరికి భిన్నమైనది &#8230;. !</div>
<p><strong><span style="color: #ff0000;">కురూపి  కథను ఇక్కడ చదవొచ్చు:</span></strong> <a href="http://www.scribd.com/doc/131593137/Kuroopi" target="_new">http://www.scribd.com/doc/131593137/Kuroopi</a></p>
<p><strong> <span style="color: #ff0000;">కథా సంగ్రహం :-</span></strong></p>
<p>కథానాయకుడు ఒక రచయిత.  పేరు కనకం ! అతడికి ఆడవాళ్ళ మీద ప్రత్యేకించి గొప్ప అభిప్రాయాలేమి ఉండవు . బస్ లో కనపడి <a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/03/koku.jpg"><img class="alignright size-full wp-image-2248" title="koku" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/03/koku.jpg" alt="" width="150" height="175" /></a>పలకరింపు గా నవ్విన సరస్వతిని చూసి అనాకారి కాబట్టి &#8220;సెక్స్ ఆకలి&#8221;  తో అలా సూచనో, ఆహ్వానమో పంపింది అని వెంటనే నిర్థారించు కుంటాడు.అతని చూపులో &#8220;ఇంత అనాకారి దానికి నేను కావల్సి వచ్చిందీ?&#8221; అన్న భావమే ఉంటుంది.</p>
<div>కథ విషయానికొస్తే కనకం ఒక రచయిత. మామూలు మనిషి! అందుబాటులోకి వచ్చిన ఆడవాళ్లను మొహమాటాలు లేకుండా  అందుకునే  స్వభావం కూడా !  ప్రేమ అంటే అతనికి సెక్స్ తప్ప మరొకటి కాదు!  చాలా మంది లాగే స్త్రీని అతడు తన హార్మోన్స్ తోనే గుర్తిస్తాడు . అతని అభిమాని ఒకరి చెల్లెలు సరస్వతి అతనికి పరిచయం అవుతుంది. 24 ఏళ్ళ సరస్వతి అనాకారి. లెక్చెరర్ గా పని చేస్తుంటుంది.  మొదటి సారి చుసిన తర్వాత కనకం ఆమెను గుర్తు అయినా పెట్టుకోడు . అందుకే ఆమె ఆ తర్వాత రోడ్డు మీద కనిపిస్తే ఎవరో అనుకుంటాడు .</div>
<div></div>
<div>ఆ తర్వాత కనకం వాళ్ళింటికి వస్తూ పోతూ ఉంటాడు. పరిచయ క్రమంలో కనకం  తో సరస్వతి అనేక విషయాల గురించి చర్చిస్తుంది. అతను  రచనలని సునిశితంగా విశ్లేషిస్తుంది. అతని కథల్లో అనాకారి పాత్రలు లేవని ఎత్తి చూపుతుంది. అందమైన పాత్రలుంటే ఆ అందానికో ప్రయోజనం ఉండి తీరాలని, లేకపోతే శిల్పం దెబ్బ తింటుందని విమర్శిస్తుంది. అప్పటివరకూ కనకం ఆ సంగతే గమనించడు . అందరూ అతని రచనల్ని మెచ్చుకోడమే తప్ప ఈ విధంగా అంతవరకూ ఎవరూ విమర్శించలేదు. ఆమె తన జీవిత లక్ష్యాలను,. రచనా విధానాన్ని, నమ్మకాల్ని చాలెంజ్ చేస్తున్నట్లు అతడు భావిస్తాడు . రచనను విమర్శించడం అంటే ఒకరకంగా  రచయిత జీవితాన్ని విమర్శించడమే అని కుటుంబ రావు గారు అంటారు . అంటే రచన అనేది ఊహల్లోంచి కాక, రచయితా జీవితంలోంచే (అతని పరిశీలనల నుంచి) పుట్టాలని ఆయన  స్పష్టంగానే చెప్పినట్లు తోస్తుంది.</div>
<div></div>
<div>
<p>అందరూ మెచ్చుకునే కనకం రచనల్లో కొన్ని లోపాలున్నాయని సరస్వతి ఎత్తి చూపిస్తే తప్ప కనకం వాటిని గుర్తించడు. లోకంలో అందమైన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు అల్ప సంఖ్యాకులే! అల్పసంఖ్యాకులను ప్రతిబింబించే సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించ లేదని సరస్వతి అన్న మాటలు కనకానికి ఛెళ్ళున తగుల్తాయి. అందమైన పాత్రల ద్వారా పాఠకులను వశపరచుకోవచ్చంటుంది సరస్వతి!</p>
<p>అనాకారి పాత్రతో కథ రాయగలరా అని సవాలు విసురుతుంది. అంటే తనమీదే కథ రాయగలరా అని అడిగిందని అనుకోవచ్చు .</p>
<p>అసలు సాహిత్యంలో పాత్రలు అందగాళ్ళు అంద గత్తెలూ అయి ఉండాలా ? అనాకారులు ,రూపసులూ కాని వాళ్ళు సాహిత్యం లో పాత్రలు గా ఉండ దగరా ? ఈ పాయింట్ మీద కథలో కొంత చర్చ నడుస్తుంది ఇద్దరి మధ్యా !!</p>
<p>ఆ చర్చలు, ఆమె అభిప్రాయాలు ఇంట్లో ఆమె ప్రవర్తన ,  స్వభావం గమనిస్తున్న కనకానికి ఆమెలో ఎనలేని ఆకర్షణ కనిపిస్తుంది. పార్క్ లో ఆమె బెంచీ మీద కూచోగానే ఆ పక్కన కుచున్న వాడొకడు ఆమె వైపు చూసి లేచి వెళ్ళి పోతాడు. కనకానికి మాత్రం ఆమెను మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని అనిపిస్తుంది. ఆమె తన కథల మీద చేసిన నిష్పాక్షికమైన విమర్శ, నిక్కచ్చి అభిప్రాయాలు అతన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆమె తన వదిన మీద చెప్పిన కొద్ది పాటి ఫిర్యాదులు(ఇల్లు సర్దుకోదని, తను వాడే అద్దం మీదైనా మరకలు తుడవదని) సైతం అతని కంటికి సహృదయంతో చెప్పినవి గానే కనిపిస్తాయి. &#8220;<strong>తన కథలను తప్పు పట్టినప్పుడు కూడా తను చెప్ప దల్చుకున్న దానికంటే తక్కువే చెప్పింది తప్ప ఒకరి తప్పును ప్రచారం చెయ్యడం లో తనకు ఆనందం ఉన్న దానిలా మాట్లాడ లేదు</strong> &#8221; కాబట్టి వదిన గురించి ఆమె చెప్పిన ఫిర్యాదు లో కూడా అతనికి సమంజసమైన ధోరణే కనిపిస్తుంది</p>
</div>
<p>లతా పాటకు పరవశిస్తుందని, అన్న పిల్లలని తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుందనీ, మనుషుల్ని నిశితంగా చదువుతుందని గమనించాక కనకానికి ఆమె ఎంతో సౌందర్య వంతంగా కనిపిస్తుంది.</p>
<p>ఆమె అన్న కూతురు హాస్పటల్లొ బ్రెయిన్ ఫీవర్ తో మరణిస్తే.. ఆ వార్త సరస్వతి ని ఎంత కుంగదీస్తుందో అన్న భావనతో కళ్ళనీళ్ళు నింపుకుంటాడు. నిజానికి ఆ పాపతో అతనికి ఎలాటి బంధమూ లేదు. సరస్వతి సున్నిత హృదయం  ఎంత గాయపడుతుందో అన్న భావన అతని కన్నీటికి కారణం !!<br />
ఆమె ప్రవర్తన ద్వారా, స్వభావం ద్వారా, ఆలోచనల ద్వారా ఆమె హృదయ సౌందర్యాన్ని గుర్తిస్తాడు.  ఎలాటి  సెంటిమెంట్స్ లేని అతని మొద్దు హృదయాన్ని కూడా తన హృదయ సౌందర్యం తో కరిగిస్తుంది సరస్వతి !</p>
<p>కథ చివర్లో మేనకోడలు చనిపోయిందని కుమిలి పోతున్న సరస్వతిని కనకం ఎంతో ఆర్తి తో ఓదారుస్తాడు . తనకు తెలీకుండానే ఆమెను దగ్గరకు తీసుకుని వీపు నిమురుతూ నిజంగా ఓదారుస్తాడు. గాఢ నిద్ర లో సరస్వతి అతని డొక్కలోకి దూరుతుంది . ఆ క్షణం లో సరస్వతి కి తానూ తల్లి అయినట్లు గా తోచి కనకానికి నవ్వు వస్తుంది . ఈ చివరి వాక్యం తో కథ సంపూర్ణం అవుతుంది . సరస్వతి మీద అతనికి ఏర్పడిన ఆత్మీయతను, అనురాగాన్ని ఈ వాక్యం ఒక్క సెకను లో పాఠకుడికి  పూర్తిగా పట్టి ఇచ్చేస్తుంది .</p>
<div><span style="color: #cc0000;"> <strong>పాత్ర చిత్రణ</strong></span></div>
<div></div>
<div>సరస్వతి వదిన జయలక్ష్మి అందమైనదే ! పైగా దానికి మెరుగులు కూడా దిద్దుతూ ఉంటుంది . అయినా కూడా జయలక్ష్మి కనకాన్ని వికర్షిస్తుంది తన ప్రవర్తన ద్వారా ! అందగత్తె అయిన జయలక్ష్మి ముందు అనాకారి సరస్వతి తన హృదయ సౌందర్యం, సౌకుమార్యం వాళ్ళ ఎలివేట్ అవడం మనకు తెలీకుండానే జరిగి పోతుంది . ఇది పాఠకుడికి వెంటనే తట్టకపోయినా అందం ముందు అనాకారి తనం ఎలివేట్ అవడం గొప్పగా అనిపిస్తుంది.</div>
<div></div>
<div>ఎనిమిదో అధ్యాయంలో చివరి ఘట్టం చాలా కీలకమైనది కనకం రచనలోని  ముగింపు సమస్యను తేల్చేయటమే కాదు; సరస్వతి పట్ల అతని దృక్పథాన్ని కూడా స్పష్టం  చేస్తుందీ సన్నివేశం.  అలాగే  అతడి అనూహ్య  భావోద్వేగం వెనకున్న మనసును  సరస్వతి గ్రహించే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ  అనూహ్యమైన మలుపు ఆసక్తికరంగా నడుస్తుంది.</div>
<div>కనకం అనాకారి ని హీరోయిన్ గా పెట్టి కథ రాసినపుడు దాని ముగింపు ఎలా ఉంటుందో సరస్వతికి చెప్పక &#8220;<strong>ఎలా ఉంటే బాగుంటుంది?&#8221;</strong> అని అడుగుతాడు.</div>
<div></div>
<div>ఆ పైన ఆమె చెప్పిన రెండు మూడు విశ్లేషణాత్మక వాక్యాలు అతని బుర్ర తిరిగి పోయేలా చేస్తాయి. అతడు ముగ్ధుడై పోయి చప్పున ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటాడు.</div>
<div></div>
<div>సరస్వతి లో గొంతుకతో &#8220;థాంక్స్&#8221; అని బయటికి వెళ్ళి పోతుంది. దీనితో కనకం పై ఆమెకు ఎలాటి అభిప్రాయం ఏర్పడిందీ పాఠకుడికి సులువు గానే  అవగతమవుతుంది. అలాగే కనకానికి కూడా ఆమె స్వభావం, మేథ మీద కల్గిన ఇష్టమే అతని చొరవకు కారణం తప్ప ఇతరత్రా సానుభూతి లాంటి అంశాలు కావని సూచిస్తాడు రచయిత.</div>
<p>అందుకే ఆమె చెప్పిన రెండక్షరాల &#8220;థాంక్స్&#8221; అనే పదం అతని కథకు ముగింపుగా మారుతుంది.</p>
<div></div>
<div><strong><span style="color: #ff0000;">రచయితా, విమర్శకుల అభిప్రాయం :</span></strong></div>
