<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; పప్పు నాగరాజు</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%AA%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>మెటాకవితలు మూడు</title>
		<link>http://vaakili.com/patrika/?p=13329</link>
		<comments>http://vaakili.com/patrika/?p=13329#comments</comments>
		<pubDate>Wed, 01 Feb 2017 00:45:42 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=13329</guid>
		<description><![CDATA[కవిత్వం గురించీ, కవిత్వ తత్వం గురించీ, తమకి కవిత్వంతో ఉన్న సంబంధం గురించీ సుమారుగా ప్రతీ కవీ కవితాత్మకంగానే చెప్తాడు. స్పానిష్, హిబ్రూ, ఇంగ్లీషు భాషల్లోంచి అటువంటి మెటాకవితలు మూడు.<br /> <br />
హోర్హె లూయిస్ బోర్హెస్ ఆలోచనలూ, వ్యక్తీకరణా, అతని ఊహలూ, అతని ఇమోషన్లూ వీటన్నిటిలో అంతర్లీనంగా ఏదో దగ్గరితనం ఉంది – ఎంతగా అంటే, అతను ఇక్కడే నడయాడి, మనదైన దాన్నెంతో తనలో ఇంకించుకున్నాడేమో అనే అంతగా. <br /><br />
ఇస్రాయెల్ కి చెందిన ప్రసిద్ఢ కవయిత్రి Leah Goldberg. హీబ్రూలో ప్రథమ శ్రేణి కవయిత్రి. రెండో ప్రపంచ యుద్ధం, ఇస్రాయెల్ స్వాతంత్రం, యూదుల వలసలు, హోలోకాస్టు ఇవన్నీGoldberg వస్తువులు. <br /><br />
అమెరికాలో స్థిరపడి, అక్కడే చదువుకున్న TarfiaFaizullah బంగ్లాదేశ్ కి చెందిన కవయిత్రి. ఆమె తన కవిత్వంలో బంగ్లా స్త్రీల సమస్యలను, 1971 యుద్ధంలో బంగ్లా స్త్రీలపై పాకిస్తాన్ సైనికుల అత్యాచారాల చరిత్రను చిత్రించారు.]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">క</span>విత్వం గురించీ, కవిత్వ తత్వం గురించీ, తమకి కవిత్వంతో ఉన్న సంబంధం గురించీ సుమారుగా ప్రతీ కవీ కవితాత్మకంగానే చెప్తాడు. స్పానిష్, హిబ్రూ, ఇంగ్లీషు భాషల్లోంచి అటువంటి మెటాకవితలు మూడు.</p>
</div>
<div style="width: 50%; float: left; padding-left: 1em; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">కవిత్వారాధన</span></p>
<p><span style="font-size: 30px;">పా</span>రే నీటిలో, కరిగే క్షణాలతో<br />
ఉరికే నదిని వీక్షిస్తూ<br />
కాలమొక నదేనని గుర్తిస్తూ<br />
నదిలానే మనమూ పక్కదార్లు పడతామనీ<br />
నీటిలానే మన మోములూ మాయమయేననీ!</p>
<p>మెలకువ కూడా మరొక కలేననీ<br />
ఇది కల కాకూడదనే స్వప్నమైనా<br />
మరణం తప్పదంటూ నాడులన్నీ ఇంకిన భయమైనా<br />
ప్రతిరాత్రి మరణించే ఒక కలే కదా!</p>
<p>ప్రతీ రోజూ ప్రతీ వత్సరమూ<br />
మనిషిగా గతించిపోయిన కాలమంతటికీ ప్రతీకగా<br />
అతన్ని ఆక్రమించుకునే వయసుని<br />
సంగీతంగా, శబ్దంగా, సంకేతంగా మారుస్తూ</p>
<p>మరణంలోనూ ఒక కలనీ<br />
సాయం సంధ్యలో మెరిసే విషాదాన్నీ<br />
దర్శించేదే కవిత్వం<br />
వినయమై, అమృతమయమై<br />
కవిత్వం</p>
<p>ఉదయాస్తమయాలుగా పునరావృతమవుతూ<br />
ఒక్కోపరి ఏ సాయంత్రపు వేళలోనో మూర్తిమంతమై<br />
అకాశపు అద్దపులోతుల్లోంచి మనకేసి పరికించి చూస్తుందే<br />
ఆ అద్దమే కవిత్వం</p>
<p>తనకి దాసుడై,<br />
తొలిప్రేమలోతుల్లో విలపిస్తూ<br />
మాయలన్నీ వదులుకున్న యులిసిస్<br />
మోము మనకి చూపించిన ఇతికా వంటిదే<br />
కవిత్వం</p>
<p>మైమరపించే జీవనది<br />
అంతులేని ప్రవాహమది<br />
తన కదలికని తనే ప్రతిబింబిస్తూ<br />
కుదురులేని హిరాక్లిటస్ తనకు తానై<br />
వేరైనట్టుగా, కదిలే నదిలా<br />
కవిత్వం</p>
<p>Art of Poetry, by Jorge Luis Borges<br />
English Translation: Anthony Kerrigan<br />
Telugu Translation: Nagaraju Pappu</p>
</div>
<div style="width: 40%; float: left; padding: 70px 8px;"><img class="aligncenter size-full wp-image-13376" title="220px-Jorge_Luis_Borges_1951,_by_Grete_Stern" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/02/220px-Jorge_Luis_Borges_1951_by_Grete_Stern.jpg" alt="" width="220" height="289" /><br />
హోర్హె లూయిస్ బోర్హెస్ కవిత్వం చదివిన ప్రతిసారీ, అతని ప్రతి కవితలోనూ ఏదో తెలుగుతనం ఉన్నట్టు తోస్తుంది నాకెందుకో.<br />
అతని ఆలోచనలూ, వ్యక్తీకరణా, అతని ఊహలూ, అతని ఇమోషన్లూ వీటన్నిటిలో అంతర్లీనంగా ఏదో దగ్గరితనం ఉంది &#8211; ఎంతగా అంటే, అతను ఇక్కడే నడయాడి, మనదైన దేన్నో తనలో ఇంకించుకున్నాడేమో అనే అంతగా.</div>
<div style="clear: both;"></div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=13329</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రోషిత భర్తృక</title>
		<link>http://vaakili.com/patrika/?p=13289</link>
		<comments>http://vaakili.com/patrika/?p=13289#comments</comments>
		<pubDate>Wed, 01 Feb 2017 00:36:58 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[క్రీనీడ]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>
		<category><![CDATA[భైరవభట్ల విజయాదిత్య]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=13289</guid>
		<description><![CDATA[పరదేశంబున కేగు భర్తృకరమున్ బట్టన్ ప్రయత్నంబుతో<br />
పరుగుల్వెట్టుచు పొంగెనుప్పెనగ హృద్వారాశి, తా జ్ఞాపకా<br />
ల రుచుల్ దాచుకొనన్ ప్రయాస, మదిలో రాగంబు దోగాడగన్<br />
తరమా! ప్రోషితభర్తృకావిరహ మోదార్పన్ నిశారంభమున్!]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: center;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/01/7816099482_4204106b44_b.jpg"><img class="aligncenter  wp-image-13295" title="7816099482_4204106b44_b" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/01/7816099482_4204106b44_b.jpg" alt="" width="614" height="439" /></a></p>
<div style="padding-left: 5em; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ప</span>రదేశంబున కేగు భర్తృకరమున్ బట్టన్ ప్రయత్నంబుతో<br />
పరుగుల్వెట్టుచు పొంగెనుప్పెనగ హృద్వారాశి, తా జ్ఞాపకా<br />
ల రుచుల్ దాచుకొనన్ ప్రయాస, మదిలో రాగంబు దోగాడగన్<br />
తరమా! ప్రోషితభర్తృకావిరహ మోదార్పన్ నిశారంభమున్!</p>
