<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; తన్నీరు కళ్యాణ్ కుమార్</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య</title>
		<link>http://vaakili.com/patrika/?p=8763</link>
		<comments>http://vaakili.com/patrika/?p=8763#comments</comments>
		<pubDate>Sat, 01 Aug 2015 03:05:23 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[తన్నీరు కళ్యాణ్ కుమార్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=8763</guid>
		<description><![CDATA[<p>తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు అస్తమయం తెలుగు జాతి ప్రజలకు &#8211; సాహిత్యానికి తీరని లోటు. వేదం నుంచి ఉద్యమం దాకా దగ్గరగా లోతుగా పరిశీలించి రచనలు చేసిన విలక్షణ రచయిత రంగాచార్య. బాల్యం నుంచి చివరి శ్వాస దాకా వివిధ సాహితీ ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉండే అంశాలు ఆయనలో ఒక్కటిగా కలిసి కాపురం చేస్తాయి. ఆయనను చూస్తే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో తుపాకీ పట్టిన యోధుడని, ఆయన నుదిటి పై కనిపించే తిరునామాలు చూసి ఆయనొక మార్క్సిస్ట్ అని ఎవరూ అనుకోరు. రంగాచార్య సంప్రదాయాన్ని ఎంతగా ప్రేమించారో, సంప్రదాయాన్ని కూడా అంతే ఇష్టపడతారు. భిన్నిత్వంలో ఏకత్వం అనే భారతీయ దృక్పథానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దాశరథి రంగాచార్య స్వాతంత్ర్య సమర యోధునిగా, అక్షర బ్రహ్మగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.</p> <p>వరంగల్ జిల్లా చిన్న గూడూరులో 1928 ఆగష్టు 24న జన్మించిన రంగాచార్య హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఉద్యమబాట పట్టారు. ‘అధ్యయనం – పోరాటం’ అనే నినాదానికి ఆయన అక్షర సాక్షి. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు ఆయనకు అన్న. తెలంగాణ వేదనను, వీరత్వాన్ని దాశరథి సోదరులు స్వయంగా అనుభవించి సాహిత్యంలో పలవరించారు. ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజం ప్రేరణతో అన్నయ్య నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టగా, తమ్ముడూ అదే బాటలో అడుగులు కదిపారు. తండ్రి సనాతనవాది అయినా అన్నయ్య సాంగత్యంలో రంగాచార్య అభ్యుదయ పంథా తొక్కారు. నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పగలు బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూనే, రాత్రుళ్ళు రైతు కూలీలకు ఉద్యమ బోధన చేసేవారు. ఇంతలో అన్న కృష్ణమాచార్య జైలు పాలుకావడంతో ఇంటి బాధ్యతలన్నీ రంగాచార్య మోయాల్సి వచ్చింది.</p> <p>కుటుంబం ఉద్యమ ప్రభావంలోకి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/08/dasarathirangacharya.jpg"><img class="alignleft size-full wp-image-8765" title="dasarathirangacharya" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/08/dasarathirangacharya.jpg" alt="" width="300" height="263" /></a><span style="font-size: 30px;">తొ</span>లితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్యులు అస్తమయం తెలుగు జాతి ప్రజలకు &#8211; సాహిత్యానికి తీరని లోటు. వేదం నుంచి ఉద్యమం దాకా దగ్గరగా లోతుగా పరిశీలించి రచనలు చేసిన విలక్షణ రచయిత రంగాచార్య. బాల్యం నుంచి చివరి శ్వాస దాకా వివిధ సాహితీ ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉండే అంశాలు ఆయనలో ఒక్కటిగా కలిసి కాపురం చేస్తాయి. ఆయనను చూస్తే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో తుపాకీ పట్టిన యోధుడని, ఆయన నుదిటి పై కనిపించే తిరునామాలు చూసి ఆయనొక మార్క్సిస్ట్ అని ఎవరూ అనుకోరు. రంగాచార్య సంప్రదాయాన్ని ఎంతగా ప్రేమించారో, సంప్రదాయాన్ని కూడా అంతే ఇష్టపడతారు. భిన్నిత్వంలో ఏకత్వం అనే భారతీయ దృక్పథానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దాశరథి రంగాచార్య స్వాతంత్ర్య సమర యోధునిగా, అక్షర బ్రహ్మగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.</p>
<p>వరంగల్ జిల్లా చిన్న గూడూరులో 1928 ఆగష్టు 24న జన్మించిన రంగాచార్య హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఉద్యమబాట పట్టారు. ‘అధ్యయనం – పోరాటం’ అనే నినాదానికి ఆయన అక్షర సాక్షి. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు ఆయనకు అన్న. తెలంగాణ వేదనను, వీరత్వాన్ని దాశరథి సోదరులు స్వయంగా అనుభవించి సాహిత్యంలో పలవరించారు. ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజం ప్రేరణతో అన్నయ్య నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టగా, తమ్ముడూ అదే బాటలో అడుగులు కదిపారు. తండ్రి సనాతనవాది అయినా అన్నయ్య సాంగత్యంలో రంగాచార్య అభ్యుదయ పంథా తొక్కారు. నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పగలు బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూనే, రాత్రుళ్ళు రైతు కూలీలకు ఉద్యమ బోధన చేసేవారు. ఇంతలో అన్న కృష్ణమాచార్య జైలు పాలుకావడంతో ఇంటి బాధ్యతలన్నీ రంగాచార్య మోయాల్సి వచ్చింది.</p>
<p>కుటుంబం ఉద్యమ ప్రభావంలోకి వెళ్ళడాన్ని తండ్రి వెంకటాచార్యులు తట్టుకోలేక భార్యబిడ్డలను వదిలేసి వెళ్ళిపోయారు. బతుకు తెరువు కోసం తల్లి వెంకటమ్మ హరికథలు చెబితే, రంగాచార్యులు లైబ్రేరియన్ గా పనిచేశారు. ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో రజాకార్లు పెట్రేగిపోయారు. ఉద్యమ నేపథ్యం కలిగిన దాశరథి కుటుంబంపై దాడులు చేశారు. ఈ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్ళిన రంగాచార్య తుపాకీ పేల్చడంలో శిక్షణ తీసుకున్నారు. తుపాకీ గుండ్లకు గుండెలనడ్డి రజాకార్లను ఎదుర్కొన్నారు. 1948 సెప్టెంబరు 16న పోలీస్ యాక్షన్ తరువాత రంగాచార్య ఉద్యమం నుండి బయటకు వచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత ప్రజలను పీడించిన దొరలే ఖద్దరు, గాంధీ టోపీ ధరించి రాజకీయ నాయకులుగా అవతారమెత్తారు. రంగాచార్య వారి మధ్య ఇమడలేక పోయారు. స్వయంకృషితో చదువుకొని 1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తరువాత 1957లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చేరి 1988లో అసిస్టెంట్ కమీషనర్ గా రిటైరయ్యారు. మారేడ్ పల్లి మున్సిపల్ ప్లే గ్రౌండ్ పక్కన ఉన్న ఇరుకైన సందులోని మూడు గదుల ఇల్లు ఆయన గడిపిన సాధారణ జీవితానికి అద్దం పడుతుంది.</p>
<p>“నేను కత్తీ, డాలూ పట్టుకోలేను. సాయుధుడనై ఎదిరించలేను. నా పెన్నే నా గన్ను” అని చాటిన ఘనపాటి దాశరథి రంగాచార్యులు. ఆయన తన రచనల ద్వారా ప్రజల్ని మేల్కొపడానికి, అన్యాయాన్ని ఎదిరించేలా పురుగొల్పడానికి ఇష్టపడేవారు. తెలంగాణ సాయుధ పోరాటానికి రంగాచార్య రచనలు ఎంతగానో దోహదం చేశాయి. లక్ష్యశుద్థితో ఆయన తన రచనలు కొనసాగించారు. దాశరథి రంగాచార్య సాహితీ సేవ విలక్షణమైనది, విస్తృతమైనది, విభిన్నమైనది. రంగాచార్య రచనలు భావోద్రేకాలు రగిలించేకన్నా, భావోద్వేగాలు కలిగిస్తాయి. మహా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆళ్వారు స్వామి వదిలి వెళ్ళిన రచనా ఉద్యమాన్ని రంగాచార్య తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. ఆయన సనదైన పద్ధతిలో తెలంగాణ ప్రజల జీవన చిత్రణ కోసం నవలా రచనకు పూనుకున్నారు.</p>