<div>ప్రబంధాల నుంచి ఈ నాటి వరకు సాహిత్యం లో నాయికా నాయకులు అందరూ అందగాళ్ళు, అందగత్తె లే ! ఒకవేళ అందాన్ని వర్ణించక పోయినా అనాకారులుగా మాత్రం చిత్రించరు. దీన్నిప్రశ్నించడం కథకుడి ఉద్దేశంగా తోస్తుంది .<br />
ఈ కథ మీద రాచమల్లు రామ చంద్రా రెడ్డి గారు (విశాలాంధ్ర వేసిన కొ.కు సాహిత్యం 5వ సంపుటానికి ముందు మాట ) ఒక వ్యాసం రాసారు . సాహిత్యంలో ఇతిహాసాల నుంచి చరిత్ర వరకు రుక్మిణి, సీత,శకుంతల,వరూధిని, అనార్కలి ఇత్యాదులంతా మహా సౌందర్య రాశులే! వాళ్ళు అంత అందంగా లేకపోతే ఆయా కథా నాయకులకు వారి మీద ప్రేమ పుట్టేదేనా? కథానాయికలెవరూ అందంగా లేకుండానే వారి మీద ప్రేమ పుట్టిందని రాస్తే పాఠకులు నమ్ముతారా? లోక విరుద్ధమైన దాన్ని ఎవరూ నమ్మరు కనుక సాహిత్యంలో పాత్రలు అందంగా ఉండే తీరాలి.కనుకే అందం రచనా శిల్పానికి అండగా ఉందన్న రీతిలో ఆ వ్యాసం లో కొంత భాగం సాగుతుంది .</div>
<p>సాధారణంగా రచయితలు తమ నవలలకు ముందు మాటో, ఉపోద్ఘాతమో రాస్తుంటారు.అయితే కుటుంబరావు గారు &#8220;కురూపి&#8221; కథకు ఉపోద్ఘాతం రాశారు. దాంట్లో ఆయన అందవిహీనత వ్యక్తి గత సమస్యా? లేక సాంఘికమా అన్న విషయం మీద కొంత చర్చించారు. ఎందుకంటే ఆడవాళ్ళ అందం పెళ్ళికి ఒక అర్హతగా గల సమాజం ఇది. చర్చ తర్వాత ఇది పూర్తిగా వ్యక్తిగతమూ కాదు, పూర్తిగా సామాజికమూ కాదని అంటారాయన. ఈ సమస్యకు ఆధ్యాత్మికం గా మాత్రమే పరిష్కారం దొరుకుతుందని అంటారు. (ఆధ్యాత్మికం అంటే పరలోకానికి సంబధించింది కాదని స్పష్టత ఇస్తారు)</p>
<p>&#8220;<strong>మనిషి నుంచి మనిషి పొందే లక్షలాది అనుభూతులలో అందం ఇచ్చేది ఒకటి మాత్రమే!అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయి. తన తల్లి అందమైనదా కాదా, బామ్మ అందమైనదా కాదా అన్న సంశయం పిల్లలను ఎన్నడూ బాధించదు. గాంధీ బొమ్మ, జవహర్ లాల్  బొమ్మ కనిపిస్తే ఎంతమంది హృదయాలు ఆనందంతో నిండేదీ జనం ఊహించవచ్చు&#8230;.. ఇలాంటి ఆధ్యాత్మిక భావాలు జీవితం నిండా ఉంటాయి.  ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఉండే గోడలు పడిపోయాక, అటువంటి అనుభూతులు పెరుగుతాయి.వాటికి విలువ కూడా పెరుగుతుంది. ఈ మాట వ్యక్తం చెయ్యడానికే కురూపి రాశాను</strong>&#8221; అని వివరిస్తారు.</p>
<p>ఈ మాటల్ని జాగ్రత్త గా పరిశీలిస్తే కథ తాలూకు ఆత్మపాఠకుడి కి అవగతం అవుతుంది .</p>
<div>బాహ్య సౌందర్యాన్ని మించిన ఆత్మ సౌందర్యం జీవితాల్లో సౌందర్యాన్ని నింపుతుందని కథకుడి అభిప్రాయంగా వెల్లడి అవుతుంది .</div>
<div>అసలు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.</div>
<div></div>
<div>నాయికా నాయకులు అందంగా ఉంటే-  కథాగమనం వేగంగా సాగటానికి  వెసులుబాటూ,  పాఠకులను  త్వరగా ఆకట్టుకోవటం అనే ప్రయోజనమూ  ఉంటాయి.  కానీ అనాకారి నాయకా నాయకుల కథలు రాయాలనీ,  ఈ సమస్యను  సాహితీ ప్రక్రియగా మలుద్దామనీ  రచయితలు పెద్దగా ఆలోచించరు.<br />
ఎందుకంటే ‘అనాకారితనం ’ సమస్యను కొ.కు.  తప్ప ఇతర తెలుగు రచయితలు పట్టించుకున్న దాఖలాలు లేవు.</div>
<p>ఈ కురూపి కథలో అందాన్నీ,  మంచి స్వభావాన్నీ; దురుసు స్వభావాన్నీ,  సంస్కారాన్నీ కాంట్రాస్టుగా  చూపిస్తాడు రచయిత. ఇదంతా కృత్రిమంగా కాకుండా కథలో స్వాభావికంగానే నడుస్తుంది.</p>
<div>యాభై ఏళ్ల క్రితం (మొదటి ప్రచురణ 1963 జ్యోతి మాస పత్రిక లో ) రాసినా , చదివినప్పుడల్లా కొత్త ఆలోచనల్ని , సరి కొత్త భావాల్ని స్ఫురింపజేసే కథ &#8220;కురూపి&#8221;.</div>
<p>ఈ మధ్య విరసం వేసిన కుటుంబరావు గారి సాహిత్యం ఎనిమిదో సంపుటం లో ఈ కథను చదవొచ్చు .</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=2116</wfw:commentRss>
		<slash:comments>36</slash:comments>
		</item>
		<item>
		<title>ఒక మిస్టీరియస్ మునెమ్మ!</title>
		<link>http://vaakili.com/patrika/?p=1405</link>
		<comments>http://vaakili.com/patrika/?p=1405#comments</comments>
		<pubDate>Thu, 28 Feb 2013 15:32:07 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=1405</guid>
		<description><![CDATA[<p>తెలుగు నవలా సాహిత్యం లో మునెమ్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కథా నాయిక అంటే మునెమ్మ! ఒంటి చేత్తో  కథను నడిపిస్తూ, ఆమె ధైర్య సాహసాలకు, నిబ్బరానికి చకితులవుతున్న పాఠకులను చేయి పట్టి కథ చివరంటా లాక్కు  పోతూ&#8230;తను మాత్రం స్థిత ప్రజ్ఞురాలై నడిచిపోతుంది. డాక్టర్ కేశవ రెడ్డి గారి సంచలనాత్మక నవల మునెమ్మ 2007 లో చతురలో మొదట ప్రచురితం అయ్యాక..హైద్రాబాదు బుక్ ట్రస్ట్ విడిగా పబ్లిష్ చేసింది.</p> <p>బహుళ ప్రజాదరణ పొందిన ఈ నవల అంతే స్థాయిలో విమర్శలకు కూడా గురైంది. రచనా శిల్పం గురించి మునెమ్మ చిత్రణ గురించి, పత్రికల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు నడిచాయి. కొన్ని మరీ వ్యక్తిగత స్థాయిలో చేసుకున్న పరస్పర దాడుల్లా కూడా అనిపించక మానవు. మునెమ్మ మీద బోల్డు చర్చలు, అభిప్రాయాలు..విశ్లేషణలు..పరిశోధనా వ్యాసాలూ !!</p> <p>మునెమ్మ కథ కాస్త చెప్పుకుందాం! రాయల సీమ లో ఒంటిల్లు అనే కుగ్రామానికి చెందిన జయరాముడి భార్య మునెమ్మ. ఆమె పెళ్ళి నాడే ఇంట్లో పుట్టిన కోడెదూడ పెరిగి పెద్దయి బొల్లి గిత్తగా ఆ ఇంట్లో దాదాపు సభ్యుడిగా(?) మసలుతుంటుంది. జయరాముడు గిత్తను తీసుకుని వెళ్తుంటే చూసిన వాళ్ళు వాళ్ళిద్దరినీ రామ లక్ష్మణులే అనుకుంటారు.</p> <p>ఒకరోజు బొల్లి గిత్త పొలంలో గడ్డి కోస్తున్న మునెమ్మ వీపు మీద రెండు కాళ్ళు ఎత్తి ఆనిస్తుంది. ఆ చర్యలో జయరాముడికి లైంగికోద్రేకం కనిపిస్తుంది.  వెంటనే అతడు గంగ వెర్రులెత్తి పోయి గిత్తను చావబాది మర్నాడు ఎక్కడో దూరాన ఉన్న పశువుల సంతకు తోలుకుపోయి అమ్మేయాలని నిశ్చయించుకుంటాడు. మొదట  గిత్తను అమ్మడానికి ససేమిరా అన్న జయరాముడి తల్లి &#8230;.అది చేసిన పని విని నిర్ఘాంత  పోయి అమ్మేయడమే మంచిదని అభిప్రాయ పడుతుంది.</p> <p>దగ్గరలోని పోటుమిట్ట గ్రామం లోని కమిషన్ ఏజెంట్ (తరుగులోడు) సాయంతో గిత్తను సంతలో అమ్మడానికి తోలుకు పోతాడు జయరాముడు. అయితే రెండు రోజుల తర్వాత గిత్త ఒక్కటే తిరిగి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg"><img class="alignleft size-full wp-image-946" title="sujatha" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg" alt="" width="96" height="133" /></a>తెలుగు నవలా సాహిత్యం లో మునెమ్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కథా నాయిక అంటే మునెమ్మ! ఒంటి చేత్తో  కథను నడిపిస్తూ, ఆమె ధైర్య సాహసాలకు, నిబ్బరానికి చకితులవుతున్న పాఠకులను చేయి పట్టి కథ చివరంటా లాక్కు  పోతూ&#8230;తను మాత్రం స్థిత ప్రజ్ఞురాలై నడిచిపోతుంది. డాక్టర్ కేశవ రెడ్డి గారి సంచలనాత్మక నవల మునెమ్మ 2007 లో చతురలో మొదట ప్రచురితం అయ్యాక..హైద్రాబాదు బుక్ ట్రస్ట్ విడిగా పబ్లిష్ చేసింది.</p>
<p>బహుళ ప్రజాదరణ పొందిన ఈ నవల అంతే స్థాయిలో విమర్శలకు కూడా గురైంది. రచనా శిల్పం గురించి మునెమ్మ చిత్రణ గురించి, పత్రికల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు నడిచాయి. కొన్ని మరీ వ్యక్తిగత స్థాయిలో చేసుకున్న పరస్పర దాడుల్లా కూడా అనిపించక మానవు. మునెమ్మ మీద బోల్డు చర్చలు, అభిప్రాయాలు..విశ్లేషణలు..పరిశోధనా వ్యాసాలూ !!</p>
<p>మునెమ్మ కథ కాస్త చెప్పుకుందాం! రాయల సీమ లో ఒంటిల్లు అనే కుగ్రామానికి చెందిన జయరాముడి భార్య మునెమ్మ. ఆమె పెళ్ళి నాడే ఇంట్లో పుట్టిన కోడెదూడ పెరిగి పెద్దయి బొల్లి గిత్తగా ఆ ఇంట్లో దాదాపు సభ్యుడిగా(?) మసలుతుంటుంది. జయరాముడు గిత్తను తీసుకుని వెళ్తుంటే చూసిన వాళ్ళు వాళ్ళిద్దరినీ రామ లక్ష్మణులే అనుకుంటారు.</p>
<p>ఒకరోజు బొల్లి గిత్త పొలంలో గడ్డి కోస్తున్న మునెమ్మ వీపు మీద రెండు కాళ్ళు ఎత్తి ఆనిస్తుంది. ఆ చర్యలో జయరాముడికి లైంగికోద్రేకం కనిపిస్తుంది.  వెంటనే అతడు గంగ వెర్రులెత్తి పోయి గిత్తను చావబాది మర్నాడు ఎక్కడో దూరాన ఉన్న పశువుల సంతకు తోలుకుపోయి అమ్మేయాలని నిశ్చయించుకుంటాడు. మొదట  గిత్తను అమ్మడానికి ససేమిరా అన్న జయరాముడి తల్లి &#8230;.అది చేసిన పని విని నిర్ఘాంత  పోయి అమ్మేయడమే మంచిదని అభిప్రాయ పడుతుంది.</p>