<p>______________</p>
<p>As her beloved leaves<br />
for distant lands<br />
unable to let him go,<br />
her turbulent heart extends to him</p>
<p>Uncontrollable longing erupts<br />
in a futile attempt to reign in<br />
the moisted memories<br />
of melancholy and separation</p>
<p>As the abyss of the night<br />
crashes onto her<br />
impossible it is to pacify<br />
the plight of the lover<br />
left behind</p>
<p>_______________</p>
</div>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p>Translator’s note:</p>
<p>భర్త పరదేశంలో ఉన్న స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. అష్టవిధ నాయికల్లో ఈమె కూడా ఒకతె.</p>
<p>చిక్కటి చమత్కారం ఉన్న పద్యం ఇది. ఫొటోని చూసి రాసిన పద్యం కాబట్టి, పద్యం అర్థం కావాలంటే ఫొటోకూడా చూడాలి. ప్రోషిత భర్తృకని సముద్రంతో పోల్చినట్టూ, లేదా నిశారంభ సమయంలో సముద్రాన్నే ప్రోషిత భర్తృకతో పోల్చినట్టూ &#8211; ఇలా రెండు సమన్వయాలూ చెప్పుకోవచ్చు.</p>
<p>పద్యంలో ఒక్క హృద్వారాశి అన్న పదం తప్పితే, సముద్రం గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. పరదేశంబుతో ప్రారంభమై, నిశారంభముతో ముగియడం చక్కటి ప్రయోగం. నిశారంభం అనే పదంలోనే ఇందులోని కవిత్వం అంతా ఉంది.</p>
<p>అనువాదంలో కూడా, సముద్రాన్ని సూచించే ఇమేజిరీనే వాడాం తప్పించి, సముద్రంతో పోలికనీ, సముద్రం అనే పదాన్ని గానీ ఎక్కడా చెప్పలేదు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>Picture Credit: http://www.jakemoorephotography.co.uk/bournemouth_poole_water_sports.html</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=13289</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>మలిన బాష్ప మౌక్తికమ్ము!</title>
		<link>http://vaakili.com/patrika/?p=12646</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12646#comments</comments>
		<pubDate>Sat, 05 Nov 2016 16:03:25 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[గెస్ట్ ఎడిటోరియల్]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12646</guid>
		<description><![CDATA[<p>“నేను కవిత్వాన్ని ఎందుకు ద్వేషిస్తాను” అంటూ పొడుగాటి వ్యాసం ఒకటి రాసాడు బెన్ లెర్నర్. బెన్ స్వయంగా కవి, ఆయన ప్రచురించిన కవిత్వ సంకలనాలకి ఎవార్డులు కూడా వచ్చాయి, కవిత్వాన్ని, కవిత్వ ధోరణులని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన విమర్శకుడు ఆయన. మరి అలాంటి ఒక కవే కవిత్వాన్ని ద్వేషించడం ఏమిటి? దీనికి సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన కారణాలు చెప్పుకొస్తాడు బెన్.</p> <p>ఆయన అభిప్రాయంలో, కవిత్వం రానివారంటూ ఎవరూ లేకపోవడమే కవిత్వంతో మొదటి ఇబ్బంది. ఎవరితోనైనా “నేను కవిత్వం రాస్తా” అని చెప్పారనుకోండి, లేదా ఏదో కవితని ప్రస్తావించారనుకోండి. సాధారణంగా, అవతల వ్యక్తి కూడా, “ఓ, నేను కూడా ఒకప్పుడు కవితలు రాసానండోయ్&#8221; అనో, లేదా &#8220;మా అక్క కూతురు కూడా మంచి కవితలు రాస్తుంది, మీలానే” అనో ఇలాంటి సమాధానాలేవో చెప్తారు. అదే, మీరు ‘నేనో ఇంజినీర్ని, డాక్టర్ని&#8221;, లేదా పోనీ, &#8220;నేను నవలలు రాస్తా”నని చెప్పారనుకోండి &#8211; అప్పుడు మాత్రం ఇటువంటి “నేను సైతం..” అనే సమాధానాలు రావు. ఎందుకో, అందరికీ కవిత్వం అంటే సొంత జాగీరు. అది రానివాడు ఏవడూ ఈ భూప్రపంచంలో లేడు. అలాగే, కవిత్వం అర్థం కావడం ఏ ప్రయత్నమూ, ఏ అధ్యయనమూ లేకుండా పట్టుపడాలనుకుంటారు చాలామంది. కవిత్వానికీ ఒక చరిత్ర ఉంది, ఒక భాష ఉంది, దానిలోనూ ఎన్నో ప్రయోగాలు, మార్పులు ఉన్నాయి, దానిలోనూ ఏదో సాంకేతికత ఉంది &#8211; అది కాస్త ప్రయత్నం చేస్తేగానీ వశంకాదు, అని అనుకోరు. అందుకని, మనకి అర్థంకాని కవిత్వం అంతా అర్థంలేనిదే!</p> <p>ఇకపోతే, చాలా మంది కవులకి కవిత్వం అంటే అందమైన, భావుకమైన, ఉద్వేగమైన వచనం. వెన్నెల పుష్పాలనీ, వెలుగుపూలనీ, అందమైన సాయంత్రాలలో, శ్రావణమేఘాలుతో కురిపించని కవి ఎవడున్నాడు? కవిత్వం అంటే సున్నితంగానో, మధురంగానో, అందంగానో, మరోవిధంగానో “వాపోవడమే”! అది ప్రేయసికోసం కావొచ్చు, ప్రభువుకోసం కావొచ్చు, దేవుడికోసమో, కౌగిలికోసమో, కార్మికుల కష్టాలకోసమో కావచ్చు. వస్తువు ఏదైనా గానీ, “విరహమో మరి [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">“నే</span>ను కవిత్వాన్ని ఎందుకు ద్వేషిస్తాను” అంటూ పొడుగాటి వ్యాసం ఒకటి రాసాడు బెన్ లెర్నర్. బెన్ స్వయంగా కవి, ఆయన ప్రచురించిన కవిత్వ సంకలనాలకి ఎవార్డులు కూడా వచ్చాయి, కవిత్వాన్ని, కవిత్వ ధోరణులని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన విమర్శకుడు ఆయన. మరి అలాంటి ఒక కవే కవిత్వాన్ని ద్వేషించడం ఏమిటి? దీనికి సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన కారణాలు చెప్పుకొస్తాడు బెన్.</p>
<p>ఆయన అభిప్రాయంలో, కవిత్వం రానివారంటూ ఎవరూ లేకపోవడమే కవిత్వంతో మొదటి ఇబ్బంది. ఎవరితోనైనా “నేను కవిత్వం రాస్తా” అని చెప్పారనుకోండి, లేదా ఏదో కవితని ప్రస్తావించారనుకోండి. సాధారణంగా, అవతల వ్యక్తి కూడా, “ఓ, నేను కూడా ఒకప్పుడు కవితలు రాసానండోయ్&#8221; అనో, లేదా &#8220;మా అక్క కూతురు కూడా మంచి కవితలు రాస్తుంది, మీలానే” అనో ఇలాంటి సమాధానాలేవో చెప్తారు. అదే, మీరు ‘నేనో ఇంజినీర్ని, డాక్టర్ని&#8221;, లేదా పోనీ, &#8220;నేను నవలలు రాస్తా”నని చెప్పారనుకోండి &#8211; అప్పుడు మాత్రం ఇటువంటి “నేను సైతం..” అనే సమాధానాలు రావు. ఎందుకో, అందరికీ కవిత్వం అంటే సొంత జాగీరు. అది రానివాడు ఏవడూ ఈ భూప్రపంచంలో లేడు. అలాగే, కవిత్వం అర్థం కావడం ఏ ప్రయత్నమూ, ఏ అధ్యయనమూ లేకుండా పట్టుపడాలనుకుంటారు చాలామంది. కవిత్వానికీ ఒక చరిత్ర ఉంది, ఒక భాష ఉంది, దానిలోనూ ఎన్నో ప్రయోగాలు, మార్పులు ఉన్నాయి, దానిలోనూ ఏదో సాంకేతికత ఉంది &#8211; అది కాస్త ప్రయత్నం చేస్తేగానీ వశంకాదు, అని అనుకోరు. అందుకని, మనకి అర్థంకాని కవిత్వం అంతా అర్థంలేనిదే!</p>