<p>రంగాచార్య మొత్తం 9 నవలలు రాశారు. వీటిలో ‘చిల్లరదేవుళ్లు’, ‘మోదుగుపూలు’, ‘జనపదం’ నవలలు పిరీయాడిక్ నవలలు కావడంతో ఒక నవల ముగింపు మరో నవలకు ప్రారంభం అవుతుంది. ఆయన తన తొలి నవల ‘చిల్లరదేవుళ్లు’ను 1969లో వెలువరించారు. తెలంగాణ గురించి తెలంగాణ మాడలికంలో రాసిన నవల కావడంతో ఈ నవలకు విశేష ఆదరణ లభించింది. మొదటి నవలకే రంగాచార్య కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అందుకున్నారు. దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధ పోరాటం నాటి వాతావరణాన్ని, ఆ కాలంలోని బానిస పరిస్థితులను ఈ నవలలో విస్పష్టంగా ప్రస్ఫుటీకరించారు. గార్ల ప్రాంతంలోని జాగీర్దార్ల దాష్టికాలను ఈ నవలలో కళ్ళకు కట్టించారు. ఈ నవలలోని పీరిగాడు, పాణిమంజరి, ఇందిర పాత్రలు ఆనాటి సమాజంలోని ప్రజలకు ప్రతినిధులు. ఈ నవల 1974లో చలన చిత్రంగా వచ్చింది. ‘చిల్లరదేవుళ్లు’ 1938కి పూర్వపు తెలంగాణ ప్రజల జీవనాన్ని చిత్రిస్తే, తెలంగాణ సాయుధ పోరాటంలోని 1942-48 సంవత్సరాల మధ్య కాలాన్ని ‘మోదుగుపూలు’ నవల వర్ణిస్తుంది. రంగాచార్య నిర్వహించిన పోరాట చిత్రణమే ఈ నవలలోని ఇతివృత్తం. ఈ నవల చదివే చండ్ర రాజేశ్వరరావు రంగాచార్యను ‘ఆంధ్ర గోర్కీ’గా అభివర్ణించారు. ‘చిల్లరదేవుళ్లు’, ‘మోదుగుపూలు’ వంటి నవల్లో తెలంగాణ పలుకుబడులను &#8211; నుడికారాన్ని పలికించారు.స్వాతంత్ర్యం తరువాత రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని ‘జనపదం’ నవలలోచిత్రించారు.</p>
<p>నగర సమస్యల ఇతివృత్తంతో ‘మాయాజలతారు’ నవల రాశారు. దేశంలో సామ్యవాద స్థాపన జరుగుతుందన్న ఆశలను &#8211; ఆశయాలను ‘రానున్నది ఏది నిజం’ నవలలో చిత్రించారు. మతాలు వెలసిపోయే రంగులని, మానవత నిరంతంరం నిలిచే వుండే ఘనతని సందేశాన్నిస్తూ ‘మానవత’ నవల వ్రాయబడింది. ఒక బ్రాహ్మణునికి, ఒక దళితునికి మధ్య స్నేహాన్ని కల్పించి, మానవత్వం దైవత్వానికి అతి దగ్గరని ‘శరతల్పం’ నవలలో నిరూపించారు. స్వాతంత్ర్యం తరువాత కూడా ఆ స్వాతంత్ర్యపు వెలుగులు ప్రసరించని గ్రామాలు ఎలా దోపిడీకి గురయ్యాయో, ఆ దోపిడీలో ప్రజల విషాద జీవితాలు, టీచరమ్మ నుంచి చైతన్యం పొందిన గ్రామస్థులు తిరగబడి విజయం సాధించడం ‘పావని’ నవల చిత్రిస్తుంది. వీటి తరువాత రంగాచార్య దృష్టి సంప్రదాయ సాహిత్యంపై పడింది.<br />
భారతం, వేదాలు, ఉపనిషత్తులు అనువదించిన తరువాత మళ్ళీ నవలా రచనకు ఉపక్రమించారు. ప్రపంచీకరణ, పారిశ్రామీకరణ ప్రభావంతో మరణం వైపు పయనిస్తున్న ప్రజలకు అమృతం వైపు పయనింపజేసే ‘అమృతంగమయ’ నవల రాశారు. ఇందులో భారతీయ తాత్త్వికత, దాని గొప్పదనం, ఆంగ్లేయులు దాన్ని ధ్వంసం చేసిన విధానం, భారతీయ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం తదితర అంశాలను ఆ నవల చర్చిస్తుంది. సుదీర్ఘ తెలంగాణ సామాజిక పరిణామాలను తన రచనల్లో ప్రతిబింబించిన రంగాచార్య తన ఆత్మకథను ‘జీవనయానం’ పేరుతో రాశారు. మౌలికంగా ఈ రచన ఆయన స్వీయచరిత్రే అయినా పాఠకులకు ఎక్కడా స్వోత్కర్ష కనపడదు. తానేమిటో చెప్పేకన్నా, ఒక రచయితగా తన బాధ్యత ఏమిటో జీవనయాత్రలో అవగతం చేశారు. ఈ రచనలో రంగాచార్య తన జీవింతంలో పాటు, ఏడి దశాబ్దాల తెలుగు జాతి జీవనాన్ని చిత్రించారు. బుద్ధుని జీవిత చరిత్రను ‘బుద్ధ భానుడు’ పేరుతో అపురూపమైన రచనను 2010 సంవత్సరంలో వెలువరించారు. రంగాచార్య నవలలు ఎక్కువగా వ్రాసినా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథా సాహిత్యం అంటే ఆయనకెంతో అభిమానం. రంగాచార్య చేతి నుండి జాలువారిన కథా సంపుటి ‘నల్లవాగు’. సమర సాహిత్యానికి చెందిన ‘రణరంగం’, ‘రణభేరి’, ‘జనరంగం’ వీరి రచనలే.</p>
<p>తొలుత కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితుడైన రంగాచార్య తదనంతరకాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీ మద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు. కాలక్రమంలో వాల్మీకి రామాయణంలో చోటు చేసుకున్న అవాల్మీకాలు లేకుండా అచ్చంగా వాల్మీకి ప్రొక్తమైన రామయణాన్ని ‘శ్రీ మద్రామాయణం’ పేరుతో తెలుగువారికి వచనంలో అందించారు. రామాయణంలో అక్కడక్కడా రాసిన రంగాచార్య విమర్శనాత్మక అభిప్రాయాలు చదువరులను ఆలోచింపజేస్తాయి. అపరితమైన పరిజ్ఞాన్ని అందిస్తాయి. ‘సీతా చరితం’ పేరుతో మరోసారి రామయణాన్ని రాశారు. 1994లో హరివంశ సహిత ‘మహా భారతం’ రచించారు రామాయణ, మహా భారత రచనల తరువాత ‘శ్రీ మద్భాగవతం’ రాశారు. ఈ రచనలో రంగాచార్య వ్యాసున్ని అనుసరించినా, పోతన పద్యాల రుచిని పాఠకులకు చూపించారు.</p>
<p>అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి ‘అభినవ వ్యాసుని’గా ఖ్యాతిగాంచారు. వేదాలను అనువాదం చేయడానికి ముందు ఆయన తన వేషధారణ కూడా మార్చుకున్నారు. పంచె కట్టుకోవడం, చొక్కా వేసుకోకుండా శాలువా కప్పుకోవడం, నుదుట మూడు నామాలు పెట్టుకోవడం చాలా మందిని ఆశ్చర్యపర్చింది. ఆయన జీవితంలో వైరుధ్యంగా కనిపించిన విషయం. దీనికి ఆయన మతం వ్యక్తిగతమైంది. “మార్క్సిజానికి, నా వేషధారణకు, వేదాల అనువాదానికి మధ్య వైరుధ్యమేమీ లేదు” అంటూ నిక్కచ్చిగానే సమాధానమిచ్చారు. ప్రజలకు వేదం అనే నినాదంతో వేద ఉద్యమాన్ని ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చాశారు. వేదాలను అందరూ చదువుకునేలా రాస్తావా? అంటూ సంప్రదాయవాదులు ఫోన్ ల ద్వారా, ఉత్తరాల ద్వారా హెచ్చరించినా ఆయన ఏమాత్రం లెక్క చేయలేదు. వేదావిష్కరణలో ఒక స్త్రీకి, ఒక దళిత యువకునికి వేద ప్రతులను అందించారు. వేదాలను ప్రవేశికగా వేదాలు మానవజాతి అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపాయో, నేటి యాంత్రిక నాగరికతకు వేద సాహిత్యంలో ఎటువంటి సమాధానాలు ఉన్నాయో వివరిస్తూ ‘వేదం – జీవననాదం’ రచించారు. రంగాచార్య వేద రచనను వివరిస్తుంటే రచయితకు ఉండాల్సిన మొదటి అర్హత ఏమిటో అర్ధమవుతుంది. సమాజహితం కోసం చేసే ఏ రచనకైనా ధైర్యం ఉండాలని ఆయన మాటల్లో బోధపడుతుంది.</p>
<p>రంగాచార్య జీవితానికి, అనువాదాలకు విడదీయని బంధం ఉంది. ఆయన చిన్నతనంలోనే వారి తండ్రి నిర్వహించిన ‘దాశరథి’ పత్రిక కోసం ద్రావిడ గ్రంథాలను అనువదించారు. తరువాత కాలంలో ఆయన సాహితీ జీవితం అనువాదంతోనే ప్రారంభం అయింది. 1940ల్లో కోల్ కతాలో వచ్చిన కరువు రక్కసి గురించి ప్రఖ్యాత భారతీయ ఆంగ్ల రచయిత భవానీ భట్టాచార్య రాసిన నవల ‘He who rides A tiger’ను ‘దేవుని పేరిట’ పేరుతో తెలుగులో అనువదించారు. తొలినాళ్ళలో రంగాచార్య పిల్లలకోసం ‘వివేకనందుడు’, ‘మహాత్ముడు’, ‘కాళిదాసు’ అనే మూడు నాటకాలు రచించారు. 1974లో ‘శ్రీ వేంకటేశ్వర లీలలు’ రచించారు. రంగాచార్య రచనలు పబ్లిషర్లకు లక్ష్మీకటాక్షాన్నిచ్చాయి. ఐతే తాను మాత్రం సరస్వతీ కటాక్షానికే సంతృప్తులైనారు.</p>
<p>రంగాచార్యుల రచనలది విశిష్ట పంథా. మెలోడ్రామాలు సృష్టించడం ఆయన సాహితీ నైజానికి విరుద్ధం. శిల్పాన్ని త్యాగం చేయకుండా చెప్పాల్సిన కథను ఆయన అలవోకగా నడిపించగలరు. యువకళావాహిని ఆయనకు అక్షర వాచస్పతి బిరుదు ప్రధానం చేశారు. రచయిత భావుకత్వానికి ఒక నైజం ఉండాలని ఆయన తరచూ అనేవారు. భావుకత్వానికి నైజం అనే మాట సాహిత్యంలో కొత్త ప్రయోగానికి నాంది పల్కింది. కథలు, నవలల్లోని పాత్రలు పాఠకునికి సన్నిహితమైతమైతేనే ఆ రచన సమాజానికి స్ఫూర్తిదాయకం అవుతుందని దాశరథి విశ్వసించేవారు. ప్రాంతీయ విభేదాలు, కులాలు, మతతత్వ ప్రాతిపదికన రచనలు చేయడం ఆయనకు నచ్చేది కాదు. అన్యాయాలను ఎదుర్కొవడమే రచనల ముఖ్య ఉద్దేశం కావాలని రంగాచార్య దృఢంగా నమ్మేవారు. ఆయన రచనలు చదివిన ప్రతి పాఠకుడూ తనను తాను పరిశీలించుకునే అవకాశం కలుగుతుంది. అటువంటి సాహిత్యమే సజీవంగా నిలుస్తుంది.</p>
<p>మన కాలపు మహా మనిషి రంగాచార్య రచనల్లో తెలంగాణదనం ఉట్టిపడుతుంది. ఆయన రచనల్లో ప్రగతిశీలురు అభ్యుదయాన్ని చూడవచ్చు. వేదపరాయణులు వేదాలను తెలుసుకోవచ్చు. రంగాచార్య వెలువరించిన సారస్వతాంబుధిలో సాహితీవేత్తలకు సాహిత్య రత్నాలు లభిల్తాయి. చరిత్రకారులకు తెలంగాణ చరిత్ర దర్శినమిస్తుంది. మానవత్వమే రంగాచార్య నమ్మిన మతం. ఆయన వేదం&#8230;.జన జీవన నాదం. ఆయన రచనలు మట్టి బతుకుల అక్షర చిత్రాలు. నిరంకుశంపై అంకుశం రంగాచార్య కలం. ఆయన ఒక కథ రాసినా, ఒక నవల రాసినా&#8230;అది తిరుగుబాటు బావుటే. అది ముమ్మాటికీ సామాన్యుడి గొంతుకే. అందుకే కాబోలు సామన్యుల నడుమ సామాన్యుడిగానే తుదిశ్వాస దాకా ఆయన బతికారు. చిరకాలం బతికుంటారు. అందుకే దాశరథి నిజంగా కరుణాపయోనిధి!.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=8763</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా</title>