<p>దగ్గరలోని పోటుమిట్ట గ్రామం లోని కమిషన్ ఏజెంట్ (తరుగులోడు) సాయంతో గిత్తను సంతలో అమ్మడానికి తోలుకు పోతాడు జయరాముడు. అయితే రెండు రోజుల తర్వాత గిత్త ఒక్కటే తిరిగి వస్తుంది. జయరాముడు రాడు. గిత్త సంత లో అమ్ముడై పోయిందని మాత్రం దాని కొమ్ముకు అంటించిన చీటీలో ఉంటుంది. అతడు ఏమయ్యాడో అని ఆలోచిస్తూ ఉండగానే కలత నిద్రలో మునెమ్మకు ఒక కల వస్తుంది. ఆ కలలో జయరాముడు శవమై కనిపిస్తాడు. అతడు చనిపోయాడని ఆ కల ఆధారంగా (తన విశ్వాసాల ప్రకారం) నిర్థారించుకున్న మునెమ్మ అతడిని ఎవరు చంపారో, ఎలా చంపారో వెదకడానికి బయలు దేరుతుంది.  వారి మీద పగ తీర్చుకోవాలని మునెమ్మ ధ్యేయం! జయరాముడి బంధువైన సినబ్బ(ఇతడే కథ ను మనకు చెప్పే నెరేటర్. ఇతడి మాటల్లోనేకథ అంతా నడుస్తుంది) తను కూడా ఆమెకు తోడు గా వస్తానంటాడు. ఇద్దరూ కల్సి బయలు దేరతారు.</p>
<p>బయలు దేరినప్పటి నుంచీ ప్రతి చోటా సమాచారం సేకరించుకుంటూ దాన్ని విశ్లేషించుకుంటూ&#8230;.జయరాముడిని ఎవరు చంపారో కనుక్కుని వాళ్ళని మునెమ్మ చట్టానికి దొరకని <strong>&#8220;</strong><strong>సహజ</strong><strong> </strong><strong>న్యాయ</strong>&#8221; పద్ధతిలో  తుదముట్టించడం తో కథ సమాప్తం!</p>
<p>ఈ నవల్లో కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాముఖ్యం! బిగి సడలని&#8230;ఉత్కంఠ నిండిన కథనం వల్ల పాఠకుడు దాని వెనుక పరుగులు తీస్తాడు. కథ మొత్తం మనకు సినబ్బ చెప్తూ ఉంటాడు. మునెమ్మ మనోభావాలను కుడా సినబ్బే వర్ణిస్తాడు.కథ మధ్యలో సందేహాలు వస్తున్నా&#8230;&#8230;.కథనం లోని గొప్ప దనం వల్ల &#8230;.వాటిని పక్కకు నెట్టి ఏమి జరిగిందో చదివేద్దాం అన్న ఉత్కంఠ పాఠకుడిని ఊపిరి తిప్పుకోనివ్వక కథను చదివిస్తాయి. సినబ్బే ప్రయోక్త గా కథలోని ప్రతి సంఘటన నడుస్తుంది. , భీభత్స ప్రధానమైన దృశ్యాలను , కట్టలు తెంచుకున్న మునెమ్మ దుఖాన్ని, చివరకు బొల్లి గిత్త చేసే .ప్రళయ తాండవాన్ని, తరుగులోడి చావును&#8230;ఇవన్నీఅతడే  చెప్తాడు. సినబ్బ పాత్రలోనే రచయిత మనకు స్పష్టంగా కనిపిస్తుంటాడు.</p>
<p><strong>మునెమ్మ</strong><strong> </strong><strong>పాత్ర</strong><strong> </strong><strong>చిత్రణ</strong><strong> </strong></p>
<p>మునెమ్మ అసలు సిసలు కథా నాయికగా ఈ నవల్లో విశ్వరూపం దాలుస్తుంది.  నిబ్బరం, ఆలోచన, తర్కం, కంటికి కనపడనీయని పగ ఇవన్నీ మునెమ్మ కి అలంకారాలు.  మునెమ్మ ప్రస్థానం అతడు అడవిని జయించాడు నవలలో ముసలి వాడిని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఇద్దరిలో కామన్ గా కనపడే లక్షణం కర్తవ్య దీక్ష, కర్తవ్య సాధనకు ..అడ్డు వచ్చిన కష్టాన్ని పక్కకు నెట్టి ముందుకు సాగడం!</p>
<p>పల్లెటూరి అమాయక స్త్రీ అయినా మునెమ్మ కథలో చాలా పరిణతి  చెందిన, చదువుకున్న స్త్రీ వలె &#8220;కొటేషన్స్&#8221; లో పెట్టుకో దగ్గ మాటలు మాట్లాడుతుంది.(పెళ్ళి సమయంలో వీరి బాగుల్దానిలా ఉందని ఆమెను అంతా అనుకుంటారు) జీవితమే ఆ పరిణతి  నేర్పిందని అనుకున్నా&#8230;..అపరాధ పరిశోధకు రాలి స్థాయిలో ఆమె చిక్కు ముళ్లను విప్పుతూ..పోవడం కొంత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఆమెలో నిగూఢమైన తెలివి తేటలు ఉన్నాయని పాఠకుడికి అర్ధమవుతుంది . ఆమె మానసిక ప్రపంచంలో రేగిన కల్లోలం కుడా ఆమె చేత అటువంటి పరిణతి చెందిన మాటలు సందర్భానుసారంగా మాట్లాడించి ఉంటుందని కుడా మరో పక్క తోస్తుంది.</p>
<p>మునెమ్మ 1930 ల నాటి ఒక సాధారణ పల్లెటూరి స్త్రీ! ఆమె కలలో కనిపించే దృశ్యాలను సందేశాలుగా నమ్ముతుంది. బహుశా ఆత్మలు ఆవహించడాన్ని కూడా నమ్ముతుంది.  భర్త ఆచూకీ కనుక్కోడానికి బయలు దేరిన మునెమ్మ ఈ మూఢ నమ్మకాలకు అతీతురాలు కాదు. అసలు మునెమ్మ ఈ పయనంలో ఏదో ఒక శక్తి ఆవేశించిన దానిలా &#8230;నిబ్బరాన్ని ప్రదర్శిస్తుంది. తొణకదు బెణకదు.</p>
<p>&#8220;సమయం వచ్చినపుడు ఈ గొడ్డే కాదు, ఈడ నుంచి మద్ది పాలెం దాకా రోడ్డు మీద ఉండే ప్రతి కంకర రాయీ మాట్లాడుతుంది&#8221;</p>
<p>&#8220;రోడ్డుకిరువైపులా ఉండే ప్రతి చెట్టు కిందా ఆయన (మరణించిన భర్త) చేతులు చాచి నన్ను పిలిచినాడు&#8221;</p>
<p>&#8220;కాలు దీసి వీధిలో పెడితే దారి దానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదికి వచ్చే ముందు  ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం ఇవన్నీ ఆలోచించే వచ్చామా?&#8221;</p>
<p>&#8220;సమయమొచ్చినపుడు గొంతు మీద కాలేసి అడుగుదాం! చేప కోసం గాలం వేసినపుడు బెండు తైతక్క లాడగానే లాగుతామా? బెండు నీళ్ళలో మునిగినపుడు కదా లాగుతాం?&#8221;</p>
<p>వినిపించని వాటి గురించి, కనిపించని వాటి గురించేరా మనం ఆలోచించాల్సింది&#8221;</p>
<p>&#8220;ఆ రాత్రి నాకు కలొచ్చినప్పటి నుంచీ నేను వేస్తున్న ప్రతి అడుగూ ఆయన (భర్త జయరాముడి) అంత్య క్రియల్లో భాగమే! అంత్య క్రియలంటే ఇవే&#8221;</p>
<p>ఇలా నిబ్బరంగా, తెలివి గా లోతుగా మాట్లాడుతూ మునెమ్మ తన వ్యక్తిత్వాన్ని , వైఖరిని పాఠకులకు స్పష్ట పరుస్తుంది.</p>
<p>ఆమె తనకు వచ్చిన కలను తన మనసులో దాగిన భయానికి ప్రతి బింబంగా భావించక, అది జయరాముడు తన చావు గురించి <a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/Munemma.jpg"><img class="size-full wp-image-1688 alignright" title="Munemma" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/Munemma.jpg" alt="" width="209" height="320" /></a>ఆమెకు పంపిన సందేశంగా భావిస్తుంది.  ఆ సందేశంతోనే ముందడుగేస్తుంది. ముందుమాటలో కవయిత్రి జయప్రభ &#8220;<strong>రచయిత</strong><strong> </strong><strong>అరవయ్యేళ్ళ</strong><strong> </strong><strong>నాటి</strong><strong> </strong><strong>కథనే</strong><strong> </strong><strong>ఎన్నుకున్నా</strong><strong>&#8230;</strong><strong>మునెమ్మ</strong><strong> </strong><strong>పాత్రను</strong><strong> </strong><strong>చిత్రిస్తున్నపుడు</strong><strong>..</strong><strong>సమకాలీన</strong><strong> </strong><strong>స్తీల</strong><strong> </strong><strong>ఆలోచనల</strong><strong> </strong><strong>ప్రభావం</strong><strong> </strong><strong>ఆయన</strong><strong> </strong><strong>మీద</strong><strong> </strong><strong>అనివార్యంగా</strong><strong> </strong><strong>పని</strong><strong> </strong><strong>చేసినట్లుంది</strong>&#8221; అంటారు. ఈ మాటతో ఏకీభవించాలని  అనిపించదు  . గ్రామీణ స్త్రీలలో ఉండే స్థైర్యం, ధైర్యం,విచక్షణ, ఇవన్నీ జీవితం నేర్పే అవసరాలే ! వాటితో పాటు పగ ఒకటి మునెమ్మ కు కొత్త కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఆ కర్తవ్యం లోంచే పరిశోధన దిశగా ఆలోచిస్తుంది.</p>
<p>ఆమె నిర్ణయించుకున్న అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ విశ్రాంతి తీసుకోదు. అది నెరవేరాక, ఇక ఏడుస్తూ కూచోదు. నిస్పృహకు లోను కాదు. లేచి బతుకు బండి ముందుకు సాగేందుకు ముందడుగేస్తుంది. <strong>&#8220;</strong><strong>అవసరం</strong><strong> </strong><strong>అన్నీ</strong><strong> </strong><strong>నేర్పుతుంది</strong><strong> </strong><strong>రా</strong><strong> </strong><strong>సినబ్బా</strong><strong>, </strong><strong>ఈ</strong><strong> </strong><strong>మాట</strong><strong> </strong><strong>గొడ్డుకు</strong><strong> </strong><strong>కూడా</strong><strong> </strong><strong>వర్తిస్తుంది</strong>&#8221; అనే<strong>సంచలనాత్మక</strong><strong>, </strong><strong>మార్మిక</strong><strong> ,</strong><strong>సందేహాత్మక</strong>  వ్యాఖ్యతో కథను ముగిస్తుంది.</p>