<p>ఇకపోతే, చాలా మంది కవులకి కవిత్వం అంటే అందమైన, భావుకమైన, ఉద్వేగమైన వచనం. వెన్నెల పుష్పాలనీ, వెలుగుపూలనీ, అందమైన సాయంత్రాలలో, శ్రావణమేఘాలుతో కురిపించని కవి ఎవడున్నాడు? కవిత్వం అంటే సున్నితంగానో, మధురంగానో, అందంగానో, మరోవిధంగానో “వాపోవడమే”! అది ప్రేయసికోసం కావొచ్చు, ప్రభువుకోసం కావొచ్చు, దేవుడికోసమో, కౌగిలికోసమో, కార్మికుల కష్టాలకోసమో కావచ్చు. వస్తువు ఏదైనా గానీ, “విరహమో మరి కాస్త వేదనో” కవిత్వ ఘోష.</p>
<p>చాలా కవితలు ఇక్కడే ప్రారంభం అవుతాయి, చాలా మంది కవులూ ఇక్కడే ఆగిపోతారు. “any lyrical expression is poetry” అనుకోవడంతో చాలా చెత్త కవిత్వంగా చలమణీ అయిపోతోంది అంటాడు బెన్. ఇది కవిత్వంతో మొదటి ఇబ్బంది.</p>
<p>అందుకే, “కాలేజీ రోజుల్లో అందరూ కవిత్వం రాస్తారు. తెలివైనవాళ్ళైతే పెద్దయ్యాక ఆపేస్తారు, అంతే తేడా” అంటాడు అంబర్టో ఇకో.</p>
<p>ఈ గీత దాటిన కవులు అసలైన కవులు. “<em>You’re moved to write a poem because of some transcendent impulse to get beyond the human, the historical, the finite. But as soon as you move from that impulse to the actual poem, the song of the infinite is compromised by the finitude of its terms. So the poem is always a record of failure</em>” అంటాడు అలాన్ గ్రాస్మాన్. అందుకే, ప్రెంచ్ కవి ఆర్థర్ రింబాడ్ అతి చిన్న వయసులోనే కవిత్వం రాయడం ఆపేసాడట. ఈ భాధనే శ్రీశ్రీ కవిత్వమొక తీరని దాహం అంటాడు.</p>
<p>రాబర్ట్ బ్రౌనింగ్‌ని ఎలిజబెత్ బారెట్ ఓ సారి మీ కవితలకి అర్థం ఏమిటీ అని నిలదీసిందట, కాస్సేపటికి విసిగిపోయిన బ్రౌనింగ్ &#8211; “<em>At the time of writing, I and God know, after I finish, only God knows</em>” అని చమత్కరించాడు. ఇదీ కవిత్వంతో అసలు గొడవ.</p>
<p>కృష్ణశాస్త్రి కవిత్వంలో ఈ రెండు ధోరణలూ స్పష్టంగా కనిపిస్తాయి. కృష్ణశాస్త్రి భావకవిత్వానికి ఒక కొత్త భాషని తయారు చేసాడు &#8211; అందులో వేదనని మధురంగా వ్యక్తీకరించవచ్చు. తీయతేనియ బరువులు, మరిగే వెన్నెలలూ, సౌఖ్యజ్వాలలు ఈ కవిత్వ భాషలో ఉంటాయి. ఓ రకంగా, కృష్ణశాస్త్రి కవిత చెప్పడానికి కొన్ని సులువైన మార్గాలు తయారు చేసాడు. కానీ, ఆయన అక్కడితో ఆగిపోలేదు, ”విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన ఇక వీధి వాకిలేది చెల్లెలా” అని రాధ చేత దమాయించి అడిగించాడు. గొప్ప కవులందరి కవిత్వం లానే, కృష్ణశాస్త్రి కవిత్వాన్ని కూడా అర్థం చేసుకుని అస్వాదించడానికి కొంత వ్యాఖ్యానం అవసరం.</p>
<p style="text-align: center;">***</p>
<p><img class="alignleft  wp-image-12654" title="OLYMPUS DIGITAL CAMERA" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/RamaSuri_Vaakili.jpg" alt="" width="371" height="233" />రామసూరిగారి పరిచయం కాక పూర్వం, కృష్టశాస్త్రి కవిత్వం నాకు “pain poetry” లానే అనిపించేది. ఆయన రాసిన ప్రతి పాటా, ప్రతి కవితా కట్టిపడేసినా, అందులో కవిత్వం అంతా ఒక సున్నితమైన వేదనగానే అనిపించేది.</p>
<p>రామసూరిగారి పరిచయం నాకు కవిత్వాన్ని ఆస్వాదించడం అంటగట్టింది. విజయనగరంలో డిగ్రీ చదివే రోజుల్లో, ప్రతి సాయంత్రం ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకి పద్యాన్ని పైకి చదవడం, పద్యం చదివి అందులో కవిత్వానికి దీపంపట్టి చూపించడం వచ్చు. శ్రీశీలో సింబలిస్టుని, టాగూర్లో ఒక లిరిసిస్టునీ, పట్టాభిలో సైటైరిస్టునీ మాస్టారే చూపించారు. కవిత్వం అంటే, కరుణగానీ, వేదనగానీ, అందమైన వచనంగానీ కాదనీ, అదంతా కవిత్వానికి సరంజామా అయితే కావొచ్చుగానీ, అసలు కవిత్వమంటే సౌందర్యానుభూతి అని ఆయన చెప్తూ ఉండేవారు. ప్రపంచం ఆంతా అర్థం కానక్కరర్లేదు, అందమంతా అనుభవంలోకి రానక్కరలేదు అంటుండేవారు.</p>
<p>మాస్టారు పిహెచ్. డి చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా ముళ్లపూడి వెంకట రమణ సాహిత్యం మీద చేద్దాం అనుకున్నారు. ఆయన శిష్యులమూ, మిత్రులమూ కొంతమందిమి, “మీరు కృష్ణశాస్త్రి సౌందర్యతత్వం మీద చేస్తేకానీ వీల్లేదు” అని పట్టుబట్టాం. ఎందుకంటే, రామాసూరిగారు మంచి కవి, కవిత్వాన్ని ఆయన ఎంతో ఇష్టంగా అధ్యయనం చేసారు, పైగా ఆయన కృష్ణశాస్త్రిగారి దగ్గర కొన్నాళ్లు పనిచేసారు. దేవులపల్లే ఆయన్ని విజయనగరం కాలేజీలో ఉద్యోగానికి పురమాయించారట కూడా. ఆ విధంగా ఆయనకి కృష్ణశాస్త్రి జీవితం గురించీ, కవిత్వంగురించీ చాలా లోలైత అవగాహన ఉంది.</p>
<p>ఇదంతా ఒక ఎత్తైతే, ఆరోజుల్లో తెలుగు సాహిత్యం “సామాజిక స్పృహ”తో చెమటలుపట్టి ఉంది. అప్పట్లోనే ఈయన, “<em>the purpose of poetry is to create an aesthetic experience &#8211; its subject can be as wide and diverse as the world, its expression as deep and subtle as the human heart, but its function nonetheless is only one</em>” అనేవాడు.</p>
<p>కృష్ణశాస్త్రి సౌందర్యతత్వం అనే పరిశోధనా వ్యాసంలో ఈ విషయాన్ని రామసూరి అలవోకగా వ్యాఖ్యానించాడు. ఆయన థీసెస్ కేవలం శాస్త్రిగారి కవిత్వం మీద సమగ్రమైన, సాధికారమైన వ్యాఖ్యానం మాత్రమే కాదు, శాస్త్రిగారి కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, దాని అవసరం మనకెందుకో చెప్పిన కదళీపాకం.</p>
<p>రామసూరి తన పరిశోధనా వ్యాసంలో ఐదు ధారలని ఒడుపుగా అల్లుకుంటూ పోయారు. శాస్త్రిగారి కవిత్వ జీవితం &#8211; ఆయన్ని ప్రభావితం చేసిన వ్యక్తులూ, ఆయన కవిత్వం వెనకాల ఉన్న ప్రేరణలు, ముఖ్యంగా శాస్త్రిగారిపై అప్పటి రొమాంటిక్ కవులు, సూఫీకవుల ప్రభావం మొదలైనవి మొదటిది. రెండోది &#8211; తెలుగులో భావకవితా విప్లవం వెనక ఉన్న చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, మూడోది &#8211; శాస్త్రిగారి కవిత్వ శైలి, కవిత్వ వ్యాకరణం, నాలుగోది &#8211; శాస్త్రిగారి కవిత్వం మొత్తం &#8211; తొలినాటి పద్యాలు మొదలుకొని, సినిమాపాటల వరకూ ఉన్న ఆయన కవిత్వాన్నంతా ఒక విస్తృతమైన చట్రంలోకి తేవడం, ఐదోది &#8211; శాస్త్రిగారి కవిత్వంలోని సౌందర్య ప్రస్థానం. అక్కడ ఆగిపోకుండా, సుమారుగా ప్రపంచంలోని కవిత్వ ధోరణులన్నీ ఈ వ్యాసాలలో పరిచయం చేసారు రామసూరి. ఇదంతా సామాన్య పాఠకుడుకి అర్థమయ్యే రీతిలో సునాయాసంగా చెప్పడం ఉపాధ్యాయ వృత్తితో వచ్చిన ప్రతిభ.</p>
