<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; పడుగు</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=391&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>ఒక కాలం కన్న కవి</title>
		<link>http://vaakili.com/patrika/?p=5349</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5349#comments</comments>
		<pubDate>Mon, 31 Mar 2014 19:54:39 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పడుగు]]></category>
		<category><![CDATA[డా. కాసుల లింగారెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5349</guid>
		<description><![CDATA[<p>ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఏ సమాజంలోనైనా కవులకు అత్యంత ప్రాధాన్యత వుంది. చాలా సందర్భాల్లో కవులు సమాజ గమనాన్ని నిర్దేశిస్తూ వస్తున్నరు. చరిత్ర పుటలు తిరగేస్తే కవులే తత్త్వవేత్తలు, తత్త్వవేత్తలే కవులుగా తీర్చిదిద్దబడ్డ వైనం గమనించవచ్చు. ఒక్క మినహాయింపును మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే ప్లేటో గురించి &#8211; కవులని నిషేధించాలన డానికి ఆయన కారణాలు ఆయనకు వున్నయి. కాని కవిత్వం యొక్క ప్రాధాన్యత ఆయన తర్వాత కూడా కొనసాగింది. కారణం,</p> <p>Poetry is simply the most beautiful, impressive and widely effective mode of saying things and hence its importance- Mathew Arnold</p> <p>ఆధునిక వచన కవిత్వం గాని, చిత్రలేఖనంగాని అందరికీ అర్థమయ్యే స్థాయిలో వుండడం లేదనే అభియోగం వుంది. శుద్ధ వచనం నుంచి వచన కవిత్వాన్ని వేరు చేసేవి అందమైన గాఢముద్ర గల ప్రభావ పూరితమైన ప్రతిభా కారకాలే. వాటిని ఉపయోగించ డంలో కవి తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే, పాఠకుడు దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన శ్రమను, నైపుణ్యాన్ని వినియోగించాలి. ఎందుకంటే,</p> <p>Poetry is the spontaneous overflow of powerful feelings it takes its origin from emotions recollected tranquility- William Wordsworth</p> <p>గతానికి సంబంధించిన ఆవేశాలు శక్తివంతమైన ఆలోచనలుగా స్వతస్సిద్ధంగా వెలువడే క్రమంలో కవి తన స్థల, కాల, సామాజిక అవగాహనలోని మూర్తమైన ప్రతీకల ద్వారా అమూర్తమైన భావాలకు రూపమిస్తడు. వ్యక్తి నిష్ఠమైన ఆవేశాలను సామూహిక అనుభవాలుగా, ఆవేశాలుగా భ్రమింపచేయడంలో కవి కృతకృత్యుడైనప్పుడే, అది గొప్ప కవిత్వమౌతుంది. అందుకు వస్తువును తను దర్శించే పద్ధతి, దానికి మూర్తరూపాన్నిచ్చే పద్ధతి తనదైన ప్రత్యేకతను నవ్యతను, సృజనాత్మకతను కవి కలిగివుండాలి. ఎందుకంటే,</p> <p>The way of expressing emotion in the form of art is by finding an objective correlative , in words, a set [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg"><img class="alignleft size-full wp-image-4882" title="padugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg" alt="" width="445" height="275" /></a>ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఏ సమాజంలోనైనా కవులకు అత్యంత ప్రాధాన్యత వుంది. చాలా సందర్భాల్లో కవులు సమాజ గమనాన్ని నిర్దేశిస్తూ వస్తున్నరు. చరిత్ర పుటలు తిరగేస్తే కవులే తత్త్వవేత్తలు, తత్త్వవేత్తలే కవులుగా తీర్చిదిద్దబడ్డ వైనం గమనించవచ్చు. ఒక్క మినహాయింపును మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే ప్లేటో గురించి &#8211; కవులని నిషేధించాలన డానికి ఆయన కారణాలు ఆయనకు వున్నయి. కాని కవిత్వం యొక్క ప్రాధాన్యత ఆయన తర్వాత కూడా కొనసాగింది. కారణం,</p>
<p>Poetry is simply the most beautiful, impressive and widely effective mode of saying things and hence its importance- Mathew Arnold</p>
<p>ఆధునిక వచన కవిత్వం గాని, చిత్రలేఖనంగాని అందరికీ అర్థమయ్యే స్థాయిలో వుండడం లేదనే అభియోగం వుంది. శుద్ధ వచనం నుంచి వచన కవిత్వాన్ని వేరు చేసేవి అందమైన గాఢముద్ర గల ప్రభావ పూరితమైన ప్రతిభా కారకాలే. వాటిని ఉపయోగించ డంలో కవి తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే, పాఠకుడు దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన శ్రమను, నైపుణ్యాన్ని వినియోగించాలి. ఎందుకంటే,</p>
<p>Poetry is the spontaneous overflow of powerful feelings it takes its origin from emotions recollected tranquility- William Wordsworth</p>
<p>గతానికి సంబంధించిన ఆవేశాలు శక్తివంతమైన ఆలోచనలుగా స్వతస్సిద్ధంగా వెలువడే క్రమంలో కవి తన స్థల, కాల, సామాజిక అవగాహనలోని మూర్తమైన ప్రతీకల ద్వారా అమూర్తమైన భావాలకు రూపమిస్తడు. వ్యక్తి నిష్ఠమైన ఆవేశాలను సామూహిక అనుభవాలుగా, ఆవేశాలుగా భ్రమింపచేయడంలో కవి కృతకృత్యుడైనప్పుడే, అది గొప్ప కవిత్వమౌతుంది. అందుకు వస్తువును తను దర్శించే పద్ధతి, దానికి మూర్తరూపాన్నిచ్చే పద్ధతి తనదైన ప్రత్యేకతను నవ్యతను, సృజనాత్మకతను కవి కలిగివుండాలి. ఎందుకంటే,</p>
<p>The way of expressing emotion in the form of art is by finding an objective correlative , in words, a set of objects, a situation, a chain of events which shall be the formula of the particular emotion, such that when the external facts, which must terminate in the sensory experience , are given , the emotion is immediately evoked- T.S. Eliot</p>
<p>ఒక సమాజము తనకు కావాల్సిన కవుల్ని అది తయారు చేసుకుంటది. &#8216;కాలం కడుపుతో వుండి&#8217; కవుల్ని కంటనే వుంటది. కాని సమాజంలో ఉద్యమ ప్రాబల్య కాలంలో మాత్రం అనేక మంది కవులు, కళాకారులు పుట్టుకొస్తరు. తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కాని, ఇప్పటి మలిథ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమ కాలంలోగాని మనము ఆ విషయాన్ని స్పష్టంగా చూడొచ్చు. నాలుగు కోట్ల ప్రజల న్యాయమైన ఆకాంక్ష అర్థ శతాబ్ధ కాలంగా అణచివేయబడుతున్న సందర్భంలో సామాజిక స్పృహ కలిగిన ప్రతి వ్యక్తి తన కార్యాచరణ ద్వారా అందుకు తోడ్పడే మార్గాన్ని ఎంచుకుంటడు. ఇవాళ్ళ తెలంగాణలో అట్లా అనేక మంది అనేక విభిన్న కార్యక్రమాల ద్వారా ఉద్యమానికి దోహదం చేస్తున్నరు. సాహిత్యంతో పరిచయముండి, ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న అనేక మంది తెలంగాణ విద్యాధికులు కవితల ద్వారా, పాటల ద్వారా మనముందుకొస్తున్నరు. అట్లా ఈ ఉద్యమం మలిచిన కవే మన జోగు అంజయ్య &#8216;పల్లెలన్ని మల్లెలాయె&#8217; అనే పాటల పుస్తకం ద్వారా తెలంగాణ సాహిత్యాకాశం మీద తళుక్కుమన్న &#8216;కంటిపాప కలగన్నది&#8217; అనే కవితా సంకలనం ద్వారా స్థిరపడ్డడు.</p>