<p><strong>కథనం</strong><strong>-</strong><strong>శిల్పం</strong></p>
<p>మునెమ్మ నవల ను సినబ్బ మాటల్లో చదువుతాం మనం! రచయితే సినబ్బ! ఈ కథలో కథనమే ముఖ్య భూమిక వహించి పాఠకుడిని ముందడుగు వేయిస్తుంది. అయితే ఈ నవల రాయడంలో రచయిత ఒక ప్రత్యెక  పద్ధతిని ఎంచుకున్నారు. జయప్రభ దాన్ని <strong>&#8220;</strong><strong>మాజిక్</strong><strong> </strong><strong>రియలిజం</strong>&#8220;  పోల్చారు. రచయిత ఈ కథలో కొన్ని ముఖ్యమైన విషయాల్ని చెప్పీచెప్పనట్లు గా  అస్పష్టంగా చెప్పి వదిలేశారు.  బొల్లి గిత్త మునెమ్మ ను తాకిన సంఘటన మీద స్పష్టత ఉండదు. నిజంగానే మునెమ్మకు గిత్త మీద , పెంపుడుజంతువు  మీద ఉండే వాత్సల్యం తప్ప మరో భావం ఉందా లేదా? బొల్లి గిత్త ఏ దృష్టి తో తన మీదకు వచ్చిందన్న విషయాన్ని మునెమ్మ గ్రహించిందా  లేదా?</p>
<p>జయరాముడు గిత్తను ఎందుకు చచ్చేట్లు బాదాడో తనకు తెలీదని అత్త సాయమ్మతో చెప్తుంది. ఎందుకు అమ్మేస్తానంటున్నాడో కూడా అంతు పట్టనట్లు వ్యవహరిస్తుంది.  గిత్తను అమ్మడానికి ముందు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సాయమ్మ  , గిత్తను చావబాదిన  కారణం విన్నాక  , దాన్ని అమ్మేయడానికి అభ్యంతరం వ్యక్త పరచక మౌనం వహిస్తుంది. అప్పుడైనా మునెమ్మ కు  అనుమానం రావాలి సాయమ్మ మౌనం పట్ల!!   పైగా తన వీపు మీద కాళ్ళు ఆనించాకే, మునెమ్మ కళ్ళ ముందే దాన్ని జయరాముడు చావ బాదుతాడు . ఎద్దు చర్యలో కోరిక ఆమెకు కనిపించక పోయినా , తన ప్రాణానికి హాని జరగ బోయిందన్న కారణం తో జయరాముడు కొట్టి ఉంటాడని తోచదా? అపరాధ పరిశోధనలో చిక్కు ముళ్ళను అవలీలగా విప్ప గలిగిన మునెమ్మ కు? చివరికి సాయమ్మ పరిస్థితి ఏమైనట్లు?  మునెమ్మ ఇంటి నుంచి బయలు దేరాక ఇక సాయమ్మ ప్రసక్తే ఉండదు.</p>
<p>నవల చివర్లో గిత్తను ఉద్దేశిస్తూ  &#8220;<strong>పిలగాడిని</strong><strong> </strong><strong>వదులు</strong>&#8221; అని అనడం కూడా కొంత సందిగ్థతకు దారి తీస్తుంది. <strong>పిలగాడా</strong> అనేది మునెమ్మ మోహం కమ్మిన వేళ భావావేశంతో భర్తను పిల్చుకునే ముద్దు పేరు అని రచయిత చెప్పక పోయుంటే ఈ సందిగ్థతకు తావు ఉండేది కాదు.  బొల్లి గిత్త కు అటువంటి భావనలు లేవని మునెమ్మ నమ్మి ఉంటే  &#8220;అది ఆడోళ్ళ మీదకు పోతోందని&#8221; తరుగులోడిని  రెచ్చ గొట్టే వ్యూహం లో భాగం గా  అంటుందా? . ఈ మాట మునెమ్మ ఎందుకు వాడింది?  కథను విశ్లేషించిన అంబటి సురేంద్ర రాజు దీన్ని మాంత్రిక కథనంగా వర్ణిస్తారు. కథతో పాటే సందేహాలు వస్తున్నా, మునెమ్మ సాగిస్తున్న పరిశోధన సందేహాలను పక్కన పెట్టించి తనతో పాటు ముందుకు లాక్కెళుతుంది.</p>
<p>అలాగే ఈ నవలలో తరుగులోడి  చావు చాలా హింసాత్మకంగా ఆవిష్కరిస్తాడు రచయిత. బొల్లి గిత్త అతని పేగుల్ని తీసి కొమ్ములకు చుట్టుకోవడం, అతడి కడుపు లోంచి బయటికి వచ్చి పాదాల వరకు వేల్లాడుతూ ఉండిన కొమ్ముని తొక్కుకుంటూ ముందుకు వెళ్లి పడి  పోవడం, అతని పేగుల్ని బొల్లి గిత్త ఇళ్ళ కప్పుల మీదకు విసిరేయడం, అతడి మృత దేహాన్ని తొక్కుతూ నాట్యం చేయడం ఇత్యాది దృశ్యాల వర్ణన భీభత్సంగా ఉండటం &#8230;.బహుశా మునెమ్మ పగ తాలూకు తీవ్రతకు తగిన ఫలితం దక్కిందని చెప్పడానికి కావొచ్చు!!  కాని ఆ ఆ దృశ్య చిత్రణ చాలా వెగటు కల్గిస్తుంది.</p>
<p><strong>విమర్శలు</strong><strong>-</strong><strong>వివాదాలు</strong><strong>:</strong></p>
<p>ఈ నవల మీద చాలా విమర్శలే వచ్చాయి. మొదటగా కాత్యాయని(చూపు) సంధించిన విమర్శనాస్త్రం పెను సంచలనాన్ని సృష్టించింది.</p>
<p>&#8220;గిత్తకూ మునెమ్మకూ రచయిత సంబంధం అంటగట్టారని&#8221;  ఆరోపిస్తూ ఈ ధోరణి పై, ఈ రచన పై ఆమె  ధ్వజమెత్తారు. &#8220;<strong>అవసరం</strong><strong> </strong><strong>అన్నీ</strong><strong> </strong><strong>నేర్పుతుంది</strong><strong> </strong><strong>రా</strong><strong> </strong><strong>సినబ్బా</strong><strong>, </strong><strong>ఈ</strong><strong> </strong><strong>మాట</strong><strong> </strong><strong>గొడ్డుకు</strong><strong> </strong><strong>కూడా</strong><strong> </strong><strong>వర్తిస్తుంది</strong><strong>&#8220;</strong> అన్న వాక్యాన్ని ఆమె సునిశితంగా విమర్శిస్తారు.  మునెమ్మ, గిత్త జీవనోపాధి మాత్రమే కాక పరస్పర &#8220;<strong>అవసరాల</strong><strong> </strong><strong>ఆధారంగా</strong>&#8221; ఒక ప్రాతి పదిక ఏర్పర్చుకున్నట్లు రచయిత  స్పష్టం చేసారని ఆమె ఆరోపణ. గిత్త రంకె లో భర్త గొంతు మునెమ్మకు వినిపించడం, రహస్య సంకేత నామం తో మునెమ్మ గిత్తను పిలవడం ఇందుకు సాక్ష్యాలని కాత్యాయని అంటారు. ఆమెను సమర్థిస్తూ డాక్టర్ భారతి (గీతాంజలి) జంతువులు తమ సెక్స్ వాంఛలను ఎటువంటి పరిస్థిత్లోనూ మనుషుల పట్ల ప్రకటించవని పశు వైద్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా సాధికారకంగా ప్రవేశ పెట్టారు. శాస్త్రీయ పధ్ధతి లో ఆమె చేసిన విమర్శ చాలా న్యాయంగా తోస్తుంది. ఇదొక వికృత శిల్ప విన్యాసమని తెలకపల్లి రవి విమర్శించారు. &#8220;<strong>సామాజికతకు</strong><strong>, </strong><strong>సహజాతాలకు</strong><strong> </strong><strong>మధ్య</strong><strong> </strong><strong>సంబంధాన్ని</strong><strong> </strong><strong>రచయిత</strong><strong> </strong><strong>సవ్యంగా</strong><strong> </strong><strong>అర్థం</strong><strong> </strong><strong>చేసుకోలేదని</strong> ఆయన అభిప్రాయ పడ్డారు.</p>
<p>అయితే ఈ విమర్శల్ని డాక్టర్ కేశవ రెడ్డి కొట్టి పారేశారు.  జంతువుల్లో బోర్ డమ్ సెక్స్ భావాలు మామూలేననీ, ఆవులలోను , స్త్రీలలోనూ ఉండే  ఒకే రకమైన హార్మోను వల్ల ఎద్దులు అలా స్త్రీల పట్ల ఆకర్షితులు కావడం సహజమే నని అన్నారు. ఈ లెక్కన  ఎద్దులు కోరిక కల్గినపుడల్లా స్త్రీల వైపు ఆకర్షితులైతే పల్లెల్లో స్త్రీల ప్రాణాలు ఏమై పోవాలని డాక్టర్ భారతి ప్రశ్నిస్తారు. ఈ   పరస్పర విమర్శా ప్రతి విమర్శల సిరీస్ లో కొంతమంది రచయితను, మరి కొంతమంది విమర్శకులను సమర్థించారు.  తెలుగు సాహిత్యంలో సాహితీ విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగే సందర్భాలను తరచూ చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది.  రచయిత ధోరణిని పర్వర్షన్ గా కాత్యాయని, తెలకపల్లి రవి పరిగణించగా, రచయిత అంతకంటే ఒక మెట్టు దిగి విమర్శకులను హిస్టీరిక్ రోగులుగా  వర్ణించడం, వారిని They mean nothing to me అనడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఆయన అసహనాన్ని స్పష్ట పరుస్తుంది.  They mean nothing to me అంటున్నపుడు వారి విమర్శలకు జవాబు ఇవ్వడం అవసరమా అన్న ప్రశ్న రేకెత్తుతుంది. విమర్శలు ఇలా విషయం మీద కాక వ్యక్తి గత స్థాయికి దిగడం ఆరోగ్య కరమైన ధోరణి కానే కాదు.</p>
<p>బొల్లిగిత్తలో మునెమ్మ భర్తను చూడటం అంటే&#8230;..కేవలం రక్షకుడిని చూసిందా? లేక మరో దృష్టితోనా అనేది ఈ నవల్లో ఎక్కడా రచయిత స్పష్టంగా చెప్పక వదిలేయడం ఈ అస్పష్టతకు కారణం. అంబటి సురేంద్ర రాజు కూడా&#8221; భర్త మరణానికి కారణమైన బొల్లి గిత్త ఆ భర్త &#8220;<strong>స్థానాన్ని</strong><strong> </strong><strong>భర్తీ</strong><strong> </strong><strong>చేయడం</strong>&#8221; పొయెటిక్ జస్టిస్ అనడం మరింత సందేహానికి తావిస్తుంది. ఏ రకంగా భర్తీ చేస్తుందన్నది ఆయనా స్పష్టంగా చెప్పరు.</p>
<p>అయితే మునెమ్మకు కొన్ని మూఢ నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి భర్త ఆత్మ బొల్లి గిత్తను ఆవేశించి తరుగులోడిని చంపాలని ఆమె ఆకాంక్షించిందని, అందుకే &#8220;పిలగాడిని వదులు&#8221; అని సినబ్బతో అని ఉంటుందని, ఆ కారణం చేతనే ఆమె గిత్త రంకె లో భర్త గొంతును వినగలిగి ఉంటుందని సామాన్య పాఠకుడు భావించే అవకాశం కూడా లేకపోలేదు.  అయితే దీనికి కూడా రచయిత నుంచి స్పష్టమైన మద్దతు నవల్లో కనిపించదు. నర్మ గర్భమైన వాతావరణాన్ని,  మాటల్ని (అవసరం అన్నీ నేర్పుతుందని, అది గొడ్డుకు కూడా వర్తిస్తుందని మునెమ్మ అన్న మాటకు ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి..) సృష్టించి ఆ ఖాళీని, సందేహాల్ని పాఠకుల మెదడులో వదిలి ఊరుకుంటాడు.</p>