		<link>http://vaakili.com/patrika/?p=6111</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6111#comments</comments>
		<pubDate>Tue, 05 Aug 2014 12:39:39 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[తన్నీరు కళ్యాణ్ కుమార్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6111</guid>
		<description><![CDATA[<p>ఆధునిక భాషాశాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు చేకూరి రామారావు తెలుగువారు గర్వించదగిన మహానుభావుడు. ఆధునిక భాషా రంగంలో అనితర సాధ్యమైన గుర్తింపు పొందిన మహా వ్యక్తి. ఆయన మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు. భద్రిరాజు కృష్ణమూర్తి, తూమాటి దొణప్ప తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన చేకూరి రామారావు తెలుగు వారికి చిరస్మరణీయులు. ఆయన వాడుక భాషా వ్యాప్తికి చేసిన కృషి ప్రశంసనీయం.</p> <p>అందరికి &#8216;చేరా&#8217;గా సుపరిచితుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలుకా ఇల్లిందుల పాడు గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య గుంటూరు జిల్లా నరసరావుపేటలోను, ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో పూర్తి చేశారు. డిగ్రీ, యం.ఏ. తెలుగు హైదరాబాదులో పూర్తి చేసి, అమెరికా వెళ్ళి కార్నల్ యూనివర్శిటీలో జెరాల్డ్ కెలి పర్యవేక్షణలో &#8216;తెలుగు నామ్నీకరణం&#8217;(నామినలైజేషన్) పై పిహెచ్.డి. చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో లింగ్విస్టిక్  ప్రొఫెసర్ గా పనిచేసి అక్కడే పదివీ విరమణ చేశారు. కథకునిగా, విమర్శకునిగా, సాహితీవేత్తగా చేకూరి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు.</p> <p>వచన కవిత్వంలో దిట్ట అయిన చేరా వివిధ దిన పత్రికల్లో అనేక వ్యాసాలు, చేరాతలు వ్రాశారు. 1975 నుండి ఇటీవల కాలం వరకు ఎన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాయి.  తెలుగు వాక్యం, వచన రచన తత్త్వాన్వేషణ, సాహిత్య కిర్మీరం, భాషా పరివేషం, తెలుగులో వెలుగులు(భాషా పరిశోధన వ్యాసాలు), స్మృతి కిణాంకం, ఇంగ్లీషు &#8211; తెలుగు పత్రికా పదకోశం, ముత్యాలసరాల ముచ్చట్లు, చేరా పీఠికలు, వచన పద్యం లక్షమ చర్చ, రెండు పదుల పైన, చేరాతలు సాహిత్య విమర్శ &#8211; పరామర్శ, భాషాను వర్తనం, భాషాంతరంగం, సాహిత్య వ్యాసరించోళి, కవిత్వానుభవం  తదితర రచనలు చేసి భాషావ్యాప్తికి తన వంతు కృషి చేశారు.</p> <p>చేరా 2000లో రచించిన &#8216;స్మృతి కిణాంకం&#8217; అనే వ్యాస సంపుటికి 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వాడుక భాషకు కొత్త పుంతలు తొక్కించేందుకు చేరా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Chekuri_ramarao.jpg"><img class="alignleft size-full wp-image-6113" title="Chekuri_ramarao" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/08/Chekuri_ramarao.jpg" alt="" width="214" height="269" /></a>ఆధునిక భాషాశాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు చేకూరి రామారావు తెలుగువారు గర్వించదగిన మహానుభావుడు. ఆధునిక భాషా రంగంలో అనితర సాధ్యమైన గుర్తింపు పొందిన మహా వ్యక్తి. ఆయన మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు. భద్రిరాజు కృష్ణమూర్తి, తూమాటి దొణప్ప తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన చేకూరి రామారావు తెలుగు వారికి చిరస్మరణీయులు. ఆయన వాడుక భాషా వ్యాప్తికి చేసిన కృషి ప్రశంసనీయం.</p>
<p>అందరికి &#8216;చేరా&#8217;గా సుపరిచితుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలుకా ఇల్లిందుల పాడు గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య గుంటూరు జిల్లా నరసరావుపేటలోను, ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో పూర్తి చేశారు. డిగ్రీ, యం.ఏ. తెలుగు హైదరాబాదులో పూర్తి చేసి, అమెరికా వెళ్ళి కార్నల్ యూనివర్శిటీలో జెరాల్డ్ కెలి పర్యవేక్షణలో &#8216;తెలుగు నామ్నీకరణం&#8217;(నామినలైజేషన్) పై పిహెచ్.డి. చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో లింగ్విస్టిక్  ప్రొఫెసర్ గా పనిచేసి అక్కడే పదివీ విరమణ చేశారు. కథకునిగా, విమర్శకునిగా, సాహితీవేత్తగా చేకూరి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు.</p>
<p>వచన కవిత్వంలో దిట్ట అయిన చేరా వివిధ దిన పత్రికల్లో అనేక వ్యాసాలు, చేరాతలు వ్రాశారు. 1975 నుండి ఇటీవల కాలం వరకు ఎన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాయి.  తెలుగు వాక్యం, వచన రచన తత్త్వాన్వేషణ, సాహిత్య కిర్మీరం, భాషా పరివేషం, తెలుగులో వెలుగులు(భాషా పరిశోధన వ్యాసాలు), స్మృతి కిణాంకం, ఇంగ్లీషు &#8211; తెలుగు పత్రికా పదకోశం, ముత్యాలసరాల ముచ్చట్లు, చేరా పీఠికలు, వచన పద్యం లక్షమ చర్చ, రెండు పదుల పైన, చేరాతలు సాహిత్య విమర్శ &#8211; పరామర్శ, భాషాను వర్తనం, భాషాంతరంగం, సాహిత్య వ్యాసరించోళి, కవిత్వానుభవం  తదితర రచనలు చేసి భాషావ్యాప్తికి తన వంతు కృషి చేశారు.</p>
<p>చేరా 2000లో రచించిన &#8216;స్మృతి కిణాంకం&#8217; అనే వ్యాస సంపుటికి 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వాడుక భాషకు కొత్త పుంతలు తొక్కించేందుకు చేరా ఎంతగానో కృషి చేశారు.  తెలుగు సాహితీ విమర్శకునిగా ప్రసిద్ధ చెందారు. జస్టిస్ ఆవుల సాంబశివరావు స్మారక పురస్కారాన్ని కూడా చేరా అందుకున్నారు. చేరా భాషా వైదుష్యానికి, నిశిత పరిశీలనా నైపుణ్యానికి గుర్తింపుగా తెలుగునాట అనేక సాహితీ, సాంస్కృతిక సంస్థలు సన్మానాలు జరిపి అక్షర నీరాజనాలర్పించాయి. చేరాది కుల &#8211; మత &#8211; ప్రాంతీయ దురభిమానాల సంకుచిత సరిహద్దులలో ఇమడని వ్యక్తిత్వం.</p>
<p><strong>ఆధునిక భాషాశాస్త్రవేత్తగా చేరా </strong>:- భాషాశాస్త్రం ఆయనకు అధికారిక అధ్యయన రంగం. సాహిత్యం ఆయనకు అభిరుచి రంగం. భాషాశాస్త్ర పరిశోధనలో కొత్త దారి తొక్కి, తెలుగు వాక్య నిర్మాణ రహస్యాలను ఆయన ఆవిష్కరించారు. 1975లో ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా ప్రచురించిన &#8216;<strong>తెలుగు వాక్యం&#8217; </strong>తెలుగు వాక్యానికి నవీన వ్యాకరణం వంటిది. ఆధునిక తెలుగు వాక్యాన్ని చేరా వ్యవహర్తల సంభాషణల నుంచి, ప్రసిద్ధ వచన రచనల నుంచి నమూనాలుగా తీసుకొని విశ్లేషణలు &#8211; వ్యాఖ్యలు చేశారు. రాసే తెలుగుకి &#8211; మాట్లాడే తెలుగుకి అంతరం ఉండి తీరుతుందని, రాసే భాష ప్రయోజనాలు భిన్నమైనవని, బౌద్ధిక వచనం సూటిగా అలంకార రహితంగా ఉండాలని ఆయన వాదించేవారు. వాక్య నిర్మాణానికి సంబంధించిన తన శాస్త్రీయ సూత్రాలనే చేరా వచన కవిత్వ విశ్లేషణకు కూడా వినియోగించుకున్నారు.  ఆధునిక భాషాశాస్త్ర రంగంలో నవ్య విప్లవానికి నాందీ పలికిన నామ్ చామ్ స్కీ సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి, చేరా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.</p>
<p><strong>ఆధునిక సాహిత్య విమర్శకునిగా చేరా </strong>:- చేరాకు విస్తృతమైన ప్రసిద్ధిని అందించింది ఆయన &#8216;చేరాతలు&#8217; కాలమ్. 1986 నుంచి 1994 దాకా ఎనిమిదేళ్ళ పాటు ఆంధ్రజ్యోతీ ఆదివారం సంచికలో ఆయన నిర్వహించిన చేరాతలు కాలమ్ నాటి సాహిత్య లోకంలో ఒక సంచలనం. సమకాలీన కవిత్వ విశ్లేషణగా సాగిన ఆ కాలమ్, కొత్తగా రాస్తున్న కవులకు ప్రోత్సాహకరంగా ఉండేది. రూపరీత్యా కవిత్వ నిర్మాణ పద్ధతిని వ్యాఖ్యానిస్తూ చేరా రాసిన వ్యాసాలు, అప్పటి తెలుగు సాహిత్య సమాజానికి అలవాటైన వస్తు విమర్శకు పూర్తిగా భిన్నమైనవి. చేరా ప్రగతిశీల భావాలు కలవారు. ప్రజా వ్యతిరేక కావ్య వస్తువును సమ్మతించేవారు కాదు.</p>