<p>&#8216;పల్లెలన్నీ మల్లెలాయె&#8217; పది జిల్లాల ఉద్యమ ఆకాంక్షల పాట. ఐదు థాబ్దాలుగా కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న ఆకాంక్షను, తెలంగాణ పదములోని మాధుర్యాన్ని, జెండా నీడలోని ధైర్యాన్ని వినిపించిన మంచి మనసులున్న నేల పాడుకున్న పాట. ఈ పాటలో విద్యార్థి దండు కదులుతుంది. పల్లెలు ఎర్ర మల్లెలై రాజీలేని పోరుతో నడుం బిగించాయి. రాజ్యహింసని ధిక్కరించి ఢిల్లీల గెలిచి వస్తమని, ద్రోహాలకు, దోపిడీలకు చరమగీతం పాడుతమని వాగ్ధానం చేస్తున్నవి.</p>
<p>&#8221;అగ్గిపిడుగులాంటి వీరపుత్రులున్నరమ్మ నీకు<br />
శ్రీకాంతాచారి మా చూపులోన ఉన్నాడమ్మా<br />
వేణుగోపాలరెడ్డి వేగుచుక్క అయినాడు<br />
కృష్ణయ్య యాదయ్య యాదిలోన ఉన్నారు&#8221; అంటూ అమరుల తల్చుకుంటడు.</p>
<p>తెలంగాణ పట్ల, తెలంగాణ దార్శనికుల పట్ల విపరీతమైన అభిమానమున్న కవి ఒక్కక్కరినే పలవరిస్తున్నడు. కానికాలంలో కాలం చేసిన వాళ్ళను స్మరించుకున్నడు. బియ్యాల జనార్ధన్‌రావు, బాలగోపాల్‌, బుర్ర రాములు, కన్నాభిరన్‌, జయశంకర్‌, బెల్లి లలితల మీద ఎలిజీలు రాస్తున్నడు.</p>
<p>&#8221;మీ ఉపన్యాసాల ప్రేరణతో<br />
ఊర్లన్ని ఉద్యమిస్తున్నవి<br />
పట్నాలకు పౌరుషము వచ్చి<br />
యాస భాషను బతికుంచుకుంటున్నవి&#8221; (తెలంగాణ జాతి రత్నం)</p>
<p>అంటూ &#8216;నేలమ్మ ఒడిని చేరిన తెలంగాణ జాతి రత్నాన్ని&#8217; యాది జేసుకుంటున్నడు. &#8216;జీవితాంతం కడగండ్ల బతుకుల విముక్తికై పోరాడిన తెలంగాణ శక్తి&#8217; అని గద్దర్‌ను కీర్తిస్తున్నడు. తెలంగాణ గొప్పదనాన్ని జనరంజకంగా పాడిన బెల్లి లలిత అమరత్వాన్ని మరువకూడదంటున్నడు. &#8216;చైతన్యకారుడి ఆదర్శ జీవితం వెలకట్టలేనంత వెలుగును ఇస్తుంద&#8217;ని అంజయ్యకు తెలుసు. అందుకే తను కూడా ఆ బాటలో పయనించాలనుకుంటున్నడు.</p>
<p>జనగామలో ఒక సాహిత్య సంఘాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నిస్తున్న సమయంలోనే నాకు జోగు అంజయ్య పరిచయమయ్యిండు. తన పని రాక్షసత్వం ద్వారా, నిబద్ధత ద్వారా సౌమ్యుడైన అంజయ్య నన్ను ఆకట్టుకున్నడు.&#8217;పల్లెలన్ని మల్లెలాయె&#8217; ఆవిష్కరణ సభలో పాల్గొన్న నాటి నుంచి మా అనుబంధం మరింత పటిష్టమౌతూ వస్తున్నది. &#8216;జరసం&#8217; కార్యదర్శిగా ఈ సంవత్సర కాలంలో తాను సాహిత్యం పట్ల ఎంత సీరియస్‌గా వున్నడో నిరూపించుకున్నడు. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ తెలంగాణ రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న దళారీతనానికి ఆగ్రహం చెందుతున్నడు.</p>
<p>&#8216;రోజుకో వేషంతో<br />
పూటకో మాటతో<br />
ఉద్యమాలను ముంచాలనుకుంటే<br />
తోలు తీస్తారు జాగ్రత్త (ఉద్యమం ఏమంటున్నది)</p>
<p>అంటూ హెచ్చరిస్తున్నడు. &#8216;పోరాడే జనం ఉన్నచోట ముందడుగు వేసే నాయకులు వుండాలి&#8217;. కాని ప్రపంచంలో ఎక్కడా చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని తెలంగాణ ఈ సంవత్సర కాలంలో చవిచూసింది. ప్రజలు స్వచ్ఛందంగా పోరాట రూపాలు ఎన్నుకొని ఉద్యమం నిర్వహిస్తుంటే ఎక్కడ వెనుకబడిపోతామోనని, ప్రజలకు దూరమైతే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ చెత్తకుప్పల్లో చేరిపోవాల్సివస్తుందోనని తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజల వెంట నడిచిండ్రు, లేదా నడిచినట్టు నటించిండ్రు. సోనియాగాంధీ పాదాల చెంత మోకరిల్లుతూ, సీమాంధ్ర పెట్టుబడిదారులనుంచి సబ్‌ కాంట్రాక్టులు పొందుతూ చేవచచ్చిన దద్దమ్మల్లా కాంగ్రెస్‌ నాయకులు, పచ్చకళ్ళ రోగి ఆంధ్రాబాబునాయుడు కుట్రల, కుయుక్తుల కబంధ హస్తాల నుండి విడివడక లొంగిపోయి వంగిన తెలుగుదేశం నాయకులు, ఆంధ్ర పెట్టుబడిదారులకు, కమ్మకుల ఆధిపత్య వర్గాలకు పార్టీని తాకట్టుపెట్టిన మార్క్సిస్టులు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించక తప్పని రోజు తప్పకుండా వస్తుంది. అందుకే,</p>
<p>&#8221;బలమైన ఆకాంక్షను<br />
అంగట్లో పెట్టినందుకు<br />
రాజకీయ ద్రోహానికి<br />
వేయిమంది బలైనందుకు<br />
చరిత్ర పుటల నుండి<br />
మీ పేర్లు తొలగిస్తు&#8221; న్ననని కవి తన నిరసన ప్రకటిస్తున్నడు.</p>
<p>గడిచిన చరిత్రను గుర్తు చేసుకుంటూ &#8216;గడీల ప్రభువుల గోళీలాటలో వీర తెలంగాణ విగ్రహమయ్యిందని&#8217; అంగలారుస్తున్నడు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సభలో భారతీయ జనతా పార్టీ, టి.ఆర్‌.ఎస్‌. నాయకులు స్టేజిని ఆక్రమించుకున్న ఘటన చూసినప్పుడు సహజంగనే వారసత్వపు సమస్య చర్చకు వస్తది. సావర్కర్‌ ప్రస్థానంలో భగత్‌సింగ్‌ సహచరుడిగా వున్న స్థితినుంచి ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిబిరంలో చేరి పోయాక, ఆ శిబిరం గత రెండు థాబ్దాలుగా భగత్‌సింగ్‌ వారసులమని చెప్పుకుంటున్న వైనం తెలిసిందే. తెలంగాణ సాయుధపోరాటానికి నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మధ్య అభేదాన్ని పాటించడం ద్వారా పాలకవర్గాలు ఒక సంక్లిష్ట, గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నరు. &#8216; పోరుజెండకు ప్రాణం పోస్తూ రక్తం చిందించే కమ్యూనిస్టులూ, వారి అభిమానులూ వున్న దేశంలో డెబ్భై ఏళ్ళు గడిచినా ఏడుపాయలుగా చీలిపోయింది, గాని జీవనదిగా మారలేకపోయింది. ఐక్యంగా ఉండలేక పోయింది&#8217; అని వ్యధ చెందుతున్నడు కవి. క్విట్‌ ఇండియా ఉద్యమ సందర్భంలోగాని, అంబేద్కర్‌ జీవితంలోని రాడికల్‌ థ (1936-42)లో అంబేద్కర్‌తో వ్యవహరించిన సందర్భంలోగాని, 1969లో తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిగా సమైక్యవాదపు &#8216;విశాలాంధ్రలో ప్రజారాజ్యం&#8217; ముసుగులోగాని, మలిథ ఉద్యమంలో మార్క్సిస్టుల వైఖరిగాని ఈ దేశంలో మనువాద బ్రాహ్మణ భావజాలం కమ్యూనిస్టు ఉద్యమాన్ని దారితప్పించిందని తెలుస్తుంది. ఇవ్వాళ్ళ అస్తిత్వ ఉద్యమాలుగా ముందుకొచ్చిన స్త్రీ, దళిత, మైనారిటి, ప్రాంతీయ సమస్యలను అర్థం చేసుకోవడంలో బ్రాహ్మణ భావజాలం అడ్డుపడి ఆయా వర్గాల అణచివేతకు దారితీసిందని అర్థమౌతుంది.</p>
<p>స్వతహాగా పాటగాడైన (గాయక రచయిత) జోగు అంజయ్య జార్ఖండ్‌ రాష్ట్ర ప్రజాకళాకారుడు జీతన్‌ మరాండికి ఉరిశిక్ష విధించబడడం పట్ల కలత చెందిండు. &#8216;భూమి పుత్రులను కాపాడే కోపాగ్నిలో అక్కడి నేలతల్లి మృత్యు శకటాన్ని ముద్దాడుతుంది&#8217; అని చెప్తూ,</p>
<p>&#8216;పాటను బతికిస్తే<br />
ఆదివాసిని గుర్తిస్తే<br />
అడవి గెలిచిందనీ<br />
ప్రజాస్వామ్యం నిలిచిందనీ&#8217; ప్రకటిస్తనంటడు (ఉరిశిక్ష మరణిస్తే)</p>
<p>పీడిత కులం నుంచి, అట్టడుగు వర్గం నుంచి వచ్చిన కవి వనరుల విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులను, వారి కొమ్ముకాస్తున్న భారత దళారీ పాలకవర్గాలను ఎదిరించి పోరాడుతున్న ఆదివాసీల పక్షాన నిలిచిన జీతన్‌ మరాండీని ఆలింగనం చేసుకోవడం ద్వారా మన హృదయాల్ని గెలుచుకొని మనకు ప్రీతిపాత్రమైతడు. &#8216;అంతర్జాతీయుడి ఆర్థిక సంస్కరణ అనుకరణ ఫలితాల&#8217; పట్ల అవగాహన వున్న కవి ప్రభుత్వాల, మార్కెట్‌ శక్తుల గుట్టును రట్టు చేస్తానంటుంది తెలంగాణ&#8217; అంటూ భరోసా ఇస్తడు. స్థానికీకరణే ప్రజల ఆత్మ గౌరవానికి, స్వావలంబనకు, అభివృద్ధికి మార్గమన్న ఎరుకను కనబరుస్తడు.</p>