<p>గిత్త ఒక జంతువు. దానికి &#8220;అవసరం&#8221; ఏముంటుంది? పగ ప్రతీకారం తీర్చుకునే అవసరం దానికి ఉంటుందా? పైగా&#8230;.అది ఏ క్షణం లో ఎలా ప్రవర్తిస్తుందో చెప్పలేమని మునెమ్మే అంటుంది. కాబట్టి..దానికి ఆలోచన లేదు. మరి దానికి ఉండే అవసరం ఏమై ఉండాలి?  అనే సందేహం పాఠకుడిని  వెంటాడి తీరుతుంది.<strong> </strong><strong>1985 </strong><strong>తర్వాత</strong><strong> </strong><strong>తెలుగు</strong><strong> </strong><strong>నవలలు</strong><strong>-</strong><strong>స్త్రీవాద</strong><strong> </strong><strong>దృక్పథం</strong>అనే అంశం మీద సమర్పించడానికి  మునెమ్మ పాత్రను ఎంచుకుని ఈ నవల మీద పరిశోధనా వ్యాసం రాసిన డాక్టర్ దార్ల వెంకటేశ్వర రావు గారు  ఈ చివరి వాక్యానికి సంబంధించి &#8221; కథనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పెళ్ళయి ఆరేళ్ళయినా పిల్లలు పుట్టక పోవడానికి భర్త లోపాన్నేదైనా  రచయిత సూచించాలనుకంటున్నాడా?&#8221; అని సందేహాన్ని వ్యక్తం చేశారు.</p>
<p>ఇవన్నీ పాఠకుడు తనకు తానే ఊహించుకున్న జవాబులతో తృప్తి పరచుకోవాలి తప్ప నవల్లో ఇదమిత్థంగా &#8220;ఇదీ జరిగింది&#8221; అని రచయిత చెప్పడు.</p>
<p>అసంఖ్యాక పాఠకుల ఆదరణకు పాత్రమై, అదే స్థాయిలో విమర్శలకూ గురైన సంచనల పాత్ర మునెమ్మ!</p>
<p>పాఠకుల్లొ  ఆసక్తిని, అనురక్తిని కల్గించడం తో పాటు, అనుమానాలను, సందేహాలను, సందిగ్ధాలను అదే స్థాయిలోరేకెత్తించిన ఒక మిస్టీరియస్ నవల గా మునెమ్మ ను చెప్పుకోవచ్చు.</p>
<p>తప్పక చదవాల్సిన నవల! హైదరాబాదు  బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ నవల అన్ని షాపుల్లోనూ లభ్యం!</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=1405</wfw:commentRss>
		<slash:comments>54</slash:comments>
		</item>
		<item>
		<title>ఈ కథల్లో కన్నీరు అంటే కరుణ!</title>
		<link>http://vaakili.com/patrika/?p=780</link>
		<comments>http://vaakili.com/patrika/?p=780#comments</comments>
		<pubDate>Fri, 25 Jan 2013 00:45:59 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=780</guid>
		<description><![CDATA[<p>రోడ్డు మీద నడుస్తుంటాం, ఆఫీసులో పని చేస్తుంటాం,.ఏదో ఒక వూరు వెళ్తాం&#8230;.! ఈ సందర్భాలు అన్నింటిలోనూ కళ్ళ ముందు ఎంతో మంది మనుషులు కనిపిస్తారు. వారిలో కొందరు మనల్ని ఆకర్షిస్తారు. కొందరితో మాట్లాడతాం. కొందరితో స్నేహం కూడా చేస్తాం! మరి కొందరిని అసలు పట్టించుకోకుండా, లక్ష్య పెట్టకుండా, గమనించకుండా వదిలేస్తాం..!! అదిగో ఆ వదిలేసిన వాళ్ళే సుబ్బ రామయ్య గారి కథలకు వస్తువులుగా తిరిగి మనకు పరిచయం అవుతారు. మనసులోకి వచ్చిన ఒక ఆలోచనో స్పందింప జేసే ఒక సంఘటనో కాక, తన చుట్టూ ఉన్న మనుషుల్లోంచి సమాజం సులభంగా విసర్జించి పారేసిన వారిని తాను ఎన్నుకుని పరిశీలిస్తూ..ఆ అభాగ్యులతో పాటు ప్రయాణిస్తూ మనల్ని కూడా తనతో పాటు చేయిపట్టి ఈ కథల పొడుగునా తీసుకు పోతాడు రచయిత. ఒకటో అరో తప్పించి ప్రతి కథలోనూ జీవిత మధుర ఫలాలు చేతికందే లోపున చేజార్చుకున్న నిర్భాగ్యులూ, చేతికి అందకుండానే కాలాన్ని దాటిన అభాగ్యులూ&#8230;.మనసుండి నలిగిపోయే మనుషులూ, కాల చక్రం కర్కశ హస్తాల్లో చిక్కిన అమాయకులూ&#8230;వీళ్ళే అడుగడుగునా పలకరిస్తారు మనల్ని.</p> <p>&#160;</p> <p>లబ్ధ ప్రతిష్టులెంతమందో సుబ్బ రామయ్య గారి గురించి మంచి ముక్కలు చెప్పనే చెప్పి ఉంచారు.  అయితే ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ ఆ మాటల గురించి ఏమంటారంటే &#8221; ఎందరు ఎన్ని రకాలు గా చెప్పినా అవన్నీ పాక్షిక సత్యాలే ననీ, వాటన్నింటినీ ఒక చోట చేర్చి చూస్తే ఆ పాక్షిక దృశ్య శకలాల్లోంచి లీలగా నైనా సుబ్బరామయ్య గారి సాక్షాత్కరిస్తుంది అంటారు. నూటికి నూరు  పాళ్ళూ ఏకీభవించాల్సిన విషయం ఇది.</p> <p style="text-align: center;">కథల్లో మృత్యు గీతం</p> <p> సుబ్బ రామయ్య గారి చాలా కథల్లో మృత్యుగీతం తో మొదలవడమో, అంతం కావడమో జరుగుతాయి. ఇది పాఠకుడిని మొదట్లో ఉలిక్కి పడేలా చేసినా రాను రాను ఆ పరిస్థితిని ఒకింత స్థైర్యంతో మామూలుగా కొద్ది పాటి విషాద భావనతో వాస్తవ భావనతో అంగీకరించే [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg"><img class="alignleft size-full wp-image-946" title="sujatha" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/sujatha.jpg" alt="" width="96" height="133" /></a>రోడ్డు మీద నడుస్తుంటాం, ఆఫీసులో పని చేస్తుంటాం,.ఏదో ఒక వూరు వెళ్తాం&#8230;.! ఈ సందర్భాలు అన్నింటిలోనూ కళ్ళ ముందు ఎంతో మంది మనుషులు కనిపిస్తారు. వారిలో కొందరు మనల్ని ఆకర్షిస్తారు. కొందరితో మాట్లాడతాం. కొందరితో స్నేహం కూడా చేస్తాం! మరి కొందరిని అసలు పట్టించుకోకుండా, లక్ష్య పెట్టకుండా, గమనించకుండా వదిలేస్తాం..!! అదిగో ఆ వదిలేసిన వాళ్ళే సుబ్బ రామయ్య గారి కథలకు వస్తువులుగా తిరిగి మనకు పరిచయం అవుతారు. మనసులోకి వచ్చిన ఒక ఆలోచనో స్పందింప జేసే ఒక సంఘటనో కాక, తన చుట్టూ ఉన్న మనుషుల్లోంచి సమాజం సులభంగా విసర్జించి పారేసిన వారిని తాను ఎన్నుకుని పరిశీలిస్తూ..ఆ అభాగ్యులతో పాటు ప్రయాణిస్తూ మనల్ని కూడా తనతో పాటు చేయిపట్టి ఈ కథల పొడుగునా తీసుకు పోతాడు రచయిత. ఒకటో అరో తప్పించి ప్రతి కథలోనూ జీవిత మధుర ఫలాలు చేతికందే లోపున చేజార్చుకున్న నిర్భాగ్యులూ, చేతికి అందకుండానే కాలాన్ని దాటిన అభాగ్యులూ&#8230;.మనసుండి నలిగిపోయే మనుషులూ, కాల చక్రం కర్కశ హస్తాల్లో చిక్కిన అమాయకులూ&#8230;వీళ్ళే అడుగడుగునా పలకరిస్తారు మనల్ని.</p>
<p>&nbsp;</p>
<p>లబ్ధ ప్రతిష్టులెంతమందో సుబ్బ రామయ్య గారి గురించి మంచి ముక్కలు చెప్పనే చెప్పి ఉంచారు.  అయితే ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ ఆ మాటల గురించి ఏమంటారంటే &#8221; ఎందరు ఎన్ని రకాలు గా చెప్పినా అవన్నీ పాక్షిక సత్యాలే ననీ, వాటన్నింటినీ ఒక చోట చేర్చి చూస్తే ఆ పాక్షిక దృశ్య శకలాల్లోంచి లీలగా నైనా సుబ్బరామయ్య గారి సాక్షాత్కరిస్తుంది అంటారు. నూటికి నూరు  పాళ్ళూ ఏకీభవించాల్సిన విషయం ఇది.</p>
<p style="text-align: center;"><strong>కథల్లో మృత్యు గీతం</strong></p>
<p> సుబ్బ రామయ్య గారి చాలా కథల్లో మృత్యుగీతం తో మొదలవడమో, అంతం కావడమో జరుగుతాయి. ఇది పాఠకుడిని మొదట్లో ఉలిక్కి పడేలా చేసినా రాను రాను ఆ పరిస్థితిని ఒకింత స్థైర్యంతో <a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/peddi-1.jpg"><img class="alignright size-full wp-image-947" title="peddi-1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/peddi-1.jpg" alt="" width="144" height="243" /></a>మామూలుగా కొద్ది పాటి విషాద భావనతో వాస్తవ భావనతో అంగీకరించే స్థాయికి పాఠకుడు చేరతాడు. నీళ్ళు కథలో కథానాయకుడు నీటిలోనే ప్రమాద వశాత్తూ మునిగి మరణించినపుడు గుండె జలదరిస్తుంది. ఆ తర్వాత  ముసురు కథలో కిరసనాయిలు తాగి ప్రాణం పోగొట్టుకున్న సింగార వేలు, నిప్పు కోడి కథలో తిండికి అలమటించి దిక్కు లేని చావు చచ్చే రామ కోటి, పూర్ణాహుతి లో రోడ్డు దాటుతూ దుర్మరణం పాలయ్యే రామేశం, కళ్ళ జోడు కథలో హటాత్తుగా గుండె పోటు పాలై మరణించే అవధాని, సతీ సావిత్రి కథలో పొట్ట కూటి కోసం సావిత్రి ఎవరితోనో గడపడానికి వెళ్తే పాలకు అలమటించి గొంతెండి ప్రాణాలు వదిలే పసి పాప, ఆకలి నొప్పితో విలవిల లాడి ఒకానొక వర్షపు వేళ కన్ను మూసే పీనుగలు మోసే కనకయ్య, పాటలు పాడి పాడి గొంతు కాన్సర్ తో దీన స్థితితో పోయే పంకజ వల్లి&#8230;. (కొంప మాత్రం మిగిలింది) స్టేజీ మీద గుండెపోటుతో ప్రాణాలొదిలే సత్యం,  వీళ్లందరి మరణాలు కథలు చదువుతున్న కొద్దీ ప్రతి కథకూ గుండెను కలచి వేస్తూనే&#8230;.చావుని సైతం మౌనంగా అంగీకరిచగల స్థితికి పాఠకుడిని చేరుస్తాయి.</p>