<p>కవితా నిర్మాణం మీద కేంద్రీకరించిన తీరు ఆయనకు రూపవాది అనే విమర్శను తెచ్చిపెట్టింది. వస్తువుతో ఏకీభావం ఉన్నప్పుడు, విమర్శించవలిసింది రూపాన్నే కదా&#8230; అని చేరా తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చేవారు. కవిత్వం రాయడానికి కాదు, కవిత్వాన్ని ఆస్వాదించడానికి కూడా కొంత శిక్షణ &#8211; సహాయము కావాలని చేరాతలు నిరూపించాయి.  కొత్త కవిత్వ పథంలో తొలి అడుగులు వేస్తున్న కవులకు చేరాతలు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, వారి కవిత్వాన్ని అర్ధం చేసుకోగలిగిన పాఠకులను కూడా అవి రూపొందించాయి.</p>
<p>చేరాతలు కాలమ్ చేరాకు ప్రఖ్యాతితో పాటు, అనేక సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. ఆయన కాలంలో కనిపించిన కవులకు సాహిత్యరంగంలో ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో, చేరా ఎంపికపై విమర్శలు వచ్చాయి. చేరా తన విమర్శలలో స్త్రీవాద సాహిత్యానికి పెద్ద పీఠ వేశారు. స్త్రీ వాద కవిత్వాన్ని అర్ధం చేసుకోలేక నిరాకరిస్తున్న అనేకమంది కవుల &#8211; మేధావుల &#8211; విప్లవ కారుల ఆలోచనలకు సరియైన దారిలో పెట్టడానికి ఆయన విమర్శలు దోహదపడ్డాయి.  విప్లవ &#8211; దళిత కవులను కూడా చేరా అప్పుడప్పుడు తన విమర్శలలో పరామర్శించారు.</p>
<p><strong> బహుముఖ ప్రజ్ఞాశాలి చేరా </strong><strong>:-  </strong>అనువాదరంగమన్నా కూడా ఆయనకు విశేషమైన అభిమానం. ఆయన కొన్ని కవితలను అనువాదం చేయడమే గాక, అనువాద శాస్త్రం పై తన అభిప్రాయాలను వివిధ వ్యాసాలలో వ్యక్తీకరించారు. భద్రిరాజు కృష్ణమూర్తి గారి వ్యవసాయ వృత్తి పదకోశం లోని అనుభవంతో ఆయన నిఘంటవు నిర్మాణరంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, తెలుగు విశ్వ విద్యాలయంలో ఒక శాఖ ఏర్పాటుకు కృషి చేశారు. పత్రికా భాషపై ఆయనకున్న అభిమానంతో పత్రికలకు పనికివచ్చే ఇంగ్లీషు &#8211; తెలుగు పత్రికా పదకోశం కూడా నిర్మించారు. సాహిత్యాభిరుచి వల్ల ఆయనకు అటు భారతీయ సాహిత్య విమర్శ (ఛందో &#8211; అలంకార శాస్త్రాల విషయంలో) &#8211; పాశ్చాత్య సాహిత్య విమర్సలతో పాటు భాషాశాస్త్ర దృక్పథంలో ప్రారంభమై శైలి శాస్త్రం &#8211; ఈ మూడింటినీ జోడించి సాహిత్య విమర్శ ప్రారంభించారు. భాషాశాస్త్రంతో పాటు ఛందస్సు కూడా చేరాకు ఇష్టమైన రంగం. ముత్యాలసరం  మీద &#8211; వచన కవిత్వ లక్షణాల మీద సుదీర్ఘ చర్చలు చేశారు.</p>
<p>తొలి ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వెలువరించిన <strong>&#8216;తెలుగువాక్యం&#8217;</strong> మొదలుకొని నిన్నటి <strong>&#8216;భాషా పరివేషం&#8217;</strong> వరకు ఎన్నో ఏళ్ళుగా చేరా రచనా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆయన గ్రంథాలు పునర్ముద్రితమవుతూనే ఉన్నాయు. సాహితీ వేత్తలు, విమర్శకులు, పాత్రికేయులు సమీక్షించి అంచనా కట్టే ప్రయత్నం చేశారు. సహజంగానే దృక్పథాల్లో ఉన్న వైరుధ్యాల వల్ల చేరా పుస్తకాల మీద వచ్చిన సమీక్షలలో సానుకూలమైనవి, ప్రతికూలమైనవి కూడా ఉన్నాయి. నిజ జీవితంలో ఇతరులను నొప్పించడం గాని, పరుషంగా మాట్లాడటం గానీ ఏనాడు చేయని చేరా భాషా సాహిత్య విమర్శనా రంగాలలో తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పడానికి ఏమాత్రం వెనుకాడే వారు కాదు. అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పినా  ఎదుటి వారి పట్ల ఆదరాభిమానల విషయంలో ఎన్నడూ ఆయన లోటు చేసేవారు కాదు. మానవీయ విలువలకు పెద్ద పీఠ వేయడంలో చేరాది ఎన్నడూ పెద్ద మనసే. తనను విభేధించే వారితో సైతం ఔన్నత్యాన్ని ప్రదర్శించి, వారిని ప్రశంసించగల సహృదయం చేరాది. అందువల్లే చేరా అందరి చేత మన చేరా అనిపించుకున్నారు.</p>
<p>ఆధునికత, ప్రగతిశీలత, సంయమనం, అపారమైన పాండిత్యం, గాఢమైన కవిత్వ ప్రేమ&#8230;..ఇన్ని లక్షణాలు కలగలసి రూపుదాల్చితే చేరా. చేరా తన జీవితకాలంలో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ప్రతిభలోనూ &#8211; ప్రజ్ఞలోనూ ఆయనతో ఏమాత్రం సరితూగని వారు ఉన్నత పదవులు అలంకరించినా, చేరా ఏనాడు పదవులు &#8211; హాదాలు కోరుకోలేదు.</p>
<p>తొలితరం భాషాశాస్త్రవేత్తగా, ఆధునిక సాహిత్య విమర్శకునిగా, నిఘంటువు నిర్మాతగా, ఎందరో తెలుగు రచయితలకు &#8211; రచయిత్రులకు స్ఫూర్తినిచ్చిన ఆదర్శమూర్తిగా చేరా తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. భౌతికంగా చేరా నేడు లేకపోయినా భాషాశాస్త్ర రంగంలో &#8211; ఆధునిక సాహిత్య విమర్శలో నూత్న పథంలో ముందుకు సాగే వారికి దిక్సూచిలా, వెలుగు దివ్వెలా దారి చూపిస్తునే ఉంటారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6111</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం</title>
		<link>http://vaakili.com/patrika/?p=5838</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5838#comments</comments>
		<pubDate>Wed, 02 Jul 2014 18:59:30 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[తన్నీరు కళ్యాణ్ కుమార్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5838</guid>
		<description><![CDATA[<p>అమెరికాంద్రుల జీవితాలలో తరచుగా తారసపడే పరిస్థితులను, సమస్యలను వాటి పరిష్కారాలను కథలుగా మలచి మనకు అందిస్తున్న అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులు అభినందనీయులు. వేరు వేరు కాలాలలో అమెరికాలోని తెలుగువారి జీవనవిధానం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఈ కథల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలోని తెలుగు కథా రచయిత్రులు అక్కడి సమాజంలోని తమ వారి జీవితాలను శోధించి, ఆ అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకొని కథలను సృష్టిస్తున్నారు. అమెరికా లాంటి భిన్న సంస్కృతుల వ్యవస్థలో తమ సంస్కృతిని, తమ భాషను, తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోను &#8211; ఉత్సాహంతోను అక్కడి కథా రచయిత్రులు కథలను వ్రాస్తున్నారు. సాహిత్యం కూడా సంస్కృతిలో భాగం కావున అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృభాషలో కథలు, కవితలు వ్రాసే రచయిత్రులు కూడా అక్కడి తెలుగు సంస్కృతికి ఇతోధికసాయం చేస్తున్నాయని చెప్పవచ్చు.</p> <p>అమెరికాంధ్ర సాహిత్యంలోని  కథలన్నీ అమెరికాంద్రుల జ్ఞాపకాల నుండి, ఆరాటాల నుండి, బెంగల నుంచి, స్పృశించిపోయే అనుభవాల నుండి పుట్టుకొచ్చాయి. అక్షరాల ఈ కథలు ప్రస్తుతం తెలుగు గడ్డపై వెలువడుతున్న కథలకు ఇవి భౌతికంగాను, మానసికంగాను భిన్నమైనవి. ఈ కథలలో అధిక భాగం స్త్రీ దృక్పథం నుండి కష్ట సుఖాలను విశదం చేస్తాయి. అమెరికాంధ్ర కథా రచయిత్రులందరూ రచనే వృత్తిగా కలిగినవారు కాదు. అక్కడి రచయిత్రులకిది ప్రవృత్తి మాత్రమే. ఈ రచయిత్రులకు వారు చేసే ఉద్యోగాల ద్వారా రకరకాల వ్యక్తులు పరిచయమవుతుంటారు. అమెరికాంధ్రులు పరాయిగడ్డపై  ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో, వాటిని వారు ఎలా పరిష్కరించుకోగలుగుతున్నారో, ఆయా సమస్యల నుండి బయటపడే దారిలేక ఎలా బలి అవుతున్నారో తెలుసుకొని కూర్చబడిన కథలివి.</p> <p>అమెరికా తెలుగు కథా పరిణామాన్నే అమెరికా తెలుగు సాహిత్య పరిణామంగాచెప్పవచ్చు. అమెరికాలో తెలుగు కథ పుట్టు పూర్వోత్తర వికాసాలను పరిశీలిస్తే &#8211; 1965 ప్రాంతపు తొలిదశలో అమెరికా గడ్డపై కాలుమోపిన తెలుగువారు, ఆ సరికొత్త  వ్యవస్థలో సర్ధుకుపోలేక విపరీతమైన ఒత్తుళ్ళకులోని సాహిత్యం జోలికిపోలేదు. కానీ 1970 ప్రాంతంలో ఈ పరిస్థితులు మారి సాహిత్య [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/07/kalyan.jpg"><img class="alignleft size-full wp-image-5915" title="kalyan" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/07/kalyan.jpg" alt="" width="198" height="277" /></a>అమెరికాంద్రుల జీవితాలలో తరచుగా తారసపడే పరిస్థితులను, సమస్యలను వాటి పరిష్కారాలను కథలుగా మలచి మనకు అందిస్తున్న అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులు అభినందనీయులు. వేరు వేరు కాలాలలో అమెరికాలోని తెలుగువారి జీవనవిధానం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఈ కథల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలోని తెలుగు కథా రచయిత్రులు అక్కడి సమాజంలోని తమ వారి జీవితాలను శోధించి, ఆ అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకొని కథలను సృష్టిస్తున్నారు. అమెరికా లాంటి భిన్న సంస్కృతుల వ్యవస్థలో తమ సంస్కృతిని, తమ భాషను, తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోను &#8211; ఉత్సాహంతోను అక్కడి కథా రచయిత్రులు కథలను వ్రాస్తున్నారు. సాహిత్యం కూడా సంస్కృతిలో భాగం కావున అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృభాషలో కథలు, కవితలు వ్రాసే రచయిత్రులు కూడా అక్కడి తెలుగు సంస్కృతికి ఇతోధికసాయం చేస్తున్నాయని చెప్పవచ్చు.</p>