<p>&#8216;విజన్‌ 2020 పుస్తక విమానం విలేజీలో దిగలేదు.</p>
<p>వీధికొక్కటైనా ఇవ్వకుండానే విదేశీ కంపెనీలకు పంచింది&#8217; అంటూ ప్రపంచ బ్యాంకు మోజులో చంద్రబాబునాయుడు వెలగబెట్టిన సంస్కరణలను, వ్యూహాల్ని ఎండగడుతున్నడు. భారతదేశంలో చదువురాని మామూలు రైతుకు వున్న ఇంగిత జ్ఞానం కూడా లేని పాలకులు (ముఖ్యంగా చంద్రబాబు) ప్రథమ, ద్వితీయ ఆర్థిక రంగాలను నిర్వీర్యంచేసి (బాహాటంగా ప్రకటిస్తూనే) తృతీయ రంగమైన సేవారంగం అభివృద్ధి ఒక్కటే అభివృద్ధి మార్గంగా నిర్వచించడం, ఈ దేశపు గుండె కాయగా వున్న భూమి హక్కు పట్ల మెసలి కన్నీరు కార్చడం, కుహనా సంస్కరణల్ని ప్రవేశపెట్టడం కవి లోతుగా గమనిస్తున్నడు.</p>
<p>&#8216;బీదల కోసం భూ సంస్కరణల చట్టమంటరు<br />
అమలు చేసి భూములు ఇస్తమంటరు<br />
పదుల ఎకరాలు పంచుడాయె<br />
లక్షల ఎకరాలు మింగుడాయె&#8217; (బహుజనులూ బాగున్నారా)</p>
<p>తెలంగాణలో ఒక అగ్రకుల పాలకవర్గాన్ని నిర్వీర్యం చేయడానికి 1971లో పి.వి. నర్సింహారావు (ముఖ్యమంత్రి) సీలింగ్‌ చట్టం తెచ్చిండు. ఫలితంగా మిగులు భూములు తెలివి మీరి బినామీలుగా పెంపుడు కుక్కల, పిల్లుల, జీతగాండ్ల సంకల చేరినవి. 1983లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మండలాధీశుడి అవతారమెత్తింది. తెలంగాణ పాలకవర్గాన్ని బలహీన పరచడం ద్వారా ఆంధ్రుల ఆధిపత్యాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్ది అది కమ్మకుల ప్రయోజాల్ని నెరవేర్చింది. ఫలితాలు తెలంగాణ కళ్ళెదుట ఇవ్వాళ్ళ సినిమా స్కోపులో దర్శనమిస్తున్నయి. కాని &#8216;పాలకులు దోపిడీ చేస్తున్నమని చెప్పలేక, అభివృద్ధి పేరిట ఆర్భాటాలు చేస్తారని, సంస్కరణ ఫలితాలు సంపన్నులకేనని&#8217; ఈ కవికి ఖచ్ఛితంగా తెలుసు. అందుకనే ఉపాధ్యాయ వృత్తిలో వున్న కవి</p>
<p>&#8221;సామాజిక చరిత్రను చదివితేనే కదా<br />
సమాజంలో చైతన్యం వచ్చేది<br />
సోషల్‌ సైన్సెస్‌ చదివితేనే కదా<br />
సామాజిక విలువలు రక్షించబడేది<br />
మరి కంప్యూటర్‌ మాత్రమే చదవాలంటారేమిటి?&#8221; అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నట్టే వుంటడు. కాని,</p>
<p>&#8221;అద్దం పలిగినప్పుడు<br />
అతుకుడు తాత్కాలికమే</p>
<p>రాష్ట్ర విభజన ఒక అవసరం&#8221; అని చెప్పి నిర్ద్వంద్వంగా ప్రకటించడం ద్వారా తన ఆలోచనా విధానంలోని సమగ్రతని వ్యక్త పరుస్తడు. డిసెంబర్‌ 9, 2009 ప్రకటనకు వెన్నుపోటు పొడుస్తూ డిసెంబర్‌ 23, 2009 ప్రకటన రావడం, శ్రీకృష్ణ కమిటీ డబ్బు సంచులకు అమ్ముడుపోయి తెలంగాణకు వ్యతిరేకమైన రిపోర్టు ఇవ్వడం, తెలంగాణ రాజకీయ నాయకుల దళారీతనం, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలలో నిలిచిపోయే సకల జనుల సమ్మె ఏ ప్రయోజనం పొందకుంటనే విరమించబడడం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కవి గొప్ప ఆశాజీవిగా దర్శనమిస్తడు.</p>
<p>&#8221;నూనూగుమీసాల పోరడు<br />
తొలిప్రేమను మించిన సంబరాన్ని ప్రకటిస్తూ<br />
విముక్తి దారులు వెదుకుతున్నడు<br />
కాలజ్ఞానం తెలిసిన వాడిలా<br />
తూర్పు దిక్కున పొద్దు పొడుపుగా<br />
తెలంగాణ ఉదయిస్తుంది&#8221; (తోటమాలి అడ్డుపడితే)</p>
<p>అంటు గొప్పనమ్మకాన్ని వ్యక్త పరుస్తడు.&#8217; నా తెలంగాణ ఒక బంగారు రాష్ట్రంగా వచ్చినట్లు నా కంటిపాప కలగన్నది&#8217; అంటూ నిద్దురలోనే కలవరిస్తడు.</p>
<p>&#8221;నా కలానికి ప్రజల ఆకాంక్షలను బలపరిచే పోరాటం వుంది.<br />
నా కంటిపాపకు కుల వివక్షతలేని సమాజ నిర్మాణ కలవుంది<br />
నా భాషకు తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యవహారం వుంది.<br />
నా రాగానికి మట్టి మనుషులు పాడుకునే స్వరం వుంది&#8221;<br />
అని ప్రకటిచుకున్నప్పుడు నాకు బాలగంగాధర్‌ తిలక్‌ గుర్తుకు వచ్చిండు.</p>
<p>&#8216;కవిత్వంలో ప్రజల సమస్యలు అక్షరీకరింపబడుతాయని తెలుసుకొని కలం పట్టాను. కవి కావాలని మాత్రం కాదు&#8217; అన్నప్పుడు అంజయ్యలోని modesty అర్థమౌతుంది.</p>
<p>&#8221;కవిత్వం ఒక ఆల్కెమీ<br />
దాని రహస్యం కవికే తెలుసును<br />
కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు<br />
కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు&#8221; &#8211; బాలగంగాధర్‌ తిలక్‌</p>
<p>మరి, కవిత్వం ఆల్కెమీ అని అంజయ్య కూడా తెలుసుకోవాలి.వస్తువు ఎంత బలమైనదైనా, నిర్మాణ రూపం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. సాధన ద్వారా, వ్యుత్పత్తి ద్వారా ప్రతిభను మెరుగు పరుచుకుంటూ తనదైన అభివ్యక్తిని, తనదైన శైలిని వృద్ధి చేసుకోవాలి. కవిత్వం ఒక ప్రత్యేకమైన భాష. అది కవి గ్రహించాలి.</p>
<p>‘’ Poets are the nierophants of unapprehended inspiration; The mirrors of the gigantic shadows which futirity casts upon the present ; The words of which express what they understand not; The trumpets which sign to battle and feel not what they inspire, the influence which is moved not,but moves; Poets are the unacknowledged legislators of the world- P.B.Shelly</p>
<p>ఇది అర్థం చేసుకొని, dilectolgy ని జీర్ణించుకొని అంజయ్య తెలంగాణ సాహిత్య లోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తూ, అట్లా చేసుకునే శక్తి అతనికుందని విశ్వసిస్తూ..</p>
<p><span style="text-decoration: underline;"><strong>బయోడేటా</strong></span></p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/jogu_anjayya.jpg"><img class="alignright  wp-image-5353" title="jogu_anjayya" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/04/jogu_anjayya.jpg" alt="" width="145" height="156" /></a></p>
<div>
<p>పేరు: జోగు అంజయ్య</p>
<p>పుట్టిన తేది: 04-04-1967<br />
స్వస్థలము: వడిచర్ల, లింగాల ఘనపురము. వరంగల్లు (జిల్లా)<br />
విద్యార్హతలు: ఎం.ఏ. బి.ఇ.డి.<br />
వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయుడు<br />
రచనలు: పల్లెలన్నీ మల్లెలాయె (పాటల సంపుటి)<br />
కంటిపాప కలగన్నది(కవితా సంపుటి)</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5349</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలపు కవి</title>
		<link>http://vaakili.com/patrika/?p=5199</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5199#comments</comments>
		<pubDate>Fri, 28 Feb 2014 21:01:07 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పడుగు]]></category>
		<category><![CDATA[డా. కాసుల లింగారెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5199</guid>