<p>ఇందులో కొన్ని ముఖ్యమైన భాగాలు గత కొన్ని నెలలుగా వాకిలిలో వచ్చాయి. త్వరలో, ఈ పరిశోధనావ్యాసం ఒక పుస్తకంగా కూడా వస్తుందని అశ.</p>
<p style="text-align: center;">***</p>
<p>ఇంతకీ, సౌందర్యం అంటే ఏమిటి? నాకు అర్థమయినంతలో అది బాహ్యమైన, అంతర్ముఖమైన “అందం” కాదు. అందం యొక్క అభివ్యక్తీ కాదు. అనాది అయిన, అనాదమైన మానవత్వాన్ని మనకి అనుభవంలోకి తెచ్చే ప్రతి క్షణమూ సౌందర్యమే.</p>
<p>వచనంతో, వ్యాఖ్యానంతో కన్నా, మన సాహిత్యంలో సౌందర్యానుభూతిని నిర్వచించే మూడు పద్యాలని ఉదాహరణగా తీసుకొని చెప్తాను.</p>
<blockquote><p>సా తత్వతః సమంతా<br />
త్సత్యస్య విభోసత్తా తపఃశక్తీ<br />
లీలా మహిళా వపుషా<br />
హైమవతీ తనుషు కుండలినీ</p></blockquote>
<p>ఇందులో కవి &#8211; స్థాణువుగా, సంకల్పంగా మాత్రమే ఉన్న విభుని (శివుడు) చుట్టూ ఆవరించుకుని ఉన్న ఆయన తపఃశక్తినే ఉమగా వర్ణిస్తున్నాడు. వారిద్దరి మధ్య జరిగే “క్రీడే” మనం ఎన్నో విధాల దర్శిస్తాం అంటాడు. ఇందులో విభుడు, మహిళా అనేవి సింబల్స్. అంతర్ముఖమై, అతి శక్తివంతమై, జడంగా స్ఠాణువుగా ఉన్న వస్తువు ఒకటి, దాని అంతర్మధనంలోంచి ఉద్భవించిన చాలిత శక్తి మరొకటి. ఈ రెండిటి మధ్యా రాపిడి, కలయిక సృష్టిలో అన్నిచోట్లా ఉన్నాయంటాడు కవి &#8211; ఆకాశంలోనూ, మానవ దేహంలోనూ, కవిత్వంలోనూ ప్రధానమైన క్రీడ ఇదే అంటాడు. ఇది తత్వశాస్త్ర పరిభాషలో సౌందర్య క్షణం.</p>
<p>సౌందర్యలహరిలో, శంకరుడు మరికాస్త ముందుకి పోయి, కవిని, కవి అనుభూతిని, గానం పుట్టుకనీ, గేయం విస్తృతినీ ఒకే శ్లోకంలో ఇలా చెప్తాడు.</p>
<blockquote><p>కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం<br />
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ .<br />
విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ<br />
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీ</p></blockquote>
<p>శంకరుడు మాత్రమే ఊహించగలిగిన చిత్రం ఇది. ముందుగా, ఒక నిశ్శబ్దమైన, నిశ్చలమైన తామరకొలను ఒకదాన్ని ఊహించండి. అందులో ఎన్నో తామరలు ఉదయ కాంతికి అప్పుడప్పుడే కాస్త సిగ్గుగా, భక్తిగా తలలెత్తి విచ్చుకుంటున్నాయి. ఉదయారుణకిరణాల స్పర్శలోని మాధుర్యంతో అవి తడిసిపోతున్నాయి. అవి పరమేశ్వరిని కొలిచే కవి హృదయాలు, ఆ హృదయం భజిస్తున్నది ఆమెనే (ఆమె అరుణిమనే, ఆమె కారుణ్యాన్నే). ఆ భజనే, సరస్వతి శృంగార హేలగా, వాటి చుట్టూ ఉన్న సరస్సనే కావ్య ధారలుగా ప్రవహిస్తూ రసజ్ఞులని రంజింపచేస్తోంది.</p>
<p>చాలా గొప్ప భావన ఇది. కవి పడే మధనని, కవిత్వం పుట్టే క్షణంలో ఉన్మత్తమైనపోయిన కవి మనస్సునీ, అక్కడనుండీ ఉప్పొంగే ఒక భావన భాషగా మారడంలోని శృంగారాన్నీ &#8211; ఇవన్నీ ఒక్క పద్యంలోనే చెప్పగలగడం ఒక్క శంకరుడికే సరి. ఇంతటితో ఆగలేదు అయన &#8211; సరస్సులోంచి తామరలు పుట్టడంలేదు, తామరలకి ఉదయకాంతితో నడుస్తున్న శృంగారంలోంచే సరస్సు ప్రవహిస్తోంది అనే ఊహకి కవిత్వానికి మించిన తాత్విక దృష్టికావాలి. ఈ భావననే, ఎన్నో శ్లోకాలలో సౌందర్యలహరిగా గానం చేసాడు శంకరుడు.</p>
<p><em>The function of poetry is the invocation of the Muse; its use is the experience of mixed exaltation and horror that her presence excites</em> అన్న రాబర్ట్ గ్రేవ్స్, ఈ పద్యం చదివుంటే ఆనందతాండవం చేసేవాడేమో! అందుకే, కృష్ణశాస్త్రి “ ఒక మంగళానిలము కొనితెచ్చి అందిచ్చిపోయే అజరామరము నీ వాణి, నా గీతి అప్పుడే నగలన్నీ విడనాడి శిరము వంచెను ధూళివరకు నీ పదమాని”, “ ఏమేను లేని నీ వీ దృగాళి నెట్టు లిమిడినావు” అంటాడు.</p>
<blockquote><p>“ఎలదేటినోయి స్వామీ, నేను సెలయేటి<br />
అలలలో కదలేటి కలువ పూపడవలో<br />
ఊయల నీ లీల నూగేను తూగేను<br />
నీ యోలగము వేళనే యింత మరపేల?<br />
తరపి తేనియసోన తొరిపి మంచుజలాన<br />
కురిపించి రెవరు క్రొవ్విరిగుండె లోలోన<br />
తగిలించి వలపు పుప్పొడి బూది నా మేన<br />
బిగియించిరెవరు మోదుగుపూవు చాపాన?”</p></blockquote>
<p>అన్న కృష్టశాస్త్రి తుమ్మెదపాట పై రెండు శ్లోకాల మధ్యా ఊయలలూగే భావుకమైన సౌందర్యక్షణం. ఇటువంటి క్షణాలలోనే, “ఎటుల సాగునో బ్రతుకు ఈ పాటయె లేకుంటే కడలి చేరువరకు” అనిపిస్తుంది.</p>
<p style="text-align: center;">***</p>
<blockquote><p>మలిన బాష్ప మౌక్తికమ్ము<br />
మిల మిల నీ కనుల నిలువ<br />
తళ తళ మని తారలు నటయించునురా పాపీ</p>
<p>భరియింపగరాని లజ్జ<br />
శిరము వంగి క్రుంగినంత<br />
తెరల దాటి చందమామ నవ్వునురా పాపీ</p></blockquote>
<p>ఇంతకాన్నా గొప్పగా, ఏ కాలంలోనూ, ఏ భాషలోనూ, ఏ కవీ “aesthetic encounter” ని నిర్వచించలేదు.</p>
<p>ఇంతగొప్ప కవిత్వాన్ని ఇచ్చినందుకు కృష్ణశాస్త్రికీ, దాన్ని నేర్పినందుకు రామసూరిగారికీ ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? ఎన్ని మలినబాష్ప మౌక్తికమాలలు కట్టినా, అవి కవి ఋణాన్ని, గురు ఋణాన్ని తీర్చగలవా?</p>
<p style="text-align: center;">***</p>
<p>సంస్కృత శ్లోకాలకి తాత్పర్యం:</p>
<blockquote><p>సా తత్వతః సమంతా<br />
త్సత్యస్య విభోసత్తా తపఃశక్తీ<br />
లీలా మహిళా వపుషా<br />
హైమవతీ తనుషు కుండలినీ (ఉమా సహస్రం, 1.3)</p></blockquote>
<p>సా తత్వతః సత్యస్య విభోః సమంతాత్ తతా తపశ్శక్తిః లీలా మహిళా వపుషా హైమవతీ తనుషు కుండలినీ</p>
<p>ఆమె యథార్థముగా, విభుడను స్వద్వస్తువున కంతటా వ్యాపించియున్న తపఃశక్తి, ఆమెయే లీలామాత్రమైన స్త్రీ రూపముతో హైమవతిగానూ, శరీరధారులందు కుండలనీ రూపములోనూ ఉంది.</p>
<blockquote><p>కవీంద్రాణాం చేతః కమలవనబాలాతపరుచిం<br />
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ .<br />
విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ<br />
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాంరంజనమమీ (సౌందర్యలహరి, 16)</p></blockquote>