<p>అమెరికాంధ్ర సాహిత్యంలోని  కథలన్నీ అమెరికాంద్రుల జ్ఞాపకాల నుండి, ఆరాటాల నుండి, బెంగల నుంచి, స్పృశించిపోయే అనుభవాల నుండి పుట్టుకొచ్చాయి. అక్షరాల ఈ కథలు ప్రస్తుతం తెలుగు గడ్డపై వెలువడుతున్న కథలకు ఇవి భౌతికంగాను, మానసికంగాను భిన్నమైనవి. ఈ కథలలో అధిక భాగం స్త్రీ దృక్పథం నుండి కష్ట సుఖాలను విశదం చేస్తాయి. అమెరికాంధ్ర కథా రచయిత్రులందరూ రచనే వృత్తిగా కలిగినవారు కాదు. అక్కడి రచయిత్రులకిది ప్రవృత్తి మాత్రమే. ఈ రచయిత్రులకు వారు చేసే ఉద్యోగాల ద్వారా రకరకాల వ్యక్తులు పరిచయమవుతుంటారు. అమెరికాంధ్రులు పరాయిగడ్డపై  ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో, వాటిని వారు ఎలా పరిష్కరించుకోగలుగుతున్నారో, ఆయా సమస్యల నుండి బయటపడే దారిలేక ఎలా బలి అవుతున్నారో తెలుసుకొని కూర్చబడిన కథలివి.</p>
<p>అమెరికా తెలుగు కథా పరిణామాన్నే అమెరికా తెలుగు సాహిత్య పరిణామంగాచెప్పవచ్చు. అమెరికాలో తెలుగు కథ పుట్టు పూర్వోత్తర వికాసాలను పరిశీలిస్తే &#8211; 1965 ప్రాంతపు తొలిదశలో అమెరికా గడ్డపై కాలుమోపిన తెలుగువారు, ఆ సరికొత్త  వ్యవస్థలో సర్ధుకుపోలేక విపరీతమైన ఒత్తుళ్ళకులోని సాహిత్యం జోలికిపోలేదు. కానీ 1970 ప్రాంతంలో ఈ పరిస్థితులు మారి సాహిత్య సృజనకు అనుకూలమైన వాతావరణం  ఏర్పడింది. దీంతో అంతకుముందు రచనా వ్యాపకం కలిగిన వారేగాక కొత్తవారు కూడా కలంపట్టి  తమ సంఘర్షణలను కథలుగా మలచడం ఆరంభించారు.</p>
<p>డేబ్బయ్యో దశకంనాటికి అమెరికాకు వచ్చే తెలుగువారి సంఖ్య క్రమంగా పెరగడంతో అక్కడి ముఖ్య నగరాలన్నింటిలోను తెలుగు సంఘాలు ఏర్పడటం, ఆ తరువాత ఆ సంఘాలే చిన్నవో, పెద్దవో లిఖిత పత్రికలు ప్రచురించడం ఆరంభమైంది. ఆ తరువాత కొంత కాలానికి అచ్చు పత్రికలు కూడా వెలువడ్డాయి. తెలుగు భాషా పత్రిక, మధురవాణి, తెలుగు అమెరికా పత్రికల్లో ఇక్కడున్న తెలుగు కథకుల కథలు ప్రచురించబడేవి. తొంబయ్యో దశక ప్రారంభంలో వెలువడిన తానా పత్రిక, ఆ తరువాత కొంతకాలానికి వెలువడిన అమెరికా భారతి, తెలుగు జ్యోతి, తెలుగు వెలుగు, తెలుగు పలుకు, ఇంద్ర ధనుస్సు, తెలుగువాణి పత్రికలు వెలుగు చూసాయి. ఈ పత్రికలన్నీ తెలుగు కథకు అగ్రతాంబూలన్ని ఇచ్చాయి. ఈ మాట, కౌముది, తులిక లాంటి  వెబ్ జర్నల్స్ కూడా అమెరికాంధ్ర రచ రచయితలను/ రచయిత్రులను ప్రోత్సహిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.</p>
<p>తొలితరం అమెరికాంధ్ర రచయిత్రులు మొదట్లో పుట్టినగడ్డకు దూరం ఉండటం వల్ల ఆ జ్ఞాపకాలు, అనుభూతులు ఒకరితో మరొకరు పంచుకోవాలనుకున్నారు. అందుకు ప్రారంభంలో చిన్నగా ఏర్పడిన తెలుగు సంఘాలు, వాటి సావనీర్లు ఆలంబన అయ్యాయి. కాబట్టి తొలుత చాలా మంది నాస్టాల్జియాతో రచనలు చేశారు. దాదాపు 25,30 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న తొలితరానికి చెందిన ఇప్పటికీ ఆ ప్రపంచం నుండి బైటపడలేకపోతున్నారు.  ఈ తరం వాళ్ళు ఏం రాసినా మాతృదేశంతో వాళ్ళ మానసిక సాన్నిహిత్యం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ నుండి వీరు భౌతికంగా విదేశంలో వున్నా మాతృ దేశపు మూలాల్ని మరిచిపోలేదు. దామరాజు లక్ష్మి, శారదాపూర్ణ శొంటి లాంటి వాళ్ళు పూర్తిగా మాతృదేశపు జ్ఞాపకాలతో కథలు రాశారు. మొదటి తరం వాళ్ళు ఈ దేశం వచ్చేటప్పటికీ తెలుగు వారి సంఖ్యా ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువగా వుండటం, అప్పుడు ఆంధ్రదేశంలో వున్నా తీరు, వాళ్ళు వచ్చ్జినప్పుడు అమెరికా వున్నా తీరు &#8211; ఇవన్నీ కూడా తొలితరం రచయిత్రులు ఎలాంటి కథలు రాసారన్న దానికి స్పష్టమైన ఆధారం. అమెరికాకు వచ్చిన మొదట్లో వ్యక్తిగతంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా నిలదొక్కుకోవడానికి మొదటితరం వారు పడిన సంఘర్షణ, దాని తాలూకు అనుభవాలు తర్వాత వచ్చిన తరాల వారికి ఉపయోగాపడ్డాయి.</p>
<p>1990 సంవత్సరం తరువాత వచ్చిన రెండోతరం కథకుల కథల్లో నాస్టాల్జియా భావనలు కనిపించడం లేదు. కొత్త దేశంలో తమకు ఎదురయ్యే సరికొత్త అనుభవాలను, పాత అనుభవాలను సమన్వయం చేస్తూ, ప్రతి విషయాన్ని కొత్త కళ్ళతో పరిశీలిస్తూ వ్రాసే డైస్పోరా కథాసాహిత్యం వెలువడటం ప్రారంభమైంది. 1998 అట్లాంటాలో జరిగిన ప్రప్రథమ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, 2000 చికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ భావనలకు బలాన్ని ప్రసాదించింది.</p>
<p>ఉత్తర అమెరికాలోని తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే సంకల్పంతో 1994లో ఆవిర్భవించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలుగుకథకు రాజ గౌరవాన్ని కలుగజేసింది. ఈ  ఫౌండేషన్ కృషితోనే 1995 జులైలో అమెరికా తెలుగు కథానిక &#8211; మొదటి సంకలనం వెలుగు చూసింది. అమెరికాలో వెలువడిన మొట్టమొదటి కథా సంకలనం కూడా ఇదే కావడం విశేషం. ఈ ఫౌండేషన్ వారే ఏటేటా కథా పోటీలను నిర్వహించి బహుమతులు ఇవ్వడమే గాక, కథా సంకలనాలుగా కూడా ప్రచురిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ 11 కథా సంకలనాలను ప్రచురించారు. ఈ కథా సంకలనాలలో అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథలకు సముచిత స్థానం దక్కింది.</p>
<p>వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన &#8220;<strong>20</strong><strong>వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం</strong>&#8221; అనే పుస్తకం ఒక అద్భుత ప్రయోగమేనని చెప్పాలి.  ప్రారంభ దశలో అమెరికాలోని తెలుగు కథా రచయితలు/ రచయిత్రుల కథలను సాహితీ లోకానికి పరిచయం చేసిన మహత్తర గ్రంథమిది. 1970వ సంవత్సరంలో అమెరికా నుండి వెలువడిన తెలుగు భాషా పత్రికలో <strong>చెరుకూరి రమాదేవి </strong>- పుట్టిల్లు, <strong>కోమలాదేవి</strong> &#8211; పిరికివాడు కథలు ప్రచురించబడ్డాయి. ఈ కథలు భారతీయ కుటుంబ నేపథ్యంలో వ్రాయబడిన కథలు.</p>
<p>అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రుల సృజనాత్మకత శక్తిని వెలికితీయడంలోనూ, ప్రోత్సహించి ఉత్సాహపరచడంలోనూ ఈ ఫౌండేషన్ గణనీయమైన పాత్రను పోషించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. <strong>చిమట కమల</strong> &#8211; &#8220;<em>అమెరికా ఇల్లాలు</em>&#8220;,  పూడిపెద్ది  శేషుశర్మ &#8211; &#8220;ప్రవాసాంధ్రుల ఆశాకిరణం&#8221;, <strong>దశిక శ్యామల</strong> &#8211; &#8220;<em>అమెరికా ఇల్లాలి ముచ్చట్లు</em>&#8221; మొదలైన  కథా సంకలనాలను కూడా వంగూరి ఫౌండేషన్ వారే ప్రచురించారు. మరి ముఖ్యంగా పూడిపెద్ది  శేషుశర్మ  అమెరికాంధ్ర జీవితంలో భిన్న పార్శ్వాలను  కథా వస్తువులుగా స్వీకరించి విశ్లేషణాత్మకంగా కథల రూపంలో ఆవిష్కరించిన తీరు అభినందనీయము.</p>