		<description><![CDATA[<p>ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. ఆత్మగౌరవ పోరాటాలు లావాలా ప్రవహిస్తున్న కాలం. అమూర్త వాగాడం బరంలోంచి చిత్రిక పట్టిన స్పష్టమైన కళల, కలల రేఖలు విచ్చుకుంటున్న కాలం. నన్నయ, చిన్నయల గ్రాంధిక వ్యాకరణాల సంకెళ్ళు తెంపుకొని స్థిరపడ,్డ గిడుగు పొడుగు భాష దృతరాష్ట్ర కౌగిళ్ళ దుర్మార్గాన్ని గుర్తించిన కాలం. తరగతిగది భాషను ధిక్కరించి ఇంటి భాషను నెత్తికెత్తుకుంటున్న కాలం. మనిషి ఆత్మన్యూనతల బురఖాల్ని చీల్చుకొని,అవమానాల మొండిగోడలు బద్దలుకొట్టుకొని తన్ను తాను నిఖార్సుగా నిలబెట్టుకుంటున్న కాలం. ఇగో, ఇట్లాంటి కాలపు &#8216;ఎగిలి వారంగ&#8217; మన పొన్నాల బాలయ్య &#8216;దందెడ&#8217; భుజానేసుకొని కవిత్వసేద్యపు దారుల్ల సాగుతున్నడు.</p> <p>వలసవాదం, నయావలసవాదం, అంతర్గత వలసవాదం, మనువాదం, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఎన్ని రకాల దోపిడి, పీడన, అణచివేతల్ని తెలంగాణ సమాజం మీద ప్రయోగించిందో అట్లాంటి వాటినన్నిటినీ నిండుగా అనుభవించిన వాడు బాలయ్య. వీటికి తోడు &#8216;బోడిగుండు మీద తాటిపండు పడ్డట్టు&#8217; బాల్యంలో తండ్రి మరణం, యౌవనంలో తల్లి మరణం అల్సర్‌,అపెండిక్సుల అనారోగ్య రూపాల్లో జీవితం పొన్నాలకు పరీక్షల మీద పరీక్షలు పెట్టింది. ఆపరీక్షలన్నీ నెగ్గుకుంటూ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేసి ఉపాధ్యాయ వృత్తిల స్థిరపడ్డ బాలయ్య ఇయ్యాళ్ళ పేర్కొనదగ్గ కవిగా గుర్తింపు పొందిండు.అందు కు కవి శ్రమతో పాటు మరో రెండు ముఖ్య విషయాలు దోహదం చేసినవి. తెలంగాణ అందునా ఉత్తర తెలంగాణలోని హుస్నాబాద్‌లో పుట్టి పెరగడం ఒక ఎత్తైతే, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలోని అట్టడుగు తంతెమీద ఆవిర్భవించడం మరో ఎత్తు.ఈ రెండు అస్తిత్వాలు బాలయ్య జీవితాన్ని, కవిత్వాన్ని సుసంపన్నం చేయడంలో ఒక ఉత్కృష్ట పాత్రని పోషించినవి. ఎవరైనాకవిత్వాన్ని, కళను జీవితానుభవంలోంచి తోడుకోవాల్సిందే. అనుభవం ఎంత విస్తృతమైందైతే, సంపన్నమైందైతే కవిత్వం,కళ అంత సజీవమౌతుంది. తన విస్తృత,సంపన్న జీవితానుభవంలోంచి &#8216;దందెడ&#8217; సాయంతో సజీవ కవిత్వాన్ని తోడుకుంటున్నడుకవి. అందువల్లే దళిత భాషను, జీవితాన్ని సాధికారంగా కవిత్వంలోకి తెచ్చిన అతి కొద్దిమంది కవుల్లో ఒకడుగా నిలబడ్డడు.<br /> &#8216;శ్రమ జీవుల శిరస్సులన్నీ బ్రాహ్మణుల చేతుల్లో బంతులైన &#8216; [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg"><img class="alignleft  wp-image-4882" title="padugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg" alt="" width="356" height="220" /></a>ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. ఆత్మగౌరవ పోరాటాలు లావాలా ప్రవహిస్తున్న కాలం. అమూర్త వాగాడం బరంలోంచి చిత్రిక పట్టిన స్పష్టమైన కళల, కలల రేఖలు విచ్చుకుంటున్న కాలం. నన్నయ, చిన్నయల గ్రాంధిక వ్యాకరణాల సంకెళ్ళు తెంపుకొని స్థిరపడ,్డ గిడుగు పొడుగు భాష దృతరాష్ట్ర కౌగిళ్ళ దుర్మార్గాన్ని గుర్తించిన కాలం. తరగతిగది భాషను ధిక్కరించి ఇంటి భాషను నెత్తికెత్తుకుంటున్న కాలం. మనిషి ఆత్మన్యూనతల బురఖాల్ని చీల్చుకొని,అవమానాల మొండిగోడలు బద్దలుకొట్టుకొని తన్ను తాను నిఖార్సుగా నిలబెట్టుకుంటున్న కాలం. ఇగో, ఇట్లాంటి కాలపు &#8216;ఎగిలి వారంగ&#8217; మన పొన్నాల బాలయ్య &#8216;దందెడ&#8217; భుజానేసుకొని కవిత్వసేద్యపు దారుల్ల సాగుతున్నడు.</p>
<p>వలసవాదం, నయావలసవాదం, అంతర్గత వలసవాదం, మనువాదం, నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఎన్ని రకాల దోపిడి, పీడన, అణచివేతల్ని తెలంగాణ సమాజం మీద ప్రయోగించిందో అట్లాంటి వాటినన్నిటినీ నిండుగా అనుభవించిన వాడు బాలయ్య. వీటికి తోడు &#8216;బోడిగుండు మీద తాటిపండు పడ్డట్టు&#8217; బాల్యంలో తండ్రి మరణం, యౌవనంలో తల్లి మరణం అల్సర్‌,అపెండిక్సుల అనారోగ్య రూపాల్లో జీవితం పొన్నాలకు పరీక్షల మీద పరీక్షలు పెట్టింది. ఆపరీక్షలన్నీ నెగ్గుకుంటూ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేసి ఉపాధ్యాయ వృత్తిల స్థిరపడ్డ బాలయ్య ఇయ్యాళ్ళ పేర్కొనదగ్గ కవిగా గుర్తింపు పొందిండు.అందు కు కవి శ్రమతో పాటు మరో రెండు ముఖ్య విషయాలు దోహదం చేసినవి. తెలంగాణ అందునా ఉత్తర తెలంగాణలోని హుస్నాబాద్‌లో పుట్టి పెరగడం ఒక ఎత్తైతే, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలోని అట్టడుగు తంతెమీద ఆవిర్భవించడం మరో ఎత్తు.ఈ రెండు అస్తిత్వాలు బాలయ్య జీవితాన్ని, కవిత్వాన్ని సుసంపన్నం చేయడంలో ఒక ఉత్కృష్ట పాత్రని పోషించినవి. ఎవరైనాకవిత్వాన్ని, కళను జీవితానుభవంలోంచి తోడుకోవాల్సిందే. అనుభవం ఎంత విస్తృతమైందైతే, సంపన్నమైందైతే కవిత్వం,కళ అంత సజీవమౌతుంది. తన విస్తృత,సంపన్న జీవితానుభవంలోంచి &#8216;దందెడ&#8217; సాయంతో సజీవ కవిత్వాన్ని తోడుకుంటున్నడుకవి. అందువల్లే దళిత భాషను, జీవితాన్ని సాధికారంగా కవిత్వంలోకి తెచ్చిన అతి కొద్దిమంది కవుల్లో ఒకడుగా నిలబడ్డడు.<br />
&#8216;శ్రమ జీవుల శిరస్సులన్నీ బ్రాహ్మణుల చేతుల్లో బంతులైన &#8216; వైనాన్ని గుర్తించిండు. అందువల్లనే, &#8216;తుప్పుపట్టిన చెన్నె ఆరెలే మిగ్గు పూసుకొని దూసుకొచ్చే కవితా కత్తులుగా&#8217; చేసుకొని &#8216;పగబట్టి సంస్కృతిని కొల్లగొట్టిన పరాయీకరణ మీద&#8217; యుద్ధం ప్రకటిస్తున్నడు.</p>
<p><em>&#8221;మనువు వటవృక్ష వూడల అడల్‌ గా అల్లుకొని</em><br />
<em> ఎనుగేసిన ఎడెముల్ల కులం గొంతుల ఇరుక్కొని</em><br />
<em> బుగ..బుగ పొంగిన అవమానాల&#8221;</em> పలవరిస్తున్నడు.&#8217;ఎద పగిలినప్పుడు ఏడ్పందరిదీ ఒక్కటే&#8217; అన్న స్పష్టతవున్న కవి</p>
<p><em>&#8221;అక్షరాలు అగ్గికణాలె కురిసి</em><br />
<em> జీవిత నిజాలు రాస్తె</em><br />
<em> కండ్ల సలువ రాతలు కవిత్వమౌతయంటరా?&#8221;</em> అని సందేహపడ్తడు.<br />
కాని, ఆ సందేహం తెలువనితనం కాదు</p>
<p><em>&#8221;జాన్‌ డయ్యర్‌ను వేటాడిన ఉద్ధంసింగ్‌లం</em><br />
<em> శిరస్సు తెగిపడిన శంభూకులం</em><br />
<em> వేలు కొయ్యబడ్డ ఏకలవ్యులం</em><br />
<em> రామాయణాన్ని రాసినోళ్ళం</em><br />
<em> రాజ్యాంగాన్ని రాసినోళ్ళం</em><br />
<em> ఎర్రకోటను ఏలెటోళ్ళం&#8221;</em> అంటూ సాధికార స్వరాన్ని వినిపిస్తడు. దళితులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరాన్ని చెప్పుతడు. 50 కిలోల సిమెంట్‌ బస్తా ఎత్తుకొని ఏకబిగిన 12 అంతస్థులు ఎక్కే మనిషి ఎంత దృఢంగా ఉంటడో బాలయ్య తాత్విక నేపధ్యం కూడ అంతే గట్టిది. కాబట్టే, &#8216;జాతిని తాకట్టు పెట్టి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతూ, అంబేద్కరిజాన్ని అమ్ముకొని బ్రతికే జాతిద్రోహుల మీద&#8217; యుద్ధం ప్రకటిస్తడు.</p>