<p>హే భగవతీ = తల్లీ, కవీంద్రాణాం = కవులయొక్క, చేతః = చిత్తమనే, కమలవన = తామరతోటకు, బాలాతప = లేయెండయొక్క, రుచిం = కాంతివంటిదైన, అరుణామేవ = అరుణ యను పేరుగల, భవతీం = నిన్ను, కత్ చిత్ = కొందరగు, యే సన్త = ఏ సజ్జనులు, భజన్తీ = సేవించెదరో, తే = ఆ, అమీ = వీరు, విరించి = బ్రహ్మయొక్క, ప్రేయస్యాః = ప్రేయసి అగు సరస్వతి యొక్క, తరుణతర = ఉద్రిక్తమైన, శృంగారలహరీ =శృంగారరస ప్రవాహమనే, గభీరాభిః = అగాధమైన, వాగ్భి = వాక్కులచేత, సతాం = సజ్జనులయొక, రంజనం = అహ్లాదమును, విధధతి = చేయుదురు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p><span style="color: #993366; font-size: 13px;"><br />
<strong>Editors&#8217; note:</strong><em><br />
నవంబర్ ఒకటిన ప్రముఖ తెలుగు కవి కృష్ణశాస్త్రి జయంతి సందర్భంగా ఈ నెల వాకిలి సంచికను కృష్ణశాస్త్రి ప్రత్యేక సంచికగా మీ ముందుకు తీసుకు వస్తున్నాం. గత కొన్ని నెలలుగా శాస్త్రి గారి సాహిత్యంపై ప్రచురిస్తున్న రామసూరి గారి సిద్ధాంత వ్యాసాలను ఈ నెలతో ముగిస్తున్నాం. ఈ వ్యాసాల ప్రచురణ వెనక ప్రేరణ, సహకారం అందించిన పప్పు నాగరాజు గారికి వాకిలి తరపున కృతజ్ఞతలు.<br />
</em></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12646</wfw:commentRss>
		<slash:comments>10</slash:comments>
		</item>
		<item>
		<title>Now, I eat only cannibals</title>
		<link>http://vaakili.com/patrika/?p=12069</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12069#comments</comments>
		<pubDate>Wed, 31 Aug 2016 21:28:29 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[Mango Bites]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12069</guid>
		<description><![CDATA[<p>Once upon a time<br /> My nipples were rosebuds of love<br /> My belly was the cradle of an unborn thought<br /> Now, it is just a black mass of a hardened mole<br /> a burden of unwanted fat<br /> Weightless waves<br /> of past love and pain<br /> crash into my eyes<br /> With fermented passion<br /> Now, I eat only cannibals</p> <p>When machado’s men<br /> rein in my veins<br /> When her beauty and her love<br /> seep onto the floor as vigourless fluid<br /> With fermented passion<br /> Now I eat only cannibalsWhen shadows from the past<br /> warp around my steps<br /> When categories of the world<br /> reap around my coffin<br /> With fermented passion<br /> Now, I eat only cannibals</p> <p>You remember that day?<br /> When red hot embers of the desert<br /> rose into the sky and sliced the Sun?<br /> When the stuff of the centre<br /> erupted through the edges of the universe?<br /> When this was true and that was also true<br /> and everything in between was an illusion?<br /> Then I ate a cannibal,<br /> he was tasty<br /> And, I became a beautiful traitor</p> <p>(a fond tribute [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="padding-left: 5em; font-size: 16px; line-height: 25px; font-family: 'Bookman Old Style';">
<p><span style="font-size: 30px;">O</span>nce upon a time<br />
My nipples were rosebuds of love<br />
My belly was the cradle of an unborn thought<br />
Now, it is just a black mass of a hardened mole<br />
a burden of unwanted fat<br />
Weightless waves<br />
of past love and pain<br />
crash into my eyes<br />
With fermented passion<br />
Now, I eat only cannibals</p>
<p>When machado’s men<br />
rein in my veins<br />
When her beauty and her love<br />
seep onto the floor as vigourless fluid<br />
With fermented passion<br />
Now I eat only cannibalsWhen shadows from the past<br />
warp around my steps<br />
When categories of the world<br />
reap around my coffin<br />
With fermented passion<br />
Now, I eat only cannibals</p>
<p>You remember that day?<br />
When red hot embers of the desert<br />
rose into the sky and sliced the Sun?<br />
When the stuff of the centre<br />
erupted through the edges of the universe?<br />
When this was true and that was also true<br />
and everything in between was an illusion?<br />
Then I ate a cannibal,<br />
he was tasty<br />
And, I became a beautiful traitor</p>
</div>
<p><em>(a fond tribute to <a href="https://en.wikipedia.org/wiki/Terrence_Malick" target="_blank">Terrence Malick</a>)</em></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12069</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>మన కథన సంస్కృతులకొక కొత్త వ్యాకరణం</title>
		<link>http://vaakili.com/patrika/?p=11490</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11490#comments</comments>
		<pubDate>Thu, 30 Jun 2016 19:04:02 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11490</guid>
		<description><![CDATA[“మానవ జాతికి ధర్మాలు, అధర్మాలు నేర్పించి నాగరకత పెంపొందించేది రామాయణం, మానవ సంఘం మళ్లీ జంతుత్వంలోకి జారిపోకుండా కాపాడేది రామాయణం” అంటూ లవకుశ సినిమాలో వాల్మీకి పాత్రధారి నాగయ్య కుశలవులతో అంటాడు.
<br /><br />
ఒక కవిచేతే తన రచన గురించి ఇంత ఆర్భాటంగా చెప్పించడంలోని ఔచిత్యం మాట ఎలా ఉన్నా, సుమారుగా మనకి తెలుగులో రామాయణం మీద వచ్చిన రచనలూ, విమర్శలూ, చర్చలూ, ప్రవచనాలూ ఈ దిశగానే ఉంటాయి. కల్పవృక్షాలు, విషవృక్షాలూ, ఈ మధ్య టి.వి. చానెళ్లలో నిరంతరాయంగా వినవచ్చే ప్రవచానాలు మొదలైనవి రామాయణం కథని రకరకాలుగా విశ్లేషించడమో, అందులోని భక్తినీ, రక్తినీ, ఆధ్యాత్మికతనీ, ఆ కావ్యంలోని సామాజిక, సాంస్కృతిక విలువలనీ, ఇంకా ఈ మధ్య “మేనేజ్మెంట్ టెక్నిక్కు”లనీ, గోరంత కొండంతలుగా చేసి చెప్పుకొంటూ, ఆ కథని ఆకాశానికెత్తడమో లేదా పాతాళనికి తొక్కడమో చేస్తుంటాయి.