<p>సంప్రదాయబద్ధంగా స్వదేశంలో పెరిగి, పెళ్లి పేరుతో తమ సంస్కృతి &#8211; సంప్రదాయాలకు &#8211; ఆచార వ్యవహారాలకు ఎంతో భిన్నమైన వాతావరణంలోకి అడుగిడిన తెలుగింటి ఆడపడుచుల మనోభావాలను కథల రూపంలోను &#8211; కబుర్ల రూపంలోను అందించే ప్రయత్నాన్ని కొంతమంది అమెరికా తెలుగు కథా రచయిత్రులు చేశారు. ఐతే ఈ కబుర్లు &#8211; కథలు ఈనాటి అమెరికా తెలుగింటి ఇల్లాళ్ళుకు వర్తించకపోవచ్చు. ఎందుకటే నేడు అమెరికాకి వస్తున్న ఆడపిల్లల తరహాయే వేరు. అంతేగాకుండా ఇప్పటి భార్యాభర్తల మధ్య చదువు పరంగా &#8211; ఆర్థికపరంగా &#8211; సంస్కృతి పరంగా పెద్ద ఏమీ ఉండటం లేదు. కానీ పాత రోజుల్లో ప్రవాసాంధ్రులుగా అమెరికాలో స్థిరపడటానికి వచ్చిన భార్యాభర్తల మధ్య చదువులోను, సంప్రదాయంలోనూ వ్యత్యాసం చాలా ఎక్కువుగా వుండేది. ఆ రోజుల్లో మగవారందరూ పెద్ద చదువుతో అమెరికాకి వచ్చి, ఇక్కడకు వచ్చి కూడా చదువుకునేవారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఎక్కువ మంది కొద్దిపాటి చదువుతో, అప్పటి వరకు తమ గ్రామ పొలిమేరలు కూడా దాటకుండా అమాంతం అమెరికాకి వచ్చిన ఆడపిల్లలే.</p>
<p>ఈ తెలుగింటి గృహిణులు క్రమంగా ఆంగ్ల భాష నేర్చుకొని, చదువులు చదువుకొని తమ జ్ఞానాన్ని &#8211; పరిజ్ఞాన్ని పెంపొందింజేసుకొని అమెరికా జీవన స్రవంతిలో మమేకమైనారు. ఈ గృహిణులు పరాయి గడ్డపై నా అనే వారి తోడు లేకుండా, ఒకరి మీద ఆధారపడకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. భారతీయ కుటుంబ విలువల్ని &#8211; సంస్కృతి &#8211; సంప్రదాయాలను పరాయి గడ్డపై పదిలపరిచే ప్రయత్నంలో విజయం సాధించారు. అనేక సంవత్సరాల అమెరికా జీవితంలో తమకు స్వయంగా ఎదురైన అనుభవాలను అక్షరాలుగా మలిచి కథా సంకలనాల ద్వారా పాఠకుల  ముందుంచే ప్రయత్నం చేసిన రచయిత్రులు అభినందనీయులు. ఈ అనుభవాలు కేవలం వ్రాసిన రచయిత్రులవి మాత్రమే కాదు. అమెరికాలో వున్నా తెలుగింటి ఇల్లాళ్ళందరివి.</p>
<p>పురాణం సుబ్రమణ్యశర్మ &#8220;ఇల్లాలి ముచ్చట్లు&#8221; రచనను అనుసరిస్తూ <strong>దశిక శ్యామలాదేవి</strong> చేసిన అద్బుతప్రయత్నమే ఈ &#8220;అమెరికా ఇల్లాలి ముచ్చట్లు&#8221; సంకలనం. తెలుగింటి ఆడపడుచులు అమెరికాకు వెళ్తున్న తొలినాళ్ళలో మధ్య తరగతి కుటుంబం నుండి మధ్య తరగతి చదువుతో, మధ్య తరగతి ఆలోచనలతో పరాయి గడ్డపై అడుగుపెట్టిన తెలుగింటి ఆడపదుచుల మనోభావాలకు &#8211; మానసిక సంఘర్షణలకు అక్షర రూపం ఈ &#8220;అమెరికా ఇల్లాలి ముచ్చట్లు&#8221; సంకలనం.</p>
<p>మన దేశం అయినా అమెరికా అయినా ప్రతి సంసారంలోను బాధలు, సుఖాలు, చిరునవ్వులు ఉంటాయి. ఐతే అమెరికా లాంటి భిన్న వాతావరణంలోకి అడుగు పెట్టిన అమెరికాంధ్ర కుటుంబాలలోని కష్టాలు &#8211; కన్నీళ్లుణు కమ్మని కబుర్లు రూపంలో <strong>చిమట కమల</strong> &#8220;అమెరికా ఇల్లాలు&#8221; సంకలనం ద్వారా పాఠకుల ముందుంచారు. అమెరికాలోని తెలుగింటి ఇల్లాళ్ళ సాధక బాధలను ఈ సంకలనం ద్వారా పాఠకుల ముందుంచే ప్రయత్నం చేశారు. అనేక సంవత్సరాల అమెరికా జీవితంలో రచయిత్రి తనకు స్వయంగా ఎదురైన అనుభవాలను అక్షరాలుగా మలిచి ఈ సంకలనం ద్వారా పాఠకుల ముందుంచారు.</p>
<p>1977 నుంచి జరుగుతున్న ద్వైవార్షిక తానా సమావేశాలు &#8211; 1991 నుండి జరుగుతున్న ఆటా సమావేశాలు &#8211; ఈ మధ్యే జరుపుకుంటున్న అనేక తెలుగు సంఘాల రజతోత్సవాలు &#8211; ఆ రజతోత్సవాలు సందర్భంగా ప్రత్యేక సంకలనాలు ప్రచురించడం ఆనవాయితీగా మారింది. ఈ పత్రికలు, ప్రత్యేక సంచికలు కూడా వీలైనంత వరకు అమెరికాంధ్ర కథా రచయిత్రులను ప్రోత్సహిస్తున్నాయి.  అమెరికాలోని తెలుగు రచయిత్రులు చాలా మంది తెలుగుదేశపు పత్రికల్లో తమ రచనలను ప్రచురిస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ కలుపుకుంటే అమెరికాంధ్ర  కథా రచయిత్రులు సృష్టించిన తెలుగు సాహిత్యం రాశిపరంగా గణనీయంగానే వుంది. అమెరికాంధ్ర  సాహిత్యంలో అధిక భాగాన్ని ఈ కథలే ఆక్రమించాయి.</p>
<p>అమెరికా తెలుగు కథల్ని ప్రచురితమైన క్రమంలో పరిశీలిస్తే &#8211; మొదటి తరం అమెరికా తెలుగు కథలలో ముఖ్యంగా కనిపించేది కల్చర్ షాక్ కథలు.  కల్చర్ షాక్ కథలు తర్వాత నెమ్మదిగా అమెరికాలోని తెలుగు కుటుంబాల జీవనానికి సంబంధించిన కథలు రావడం మొదలైనాయి. పిల్లల పెంపకంలో ఉండే ఇబ్బందులు, మారుతున్న భార్య &#8211; భర్తల అనుబంధాలు, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఎదురౌతున్నఅవస్థలు, అమెరికాలో అతిథులతో ఇబ్బందులు, అమెరికా నుండి ఇండియాకి వెళ్ళినప్పుడు కలిగే అనుభవాలు కథా వస్తువులయినాయి. ఆ తరువాత విడాకులు, వృద్ధాప్యం, ఉద్యోగ విరమణ వస్తువులుగా కథలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అమెరికాతెలుగు కథలు చాలా వరకు తెలుగు పాత్రలకు, తెలుగు కుటుంబాలకే పరిమితమైనట్లుగా కనిపిస్తున్నాయి. అమెరికన్ పాత్రలు, అమెరికన్ ప్రపంచం ఈ కథలలో అరుదుగా కనిపిస్తాయి.</p>
<p>అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథలను ఇతివృత్తాలను ఆధారం చేసుకొని కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చు.</p>
<p><strong>1.</strong> <strong>అమెరికన్ సంస్కృతిలో మమేకమైన &#8211; మమేకం కాని జీవితాలను చిత్రించిన కథలు </strong><strong>:- </strong>  భారతీయ వాతావరణంలో పుట్టి పెరిగిన మహిళలు అమెరికాకు వచ్చినప్పుడు ఆ సరికొత్త వ్యవస్థకు, పద్ధతులకు అలవాటు పడటానికి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడతారు. ఐతే రెండు, మూడు సంవత్సరాలు  గడిచిన తరువాత వారు కూడా ఆ సమాజానికి అలవాటుపడి, అక్కడి వాతావరణంలో మమేకమైపోతారు. మరి కొంత మంది  మహిళలు తమ వారికి  దూరంగా ఉండలేక అక్కడి వాతావరణానికి  &#8211; పద్ధతులకు ఇమడలేక ప్రవాస ఖేదాన్ని అనుభవిస్తుంటారు. ఎలాంటి మహిళల జీవితాలను, వారి ఆలోచనలనల లోతులను వెల్లడించే ప్రయత్నాన్ని కొందరు రచయిత్రులు చేశారు. <strong>దశిక శ్యామలాదేవి</strong>  &#8211;  &#8217;జానకి&#8217;, <strong>చిమట కమల</strong> &#8211; &#8216;అమెరికా ఇల్లాలు&#8217;, <strong>రాధిక శాస్త్రి</strong>  &#8211; &#8216;జీవన వాహిని&#8217;, <strong>సునీతారెడ్డి</strong> &#8211; &#8216;అమెరికాలో మొదటి రోజు&#8217;, <strong>కృష్ణ ప్రియ</strong> &#8211; &#8216;న్యూయార్క్ చేరిన అనుభవం&#8217;, <strong>కనుపర్తి దీప్తి</strong>  &#8211; &#8216;ఏ తీరుగా నను&#8217;  మొదలైనవి.</p>
<p><strong>2. తరాల మధ్య సంఘర్షణలను చిత్రించిన కథలు</strong> :- భారతదేశంలో పుట్టి పెరిగి అమెరికాకు వెళ్లి స్థిరపడిన భారతీయ మహిళ తొలి తరానికి &#8211; అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలలో పుట్టి పెరిగిన రెండవ తరానికి అనేక విషయాలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకే కుటుంబంలో వుండే ఈ రెండు భిన్న తరాల మధ్య విద్య &#8211; సంస్కృతి &#8211; వివాహా తదితర విషయాలలో అనేక భేదాలు పొడ చూపుతున్నాయి. ఈ రెండు తరాల వ్యక్తుల మానసిక సంఘర్షణలను చిత్రిస్తూ అమెరికాంధ్ర కథా రచయిత్రులు కొన్ని కథలను వ్రాసారు. <strong>పూడిపెద్ది  శేషుశర్మ</strong>- &#8216;అభాసులు &#8211; అభాతలు&#8217;, &#8216;నిర్ణయం&#8217;, &#8216;పదహారేళ్ళ వయస్సు&#8217;, &#8216;సంఘర్షణ&#8217;, &#8216;దృక్పథం&#8217;, <strong>నోరి రాధిక</strong> &#8211; &#8216;విలువలు&#8217;, &#8216;కాగల కార్యం గంధర్వులే తీర్చారు&#8217;, &#8216;తికమక&#8217;, <strong>కామేశ్వరీదేవి</strong> &#8211; &#8216;తీర్పు&#8217;, <strong>మాలెంపాటి ఇందిరా ప్రియదర్శిని</strong> &#8211; &#8216;ఈ తరం కథ&#8217;  మొదలగు కథలు ఈ కోవకు చెందినవి.</p>
<p><strong>3.</strong> <strong>వివాహ సమస్యలను చిత్రించిన కథలు</strong><strong>:- </strong>అమెరికాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలలో వారి పిల్లల వివాహా సమస్య వారిని ఎంతగానో వేధిస్తుంది. అందులోనూ ఆడపిల్లల వివాహ విషయంలో ఈ సమస్య అనేది మరింత అధికంగా వుంది. అమెరికాంద్రుల వివాహ సమస్యను కేంద్రంగా చేసుకొని అమెరికాంధ్ర  రచయిత్రులు తమ తమ దృక్కోణాల్లో కథలను తీర్చిదిద్దారు. <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211;  &#8217;అన్వేషణ&#8217;, &#8216;పెళ్లి చేసుకుంటే చూడు&#8217;, <strong>సుధేష్ణ</strong> &#8211;  &#8217;మొగుడు కావాలా&#8217;, <strong>జొన్నాళ్ లలితా</strong>- &#8216;పి.పి.అమ్మ&#8217;, <strong>రాధిక నోరి</strong> &#8211; అబ్బాయి పెళ్లి , <strong>అరుణా గల్లా</strong> &#8211; &#8216;అమెరికా సిటిజన్&#8217;, <strong>నళిని అదితం</strong> &#8211; &#8216;హరిణి&#8217; ఈ కోవకు చెందిన కథలు.</p>