<p>బహు సంక్లిష్టమైన భారతదేశంలో బతుకుతున్నడు కవి. అందుకే, బహుముఖ సమాజంలో అనేక పొరల అస్తిత్వాన్ని కలిగి వున్నడు. అంతర్గత వలసవాదంలో దోపడి, వివక్ష, అణచివేతలకు గురవుతున్న తెలంగాణ సమాజంలో జీవిస్తున్న కవితన ప్రాంతీయ అస్తిత్వాన్ని వెదుక్కుంటున్నడు. తెలంగాణ ఉద్యమం ఎగిసిసడ్డప్పుడల్లా వలసవాదులు భాషను ముందుకు తెస్తరు. తెలుగుజాతి మనమంతా ఒక్కటేనంటరు.తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటరు.అందుకు ఉద్యమించమంటరు.ఆకుట్రను అర్థం చేసుకున్న కవి</p>
<p><em>&#8221;అయ్యా! ఓ తెలుగోడా!</em><br />
<em> ఇక్కడ నువ్వు భద్రమే, నీ భాషా భద్రమే</em><br />
<em> భరోసా లేనిదల్లా మా బతుకులకే&#8221;</em> అని మఖం మీద గుద్దుతున్నడు.</p>
<p>తెలంగాణ మలి ఉద్యమం పునాది సాగునీరు, వనరుల దోపిడి.నాగార్జునసాగర్‌ నిర్మాణంలోని కుట్రను అర్థం చేసుకున్నంకజలయజ్ఞం భవిష్యత్తులో తెలంగాణను ఎడారిగా మారుస్తుందని తేలికగనే గ్రహించిండ్రు.ఆ ఎరుకతోనే</p>
<p><em>&#8216;బుద్దుని పాదాలను బురద తగలకుండ</em><br />
<em> సుమేరుడు తన శరీరాన్ని పరిచినట్టు</em><br />
<em> తలమీద ప్రాజెక్టు కట్టి</em><br />
<em> నా మొకాన మట్టి కొట్టిండ్రు&#8217;</em><br />
అని &#8216;బొజర్లల్ల ఎండిన నీటి కలల&#8217; పలవరిస్తడు. &#8216;ఎగిడ్సిన వలసవాది అగిరలేస్తిన అంగమయిన&#8217; వైనాన్ని వివరిస్తడు.నీళ్ళు కావాలె నని నిలదీస్తడు. &#8216;ఈసమెత్తు జాగనిడువక మర్మం తెలిసిన మనమట్టి కోసం మన్ను బుక్కైనా కొట్లాడుదాం&#8217; అని ఉద్భోద చేస్తడు. కలిసుండడం అనేది నిజానికి చాలా ఉదాత్తమైన భావన.విడిపోవడం ఎప్పుడైనా బాధాకరమే. అది భార్యాభర్తల బంధమైనా కావచ్చు, తెలంగాణ ఉద్యమమైనా కావచ్చు, ఎస్‌.సి. వర్గీకరణైనా కావచ్చు. కాని కల్సిందామని కథలు చెప్పేవాళ్ళు దాన్ని దోపడీ,అణచివేతలకు సాధికారతను సాధించిపెట్టేదిగా చూడడమే అసలు సమస్య.&#8217;పాపమని ఎంగిలి రొమ్మును చీకనిత్తే, పాలోడై, పామై పగబట్టడమే&#8217; విషాదం.</p>
<p>సామాజికస్పృహ ఉన్న కవి,సమసమాజ కలగన్న కవి సమాజం కోసం తపించిన ధీరుల అమరత్వాన్ని గానం చేస్తడు. &#8216;పొన్న పువ్వుల దుక్కపు రెమ్మై&#8217;న నరేందర్‌ మాదిగను, &#8216; పారిన నీ నెత్తురంతా ఏరులై నా కలం నుండి కవితా పాదాలై నిలువనీ &#8216; అని గురు రవిదాస్‌నీ, &#8216;పొద్దు గూకడమంటే రేపటి పొద్దుపొడుపుకు ఎరుక&#8217; అని బాలగోపాల్‌ని, &#8216;మట్టి పొత్తిల్ల విచ్చుకున్న పుట్ట బంగారం&#8217; అని మిద్దె రాములుని, &#8216;చిల్లులు పడ్డ హక్కుల జెండాను కన్న బిడ్డోలె సంకనెత్తుకున్న&#8217; కన్నబీరన్‌ని, &#8216;అంటరాని జాతి అస్తిత్వగొంతు&#8217;గా నిలిచిన ఫ్రొ|| కొమ్రన్ననీ, &#8216;ఉదయించే సూర్యుడివే, నువ్వు చమర్‌జాతి వీరుడివే&#8217; అంటూ ఉద్ధమ్‌సింగ్‌నీ యాది చేసుకుంటడు.</p>
<p>స్వతహాగా ఆవేశపరుడిగా ముద్రపడ్డ బాలయ్యకు అడవిమీద, ఆయుధం మీద అచంచల విశ్వాసం. అస్తిత్వ ఉద్యమాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నా అంతిమ పరిష్కారం అది మాత్రమే కాదని స్పష్టంగా తెలిసినవాడు.</p>
<p><em>&#8221;మేమెందుకు విడిపోవడానికి</em><br />
<em> శరీరాలు అంటువెట్టుకొని సత్యాగ్రహులమైనం?</em><br />
<em> ఆత్మహత్యలనాపి ఆయుధాలు ధరించి సాయుధులం కాలేమా?&#8221;</em> అంటూ ఆవేశపడ్తడు.&#8217;జబ్బకు డప్పు బదులు తుపాకి వేసుకున్న సూర్యుడు రాత్రికి రాత్రే హత్యచేయబడుతడు&#8217; అని అంగలారుస్తడు.&#8217;ఆకుల్లా రాలుతున్న అమరుల శవాలకు వేపచెట్టు తనువంతా తల్లడిల్లి తల్లివేర్లలో రేపటి స్వప్నాలను వెతుక్కుంటున్న&#8217; వైనాన్ని గమనిస్తడు.&#8217;కోమలి పాదాలకుప్రేమగా కుట్టిన అలుకల చెప్పులు మల్టీ డేగ ముక్కులో రక్తం కక్కి చచ్చిన&#8217; కారణాల్ని పసిగడ్తడు. అందుకే సామ్రాజ్యవాదం మీద, ప్రపంచీకరణ మీద అలుపెరుగని యుద్ధానికి సిద్ధమైతడు.</p>
<p><em>&#8221;అదగో.అదిగదిగో..గగనానగేయాల సూర్యులు</em><br />
<em> నల్లసారపు గుండ్లమీద గగుపవ్వులు నడిసి ఆడిన జ్ఞాపకాల పలవరింత</em><br />
<em> హుస్నాబాద్‌ ఎల్లవ్వ తల్లి సిగలో పూసిన నల్ల బతుకమ్మ</em><br />
<em> శ్రమజీవులు తలెత్తుకొని శిఖరానికెత్తిన సుత్తెకొడవలి&#8221;</em> అవనతమైందని వ్యధచెందుతూ, మట్టిస్వప్నాల సౌధం విచ్ఛిన్నమైందని విలపిస్తడు.&#8217;గిరాయిపల్లి అడవిలో పచ్చని కలలను కాలుస్తున్న శబ్దాని&#8217;కి కలత చెందుతడు. కాని కవి నిరాశావాది కాదు.</p>
<p><em>&#8221;నన్ను పాతిపెట్ట చూత్తె</em><br />
<em> బొందపెట్టిన మట్టినుంచి మల్ల మొనదేలిన కత్తినై మొలకెత్తుత</em><br />
<em> మరణించి ప్రతిసారీ సూర్యుడినై ఉదయిస్తా</em><br />
<em> కొత్త కవితనై బతికొత్తా&#8221;</em> నంటూ భరోసా నిస్తడు.</p>
<p>వస్తువుకు సంబంధించిన స్పష్టత కవిత్వ నిర్మాణంలో కనిపించకపోవడం ఇబ్బంది పెడ్తది. కవిత ఎత్తుగడ, ముగింపుల విషయంలో పరవాలేదనిపించినా పదాల కూర్పులో, వాక్య నిర్మాణంలో,ప్రతీకలు ప్రయోగించడంలో శ్రద్దపెట్టాలె.మనల్ని మనమే కాంట్రాడిక్టు చేసుకునే సందర్భాల్ని పరిహరించాలె.ముఖ్యంగా &#8216;ఎగిలివారంగ&#8217; లో అట్ల ఎక్కువ కనిపిస్తది. &#8216;దందెడ&#8217; లో కొంత అట్ల అనిపించినా వస్తువుకు తగ్గ రూపాన్ని సంతరించుకున్న కవితల్ని అనేకం మనం చూడవచ్చు.</p>
<p><em>&#8216;భూమాత నుదుటిమీద దస్కత్‌ చేసిన పాదం&#8217;</em><br />
<em> &#8216;తలపాపిన తల్లి పాపెడ నిండ నేల రాలుతున్న సుక్కల తిలకం&#8217;</em><br />
<em> &#8216;తలపువ్వు వేసే మక్క కర్రకు సంకల పాపోలె కులం&#8217;</em><br />
<em> &#8216;గాడుపు దుమారంల ఈతకమ్మల పతంగి&#8217;</em> లాంటివి అందుకు మంచి ఉదాహరణలు.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/lingareddy.gif"><img class="alignright  wp-image-4897" title="lingareddy" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/lingareddy.gif" alt="" width="174" height="171" /></a></p>
<p>అట్లాగే, తెలంగాణ పదసంపద, పలుకుబడులు,నుడికారాలు, శ్రామిక సాంస్కృతిక చిహ్నాలు బాలయ్య కవిత్వం నిండా పరుచుకొని ఒక కొత్త సోయగాన్ని అబ్బుతయి.కుక్కుడు పట్టిన,మర్రవడి,కైలాటకాలు, కశికె, బల్లిపాతర, సందెనవడడం,అడ్డికి పావుశేరు, పిత్తకంత,మోర్థపుతనం, గెరువు, మక్క కంకి, గతిమెల్లె, దొయ్య, కాట్రావు, నొగ,తడక, ఎడ్లకొట్టం,గలుమ, ఉద్దరాశిపువ్వు, అడధర్మి, దండె పొడిత్తె, అర్నమడిగితె, ఎతలవూట లాంటి పదాలు, పదబంధాలు కవిత్వం నిండా పరుచుకొని అబ్బురపరుస్తవి. నిర్మాణాన్ని మరింత మెరుగు పరుచుకొని, మరింత కవిత్వంతో పొన్నాల బాలయ్య మనల్ని అలరించాలని, సామాజిక పరాణామ క్రమంలో ఉత్ప్రేరకం అవా&amp;ఆలని ఆకాంక్షిస్తూ&#8230;</p>
<p style="text-align: center;">*** * ***</p>
<p>బయోడేటా<br />
పేరు: పొన్నాల బాలయ్య<br />
తల్లిదండ్రులు: కొమురవ్వ, దుర్గయ్య<br />
పుట్టిన తేది: 04-09-1973<br />
స్వగ్రామం: ఆరెపల్లి, కోహెడ (మం) జి|| కరీంనగర్‌<br />