<p>ముఖ్యంగా  &#8220;గాలి&#8221; కథలో కమల ముసలి తండ్రి మరణం తడి అడ్డం పడి చూపు మసక బారేలా చేస్తుంది. పెళ్ళి కాని కూతురు, ఆమె ముసలి తండ్రి ఒక పెద్ద భవనంలోని చిన్న ఇంట్లో అద్దెకుంటారు. కొడుకు ఎక్కడో దూరాన ఒక ఫాక్టరీలో పని చేసి పంపే కొద్ది డబ్బుతో బతుకు వెళ్ళదీస్తుంటారు. ఒక నడి వేసవిలో గాలి బిగదీసుకు పోయిన రోజున&#8230;కొద్ది పాటి గాలి కోసం ఆ ముసలి తండ్రి పడే యాతన యాతన కాదు. ఏమి చేయాలో తోచని కూతురు చేతిలో అన్న నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే చదువుకుని మరో వైపు కుమిలి పోతూ ఉంటుంది. అంతలో స్త్రీ లోలుడైన ఆ ఇంటి యజమాని రాగా, తండ్రికి కాసింత ఫాన్ గాలి అందించాలనే ఒకే ఒక్క కోరికతో అతనితో తీయగా మాట్లాడి అతని ఇంటికి వెళ్ళి, ఎలాగో ఒక టేబుల్ ఫాన్ పట్టుకొస్తుంది. ఇంటికి చేరి ఫాన్ పెట్టేసరికే గాలి లేక, ఊపిరి కూడా ఆడని పరిస్థితిలో తండ్రి మరణించి ఉంటాడు. మరో వైపు ఉత్తరంలో&#8230;.ఆమె అన్న ఫాక్టరీ చక్రాల మధ్య పడి మరణించాడనే వార్త ఆమెను ఆ క్షణంలో నలిపి వేస్తూ ఉంటుంది. ఏదో విషాదం జరగబోతూందని ముందే ఊహిస్తున్నా&#8230;ఈ ముగింపు గుండె చిక్క బట్టినట్లు బిగించేస్తుంది.</p>
<p style="text-align: center;">
<p style="text-align: center;"><strong>రోజు వారీ జీవితమే సరికొత్తగా&#8230;</strong></p>
<p>మృత్యువు తరచుగా ఈ కథల్లో కనిపిస్తున్నా&#8230;.మనిషి మనిషిగా ప్రవర్తించే సహజ సన్నివేశాలు, ప్రవర్తించని సహజ ఘటనలూ కథల్లో చోటు చేసుకుని ప్రతి కథా ఆసాంతం చదివేలా ఉంటాయి.బహుశా రచయిత వ్యక్తి గత జీవితంలో అలవోగ్గా ఎదురయ్యే రోజువారీ సంఘటనలే ఆయన చేతిలో పడి అద్భుతమైన శిల్పం తో మెరికల్లాంటి కథలు గా తయారై పాఠకుల ముందుకు వచ్చి ఉంటాయన్న అనుభూతి కల్గుతుంది.</p>
<p>&nbsp;</p>
<p>చిన్నమ్మ నవ్విందిలో పేదరికం వల్లనే అయినా అవిటి కూతురు పట్ల చిన్నమ్మ ప్రవర్తించే తీరూ, నాలుగు రాళ్ళు సంపాదించడానికి అదే చిన్నమ్మకు దేవుడిలా వచ్చి సహాయ పడే మాష్టారూ, &#8220;ముసురు&#8221; కథలో భర్త ను పోగొట్టుకుని దీన స్థితిలో ఉన్న పెరియ నాయకి ని , నలుగురి ఎద్దేవా మాటలూ భరిస్తూ ఆమె తరఫు వారొచ్చే దాకా కాపాడే వ్యక్తి, తనకే మింగ మెతుకులేని స్థితి లో మరొక వ్యక్తికి  ఉన్నంతలోనే మందులిప్పించి సేవలు చేసే కామేశం (పూర్ణాహుతి), తను చేసేది చిన్న పనే అయినా తల్లీ బిడ్డల్ని ఆదుకునే సహాయ రాజు, వీధి పాపగా పెరిగి, మరో వీధి పాపకు జన్మనిచ్చి నదిలో మునిగిపోయే కామాక్షి&#8230;&#8230;వీళ్ళంతా మనసులో చేరి ఆ పైన మెదడుని ఆక్రమించి ఆలోచనల్ని సాగు చేస్తూ ఉండిపోతారు.<br />
మనుగడ కోసం తీవ్ర స్థాయిలో పోరాటం సాగించే అనేక పాత్రలు అల్లిబిల్లిగా ఈ కథల్లో చోటు చేసుకుంటాయి. వృద్ధాప్యం,పేదరికం మీద పడ్డా ఆకలి మాత్రం చావని మాచమ్మ&#8230;ఏవో నాలుగు మాటలు చెప్పి అవధాని ఇంట్లో భోజనం కానిస్తుంది. (కళ్ళజోడు)! డబ్బులు తేవడం లేదని తండ్రి చేతిలో చచ్చేట్లు దెబ్బలు తిన్న  పసివాడు ముస్తఫా మద్య నిషేధం సమయంలో కూరగాయల సంచిలో మందు సీసాలు అందరికీ అందజేస్తాడు..మైళ్ళకు మైళ్ళు నడిచి. పైగా అడుగుతాడు &#8220;పోలీసయ్య గారు కష్టపడి బతకమన్నారుగా! చూడండి..నేనెంత కష్టపడుతున్నానో, నిన్న ఒక కేసు కోసం ఏకంగా ఆరుమైళ్ళు నడిచాను ఎండ గాలిలో! నాది కష్టం కాదా సార్..&#8221; అని! కొడుక్కు భారం కాకూడదనో ఏమో&#8230;ఇంట్లో చెప్పకుండా బస్టాండ్ దగ్గరా సినిమా హాళ్ల వద్దా యాచన చేసి పది పైసల బిళ్ళలు సంపాదించే మురారి డెబ్భై ఏళ్ళ తల్లీ&#8230;</p>
<p>&nbsp;</p>
<p>తన చెప్పుల జత దొంగిలించాడని తెల్సి కూడా వెంకట్రావు మీద కోపం తెచ్చుకోలేని (చెప్పుల జత)కథకుడు ..అతను వెళ్ళిపోయాక కూడా &#8220;కళ్ళ ముందు అదే దీనాకృతి..నెమ్మదిగా నడిచిపోతూ..&#8221;అనుకుంటాడు !! తన తల్లి చావాలని కోరుకున్న చలపతికి తన కొత్త్త టైపు మెషీన్ ఇచ్చేసి వెళ్దామనుకుంటాడు సుందరం. పైగా &#8220;ఖరీదుకే లెండి, నెమ్మది మీద వీలును బట్టి నెలకింతని డబ్బు పంపండి&#8221; అంటాడు. (గుండెలో పాము)..!! ఈ కథ నాకు చాలా నచ్చిన కథ రెండో సంకలనం లో !!<br />
కథల్లో వాతావరణం కూడా మనసులో గుబులు దిగులు రేపుతూ వెంటాడుతుంది.  మండిపోయే ఎండలూ, చుక్క నీరు లేని ప్రాంతాలు, గాలాడని ఉక్క పోత గదులూ,విఢిచిపెట్టని ముసురూ&#8230;..జాడించి కొట్టే వాన&#8230;ముంచుకొచ్చే వరదా&#8230;వీటన్నిటి వెనుకా&#8230;విషాదాల <a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/peddi-2.jpg"><img class="alignright size-full wp-image-948" title="peddi-2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/01/peddi-2.jpg" alt="" width="173" height="273" /></a>ఛాయలే! చాలా సేపు ఆలోచనల్లో పడేస్తాయి కథలు, పాత్రలూ! కథలతో పాత్రలతో మనసుని పిండేస్తూనే వాటి ద్వారా ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తాడు రచయిత.<br />
కోదండం గారి కల,కొళందవేలు బొమ్మ, ముసురు,చీకటి,దగ్ధ గీతం, పీట,అలజడి, దుర్దినం, కోరిక..ఇవన్నీ మనసులో అలజడిని రేపుతూనే కట్టి పడేసే ఆణిముత్యాలు.</p>
<p>&nbsp;</p>
<p>తన కథలన్నీ విషాదాంతాలే అయినా వాటి లక్ష్యం  పాఠకుల చేత కన్నీళ్ళు పెట్టించడం కానే కాదని సుబ్బరామయ్య అంటారు. అలాంటి లక్ష్యాలు సాహిత్య ప్రయోజనాలు కావని కూడా అంటారాయన. పట్టలేని దుఃఖాన్ని, క్లేశాన్ని పంచే కొన్ని కథలను  తాను కరుణ రసాన్ని వాహిక గా చేసుకుని చాలా ఆగ్రహంతో రాశానని చెప్తారు.  ఆయన కథలన్నీ పట్టణాల్లో కనిపించే దైన్య స్థితిని, నలిగి పోయిన మనుషుల్నే చూపిస్తాయి తప్ప పల్లె జీవనాన్ని ప్రతిబింబించవు. దానికాయన కొంత చింతిస్తారు కూడా! &#8220;కాలువ మల్లయ్య వంటి రచయితలు నోచుకున్న భాగ్యం తనకు కలగలేదంటారు. &#8220;మట్టి వాసన అంటారే..అదేమిటో నాకు తెలియదు. పట్టణాల్లో సుళ్ళు తిరిగే మురుగు కంపు మాత్రమే నాకు తెలుసు.దాని గురించి మాత్రమే రాశాను. తెలియని వాటి జోలికి వెళ్ళి చేతులు కాల్చుకునే అలవాటు లేదు&#8221; అని స్పష్టం చేశారు ఒక ఇంటర్వ్యూలో!</p>
<p>&nbsp;</p>
<p>శ్రీ సుబ్బరామయ్య గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం, ఆయన కథలకే కాదు,వాటి లోని ప్రతి పాత్రకూ దక్కిన గౌరవంగా భావించాలి. ప్రముఖ పుస్తకాల షాపుల్లో వారి రెండు కథా సంకలనాలూ లభిస్తున్నాయి.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=780</wfw:commentRss>
		<slash:comments>16</slash:comments>
		</item>
		<item>
		<title>నేలని నమ్ముకున్న వాళ్ళ కథలు!</title>
		<link>http://vaakili.com/patrika/?p=82</link>
		<comments>http://vaakili.com/patrika/?p=82#comments</comments>
		<pubDate>Tue, 18 Dec 2012 19:43:38 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[చదువు]]></category>
		<category><![CDATA[సుజాత]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=82</guid>