<p><strong>4.</strong> <strong>వృద్ధాప్య సమస్యలను చిత్రించిన కథలు</strong><strong>:- </strong>అమెరికాకు  తరలిపోయిన తొలితరం వారు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానమైనది వృద్ధాప్య ఒంటరితనం. అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథలలో అక్కడి ఒంటరి వృద్దాప్య హృదయాల లోతులను కూడా చక్కగా ఆవిష్కరించింది. <strong>పూడిపెద్ది  శేషుశర్మ</strong> &#8211; &#8216;చిరుదీపం&#8217;, &#8216;ముసురు చీకట్లో మెరుపుకిరణం&#8217;, &#8216;వానప్రస్థాశ్రమం&#8217;, <strong>కోమలాదేవి</strong> &#8211; &#8216;జవాబు లేని ప్రశ్న&#8217; కథలు ఈ కోవకు చెందినవి.</p>
<p><strong>5. </strong><strong>మధ్య వయస్సు ఒంటరితనానికి పరిష్కారం చూపిన కథలు</strong><strong>:- </strong>అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలలోని కొందరు వ్యక్తులను వేధిస్తున్న సమస్యల్లో మధ్య వయస్సు ఒంటరితనం ఒకటి.  మధ్య వయస్సు ఒంటరితనానికి పరిష్కారం చూపుతూ అమెరికాంధ్ర కథా రచయిత్రులు  కొన్ని కథలు వ్రాసారు. ఈ కథలలో చాలా కథలు ఈ సమస్యకు పరిష్కారంగా పునర్వివాహాన్ని సూచిస్తున్నాయి. <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211; &#8216;ఎండమావులు&#8217;, &#8216;కొత్తగా రెక్కలొచ్చనా&#8217;, &#8216;అనుబంధం&#8217;, <strong>నోరి రాధిక</strong> &#8211; &#8216;న్యాయం&#8217;, &#8216;అకాల వసంతం&#8217;, <strong>సుధేష్ణ</strong>  &#8211; &#8216;చైతన్యం&#8217;, <strong>సూర్యదేవర ప్రమీల</strong> &#8211; &#8216;తోడు &#8211; నీడ&#8217;, <strong>రెంటాల కల్పన</strong> &#8211; &#8216;అయిదో గోడ&#8217;  మొదలైనవి.</p>
<p><strong>6.</strong> <strong>విభిన్న సంస్కృతుల వివాహ సమస్యలను చిత్రించిన కథలు</strong><strong>:- </strong> వేర్వేరు దేశాలలో, వేర్వేరు సంస్కృతులలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం ద్వారా ఒకటయితే వారి మధ్య తలెత్తే సమస్యలను గూర్చి &#8211; ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన తీరును గూర్చి, కలిసి మెలిసి జీవించాల్సిన ఆవశ్యకతను గూర్చి కథా రచయిత్రులు కొన్ని కథలు వ్రాసారు. <strong>యార్లగడ్డ కిమీర</strong> &#8211; &#8216;వీడిన నీడలు&#8217;, <strong>సాయి లక్ష్మి</strong>  &#8211; &#8216;ఒయ్యారం&#8217;, <strong>రాణీ సంయుక్త</strong> &#8211; &#8216;వంచన&#8217;, <strong>కాళ్ళకూరి సాయిలక్ష్మీ</strong> &#8211; &#8216;ఇ అ&#8217; పెళ్ళి, <strong>కడప శైలజ</strong> &#8211; &#8216;మళ్ళీ పెళ్ళి&#8217;   ఈ కోవకు చెందిన కథలు.</p>
<p><strong>7.</strong> <strong>భార్యాభర్తల అనుబంధాలను చిత్రించిన కథలు</strong>:-  అమెరికాలాంటి  విదేశాలకు వెళ్ళినప్పుడు భార్య భర్తల బాధ్యతలు మరింత పెరుగుతాయి. దేశం కాని దేశంలో భార్య &#8211; భర్తల మధ్య వుండాల్సిన  ప్రేమానురాగాలను గూర్చి, బాధ్యతలు పంచుకోవాల్సిన తీరును గూర్చి, సర్ధుకుపోవాల్సిన ఆవశ్యకతను గూర్చి కొందరు అమెరికాంధ్ర రచయిత్రులు తమ కథలలో తెలియజేసారు.  <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211; &#8216;సర్ ప్రైజ్&#8217;, &#8216;అగాధం&#8217;, <strong>అయ్యగారి రమామణి</strong> &#8211; &#8216;కల నుండి ఇలకు&#8217;, <strong>పుచ్చా అన్నపూర్ణ</strong>  &#8211; &#8216;పెళ్ళి&#8217;, <strong>కనకదుర్గ</strong> &#8211;  &#8217;హెన్ పెక్డ్&#8217; మొదలైన కథలు ఈ కోవకు చెందిన కథలు.</p>
<p><strong>8.</strong> <strong>గృహహింసను చిత్రించిన కథలు</strong>:-  లక్షల కట్నాలు కుమ్మరించి సంపాదించుకున్న భర్తలు తమకు రక్షణ ఇవ్వకపోగా మానసికంగాను, శారీరకంగాను హింసలకు గురి చేస్తుంటే  పరాయి దేశంలో తమ బాధలను పంచుకొనేవారు లేక, స్వదేశంలోని తల్లిదండ్రులకు చెప్పుకోలేక మూగ బాధను అనుభవిస్తున్న గృహిణులను కేంద్రంగా చేసుకొని అమెరికాంధ్ర రచయిత్రులు కొన్ని కథలను సృజించారు. <strong>కొవ్వలి జ్యోతి</strong>  &#8211; &#8216;తరతరాల కథ&#8217;, <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211; &#8216;చీకటి వెలుగులు&#8217;, <strong>చెరుకూరి రమాదేవి</strong> &#8211; &#8216;శ్యామ&#8217;, <strong>పొన్నలూరి పార్వతి</strong> &#8211; &#8216;ఇది కథ కాదు&#8217; మొదలైనవి.</p>
<p><strong>9.</strong> <strong>సాంస్కృతిక విలువలను వెల్లడించిన కథలు</strong><strong>:- </strong>పరాయిగడ్డ పై సొంత సంస్కృతిని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ అమెరికాంధ్ర కథా రచయిత్రుల కలం నుండి కొన్ని కథలు జాలువారాయి. ఒకతరం నుండి మరొక తరానికి సంస్కృతిని అందించాల్సిన ఆవశ్యకతను గూర్చి ఈ కథలు నొక్కి చెబుతాయి. <strong>నిడదవోలు మాధవి</strong> &#8211; &#8216;ఉభయ భాషా ప్రవీణ&#8217;, <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211; &#8216;ఆశాకిరణం&#8217;, &#8216;ఉగాది పచ్చడి&#8217;, <strong>దేశభొట్ల ఉమ</strong> &#8211; &#8216;చేతులు కాలాక ఆకులు&#8217;, <strong>కొవ్వలి జ్యోతి</strong> &#8211; &#8216;గణేష్ బర్త్  డే&#8217;, <strong>గల్లా అరుణ</strong> &#8211; &#8216;తలక్రిందులైన సంస్కృతి&#8217;, <strong>చిమట కమల</strong> &#8211; &#8216;భాష కందని మనిషి&#8217;, <strong>ఆదిరాజు ప్రియ</strong> &#8211; &#8216;వినాయక వ్రత కల్పము&#8217; మొదలైనవి.</p>
<p><strong>10.</strong> <strong>అమెరికా విద్యా విధానం పట్ల అవగాహన కలిగించు కథలు</strong> :- పాఠ్య ప్రణాళికలలోను, బోధనలోను, పరీక్ష విధానంలోను భారతీయ విద్యా విధానానికి &#8211; అమెరికా విద్యా విధానానికి ఎంతో తేడా వుంది. అమెరికన్ విద్యా విధానంలోని విశేషాలను కథల రూపంలో అందించే ప్రయత్నం కొందరు కథా రచయిత్రులు చేశారు. <strong>యర్రమిల్లి దుర్గా </strong>- &#8216;జీవిత చక్రం&#8217;, <strong>రెంటాల కల్పన</strong> &#8211; &#8216;టింకూ ఇన్ టెక్సాస్&#8217;, <strong>నిడదవోలు మాలతి </strong>- &#8216;చివురు కొమ్మ చేవ&#8217;  మొదలైన కథలు ఈ కోవకు చెందిన కథలు.</p>
<p><strong>11.</strong> <strong>మాతృభూమి పట్ల మమకారాన్ని వెల్లడించే కథలు</strong> :-  &#8217;జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ&#8217; అనే సూక్తిని అమెరికాంధ్ర కథా రచయిత్రులు మరువలేదు. వ్యక్తులుగా వీరు అమెరికాలో వున్నప్పటికీ, వారి మనస్సు మాత్రం మాతృదేశంలోనే వుంటుంది. మాతృభూమిని ప్రేమించడంలోనూ, జాతీయ భావాలు కలిగి ఉండటంలోను స్వదేశంలోని భారతీయులకు ఏ మాత్రం తీసిపోరు. మాతృభూమి పట్ల తమకున్న అభిమానాన్ని అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథలలో వ్యక్తం చేశారు. <strong>మాచిరాజు సావిత్రి </strong>- &#8216;పాస్ పోర్ట్&#8217;, <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211; &#8216;లోభి&#8217;, <strong>కొమరవోలు సరోజ</strong> &#8211; &#8216;ఏ కథ వ్రాయాలి?&#8217;, <strong>విజయలక్ష్మీ రామకృష్ణన్</strong> &#8211; &#8216;మనసు &#8211; మనుగడ&#8217;, <strong>అనంతు శివ పార్వతి</strong> &#8211; &#8216;వేప చెట్టు&#8217;, <strong>సంగాసాని జయ</strong> &#8211; &#8216;వెనుదిరిగితే?&#8217; మొదలైనవి.</p>