విద్యార్హతలు: ఎం.ఎ.(హిందీ), ఎం.ఎ.(తెలుగు)<br />
వృత్తి: భాషాపండిట్‌<br />
రచనలు: ఎగిలివారంగ-2008(కవిత్వం)<br />
దందెడ-2011(కవిత్వం)</p>
<hr />
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5199</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>నిఖార్సైన కవి నర్సింహారెడ్డి</title>
		<link>http://vaakili.com/patrika/?p=4903</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4903#comments</comments>
		<pubDate>Sat, 01 Feb 2014 00:18:43 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పడుగు]]></category>
		<category><![CDATA[డా. కాసుల లింగారెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4903</guid>
		<description><![CDATA[<p style="text-align: left;"></p> <p>ఉన్నతీకరించబడ్డ మాట కవిత్వ రూపమైతె, మెరుగైన సమాజం కోసం వ్యాప్తి చేసే భావధార దాని సారమౌతుంది. ఛలోక్తులు, చమక్కులు, తిట్లు శాపనార్థాలు తాత్కాలికంగా కవిత్వంగా చెలామణీ కావచ్చు.పేరు తేవచ్చు.కాని కవిత్వాన్ని సీరియస్‌గా తమ జీవితంలో భాగం చేసుకున్న కవులు భావజాలపరంగా, తాత్వికంగా తమని తాము వ్యక్తీకరించుకుంటరు. తమ కవిత్వం క్యారెక్టర్‌ను విశదపరుస్తరు.తెలుగు సాహిత్యంలో బాలగంగాధర తిలక్‌, పఠాభి, శ్రీశ్రీ,దాశరథి లాంటి అనేకమంది కవులు చెప్పుకున్నట్టు ఇగో మన ఏనుగు నర్సింహారెడ్డి కూడ చెప్పుకుంటున్నడు. ఆర్తి, నిజాయితీ, రాయకుండా ఉండలేనితనం ఈ కవిని ఇట్లా చెప్పుకునేట్టు చేస్తున్నవి.<br /> &#8216;వాదాల్లేని సృష్టించుకున్న వివాదాల్లేని</p> <p>క్షణ క్షణం తగులుతున్న తాకుడురాళ్ళ పురులనుపరస్పరం సహకరించుకునే సమూహాల్లేని పజ్జెమే</p> <p>ఒక్కొక్కటే పేనుకుంటూ కట్టిపడేస్తుంది</p> <p>ఇక నాలో కొత్త ఆశల్ని పూయిస్తుంది&#8217;</p> <p>అని కవిత్వం జీవితంలో ఎట్లా అంతర్బాగమైందో తెలుపుతడు.&#8217;కవిత పిచ్చోడని కసిరినారు నన్ను&#8217; అంటూ వాపోతూనే</p> <p>&#8216;ఒదగకపోతే ఒంచుతా</p> <p>వినకపోతే విరుస్తా</p> <p>వ్యాకరణాలు రొదపెట్టనీ</p> <p>పద్యాన్ని హృదయానికి</p> <p>పర్యాయపదం చేస్తా&#8217; నంటూ లక్ష్యప్రకటన చేస్తడు.</p> <p>మృదువైన, సున్నితమైన భావప్రకటనతో సమాజం గురించి సూటిగా, స్పష్టంగా వ్యాఖ్యానించడం నర్సింహారెడ్డి కవిత్వ లక్షణం.60 వ థకంలో పల్లెలో పుట్టి పెరిగి, పట్టణానికొచ్చి పైచదువులు (ఖ.జు.ఆనీ.ఈ.) చదువుతున్న సమయంలో కవిత్వం నర్సింహారెడ్డిని ఆవహించింది.అమ్మగా నాన్నగా ద్విపాత్రాభినయం చేసి తన్ను తీర్చిదిద్దిన ఏనుగు లక్ష్మమ్మ కష్టాల్ని దూరం చేయాలని, అందుకు తాను ఉద్యోగం సంపాదించుకోవాలని తపిస్తున్న కాలంలో నిరుద్యోగం మీద పుంఖాను పుంఖంగా కవిత్వం రాసిండు. క్వాలీఫైడ్‌ల మొర,క్యూ కవిని కలవర పెట్టినయి. అప్పుడప్పుడూ నిరాశ బాకులా దిగేది. &#8216;సమాజం పుస్తకాన్ని తిరగేసి చదవలేనందుకు&#8217; కలిగిన బాధను కవిత్వంలోకి ఒంపుకుంటడు.</p> <p>&#8216;కలలు పగిలి పోవచ్చు</p> <p>పాఠకుని చేరని కావ్యంలా</p> <p>నువ్వలా కళ్ళల్లో వత్తులు వేసుకొని</p> <p>గోడమీద సున్నెం పట్టెలా చారగిలబడకు</p> <p>నేనసలే రాకపోవచ్చు</p> <p>అమ్మా! ఎదురు చూడకు&#8217;</p> <p>అంటూ తల్లికి ఆఖరి లేక రాసుకుంటడు.దు:ఖం కళ్ళెను ఎల్లబోసుకుంటడు.అందుకే &#8216;పల్లె చేతుల్తో నగరవాతావరణంలోకి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: left;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg"><img class="wp-image-4882 alignleft" title="padugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg" alt="" width="250" height="154" /></a><img class="wp-image-4892 aligleft" title="kasula_lingareddy" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/kasula_lingareddy-300x215.jpg" alt="" width="210" height="151" /></p>
<p>ఉన్నతీకరించబడ్డ మాట కవిత్వ రూపమైతె, మెరుగైన సమాజం కోసం వ్యాప్తి చేసే భావధార దాని సారమౌతుంది. ఛలోక్తులు, చమక్కులు, తిట్లు శాపనార్థాలు తాత్కాలికంగా కవిత్వంగా చెలామణీ కావచ్చు.పేరు తేవచ్చు.కాని కవిత్వాన్ని సీరియస్‌గా తమ జీవితంలో భాగం చేసుకున్న కవులు భావజాలపరంగా, తాత్వికంగా తమని తాము వ్యక్తీకరించుకుంటరు. తమ కవిత్వం క్యారెక్టర్‌ను విశదపరుస్తరు.తెలుగు సాహిత్యంలో బాలగంగాధర తిలక్‌, పఠాభి, శ్రీశ్రీ,దాశరథి లాంటి అనేకమంది కవులు చెప్పుకున్నట్టు ఇగో మన ఏనుగు నర్సింహారెడ్డి కూడ చెప్పుకుంటున్నడు. ఆర్తి, నిజాయితీ, రాయకుండా ఉండలేనితనం ఈ కవిని ఇట్లా చెప్పుకునేట్టు చేస్తున్నవి.<br />
&#8216;వాదాల్లేని సృష్టించుకున్న వివాదాల్లేని</p>
<p>క్షణ క్షణం తగులుతున్న తాకుడురాళ్ళ పురులనుపరస్పరం సహకరించుకునే సమూహాల్లేని పజ్జెమే</p>
<p>ఒక్కొక్కటే పేనుకుంటూ కట్టిపడేస్తుంది</p>
<p>ఇక నాలో కొత్త ఆశల్ని పూయిస్తుంది&#8217;</p>
<p>అని కవిత్వం జీవితంలో ఎట్లా అంతర్బాగమైందో తెలుపుతడు.&#8217;కవిత పిచ్చోడని కసిరినారు నన్ను&#8217; అంటూ వాపోతూనే</p>
<p>&#8216;ఒదగకపోతే ఒంచుతా</p>
<p>వినకపోతే విరుస్తా</p>
<p>వ్యాకరణాలు రొదపెట్టనీ</p>
<p>పద్యాన్ని హృదయానికి</p>
<p>పర్యాయపదం చేస్తా&#8217; నంటూ లక్ష్యప్రకటన చేస్తడు.</p>
<p>మృదువైన, సున్నితమైన భావప్రకటనతో సమాజం గురించి సూటిగా, స్పష్టంగా వ్యాఖ్యానించడం నర్సింహారెడ్డి కవిత్వ లక్షణం.60 వ థకంలో పల్లెలో పుట్టి పెరిగి, పట్టణానికొచ్చి పైచదువులు (ఖ.జు.ఆనీ.ఈ.) చదువుతున్న సమయంలో కవిత్వం నర్సింహారెడ్డిని ఆవహించింది.అమ్మగా నాన్నగా ద్విపాత్రాభినయం చేసి తన్ను తీర్చిదిద్దిన ఏనుగు లక్ష్మమ్మ కష్టాల్ని దూరం చేయాలని, అందుకు తాను ఉద్యోగం సంపాదించుకోవాలని తపిస్తున్న కాలంలో నిరుద్యోగం మీద పుంఖాను పుంఖంగా కవిత్వం రాసిండు. క్వాలీఫైడ్‌ల మొర,క్యూ కవిని కలవర పెట్టినయి. అప్పుడప్పుడూ నిరాశ బాకులా దిగేది. &#8216;సమాజం పుస్తకాన్ని తిరగేసి చదవలేనందుకు&#8217; కలిగిన బాధను కవిత్వంలోకి ఒంపుకుంటడు.</p>
<p>&#8216;కలలు పగిలి పోవచ్చు</p>
<p>పాఠకుని చేరని కావ్యంలా</p>
<p>నువ్వలా కళ్ళల్లో వత్తులు వేసుకొని</p>
<p>గోడమీద సున్నెం పట్టెలా చారగిలబడకు</p>
<p>నేనసలే రాకపోవచ్చు</p>
<p>అమ్మా! ఎదురు చూడకు&#8217;</p>
<p>అంటూ తల్లికి ఆఖరి లేక రాసుకుంటడు.దు:ఖం కళ్ళెను ఎల్లబోసుకుంటడు.అందుకే &#8216;పల్లె చేతుల్తో నగరవాతావరణంలోకి పట్టుకొచ్చిన తాజా కవిత్వం&#8217; నిరుద్యోగిలా మా ఇంటికొచ్చింది అంటాడు ఎన్‌.గోపి.మానవ సంబంధాల పట్ల ఆర్తిగల్ల కవి</p>
<p>సరియైన వయసులో పెళ్ళికాకపోవడాన్ని కూడ హృద్యంగా చిత్రిస్తడు. విఫల ప్రేమలకు విలపిస్తడు. యాంత్రీకరించబడ్డ సంబంధాలని చూసి &#8216;రోజూ కలుసుకుంటున్న అపరిచితులమం&#8217; టూ వాపోతడు.</p>
<p>తొంభయవ థకం తెలంగాణ సమాజంలో అనేక మార్పుల్ని తీసుకొచ్చింది. ప్రపంచీకరణ దేశానికి పట్టుకొమ్మలైన</p>