<br />
కానీ, రామాయణంతో మన సమాజానికీ సంస్కృతికీ ఉన్న సంబంధం ఎప్పుడూ ఇలానే ఉండేదా? రామాయణం అనాదిగా ఒక భక్తి కావ్యంగా, రాముడు ఒక సూపర్-హీరోగా, సీతారాములు ఆదర్శదంపతులుగా, రామరాజ్యం ఒక ఆదర్శరాజ్యానికి నమూనాగానే పరిగణించబడిందా? రామాలయాలు వీధివీధికి ఎప్పుడూ ఉండేవా? రామాయణ పారాయణలు ఇంతజోరుగానే ఎప్పుడూ జరిగేవా? రామకోటులు ఇప్పటిలాగనే ప్రజలు ఎప్పుడూ రాస్తుండేవారా? ఇంకా ముఖ్యంగా, రామాయణానికీ భారతావనిలో రాజకీయాలకీ ఎటువంటి సంబంధం ఉండేది? రాజులు రామాయణాన్నీ, రాముడిని తలకెత్తుకునేవారా, రామాయణం ఒక “పొలిటికల్-రచన”గా భావించేవారా, సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యలకి ఆ కథలో సమాధానాలు వెతుక్కునేవారా?]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/velcheru.jpg" alt="" width="0" height="0" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">బ</span>యట ప్రపంచానికి సంబంధించినంత వరకూ, భారత సంస్కృతిలో మతం ఉంది, ఫిలాసఫీ ఉంది, ఆంత్రపాలజీ ఉంది, భాషాశాస్త్రం ఉంది, ఇతిహాసాలు, పురాణాలు ఉన్నాయి &#8211; కానీ, మనకి గొప్ప సాహిత్యం లేదు. కొద్దో గొప్పో ఉన్నా అదంతా సంస్కృతంలోనే ఉంది. ముఖ్యంగా, మనకి “ఇంటలెక్చువల్” సంప్రదాయం అనేది ఏదీ చెప్పుకోదగ్గదిగా అభివృద్ధి చెందలేదు.</p>
<p>ఇకపోతే, తెలుగులో, ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన విమర్శలూ, అధ్యయనాలు మూడు రకాలుగా కనిపిస్తాయి. సంప్రదాయ తెలుగుపండితులు మన పాత సాహిత్యం ఎంత గొప్పదో పేజీల కొద్దీ పొగుడుతూ వ్యాసాలు రాస్తారు. ఆ సంప్రదాయం మీద మనకి అప్పటికే ఇష్టం ఉంటే ఈ వ్యాఖ్యానాలు నచ్చుతాయి. కానీ, ఈ కవిత్వ సంప్రదాయంతో ఏ సంబంధమూ లేని బయట వ్యక్తిని అవి నమ్మించి, ఒప్పించలేవు.</p>
<p>అకడెమిక్ రచనలూ, పరిశోధనా వ్యాసాలూ రెండో రకం. వీటిల్లో సాధారణంగా కనిపించే ప్రశ్నలు &#8211; ఫలనాకవి ఏకాలం నాటివాడు, ఫలానా కావ్యానికి కర్త ఎవరు, ఫలానా పద్యం ఏ కవిదీ, లేదా ఏ కావ్యం లోనిది, కావ్యాలలో ప్రక్షిప్తాలు ఏవి, అసలు మూల కావ్యంలో పద్యాలు ఏవి? ఇలాంటి ప్రశ్నలే ఎక్కువ కనిపిస్తాయి.</p>
<p>మూడోరకం వాదన ప్రకారం ఈ సాహిత్యం అంతా శుద్ధ దండగ &#8211; అందులో శృంగార వర్ణనలూ, పొడుగాటి సమాసాలు, ప్రాసలూ అలంకారలతో రకరకాలుగా చేసే పాండిత్య విన్యాసాలూ తప్పించి ఇంకేం లేదు. ఎవరో రాజుల ప్రాపకంకోసం బ్రాహ్మణ పండితులు రాసిన ఎందుకూ పనికిరాని, ఏ సాహిత్య విలువలూ లేని తాటాకు మంటలవి.</p>
<p>వెల్చేరు నారాయణరావుగారిని కలిసే వరకూ, నా అభిప్రాయాలు కూడా సుమారుగా ఇలానే ఉండేవి.</p>
<p>ఓ వేసవి మధ్యాహ్నం హైదరాబాదులో మొదటిసారి నారాయణరావుగారిని కలవడం ఇప్పటికీ గుర్తే -. పరుచూరి శ్రీనివాస్ పరిచయం చేసారు. ఆయన్ని కలిసిన మొదటి పావుగంటలోనే, తెలుగు సాహిత్యం గురించీ, సాంస్కృతిక చరిత్ర గురించీ నాకున్న అభిప్రాయాలన్నీ ఎందుకూ కొరగానివని తెలిసొచ్చింది.</p>
<p style="text-align: center;">***</p>
<p>వెయ్యేళ్ల తెలుగుసాహిత్యాన్నిఆసాంతమూ చదివి, దానిమీద అధికారం సాధించడం సామాన్యమైన విషయమేమీ కాదు. నారాయణరావుగారి విశిష్టత అక్కడతో ఆగిపోదు, తను చదివిన సాహిత్యాన్ని గురించి ఆయన గొప్పగా, ఇష్టంగా మాట్లాడగలరు, ఇంతకుముందు ఎవరూ చూడని కొత్త దారుల్లో వ్యాఖ్యానించగలరు. మనం పాతసాహిత్యాన్ని కొత్తగా ఎందుకు చదవాలి, మన సాహిత్యాన్ని ప్రపంచానికి ఎందుకు పరిచయం చెయ్యాలీ అనే విషయంలో ఆయన ఆలోచనలు విశాలమైనవీ, హృదయమున్నవీనూ.</p>
<p>ఆయన అడిగే ప్రశ్నలు గమ్మత్తుగా ఉంటాయి, కొత్తగా, తాజాగా ఉంటాయి, మూలాల్ని కదిల్చేవిగా ఉంటాయి, ఒక్కోసారి గాభరాపెట్టేవిగా, కలవర పెట్టేవిగా, కొంతమందికి కోపం తెప్పించేవిగానూ ఉంటాయి. నారాయణరావుగారి భాషలో ప్రశ్న అంటే అన్వేషణ. ఈ అన్వేషణ ద్వారా నన్నయ్య కాలంనుంచీ నాయకరాజుల కాలంవరకూ జరిగిన సాంస్కృతిక, సామాజిక మార్పులని అటు పాశ్చాత్య చారిత్రక అధ్యయనాలకీ, ఇటు భారతీయ అధ్యయనాలకీ భిన్నంగా ఒక కొత్త తరహాలో వ్యాఖ్యానించారు.</p>
<p>ఆయనా, <a href="https://en.wikipedia.org/wiki/David_Dean_Shulman" target="_blank">డేవిడ్ షూల్మన్</a> కలిసి ఎన్నో తెలుగు కావ్యాలని ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ అనువాదాలకి, వాళ్లు పొడుగాటి ముందుమాటలు/వెనుకమాటలు రాశారు. ఆధునిక పాఠకుడు ఆ కావ్యాన్ని ఎలా చదవాలో, ఎందుకు చదవాలో వివరించే వ్యాఖ్యానాలు అవి.<br />
<img class=" wp-image-11495 alignleft" title="text_and_tradition" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/06/text_and_tradition.jpg" alt="" width="340" height="543" /><br />
మనుచరిత్ర అనువాదానికి ముందుమాట చదవకపూర్వం, నాకు మనుచరిత్ర అంటే “అటజని కాంచె భూమిసురుడు..”, “ఇంతలు కన్నులుండ..” లాంటి కొన్ని పద్యాలు, ప్రబంధ నాయికల అంగాంగ వర్ణనలూనూ. మనుచరిత్ర ఎందుకు ప్రపంచ సాహిత్యంలో గొప్పదిగా పరిగణించాల్సిన రచనో, పెద్దన ఎందుకు “ఆంధ్ర కవితా పితామహుడు” అయ్యాడో తన ముందుమాటలో నారాయణరావు, షూల్మన్లు వివరంగా చెప్తారు. శ్రీనాథుడి మీద రాసిన పుస్తకంలో శ్రీనాథుడు ఎందుకు గొప్పకవో, ఆయన తన కవిత్వంలో చేసిన కొత్త ప్రయోగాలు ఏమిటో, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూసాడో, శ్రీనాథుడు ప్రపంచ సాహిత్యంలో ఎన్నదగిన కవుల జాబితాలో ఎందుకుండాలో అంతే బలంగానూ వివరిస్తారు. </p>
<p>ఈ ముందుమాటలు చదివితే, తెలుగులో ఇంత గొప్ప సాహిత్యం ఉందా అని గర్వంగానూ, ఇంత గొప్ప సాహిత్య సంపద మనం పట్టించుకోకుండా వదిలేసామా అని చాలా బాధగానూ అనిపిస్తుంది.</p>
<p style="text-align: center;">***</p>