<p><strong>12.</strong> <strong>వ్యక్తుల  వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చిత్రించిన కథలు</strong><strong> :- </strong>  భారతదేశం నుండి వలసపోయి అమెరికా లాంటి అత్యాధునిక సమాజంలో జీవిస్తున్నప్పటికీ, వ్యక్తులు తమకు స్వతహాగా అలవడిన గుణాలకు ఏ మాత్రం దూరం కాలేకపోతుంటారు.  తమ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకొని నిరాశ చెందటం, తాము చేయలేక పోయినా చేసిన వారిని నిందించడం, అసూయతో వ్యక్తుల ఎదుగుదలను అడ్డుకోవడం, పొరుగింటి పుల్లకూర తియ్యననే చందాన ఆలోచించడం మొదలైన అంశాలు ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలను తేటతెల్లం చేస్తాయి.   <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211; &#8216;కుక్కతోక&#8217;, &#8216;తృప్తి&#8217;, <strong>రాధిక నోరి</strong> &#8211; &#8216;అలవాటు&#8217;, &#8216;పండుగ&#8217;, &#8216;పొరుగింటి పుల్లకూర&#8217;, <strong>ఎస్. విజయ</strong> &#8211; &#8216;ఊరు మారినా&#8217; మొదలైన కథలు.</p>
<p><strong>13.</strong> <strong>మాతృ ప్రేమను చిత్రించిన కథలు</strong> :- అమెరికాకు వెళ్ళిన భారతీయ ఆడపడుచులు వారి కాన్పుల కోసం, తమ పిల్లలను జాగ్రత్తగా పెంచడం కోసం మాతృదేశంలోని తమ మాతృమూర్తులను  అమెరికాకు పిలిపించుకోవడమనేది సర్వ సాధారణ విషయం. కాన్పులు తదితర సమయాలలో సహాయంగా ఉండటానికి అమెరికాలోని భారతీయ భర్తలు తమ అత్త గారిని ఆహ్వానించడానికి చూపుతున్న ఆసక్తి, తమ తల్లులను  పిలిపించుకోవడానికి చూపడం లేదనే ఆవేదనను అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథల ద్వారా వ్యక్తం చేశారు. <strong>రాధిక శాస్త్రి</strong>  &#8211; &#8216;సోషల్ సెక్యూరిటీ &#8211; సీక్రెట్ కౌ&#8217;, <strong>కొమరవోలు సరోజ</strong> &#8211; &#8216;మాతృదేవోభవ&#8217;, <strong>ములుకుట్ల గునుపూడి అపర్ణ</strong> &#8211; &#8216;ఘర్షణ&#8217; మొదలైనవి ఈ కోవ చెందిన కథలు.</p>
<p><strong>14.</strong> <strong>స్వదేశంలోని బంధుప్రేమలను చిత్రించిన కథలు</strong><strong>:-</strong> స్వదేశంలోని రక్త సంబంధీకులు, బంధువులు అమెరికాలో ఉన్న తమను కేవలం వారి అవసరాలను తీర్చే కల్ప వృక్షాలుగా భావిస్తున్నారనే నిరసన కొందరు అమెరికాంధ్ర కథా రచయిత్రులు కథలలో కనిపిస్తుంది.  అమెరికాలో తామేదో డాలర్లలో మునిగి తేలుతున్నామని స్వదేశంలోని బంధువులు అనుకుంటారే తప్ప, తమకు కష్టనష్టాలు ఉంటాయని వారు ఏమాత్రం గ్రహించడంలేదనే ఆవేదన ఈ కథలలో వ్యక్తమవుతుంది. అట్లే కొందరు రచయిత్రులు స్వదేశంలోని రక్త సంబంధీకుల &#8211; బంధువుల స్వచ్ఛమైన ప్రేమలను కూడా తమ కథలలో చక్కగా వివరించారు. <strong>కొమరవోలు సరోజ</strong> &#8211; &#8216;ఉష్ణేణ ఉష్ణం శీతల&#8217;, <strong>నోరి రాధిక</strong> &#8211; &#8216;ఆట&#8217; మొదలైనవి.</p>
<p>పైన పేర్కొన్న అంశాల మీదనే గాక కట్నాలను గూర్చి, కులాన్ని గూర్చి, సాంస్కృతిక విభేదాలను గూర్చి, ఉద్యోగాలను కోల్పోయి స్వదేశానికి తిరిగొచ్చే వారిని గూర్చి&#8230;&#8230;&#8230;&#8230;&#8230;తదితర అంశాల నేపథ్యంలో కూడా అమెరికాంధ్ర  కథా రచయిత్రులు రచనలు చేశారు. అమెరికాలో గోంగూరను పెంచితే ఎంత ప్రమాదమో <strong>చెరుకూరి రమాదేవి</strong> &#8211; &#8216;గోవింద! గోవింద! గోంగూరా! గోహోవిందా&#8217;, అమెరికాలో డబ్బు సంపాదించుకొని స్వదేశానికి వచ్చి స్థిరపడాలనే కోరిక దాదాపు అక్కడికి వెళ్ళిన ప్రతి భారతీయునిలోనూ వుంటుంది. అట్టి అమెరికాంధ్రుల కోరికను కథా వస్తువుగా గ్రహించి <strong>స్రవంతి</strong> తీర్చిదిద్దిన కథ &#8216;లక్ష డాలర్లు&#8217;.  యువతీ యువకుల సాన్నిహిత్య  సంబంధాలు అనేవి అమెరికా &#8211; భారతదేశాలలో ఒకే రకంగా లేవని, అవి పరస్పర విరుద్ధమైన పోకడలతో ఉన్నాయని <strong>పూడిపెద్ది శేషుశర్మ</strong> &#8211; &#8216;తూర్పు పడమరలు&#8217; అనే కథ తెలియజేస్తుంది. తమవైన అనుబంధ, ఆప్యాయతలను తమవిగా చెప్పుకోలేక, తమదికాని దాని కోసం పరుగులు తీసే దురదృష్టవంతులు కొందరు ఉంటారని <strong>సూరంపూడి అనంత</strong> <strong>పద్మావతి</strong> &#8216;వెకేషన్&#8217; కథ తెలియజేస్తుంది.</p>
<p>పైన పేర్కొన్న అమెరికాంధ్ర కథా రచయిత్రులలో చాలా మంది అటు అమెరికా నేపథ్యంలోను &#8211; ఇటు భారతీయ నేపథ్యంలోను కథలు వ్రాస్తున్నారు.  కేవలం కొద్దిమంది అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథలను గూర్చి మాత్రమే ఈ వ్యాసంలో ప్రస్తావించబడినది. అలాగే కేవలం అమెరికా  సమాజ &#8211; కుటుంబ జీవన నేపథ్యంలో వ్రాయబడిన కథలను గూర్చి మాత్రమే ఈ వ్యాసంలో విశ్లేషించబడినది.   భారతీయ సమాజ &#8211; కుటుంబ నేపథ్యాలను ఇతివృత్తంగా చేసుకొని చక్కని కథలను వ్రాస్తున్న అమెరికాంధ్ర కథా రచయిత్రులు చాలా మందే వున్నారు. వ్యాస పరిధిని దృష్టిలో పెట్టుకొని వారిని గూర్చి ప్రస్తావించలేకపోతున్నాను. క్షంతవ్యుడిని.</p>
<p>అమెరికాంధ్ర కథాసాహిత్యంలో అమెరికాంధ్ర కథా రచయిత్రులు పోషించిన పాత్ర అగ్రగణ్యమైనదనే చెప్పాలి. 1975 ప్రాంతం నుండి అమెరికాంధ్ర కథా రచయిత్రులు కథలు వ్రాయడం ప్రారంభించారని అనుకుంటే నాటి నుండి నేటి దాక ఎంతో మంది అమెరికాంధ్ర కథా రచయిత్రులు తమ కథలతో అమెరికా తెలుగు కథా సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈనాడు అమెరికాంధ్ర కథా రచయిత్రులు చాలా ఎక్కువ మందే వున్నారు. వీరంతా మంచి ఉత్సాహంగా కథా సృజన చేస్తున్నారు. వీరు సంస్కృతుల మధ్య వారధులు కడుతున్నారనడం కంటే తరాల మధ్య వారధులు కడుతున్నారనడం సమంజసం.</p>
<p>అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులలో చాలా మంది అక్కడి తెలుగు వారి జీవనానికి సంబంధించిన కుటుంబిక ఇతివృత్తాలతోనే కథలు వ్రాసారే తప్ప, వర్తమాన సాంఘిక &#8211; రాజకీయ &#8211; ఆర్థిక విషయాలను స్పృశించినట్లు కనిపించడం లేదు. అంతేగాక నేడు కొత్తగా పుట్టుకొస్తున్న వివాహా వేదికలు, ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోల వంటి అంశాలపై కూడా అమెరికాంధ్ర కథా రచయిత్రులు దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ఎన్నారైల కట్నం వేధింపులను చిత్రిస్తూ వచ్చిన కథలు కూడా చాలా తక్కువనే చెప్పాలి.  అమెరికాంధ్ర తెలుగు కథా రచయిత్రులు కొంచెం కథా శిల్పంపై పట్టు సాధిస్తే మరెన్ని మన్నికైన కథా రత్నాలు వెలువడే అవకాశం వుంది.</p>
<p>అమెరికన్ ఇమిగ్రేషన్ నియమాలలో మార్పులు వచ్చాక, తెలుగువారు అమెరికాకు వెళ్ళడం ఆరంభమైంది. ఈ దశాబ్దాలలో వారి జీవితాలలో వచ్చిన మార్పులు అవగాహన చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు పూర్తిగా అందుబాటులో లేవు. వీటిని సంగ్రహించి, విశ్లేషించి ప్రకటించే పరిశోధకులు ఇంకా బయలుదేరలేదనే చెప్పాలి. ఈ కొరతను కొంత వరకు అమెరికా తెలుగు కథా సాహిత్యం తీర్చిందనుటలో ఎట్టి సందేహం లేదు.</p>
<p>తెలుగు సాహిత్యంలో అమెరికాంధ్ర కథా సాహిత్యమనేది ఓ పాయ. దళిత, స్త్రీ, మైనార్టీ ఉద్యమాలలో భాగంగా అమెరికాంధ్ర జీవితం గురించి అమెరికాలోనూ &#8211; స్వదేశంలోనూ సరైన చర్చ జరిగినప్పుడే వర్తమాన తెలుగు సాహిత్య స్వరూపం మరింత స్పష్టమవుతుంది. అమెరికాలోని తెలుగు సంఘాల వారు, సాహితీ సంస్థల వారు పూనుకొని అమెరికాంధ్ర తెలుగు రచయిత్రుల సాహితీ సదస్సును నిర్వహిస్తే బాగుంటుంది. ఈ రచయిత్రులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి, సమగ్రమైన చర్చ జరిపితే భవిష్యత్తులో వెలుగు చూడబోయే అమెరికాంధ్ర సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన వారౌతారు.  ఈ ప్రయత్నం రానున్న రోజుల్లో జరుగుతుందని ఆశిద్దాం. అమెరికాంధ్ర తెలుగు సాహిత్యం దిన దిన ప్రవర్ధమానమై  వెలుగొందాలని మనసారా కాంక్షిద్దాం.</p>
<p><strong>డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్</strong><br />
<strong>M.A,M.Phil, Ph.D.</strong></p>
<p>&nbsp;</p>
<p>(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5838</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
	</channel>
</rss>