<p>పల్లెల్ని మింగేసింది.&#8217;కనిపించని ఈ కుట్రల్లో పల్లె కన్నీరు పెట్టింది&#8217;. అర్బనైజేషన్‌ పల్లెల్లో ప్రధానంగా వున్న వ్యవసాయాన్ని కుంగతీసింది.ప్రజాస్వామ్య ప్రహసనం ముగిసింది. ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల రిమోట్‌తో నడవడం మొదలైంది. సంపన్న దేశాలు ప్రపంచబ్యాంకు, డబ్లుటివో వాటిని ముందుపెట్టి ఈ నాటకం నడిపిస్తున్నవి.వ్యవసాయం ,దానిమీద ఆధార</p>
<p>పడ్డ చేతివృత్తులు ద్వంసమైనవి.పల్లె వల్లకాడుగా మారింది.</p>
<p>&#8216;అప్పులోల్లు పైసలడిగితే ఎట్లరాని</p>
<p>పొట్టకూటికోసం గింజలెట్టులనుచు</p>
<p>వెరచి రైతుబిడ్డ ఉరికొయ్యకూగెరా&#8217;</p>
<p>అంటూ &#8216;ప్రపంచబ్యాంకు బాకు పల్లెబొండిగ తెంచిన&#8217; వైనాన్ని చిత్రిస్తడు కవి. &#8216;బహుళజాతి మాయ బలితీసుకొని పోయిన &#8216; తీరును ఎరుకపరుస్తడు.</p>
<p>&#8216;చెరువు నోరు తెరిసె చెల్క కన్నీరింకె</p>
<p>చుక్కనీరు లేదు దుక్కిదున్న</p>
<p>తేటతెల్లమాయె తెలగాణ యవుసమ్ము&#8217;</p>
<p>అంటూ వ్యవసాయ దుస్థితిని తెలుపుతడు.తెలంగాణ పల్లెల్లోని సకల పార్శ్వాలను చూపుతడు.శ్రమైకజీవన సంస్కృతి తన ప్రాభవాన్ని కోల్పోవడంతో పల్లె బతుకును హీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. అందుకే, &#8216;పల్లె బతుకు మాది పాడుగాను&#8217; అనే మకుటంతో &#8216;మట్టిపాట&#8217;ను గానం చేసిండు కవి. ఛందోబద్ధ పద్యాలు తెలంగాణ మాండలికం వల్ల అందాల్ని సంతరించుకున్నవి.</p>
<p>తెలంగాణ పల్లె దుంఖమంతా నర్సింహారెడ్డి కవిత్వంలో కనిపిస్తది.స్వతహాగా తను రైతుబిడ్డ. అందుకే,</p>
<p>&#8216;పీఠభూమిలో నాగలి కర్రు కింద</p>
<p>నీటిమట్టం కూడ</p>
<p>నిర్దయగా జారుకుంది&#8217;</p>
<p>అంటూ వ్యవసాయ దుస్థితిని కవిత్వం చేస్తడు. &#8216;నీటినుంచే ప్రాణం పుట్టిందని పంటచేల పారవశ్యాలతోనే సమస్త రంగాల బతుకు బండ్లు పరుగులు తీస్తాయని&#8217; ఎరుకున్న కవి, ఆ నీటిని తోడడానికి కావాల్సిన విద్యుత్తు లేమి పట్ల కలత చెందుతడు.</p>
<p>తెలంగాణ పల్లె దుస్థితికి కారణమైన నయావలపవాదాన్నే కాకుండా, అంతర్గత వలసవాదం మీద యుద్ధం ప్రకటిస్తడు.610 జీవోని ప్రశ్నిస్తడు. &#8216;వాళ్ళు కష్టపడుతర్‌ సార్‌&#8217; అంటూ సీమాంధ్రుల  దోపడి మీద సెటైర్‌లు విసురుతడు.</p>
<div>
<p>&#8216;పనిలేకపోవడమంటే జీవితము పెద్దగా లేకవోవడమే&#8217; నంటూ శ్రమైక జీవన ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తడు.కల్లోని కుంటలో నాన్నని కలవరిస్తడు.</p>
<p>&#8216;కాలానికి ఆరబెట్టిన</p>
<p>నీటిరంగుల వర్ణచిత్రంలా</p>
<p>నాన్న నాకొక అస్పష్ట జ్ఞాపకం&#8217; అంటూ కలత చెందుతడు. పరాయీకరణ నర్సింహారెడ్డిని కూడ నోస్టాల్జియాలోకి</p>
<p>నెట్టింది. అందుకనే కల్లోని కుంటని,కాడమల్లె చెట్టుని, ఊరునీ పలవరిస్తడు. &#8216;ఇక్కడో ఊరుండేది ఎవరైనా చూపిస్తారా?&#8217; అంటూ గడుసుగా ప్రశ్నిస్తడు.</p>
<p>రెవెన్యూ డిపార్టుమెంట్‌ కు సంబంధించిన సమస్యలమీద,సహృదయులైన సహోద్యోగులమీద మీద కవిత్వమల్లుతడు.</p>
<p>ప్రభుత్వాధికారిగా ఉంటూనే అసౌఖ్యానికి గురైనవాళ్ళ పక్షాన నిలబడడం కొందరికి గొప్ప విషయంగా కనిపించవచ్చు, కాని</p>
<p>అది అనివార్యం అవుతది. గౌరవప్రదమైన వృత్తిగా భావించే డాక్టర్లు, లాయర్లు కూడ రోజువారీ కూలీల కింద మార్చబడ్డ ఈ</p>
<p>వవస్థలో ఏదో ఒక ధృవాన్ని చేరుకోవడం అనివార్యమౌతుంది. నర్సింహారెడ్డి కవి కాబట్టి ప్రజా ధృవాన్ని చేరుకున్నడు.</p>
<p>మృదువైన, స్పష్టమైన, సూటితనం నర్సింహారెడ్డి కవిత్వశైలిలో కనిపిస్తది.తెలంగాణ నుడికారపు సొగను మరింత అందాన్ని అద్దుతది. అక్కడక్కడ వ్యంగ్యం, దెప్పిపొడుపు సాధికారికంగా జతకడ్తవి. అలతి పదాలతో ప్రతీకలను, అలంకారాలను విస్తృతంగా వాడతడు.</p>
<p>&#8216;వెన్నెల మెరువడానికి గోడల అద్దాల్ని వెతుక్కుంటుంది&#8217;</p>
<p>&#8216;తల్లులు-మాసిన పిల్లల నెత్తుల్లోంచి పేన్లు ఏరి కుక్కినట్లు</p>
<p>పక్షలు-కొమ్మల రెక్కల నడుమ గండుచీమల్ని ఏరి పారేస్తున్నవి&#8217;</p>
<p>&nbsp;</p>
<p>&#8216;ఫైళ్ళంటే కాగితాలు ఎంత మాత్రం కావు</p>
<p>జోడించబడిన చేతులు&#8217;</p>
<p>&#8216;గుట్టను తాకిన మబ్బుల్తో</p>
<p>రంగుల గుడారమేసిన ఆకాశపు&#8217;</p>
<p>&nbsp;</p>
<p>&#8216;చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు</p>
<p>చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు&#8217;</p>
<p>&nbsp;</p>
<p>&#8216;తలస్నానం చేసి తుడుచుకోవడం చేతకాని</p>
<p>పసిపిల్లల సమూహంలా చెట్లు&#8217;</p>
<p>&nbsp;</p>
<p>నర్సింహారెడ్డిలోని భావుకతకు ఇట్లాంటి నిదర్శనాలు ఎన్నైనా ఇవ్వవచ్చు. అట్లే &#8216;పొద్దూకి వచ్చిన వాన పొద్దూకి వచ్చిన చుట్టంలాపోనే పోదు&#8217; &#8216;చెడిపి రాస్తున్న(చెరిపి కాదు)&#8217; &#8216;తొవ్వదారానికి&#8217; &#8216;నడమంత్రం&#8217; &#8216;పల్లె బొండిగ&#8217;లాంటి తెలంగాణ నుడికారపు మెరుపులు కవి ప్రతిభకు నిదర్శనాలు.  అట్లాగే కవిత్వంలో ప్రయోగాలు చేయడం కూడ నర్సింహారెడ్డి ఇస్టపడుతడు.ఛందోబద్ద పద్యాలతో కూడిన &#8216;మట్టిపాట&#8217; ,రుబాయీలు మనకు అదే చెప్తాయి.</p>
<p>అయితే,నర్సింహారెడ్డి అంత్యప్రాసల లౌల్యం వదిలించుకోవాలె.ఎత్తుగడ,ముగింపులకు ప్రాధాన్యత ఇవ్వాలె.ప్రతీకల ప్రీతితోటి వచ్చిన అస్పష్టత తొలిగించుకోవాలె. మరింత కవిత్వం రాయాలె. నిఖార్సైన కవిగా నిలబడాలె.</p>
<p>&nbsp;</p>
<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/05/enugu.jpg"><img class="size-full wp-image-2778 aligncenter" title="enugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/05/enugu.jpg" alt="" width="150" height="200" /></a></p>
<p style="text-align: center;"> పేరు: ఏనుగు నర్సింహారెడ్డి</p>
<p style="text-align: center;">జననం: 6 ఎప్రిల్‌ 1968</p>
<p style="text-align: center;">కల్లోనికుంట, రామన్నపేట (మండలం),నల్లగొండ జిల్లా</p>
<p style="text-align: center;">ఎస్‌.ఎస్‌.సి.:1983 చిట్యాల</p>
<p style="text-align: center;">ఇంటర్‌: 1985 రామన్నపేట</p>
<p style="text-align: center;">బి.ఎ.: 1989 నల్లగొండ</p>
<p style="text-align: center;">ఎం.ఎ.:ఉస్మానియా</p>
<p style="text-align: center;">ఎం.ఫిల్‌.:తెవివి-తులనాత్మక సాహిత్యం</p>
<p style="text-align: center;">M.A. పి.హెచ్‌.డి.:తెవివి-తులనాత్మక సాహిత్యం</p>
<p style="text-align: center;">రచనలు- 1992 నుండి సీరియస్‌గా కవిత్వం పత్రికలలో</p>
<p style="text-align: center;">వ్యాసాలు,విమర్శలు,సమీక్షలు 1998నుండి</p>
<p style="text-align: center;">ప్రచురణలు: కవిత్వం</p>
<p style="text-align: center;">సమాంతర స్వప్నం-1995</p>
<p style="text-align: center;">నేనే-2002</p>
<p style="text-align: center;">మట్టిపాట-2008</p>