<p>నారాయణరావుగారు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యడంతో ఆగిపోలేదు &#8211; మన సంస్కృతినీ, చరిత్రనీ అధ్యయనం చేసే పద్దతులలో మౌలికమైన మార్పు రావాలని వాదిస్తారు. భారతీయులకి చరిత్ర రచన లేదనే వాదనని ఆయన ఒప్పుకోరు. రినసాన్సు తర్వాతే యూరోపులోనూ, అసలు ప్రపంచం అంతా ఆధునికత ప్రారంభం అయిందని దాదాపుగా అందరూ ఒప్పుకున్న మాట.దానికి భిన్నంగా నారాయణరావు మనదైన ఒక ఆధునికత పదిహేనో శతాబ్దం నుంచే ఉండేదనీ, అది వలసపాలనలో కొట్టుకునిపోయిందనీ బలంగా వాదించారు. పాశ్చాత్య చరిత్రని అధ్యయనం చేసే పద్ధతులతో, అ ఫిల్టర్లతో మన సంస్కృతిని అధ్యయనం చెయ్యడం వల్ల ప్రయోజనం లేదనేది భారత సాంస్కృతిక చరిత్ర అధ్యయనాలలో నారాయణరావు తెచ్చిన పెద్ద మార్పు. మౌఖిక సమాజాల సాహిత్య సంస్కృతి వేరుగా ఉంటుందని ఆయన ఎన్నో వ్యాసాలలో చూపించారు.</p>
<p>ఈ వ్యాసాలలో కొన్ని, <a href="http://permanent-black.blogspot.in/2016/05/text-and-tradition-in-south-india.html" target="_blank">Text and Tradition in South India</a> అని ఈ మధ్యనే ఒక సంకలనంగా వచ్చాయి. ఈ పుస్తకంలో మొత్తం పదిహేను వ్యాసాలున్నాయి. ఒక్కోవ్యాసం ముప్పై, నలభై పేజీలదాకా ఉంటుంది. ఈ వ్యాసాలలో &#8211; పురాణాలు, భారత సంస్కృతిలో కావ్యానికీ కవికీ ఉన్న సంబంధం, అచ్చుయంత్రం తెచ్చిన మార్పులూ, మౌఖిక సంప్రదాయంలో రచనలని చదివే పద్ధతులూ, వలసపాలనకి పూర్వం ఈ సంస్కృతిలో “నీతి” అనే భావన ఎలా ఉండేది, మొదలైన సాంస్కృతిక చరిత్రకి సంబంధించిన విశ్లేషణలూ, వ్యాఖ్యానాలూ ఎన్నో ఉన్నాయి. ఈ వ్యాసాలలో ప్రతీదీ ఒక కొత్త వ్యాఖ్యానం, ఒక మౌలికమైన ప్రతిపాదన, మన సంస్కృతిని కొత్తగా అర్థం చేసుకోవడానికి, ఇప్పటి సంఘర్షణలకి మూలాలు కొత్తగా వెతకడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి.</p>
<p>ఈ వ్యాసాలన్నీటినీ మొత్తంగా కలిపి చూస్తే నారాయణరావుగారి ఆలోచనా పరిధి ఎంత విశాలమైనదో తెలుస్తుంది. ఇంత విస్తృతమైన వ్యాసాలన్నిటినీ ఒక్క వ్యాసంలో సమీక్షించడం అసంభవం.</p>
<p>ఈ పుస్తకంలో రామాయణ సంప్రదాయం మీదే ఐదు వ్యాసాలున్నాయి. రామాయణం అంటే నాకున్న ప్రత్యేకమైన ఆసక్తి కారణంగానూ, ఆ కథ అందరికీ తెలిసిందే కావడంతోనూ, నారాయణరావుగారి వ్యాఖ్యానంలోని కొత్తదనాన్ని పరిచయం చెయ్యడం సులువు అవుతందనీనూ, ఈ వ్యాసాల ఆధారంగా నా ఆలోచనలు కూడా పంచుకోడానికి కుదురుతుంది కాబట్టి, వీటినుంచీ రెండిటిని ఎన్నుకున్నాను.</p>
<p>“When Does Sita Cease to be a Sita &#8211; Notes towards a cultural grammar of Indian Narratives”, &#8220;<a href="http://eemaata.com/em/issues/200309/471.html" target="_blank">The politics of Telugu Ramayanas &#8211; Colonialism, print cultures and literary movements</a>”, అనే రెండు వ్యాసాలు ఈ సంకలనంలో రామాయణ సంస్కృతి మీద వచ్చిన ముఖ్యమైన వ్యాసాలు. ఈ వ్యాసాలలో, నారాయణరావుగారు మన సాంస్కతిక చరిత్రని అర్ఠం చేసుకోడానికి ఒక కొత్త ‘వ్యాకరణాన్ని’ సూచన ప్రాయంగా ప్రతిపాదించారు. అందుకని, ఈ రెండు వ్యాసాలని మాత్రం ఇక్కడ విపులంగా పరిచయం చేస్తాను.</p>
<p style="text-align: center;">***</p>
<p>“మానవ జాతికి ధర్మాలు, అధర్మాలు నేర్పించి నాగరకత పెంపొందించేది రామాయణం, మానవ సంఘం మళ్లీ జంతుత్వంలోకి జారిపోకుండా కాపాడేది రామాయణం” అంటూ లవకుశ సినిమాలో వాల్మీకి పాత్రధారి నాగయ్య కుశలవులతో అంటాడు.</p>
<p>ఒక కవిచేతే తన రచన గురించి ఇంత ఆర్భాటంగా చెప్పించడంలోని ఔచిత్యం మాట ఎలా ఉన్నా, సుమారుగా మనకి తెలుగులో రామాయణం మీద వచ్చిన రచనలూ, విమర్శలూ, చర్చలూ, ప్రవచనాలూ ఈ దిశగానే ఉంటాయి. కల్పవృక్షాలు, విషవృక్షాలూ, ఈ మధ్య టి.వి. చానెళ్లలో నిరంతరాయంగా వినవచ్చే ప్రవచానాలు మొదలైనవి రామాయణం కథని రకరకాలుగా విశ్లేషించడమో, అందులోని భక్తినీ, రక్తినీ, ఆధ్యాత్మికతనీ, ఆ కావ్యంలోని సామాజిక, సాంస్కృతిక విలువలనీ, ఇంకా ఈ మధ్య “మేనేజ్మెంట్ టెక్నిక్కు”లనీ, గోరంత కొండంతలుగా చేసి చెప్పుకొంటూ, ఆ కథని ఆకాశానికెత్తడమో లేదా పాతాళనికి తొక్కడమో చేస్తుంటాయి.</p>
<p>కానీ, రామాయణంతో మన సమాజానికీ సంస్కృతికీ ఉన్న సంబంధం ఎప్పుడూ ఇలానే ఉండేదా? రామాయణం అనాదిగా ఒక భక్తి కావ్యంగా, రాముడు ఒక సూపర్-హీరోగా, సీతారాములు ఆదర్శదంపతులుగా, రామరాజ్యం ఒక ఆదర్శరాజ్యానికి నమూనాగానే పరిగణించబడిందా? రామాలయాలు వీధివీధికి ఎప్పుడూ ఉండేవా? రామాయణ పారాయణలు ఇంతజోరుగానే ఎప్పుడూ జరిగేవా? రామకోటులు ఇప్పటిలాగనే ప్రజలు ఎప్పుడూ రాస్తుండేవారా? ఇంకా ముఖ్యంగా, రామాయణానికీ భారతావనిలో రాజకీయాలకీ ఎటువంటి సంబంధం ఉండేది? రాజులు రామాయణాన్నీ, రాముడిని తలకెత్తుకునేవారా, రామాయణం ఒక “పొలిటికల్-రచన”గా భావించేవారా, సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యలకి ఆ కథలో సమాధానాలు వెతుక్కునేవారా?</p>
<p>భారత సంస్కృతి చాలా విస్తృతమైనది &#8211; ఇందులో ఎన్నో సమాజాలు ఉన్నాయి &#8211; అన్ని రకాల సామాజిక తరగతులకీ, ముఖ్యంగా స్త్రీలకీ రామాయణంతో సంబంధం ఒకేలా ఉండేదా? కాలక్రమంలో రామాయణంతో మన సంస్కృతికున్న సంబంధంలో ఏవైనా మార్పులు వచ్చాయా? కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కథని, ఈ సంస్కృతి సజీవంగా ఎలా ఉంచుకుంది? ఆ కథతో మనుకున్న అనుబంధం ఎటువంటిది?</p>
<p>మౌలికంగా, రామాయణం చుట్టూ ఉన్న కథన సంస్కృతుల (Narrative Cultures) తాలుకూ చరిత్ర ఏమిటి?</p>
<p>రామాయణ కథనాలు మనకి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఎన్నో కథనాలు మనం ఇప్పుడు వాల్మీకంగా చెప్పుకుంటున్న ఒక నమూనాలో ఏ విధంగానూ పట్టవు. కానీ, వాల్మీకంలోని నమూనా సుమారుగా ప్రసిద్ది చెందిన అన్ని రామాయణాల కథనాలకి స్థిరపడిపోయింది.</p>
<p>వాల్మీకి పేర వున్న రామాయణం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే కొత్త విలువల్ని, వాటికి కావలసిన సాంఘిక సంస్థల్ని, ఉత్తమ ప్రవర్తనకి కొత్త దిశానిర్దేశాన్ని చెయ్యగలిగిన ఒక చారిత్రక గాథ అని. రామాయణం పరిష్కరించ జూసే అంతర్గత సమస్య రాచరికమే! అంటే, రాచరికం, రాజ్య పాలన, అధికార వినియోగం, వంశ పారంపర్యం, ఒక కుటుంబంలో అది సంక్రమించటంలో ఉన్న సాధకబాధకాలు, వీటి స్వరూప స్వభావాలు. రామాయణం ఈ విషయంలో దిశానిర్దేశం చేస్తుంది &#8211; రాజు ఏకపత్నీవ్రతుడు కావాలి, తండ్రిమాటకి కట్టుబడాలి, పెద్దకొడుకే పట్టాభిషిక్తుడు కావాలి, పట్టాభిషిక్తుడైన రాజుని సోదరులందరూ, జ్ఞాతి భావం వదిలి, ఆయన్ని తండ్రిలా భావించాలి. ఇదీ రామాయణం రాచరిక సమస్యలకి చూపిన పరిష్కారం.</p>