		<description><![CDATA[<p>కొన్ని పుస్తకాలు ఎంచేతో జీవితం మీద గొప్ప ఇష్టాన్ని కలిస్తాయి.  పుస్తకం ముగిసి పోయాక గొప్ప ఆలోచనలు అలా చుట్టు ముడతాయి. ఆ ఆలోచనలు అలా ముసురుకుంటూ ఉంటే , ఆ ఇష్టం తాలూకు మైకంలో అలా ఉండి పోవాలనిపిస్తుంది. అలాంటి పుస్తకాల్లో చేరేదే ఫ్రెంచ్  నవల &#8220;భూమి&#8221;!  La Terre  పేరుతో దీన్ని ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా ఎంతో శ్రమకోర్చి&#8230;రాశారు.<br /> ఇది రైతుల కథ. రైతులకు భూమి మీద ఉండే ప్రేమ, వ్యవసాయం మీద ఉండే వ్యామోహం,పాషన్ ఇవన్నీ కూలంకషంగా , క్షుణ్ణంగా చదివి రాయడం అంటే  సామాన్య మైన విషయం కాదు. వ్యవసాయ  స్వరూపాన్నే కాక, అప్పటి సామాజిక, రాజకీయ పరిణామాల పట్ల కూడ అవగాహన ఉండాలి. అందుకే జోలా ఒక గ్రామంలో మకాం పెట్టాడు. అక్కడి జనంతో కల్సి పోయాడు.  ఏడాదిలో సగం రోజులు అక్కడే గడిపాడు. అదే కాక ఫ్రెంచ్ వ్యవహాయం , పల్లె ప్రజల జీవితాల గురించిన పుస్తకాలు విరివిగా చదివాడు.రైతాంగ పోరాటాలు, వ్యవసాయ సమస్యలు, వంశపారంపర్యపు ఆస్థుల వివాదాలు వీటన్నిటి మీదా ఆయన ప్రముఖ సోషలిస్టు లతో  ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాడు.ఎంతో అధ్యయనం చేసాడు.</p> <p>ఇదంతా ఒక డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ లోని సమాచారం ఆధారంగా ఒక జీవిత కథను కొన్ని పాత్రలతో నడిపి అద్భుతమైన ఫిక్షన్ ని సృష్టించడం మామూలు విషయం కానే కాదు. అది జోలా సాధ్యం చేశాడు. అందుకే ఎమిల్ జోలా రచనల్లో మిగతావి అన్నీ ఒకెత్తు, భూమి ఒకటీ ఒకెత్తు అని చెప్తారు. ఇది ఆయన అభిమాన రచన కూడానట .</p> <p style="text-align: center;">(ఎమిల్ జోలా) </p> <p>ఈ నవలను నేను ఒక సారి వేసవి సెలవుల్లో శాఖా గ్రంధాలయంలో సగం చదివాను. మర్నాడు మిగతాది చదవొచ్చని  షెల్ఫ్ లో పెట్టేసి , మర్నాడు వొచ్చి చూస్తే..ఇహ కనిపించలేదు. ఎంత వెదికినా దొరక లేదు . [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>కొన్ని పుస్తకాలు ఎంచేతో జీవితం మీద గొప్ప ఇష్టాన్ని కలిస్తాయి.  పుస్తకం ముగిసి పోయాక గొప్ప ఆలోచనలు అలా చుట్టు ముడతాయి. ఆ ఆలోచనలు అలా ముసురుకుంటూ ఉంటే , ఆ ఇష్టం తాలూకు మైకంలో అలా ఉండి పోవాలనిపిస్తుంది. అలాంటి పుస్తకాల్లో చేరేదే ఫ్రెంచ్  నవల &#8220;భూమి&#8221;!  La Terre  పేరుతో దీన్ని ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా ఎంతో శ్రమకోర్చి&#8230;రాశారు.<br />
ఇది రైతుల కథ. రైతులకు భూమి మీద ఉండే ప్రేమ, వ్యవసాయం మీద ఉండే వ్యామోహం,పాషన్ ఇవన్నీ కూలంకషంగా , క్షుణ్ణంగా చదివి రాయడం అంటే  సామాన్య మైన విషయం కాదు. వ్యవసాయ  స్వరూపాన్నే కాక, అప్పటి సామాజిక, రాజకీయ పరిణామాల పట్ల కూడ అవగాహన ఉండాలి. అందుకే జోలా ఒక గ్రామంలో మకాం పెట్టాడు. అక్కడి జనంతో కల్సి పోయాడు.  ఏడాదిలో సగం రోజులు అక్కడే గడిపాడు. అదే కాక ఫ్రెంచ్ వ్యవహాయం , పల్లె ప్రజల జీవితాల గురించిన పుస్తకాలు విరివిగా చదివాడు.రైతాంగ పోరాటాలు, వ్యవసాయ సమస్యలు, వంశపారంపర్యపు ఆస్థుల వివాదాలు వీటన్నిటి మీదా ఆయన ప్రముఖ సోషలిస్టు లతో  ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాడు.ఎంతో అధ్యయనం చేసాడు.</p>
<p>ఇదంతా ఒక డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ లోని సమాచారం ఆధారంగా ఒక జీవిత కథను కొన్ని పాత్రలతో నడిపి అద్భుతమైన ఫిక్షన్ ని సృష్టించడం మామూలు విషయం కానే కాదు. అది జోలా సాధ్యం చేశాడు. అందుకే ఎమిల్ జోలా రచనల్లో మిగతావి అన్నీ ఒకెత్తు, భూమి ఒకటీ ఒకెత్తు అని చెప్తారు. ఇది ఆయన అభిమాన రచన కూడానట .<img class="aligncenter size-full wp-image-378" title="emile" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2012/12/emile.jpg" alt="" width="120" height="155" /></p>
<p style="text-align: center;"><strong><em>(ఎమిల్ జోలా) </em></strong></p>
<p>ఈ నవలను నేను ఒక సారి వేసవి సెలవుల్లో శాఖా గ్రంధాలయంలో సగం చదివాను. మర్నాడు మిగతాది చదవొచ్చని  షెల్ఫ్ లో పెట్టేసి , మర్నాడు వొచ్చి చూస్తే..ఇహ కనిపించలేదు. ఎంత వెదికినా దొరక లేదు . శాఖా గ్రంథాలయం వాళ్ళు కూడా &#8220;ఏమో, మాకు తెలీదు&#8221; అన్నారు. అసలే ఆ పుస్తకానికి గ్రంధాలయం సంప్రదాయం ప్రకారం ముందో పేజీ వెనకో పేజీ లేకపోవడం తో..పబ్లిషర్స్ ఎవరో ఏమిటో కూడా వెంటనే కనిపెట్ట లేకపోయాను.  ఫ్రెంచ్ నవల ఆధారంగా అనువాదకుడి పేరు దొరికింది. ఎన్ని షాపుల్లోనో వెదికాను కొనాలని.పాత పుస్తకాల షాపులన్నీ వెదికాను. విజయవాడ లెనిన్ సెంటర్ అంతా శక్తి కొద్దీ జల్లెడ పట్టాను.  ప్రయోజనం లేక పోయింది.  పన్నెండేళ్ళు అలా గడిచిపోయాక పబ్లిషర్స్ ఎవరో తెలిసి (హైద్రాబాదు బుక్ ట్రస్ట్), వాళ్ళకి ఉత్తరాలు రాశాను. వాళ్ళు ఆ పుస్తకం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేదనీ, తమ వద్ద కూడా ఒకటే కాపీ ఉందని అదివ్వడం కుదరదని  మర్యాదగా చెప్పారు. ఆ పుస్తకం సగమే చదివానన్న &#8220;ఖాళీ తనం&#8221;  అలా  మనసు మూలల్లో ఉండి పోయింది. ఏదో అశాంతి పట్టుకుంది !</p>
<p>మళ్ళీ అన్వేషణ మొదలు.  చివరికి ఒక మిత్రుడి చొరవ, చలవ వల్ల ఆ అద్భుతమైన నవల నాకు దొ&#8230;రి..కిం&#8230;ది! విజయవాడ లెనిన్ సెంటర్ లోని ఒక పాత పుస్తకాల షాపు లోనే!<br />
ఇక కథలోకి వస్తే&#8230;<br />
&#8220;భూమి&#8221; నవల్లో  భూమే కథా నాయకి. భూమే ప్రతి నాయిక. నవల్లో వందల కొద్దీ పాత్రలుంటాయి. అన్నీ భూదాహంతో అలమటించేవే. భూమి మీద ప్రేమతో పరితపించేవే. ప్రతి ఒక్కరి జీవితం <strong>భూమితో, భూమి వలన,భూమి చేత </strong>అన్నట్లుగా భూమి తో అల్లుకుపోయి ఉంటుంది. ఎవరి జీవితాన్నీ విడిగా చూడలేం.</p>
<p>27 ఎకరాల సుక్షేత్రమైన  పొలం చేతిలో ఉన్న సంప్రదాయ వృద్ధ  రైతు పువాన్ తన పిల్లలు ఫానీ,జీసస్, బ్యుతో లకు భూమిని వాటాలేసి పంచడంతో కథ మొదలవుతుంది. నడుం వంగేదాకా భూమి తల్లికి సేవ చేసిన పువాన్ మరిహ శక్తి లేక భూమిని పిల్లలకు పంచి వాళ్లిచ్చే పరిహారంతో విశ్రాంతిగా శేష జీవితం గడపాలని నిశ్చయించుకుంటాడు. జీవితమంతా అతడికి చేదోడుగా నిల్చి వంచిన నడుం ఎత్తకుండా పని చేయడమే తప్ప నోరెత్తి ఎరగని భార్య రోజ్!</p>
<p>పువాన్ సోదరుడు మోషే, ఏకాకి గా మిగిలిన పీనాసి వృద్ధ సోదరి   లగ్రాండ్ !! మోషే ఇద్దరు ఆడపిల్లలు లిజా, ఫ్రాంస్వాజ్  లు! పువాన్ పిల్లలు ముగ్గురిలోనూ కొంత రౌడీ వేషాలున్న బ్యుతో పొలం పంపకాలు తనకు నచ్చలేదని, వాటా స్వాధీనం చేసుకోక అలిగి వెళ్లి పోతాడు. అతడు అప్పటికీ బాబాయి కూతురు లిజాను పెళ్లి కాకుండానే గర్భవతిని చేస్తాడు.(యురోపియన్ సమాజంలో వరసలు వేరే అని గుర్తుంచుకోవాలి). ఇంట్లో తెచ్చి పెట్టుకుని వదిలేసిన వేశ్యకు పుట్టిన కూతురు తప్ప వేరే సంసారం అదీ ఏమీ లేని జీసస్ మాత్రం ఈ భూమిని అమ్మేస్తే ఎన్నాళ్ళు తాగొచ్చు అని ఆలోచిస్తుంటాడు. లిజా,ఫ్రాంస్వాజ్  లు తండ్రి మరణించడంతో ఉన్న కొద్ది పాటి భూమినీ స్వయంగా సాగు చేసుకుంటూ రెక్కల కష్టంతో బతికే రైతు పడుచులు.</p>
<p>అలెగ్జీ అనే ఒక పెద్ద భూస్వామి కమతంలో పని చేస్తున్న జాన్ ఫ్రాంస్వాజ్  మీద మనసు పడినా, ఆమె మరీ పదహారేళ్ళది కావడం వల్ల,లిజాను చేసుకుంటే కొద్ది పాటి భూమి దక్కుతుందనే ఆశతోనూ లిజాను పెళ్ళాడ్డానికి ఒప్పుకుంటాడు. ఈ లోపు ఊళ్ళో ఒక కొత్త రోడ్డు బ్యుతో వాటా పొలం పక్కగా పడటంతో బ్యుతో  పొలం విలువ పెరిగి పోతుంది. అతడు అపుడొచ్చి పొలం స్వాధీనం చేసుకోడమే కాక, తల్లిని చేసి వదిలేసిన లిజాను పెళ్ళాడతాడు. దాంతో లిజా పొలం కుడా అతగాడికి కల్సి వస్తుంది.</p>
<p>లిజాను పెళ్లాడి ఆమె ఇంట్లోనే కాపరం పెట్టిన బ్యుతో కి ఆస్తి  బయటికి పోనీకుండా ఉండాలనే దురాశతోఫ్రాంస్వాజ్  ని కూడా సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుడుతుంది. దాంతో అక్కా చెల్లెళ్లిద్దరి మధ్యా విభేదాలు పొడసూపుతాయి. ఇంట్లో అశాంతి రేగుతుంది. బ్యుతోని అనుక్షణం అసహ్యించుకుంటూ తనని తాను రక్షించుకుంటూ ఉంటుంది ఫ్రాంస్వాజ్ . అతడు కనిపిస్తే  చాలు ఒళ్ళు మండి పోతుంది ఆమెకి.</p>
<p>రోజ్ మరణంతో (ఒక చిన్న వాగ్వాదం లో బ్యుతో తల్లిని ఒక తోపు తోయడం తో కింద పడి గాయాల పాలై మరణిస్తుంది) ఒంటరి వాడైన పువాన్ కి ఒప్పందం ప్రకారం నెల నెలా ఇవ్వాల్సిన ధాన్యం , డబ్బు ఇవ్వడం మానేస్తారు జీసస్ బ్యుతోలు! కూతురు ఫానీ తన ఇంట్లో ఉండమంటుంది కానీ ఆమె క్రమశిక్షణకు, శుభ్రతా నియమాలకు పువాన్ తట్టుకోలేక పోతాడు. అతడి బతుకు దుర్భరమవుతుంది. అతడి దగ్గర మిగిలిన డబ్బు కూడా కాజేయడానికి తన వద్ద వచ్చి ఉండమని ఆహ్వానిస్తాడు మురికి జీవి జీసస్. అతడి దగ్గర కూడా ఉండలేకపోతాడు పువాన్. గత్యంతరం లేక బ్యుతో లిజాల ఇంటికే చేరతాడు. అక్కడ బ్యుతో,  ఫ్రాంస్వాజ్ మీద చేయబోయే అత్యాచార ప్రయత్నాల్ని చూసి సహించలేకపోయినా..వారించే ప్రయత్నమూ చేయలేడు..బలహీనత వల్ల, నిస్సహాయత వల్లా!<br />