<p style="text-align: center;">కొత్తపలక-2013</p>
<p style="text-align: center;">నవల- &#8216;పగిలిన గుండెలు&#8217; డైలీ సీరియల్‌గా నల్గొండ డైలీలో 1988 రెండు నెలలు</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4903</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
		<item>
		<title>&#8216;పడుగు&#8217; కొత్త కాలమ్, ఫిబ్రవరి సంచిక నుంచి..</title>
		<link>http://vaakili.com/patrika/?p=4888</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4888#comments</comments>
		<pubDate>Sat, 18 Jan 2014 17:24:14 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పడుగు]]></category>
		<category><![CDATA[డా. కాసుల లింగారెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4888</guid>
		<description><![CDATA[<p>మమతలు,బంధాలు, ఆత్మీయతలు కాలం చేసినట్టే, తీరాల ఇసుకల మీది నురగల రాతలా కాలం చెరిగిపోయినట్టే, బహిరంతరాల్లో ఉద్యమాల ఉద్వేగాల ఉద్దీపనల్లో వెలిగిన కవిత్వం నీలో,నాలో సామాజిక ఉపరితలపు పొరల్లో, పునాదుల్లో మరణిస్తుందా? కొత్త శాస్త్రసాంకేతిక సంద్భాలు, కొత్త సామాజిక సంబంధాలు, కొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యాలు కొంత ఆజ్యం పోస్తున్నాయా? వస్తువినిమయ ప్రపంచంలో కవిత్వం కాలం చేస్తుందా? రాయడం, పత్రికాధిపతుల్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, జీతపు రాళ్ళను కరిగించి ప్రెస్‌ చుట్టూ తిరగడం, ఆవిష్కరణకు అందరి కాళ్ళు పట్టుకోవడం, కష్టపడి కాపీలను పంచడం, రివ్యూల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం కవుల్ని కష్టాల కడలిలోకి నెట్టేస్తుందా?</p> <p>సంస్కృత సమాసభూయిష్ట దుర్గంధసౌధాల్లోంచి, కులమతాల సంకుచిత చిదంబర రహస్య గదుల్లోంచి, ఆధిపత్య అణచివేత సంకెళ్ళనుంచి కవిత్వం నూత్న యవ్వనాన్ని సంతరించుకొని నిలబడుతుందా? వ్యక్తివాద కీర్తికండూతి శాలువాల్ని చింపుకొని, ప్రలోభ శకలాలకు శవపేటిక సిద్ధం చేసి, మాసిపోయిన కాలాలమీద, పాకురు పట్టిన కళాల పాళీలమీద మరింత ఉత్తేజపు వెలుగును ప్రసరిస్తుందా? ఒక విశ్వమానవున్ని జెండాగా ఎత్తిపట్టి, చిట్టచివరివాని ఆకాంక్షల ఎజెండాని భుజానికెత్తుకొని కష్టజీవికి నలుదిక్కులా (ఇరువైపుల మాత్రమే కాదు) నిలబడుతుందా? వాక్యాల కీళ్ళు విరిచి పాదాలుగా పేర్చి ఇదే కవిత్వమనే బుకాయింపునుంచి తన్ను తాను కాపాడుకుంటుందా? తిట్లదండకాన్ని పక్కన పెట్టి, బూతురోతకు గీతం పాడి స్వానుభవాల్ని సమిష్టి అనుభూతుల సత్కళగా తీర్చిదిద్దుకుంటుందా?</p> <p>కవులు మరణిస్తారు.కాలం కరిగి పోతుంది.విలువలు మారిపోతాయి. కాని ఎవరో ఒక ఆంగ్ల కవి అన్నట్టు &#8216;కవిత్వం కాక్రోచ్‌ లాంటిదే&#8217;. అది అంత తేలిగ్గా అంతర్ధానం అవ్వదు. అది అస్తిత్వ ఉద్యమాల్ని అక్కున చేర్చుకుంటది. అంతర్జాతీయ అక్రమాల్ని, అణచివేతల్ని ధిక్కరిస్తది. సందిగ్ధానికి లోనైన సమాజానికి దిశానిర్దేశం చేస్తది. ఎన్ని లోపాలున్నప్పటికీ అది అంతిమంగా ప్రజల పక్షాన నిలబడుతది. “Literature and art are for oppressed people not for any of the other group” అనేది నిరూపిస్తది.</p> <p>ఇదిగో తెలుగు సమాజంలో అట్లాంటి పాత్ర [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg"><img class="alignleft  wp-image-4882" title="padugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/padugu.jpg" alt="" width="250" height="154" /></a>మమతలు,బంధాలు, ఆత్మీయతలు కాలం చేసినట్టే, తీరాల ఇసుకల మీది నురగల రాతలా కాలం చెరిగిపోయినట్టే, బహిరంతరాల్లో ఉద్యమాల ఉద్వేగాల ఉద్దీపనల్లో వెలిగిన కవిత్వం నీలో,నాలో సామాజిక ఉపరితలపు పొరల్లో, పునాదుల్లో మరణిస్తుందా? కొత్త శాస్త్రసాంకేతిక సంద్భాలు, కొత్త సామాజిక సంబంధాలు, కొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యాలు కొంత ఆజ్యం పోస్తున్నాయా? వస్తువినిమయ ప్రపంచంలో కవిత్వం కాలం చేస్తుందా? రాయడం, పత్రికాధిపతుల్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, జీతపు రాళ్ళను కరిగించి ప్రెస్‌ చుట్టూ తిరగడం, ఆవిష్కరణకు అందరి కాళ్ళు పట్టుకోవడం, కష్టపడి కాపీలను పంచడం, రివ్యూల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం కవుల్ని కష్టాల కడలిలోకి నెట్టేస్తుందా?</p>
<p>సంస్కృత సమాసభూయిష్ట దుర్గంధసౌధాల్లోంచి, కులమతాల సంకుచిత చిదంబర రహస్య గదుల్లోంచి, ఆధిపత్య అణచివేత సంకెళ్ళనుంచి కవిత్వం నూత్న యవ్వనాన్ని సంతరించుకొని నిలబడుతుందా? వ్యక్తివాద కీర్తికండూతి శాలువాల్ని చింపుకొని, ప్రలోభ శకలాలకు శవపేటిక సిద్ధం చేసి, మాసిపోయిన కాలాలమీద, పాకురు పట్టిన కళాల పాళీలమీద మరింత ఉత్తేజపు వెలుగును ప్రసరిస్తుందా? ఒక విశ్వమానవున్ని జెండాగా ఎత్తిపట్టి, చిట్టచివరివాని ఆకాంక్షల ఎజెండాని భుజానికెత్తుకొని కష్టజీవికి నలుదిక్కులా (ఇరువైపుల మాత్రమే కాదు) నిలబడుతుందా? వాక్యాల కీళ్ళు విరిచి పాదాలుగా పేర్చి ఇదే కవిత్వమనే బుకాయింపునుంచి తన్ను తాను కాపాడుకుంటుందా? తిట్లదండకాన్ని పక్కన పెట్టి, బూతురోతకు గీతం పాడి స్వానుభవాల్ని సమిష్టి అనుభూతుల సత్కళగా తీర్చిదిద్దుకుంటుందా?<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/kasula_lingareddy.jpg"><img class="alignright size-medium wp-image-4892" title="kasula_lingareddy" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/01/kasula_lingareddy-300x215.jpg" alt="" width="300" height="215" /></a></p>
<p>కవులు మరణిస్తారు.కాలం కరిగి పోతుంది.విలువలు మారిపోతాయి. కాని ఎవరో ఒక ఆంగ్ల కవి అన్నట్టు &#8216;కవిత్వం కాక్రోచ్‌ లాంటిదే&#8217;. అది అంత తేలిగ్గా అంతర్ధానం అవ్వదు. అది అస్తిత్వ ఉద్యమాల్ని అక్కున చేర్చుకుంటది. అంతర్జాతీయ అక్రమాల్ని, అణచివేతల్ని ధిక్కరిస్తది. సందిగ్ధానికి లోనైన సమాజానికి దిశానిర్దేశం చేస్తది. ఎన్ని లోపాలున్నప్పటికీ అది అంతిమంగా ప్రజల పక్షాన నిలబడుతది. “Literature and art are for oppressed people not for any of the other group” అనేది నిరూపిస్తది.</p>
<p>ఇదిగో తెలుగు సమాజంలో అట్లాంటి పాత్ర నిర్వహిస్తున్న కవిత్వాన్ని, కవుల్ని ఒక్కసారి మననం చేసుకుందాం. రైతు బిడ్డను కదా! చిన్నప్పుడు కొట్టనంపు రామయ్య పటేలుతో పాటు &#8216;పడుగు&#8217; పెట్టి, బంతి తొక్కించి నువ్వు గింజలు రాసి పోసినట్టే ఈ పంటల పండుగ(సంక్రాంతి) నుంచి సాహిత్య &#8216;పడుగు&#8217; ద్వారా కవిత్వపు గట్టి గింజలనేరుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి &#8216;పడుగు&#8217; మన &#8216;వాకిలి&#8217;లో ఫిబ్రవరి 2014 సంచిక నుంచి..</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4888</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