ఈ విషయమై అక్కా చెల్లెళ్లకి గొడవలు, బ్యుతో చేతిలో లిజాకి తన్నులు, అతడితో గడిపేందుకు ఒప్పుకోమని చెల్లెలెకి అక్క వేడుకోళ్ళు&#8230; ఈ హింస పడలేక బ్యుతోని తీవ్రంగా ద్వేషిస్తూ జాన్ ని  పెళ్ళి చేసుకుంటుంది ఫ్రాంస్వాజ్! ఆస్తి దక్కకుండా పోయినంద్కు పీక్కుంటాడు బ్యుతో! అక్కా చెల్లెళ్ల మధ్య ఆస్తి విషయమై తీవ్ర శత్రుత్వం నెలకొంటుంది. ఒక్కటిగా మెలిగిన ఇద్దరూ బద్ధ శత్రువులై పొతారు. ఫ్రాంస్వాజ్  గర్భవతి అవుతుంది.</p>
<p>ఫ్రాంస్వాజ్ కి పిల్లలు పుడితే ఆస్తి పరాయి ఇంటికి పోతుంది. అందుకే అక్కడి మూఢ నమ్మకం ప్రకారం , గర్భ వతి అయిన ఆ పిల్ల పొట్ట మీద శిలువ ఆకారంలో చేత్తో గీత గీయాలని నిర్ణయించుకుంటారు లిజా బ్యుతోలు! అలా చేస్తే కడుపు పోతుందని వాళ్ళ నమ్మకం. ఒంటరి గా పొలానికి వస్తున్న ఆమెను అటకాయిస్తాడు బ్యుతో! ఆమె మీద అత్యాచారం చేస్తాడు. లిజా అందుకు సహకరిస్తుంది.<br />
అక్కా చెల్లెళ్ల మధ్య పోరాటం. ఆ పోరాటంలో లిజా తోసిన తోపుకి ఫ్రాంస్వాజ్ కొడవలి మీద పడి తీవ్ర గాయాల పాలవుతుంది.  ఈ ఘాతుకాన్ని అంతటినీ గడ్డి వాము వెనక నుంచీ చూసిన పువాన్ హడలి పోతాడు. మూడు రోజుల మరణ యాతన తర్వాత ఫ్రాంస్వాజ్ తను పట్టు తప్పి కొడవలి మీద పడ్డానని అందరికీ చెప్పి మరణిస్తుంది.  ఆమె భర్త పేరు మీద ఆస్తి రాయక పోవడం తో ఆస్తి అంతా లిజా బ్యుతోల పరమవుతుంది.</p>
<p>ఫ్రాంస్వాజ్ హత్యను పువాన్ చూశాడని తెలుసుకున్న పువాన్ ని కూడా లిజా బ్యుతోలు హతమారుస్తారు. జాన్ ఒంటరి వాడై పోతాడు మళ్ళీ. ఆస్తి భార్య తన పేరు మీద రాయనందుకు కొంత నొచ్చుకుంటాడు. ఇక ఆ వూరిలో ఉండబుద్ధి కాక సైన్యంలో చేరడానికి వెళ్ళి పోతాడు.</p>
<p>ముందు చెప్పుకున్నట్లు ఈ నవల్లో అసంఖ్యాక పాత్రలు కనిపిస్తాయి. రోజ్ సోదరుడు చార్లెస్ కుటుంబం, భూమి మీద ప్రేమతో నష్టాలొస్తున్నా సరే ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తూ భూమిని వదిలి పోలేని అలెగ్జీ, అతని ఇంట్లో పని చేస్తూ&#8230;పరాయి మగాళ్ళ కోసం నిరంతరం అర్రులు చాచే దాసీ జాక్ లిన్, తినడానికి గింజలు లేక నానా చాకిరీ చేస్తూ అమ్మమ్మ లగ్రాంద్ ఆదరణకు నోచుకోని పాల్మీరు, ఆమె మతి స్థిమితం లేని తమ్ముడు ఇలారియోం, ఇరుగు పొరుగులు లఘ్రీమా, మాక్రోం, ,బెక్యూ, చర్చి ఫాదర్ గోబెదార్, ఇంకా ఊర్లో పెద్ద మనుషులూ&#8230;..ఇలా!</p>
<p>వీళ్లంతా భూమి కోసం ఎంత దారుణాలకైనా ఒడిగడతారు. ఆ మట్టి కి సేవ చేస్తూ ఆ పరిమళాల్లో పరవశించి పోవాలని తపన పడుతుంటారు. పగలు కక్షలు పెంచుకుంటారు. రక్త సంబంధాలను కూడా లెక్క చేయక&#8230;అత్యా చారాలకు హత్యలకు ఒడిగడతారు.  అంతా కలిసినపుడు తాగి తందనాలాడతారు మళ్ళీ!</p>
<p>ఈ నవల్లోని ప్రతి పాత్రనూ నగిషీలతో చెక్కిన రచయిత పని తనం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. తమకంటూ ఏమీ మిగుల్చుకోక పిల్లల కు సర్వంధార పోసి అధోగతి పాలైన తండ్రి గా పువాన్ కళ్ల ముందు నిల్చి పోతాడు.</p>
<p>ఫ్రాన్స్ లోని ఆ వ్యవసాయ క్షేత్రాల వర్ణనా, వాళ్ళ ఆచార వ్యవహారలు,ద్రాక్ష తోటల్లో యువతీ యువకుల విహారాలు ఇవన్నీ ఫ్రెంచ్ పరిమళాన్ని అద్దుకుని ఆ వాతావారణం అంతా కళ్ళకు కడుతుంది. యురోపియన్ సమాజపు విచ్చలవిడి సెక్స్ సంబంధాలు, ముతక హాస్యాలు నవలంతా పరుచుకుని ఉంటాయి అంతర్లీనంగానే అయినా! అంతే  కాక ధాన్యానికి మద్దతు ధర లభించడం గురించిన చర్చలు, ఆధునిక యంత్రాల వినియోగం పట్ల విభిన్న అభిప్రాయాలు, ఎన్నికలు, వాటి మీద రైతుల అభిప్రాయాలు, అజ్నానాలు , రైతాంగ పోరాట చరిత్ర..ఇవన్ని ఈ నవలలో విస్త్రతంగా చోటు చేసుకుంటాయి. ఇవి కథకు అంతరాయాన్ని కలిగించవు సరి కదా, పాత్రలే ఆ చర్చల్లో పాల్గొనడం వల్ల మరింత ఆసక్తి కరంగా తోస్తాయి !</p>
<p>అంత విచ్చల విడి తనం మధ్యలోనూ&#8230;ఫ్రాంస్వాజ్ పట్ల తన ప్రేమను మనసులోనే దాచుకుని ఎలా వ్యక్త పరచాలో తెలీక మధన పడే జాన్ బహు సున్నితంగా కనిపిస్తాడు.మరో వైపు జీవితాంతం తాను అసహ్యించుకున్న బ్యుతో తన మీద అత్యా చారం చేసినపుడు ఫ్రాంస్వాజ్ భావ ప్రాప్తిని పొంది పరవశంతో కేకలు వేయడం పాఠకుడిని నివ్వెర పోయేలా చేస్తుంది. అను క్షణం తాను పైకి అసహించుకున్నా, తన శరీరం కోరుకుంది బ్యుతోనే అని ఫ్రాంస్వాజ్ చావ బోయే ఆఖరి క్షణాల్లో గుర్తించడం ఫ్రాంస్వాజ్ కే ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.</p>
<p>అడుగడుగునా రైతుల స్వార్థం  , స్వాభిమానం, మొండి తనం స్వలాభం, మూర్ఖత్వం,, కుట్ర, కృతఘ్నత మోసం, దగా..వీటన్నిటినీ వారి కఠోర  శ్రమ, కటిక దారిద్ర్యాల వెలుగులో పాఠకుడు సరిగా అర్థం చేసుకోవాలని, వాటిని సహజ మానవ ప్రవృత్తి గా చూడాలని ముందు మాట రాసిన డగ్లస్ పార్మీ అంటాడు. వాళ్ళని చెడ్డ వాళ్ళు గా కాక &#8220;మనుషులు&#8221; గా అర్థం చేసుకోవాలి అంటాడు.<br />
ఈ నవల కోసం ఎమిల్ జోలా సేకరించిన నోట్స్ అంతా పారిస్ లైబ్రరీ లో ఇప్పటికి కట్టలు కట్టలుగా భద్రంగా ఉందట. ఇలాంటి ప్రయత్నం మన తెలుగు సాహిత్యం లో ఏదైనా జరిగిందేమో తెలియదు. జరిగినా ఆనాటి నోట్స్ అంటా భద్రంగా దాచేంత  శ్రద్ధ మనకు ఉన్నట్లు తోచదు.</p>
<p>ఇంత చెప్పుకున్నాక అనువాదం గురించి చెప్పుకోక పొతే ఈ నవలా పరిచయం పూర్తయినట్లు కాదు. దీన్ని ప్రముఖ అనువాదకుడు సహవాసి తెలుగులోకి అనువదించారు.</p>
<p>కథ ఫ్రాన్స్ లో నడుస్తున్నా, వాతావరణం దాన్నేస్ఫురింప జేస్తున్నా&#8230;.అచ్చ తెలుగు పదాలు మాటలు కోకొల్లలుగా చోటు చేసుకున్న అద్భుతమైన అనువాదం ఈ నవలను  పూర్తిగా తెలుగు వారికి సొంతం చేసేస్తుంది. బాటిల్స్  అనే మాట వాడాల్సి వచ్చినపుడల్లా పక్కా గ్రామీణ భాషలో దాన్ని (ఎందుకంటే కథ యావత్తు పల్లె లోనే నడుస్తుంది మరి) &#8220;బుడ్లు &#8221; గా అభివర్ణిస్తాడు. <strong>&#8220;మూడు తూర్లు</strong>&#8220;(మూడు సార్లు), &#8220;<strong>ఇటు ఒచ్చే తలికి </strong>&#8220;(ఇటు వచ్చే సరికి), &#8220;<strong>పడ్డ</strong>&#8221; (గేదె), <strong>చల్ల మాపటి వేళ </strong>,<strong>చేను కాడికి.. గెనం  మీద</strong>( గట్టు మీద)ఇలాంటి పల్లె పదాల పరిమళా లతో  నవల యావత్తు ఘుమ ఘుమ లాడి  పోతుంది. ఎక్కడా బిగి తగ్గని, ఆసక్తి సడల నివ్వని అనువాదం! పర భాషా సాహిత్యాన్ని తెలుగులోకి ప్రతిభా వంతంగా పరిచయం కావాలంటే అనువాదం ప్రభావ శీలంగా  ఉండి  తీరాలని ఈ నవలలో నిరూపణ  అవుతుంది.</p>
<p>కొస మెరుపు ఏమిటంటే&#8230;ఈ నవల రాసిన తర్వాత యాభై ఏళ్ళకి ఎమిల్ జోలా అల్లుడు ఈ నవలలో వర్ణితం అయిన  రోన్య గ్రామానికి మూలమైన పల్లెకి వెళ్ళాడట. నవలలో పాత్రలన్నీ ఆ గ్రామం లోనిమనుషులే ! ఆ నవల వెలువడిన తర్వాత ఆ గ్రామం లో వారందరికీ దాని కథ తెలిసింది. వూళ్ళో వాళ్ళందరికీ నవల కొట్టిన పిండే! నవలలో పాత్రలన్నీ కారుడు గట్టిన స్వార్థం మూర్తీభవించిన పాత్రలే కాబట్టి, ఆ పాత్రలన్నింటికి వూర్లో మనుషులే మోడళ్ళు కాబట్టి, పాపం వాళ్ళేమైనా నోచ్చుకున్నారేమో అని ఆయన విచారించ బోయాడు.  తమ పల్లెను, పల్లీయుల్ని చెత్త గా  అభివర్ణించి నందుకు  వాళ్ళు ఏమి కోపం తెచ్చుకోలేదు. అయితే ఎవరిని వారు ఆయా పాత్రలతో సరి పోల్చుకోకుండా &#8220;ఫలానా బ్యుతో పాత్ర..అబ్బో బహు చెత్త&#8230;అదిగో ఆయనే ఆ పాత్రకి మూలం&#8221; అంటూ చెత్త పాత్రలన్నింటిని ఇరుగు పొరుగు వారితో యిట్టె పోల్చేసారట. డగ్లస్ పార్మి చెప్పినట్లు ఈ ధోరణిని కుడా మనుషుల సహజ లక్షణం గా మనం అంగీకరించాల్సిందే! ఫలానా చెత్త పాత్ర లక్షణాలు నాలో ఉన్నాయి అని ఎవరు ఒప్పుకుంటారేం మరి??</p>
<p>ఈ నవలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు 1983లో వేసారు. ప్రస్తుతం బయట ఎక్కడా అందుబాటులో లేదు. ఇలాంటి మంచి పుస్తకాలను మళ్లీ  వేసే బాధ్యతను పబ్లిషర్స్ తీసుకుంటే ఎంత బాగుంటుందో!<br />
తెలుగు లో ఇది అందుబాటులో లేకపోయినా ఇంగ్లీష్ వెర్షన్ pdf రూపం లో ఇక్కడ లభ్యం.<br />
<a href="http://ia700208.us.archive.org/14/items/thesoil00zolauoft/thesoil00zolauoft.pdf" target="_blank">http://ia700208.us.archive.<wbr>org/14/items/<wbr>thesoil00zolauoft/<wbr>thesoil00zolauoft.pdf</wbr></wbr></wbr></a></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=82</wfw:commentRss>
		<slash:comments>11</slash:comments>
		</item>
	</channel>
</rss>