<p>కానీ ఎందుకో మన రాజులెవరూ ఈ సూత్రీకరణని అంతగా పట్టించుకోలేదు. ఎందరో రాజులు ( ప్రవరశేనుడు, యశోవర్మ, భీమటుడు,భోజుడు ) రామాయణాన్ని నాటకాలగానో, మరో సాహిత్య రూపకంగానో రచించారు. అయితే వీరంతా కవులూ సాహిత్యపోషకులే కానీ రామాయణంతో వీరికి రాజకీయ సంబంధం ఏమీ లేదు.</p>
<p>సాంస్కృతికంగానూ, సాహిత్యపరంగానూ రామాయణం మన దేశ కవులని ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంది. భాసుడు, కాళిదాసు, కుమారదాసుడు,భవభూతి, భట్టి, మురారి,రాజశేఖరుడు మొదలైన ఎందరో కవులు రామాయణాన్ని ఎన్నోవిధాల తిరిగి రాసారు. సంస్కృత సాహిత్యంలోనూ, ప్రాకృతంలోనూ, ఇతర దేశభాషలలోనూ రామాయణం కేవలం ఒక కావ్యం కాదు &#8211; అదొక విశాలమైన సాహిత్య సంప్రదాయం.</p>
<p>అయితే, పన్నెండో శతాబ్దానికి ముందు రామాయణం సాహిత్యంగానే ఉండేది కానీ, దాన్నొక భక్తి గ్రంథంగా, రాముడిని అవతార పురుషుడిగా, రామాయణం సర్వ ధర్మాలనీ బోధించే ధార్మిక గ్రంథంగా ఆకాలం నాటి సంస్కృతి పరిగణించలేదు. అప్పటివరకూ రాముడికి భారతదేశంలో రాజకీయాలతోనూ పెద్దగా సంబంధం ఉండేదీ కాదు, రాముడికి చెప్పుకోదగ్గ ఆలయాలుకానీ, రాముడి పేరుతో శాసనాలు కానీ అప్పట్లో లేవు. ఎంతోమంది నాయకులలో ఆయన కూడా ఒకడు.</p>
<p>పన్నెండో శతాబ్దం నుండీ రామాయణానికీ, భారతావనిలో రాజకీయాలకి అంతకుముందెన్నడూ లేనీ సంబంధం వచ్చింది &#8211; ముఖ్యంగా, పడమర రాజాస్థాన్, గుజరాత్ లలోనూ, మధ్య ప్రాంతాలలోనూ మధ్య ప్రాచ్యదేశాలనుంచీ వచ్చిన మత, సాంస్కృతిక, రాజకీయమైన తాకిడి రామాయణానికి ఒక కొత్త రాజకీయ వ్యాకరణాన్ని తయారుచేసింది.</p>
<p>రామాయణ సంప్రదాయ చరిత్రలో ఇది చాలా పెద్ద మార్పు. దీనికి కారణం, ఈ కాలంలో, భారతావనిలోకి ముస్లిమ్ దండయాత్రలు ఎక్కువ అవడం, ముందు దండయాత్రలుగా ఉన్నా, అతి కొద్దికాలంలోనే ఒక కొత్త సంస్కృతి ఇక్కడ పాతుకోవడం, అది అధికారంలోకి రావడం, రామాయణానికి ఒక రాజకీయమైన అవసరాన్ని కలిగేలా చేసింది.</p>
<p>ఒకపక్క రామరాజ్యం లాంటి దైవికంగా శక్తివంతమైన రాజకీయ శక్తిని కల్పించడానికీ, అలా కల్పించిన కథనాన్ని ఒక చారిత్రక, ఐతిహాసిక నేపధ్యంతో జోడించి ప్రజలని ఒప్పించడానికీ, ఒక భిన్న సంస్కృతిని శత్రువుగా, రాక్షసంగా చూపించడానికీ రామాయణ కథనంలో పుష్కలమైన, శక్తివంతమైన కథనసామగ్రి ఉంది. “వాళ్లు వేరు, మన ఆడవాళ్లని ఎత్తుకుపోతారు, మన మాన ప్రాణాలని దొంగలిస్తారు, మన సంస్కృతినీ, మన ఆచారాలనీ హేళన చేస్తారు” అంటూ మనదికాని దానిని వేరుచెయ్యడానికి (Othering) రామాయణ కథనం అవకాశం కల్పిస్తుంది, అందులోంచే రాముడు, నిశాచర వినాశకరుడైన వీరపురుషుడిగా &#8211; ఒక బలమైన రాజుకి నమూనాగా మారతాడు.</p>
<p>రాజుకి “విష్ణ్వంశ” పోయి, రాజే విష్ణువుగా, రాజే రాముడిగా, రాజే దేవుడిగా మారడం, రామాయణం చుట్టూ ఒక భక్తి సంప్రదాయం ఏర్పడడం అనే రెండు ముఖ్యమైన పరిణామాలు ఈక్రమంలో చోటుచేసుకున్నాయి.</p>
<p>ఇందులో భాగంగానే, రాముడికి పెద్ద దేవాలయాలు వచ్చాయి. విజయనగరంలో హజార రామ దేవాలయం, యాదవరాజు రామచంద్రుడు కట్టించిన రామ్-టెక్ ప్రాంగణంలోని రామాలయం, సుమారుగా కాకతీయుల కాలంనుంచీ ఉంటూ తాన్సేను కాలంలో ప్రాముఖ్యంలోకి వచ్చిన భద్రాద్రి రామాలయం ప్రముఖమైనవి.</p>
<p>రామాయణం చుట్టూ భక్తి సంప్రదాయం ఏర్పడే క్రమంలోనే, రామనవమి పండగలు జరుపుకోవడం మొదలయ్యింది. అంటే, రామాయణం సాహిత్య కథనం నుంచీ, రాజకీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుని, ఆపైన భక్తిగ్రంథంగా, దాని చుట్టూ ఆధ్యాత్మికమైన వాతావరణం ఈ కాలంలోనే వచ్చింది. రామాయణం భక్తిగ్రంథం అయాక, రామాయణ అనువాదాలు, అనుసృజనలు అన్ని భాషల్లోనూ కోకొల్లలుగా వచ్చాయి. రామాయణాన్ని ఏదో రూపంలో రాయడమే పుణ్యకార్యం అనే ధోరణి మొదలైంది. వీధి వీధికీ రామాలయాలు వెలియడం, రామకథలు ప్రవచనాలుగా చెప్పుకోవడం మొదలైన కొత్త సంప్రదాయాలు వచ్చాయి.</p>
<p>ఇటువంటి ప్రాముఖ్యం వల్ల, ముఖ్యంగా భక్తి సంప్రదాయం రామాయణానికి తోడవటంతో, అందులోని పాత్రలు &#8211; ముఖ్యంగా సీతారాములు &#8211; మన నాగరకతకి ప్రతీకలు అయ్యారు, రామాయణంలోని విలువలు మన సంస్కృతినంతా ప్రతిబింబించే విలువలనే నమ్మకం బాగా నాటుకుపోయింది.</p>
<p>ఇదంతా ఒక్కసారిగా జరగకపోయినా, వలసపాలన తర్వాత వచ్చిన ఆధునికత సామాజికంగా పెనుమార్పులకి చోటిచ్చింది. అందువల్ల, పాతని కొత్తగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆనాటి సంఘంలో సంఘర్షణలనీ, వైరుధ్యాలనీ, సమస్యలనీ పట్టుకుని వాటితో రామాయణాన్ని విశ్లేషించడమో, రామాయణాన్ని తిరిగి రాయడమో తెలుగునాట ఎక్కువగానే జరిగింది, ఇప్పటికీ ఇదే ధోరణి కొనసాగుతోంది కూడా.</p>
<p>ఈ నేపథ్యంలో, పంధొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాలలో తెలుగులో రామాయణం ఎన్నో సాహిత్య యుద్ధాలకి వేదికగా మారింది. ఒకవైపు భక్తిరామాయణాలూ, మరోవైపు “వ్యతిరేక రామాయణాలు” ఎన్నో వచ్చాయి.</p>
<p>సంప్రదాయ, భక్తి మార్గంలో వచ్చిన రామాయణ కథనాలలో &#8211; ఆంధ్ర వాల్మీకిగా పేరొందిన వావిలకొలను సుబ్బారావు, శ్రీనివాస శిరోమణి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పుల్లెల శ్రీరామచంద్రుడు చేసిన అనువాదాలు చెప్పుకోదగ్గవి. ఇదే మార్గంలో స్వతంత్ర కావ్యంగా వచ్చిన రామాయణ కథనం విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షం. ఆరోజుల్లో మధ్య తరగతి విద్యావంతుల్లో సంప్రదాయ వ్యతిరేకత, తద్వారా బ్రాహ్మణ వ్యతిరేకతల మోజు ఎక్కువగా వుండేది. వేదాలు, పురాణాలు, మిగిలిన పూర్వ గ్రంధాలు దేశాన్ని అజ్ఞానంలో ఉంచాయని, కుల వ్యవస్థ, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం, ఇంకా ఇలాటి “ సంప్రదాయ స్వచ్ఛత”కు సంబంధించిన అనేక ఆచారాలు వెనకబడ్డ తనానికి చిహ్నాలని ఇంగ్లీష్‌ చదివిన ఆధునికులు ఒప్పేసుకున్నారు. ఇలాటి సందర్భంలో విశ్వనాథ సంప్రదాయ ఆచారాల్ని, విలువల్ని సమర్థిస్తూ మను ధర్మశాస్త్రం మీద నిలిచే సమాజానికి పిలుపునిచ్చాడు. ఇది అనూహ్యమైన రీతిలో సాహిత్య ప్రపంచాన్ని ఊపేసింది.</p>
<p>ఇకపోతే, వ్యతిరేక-రామాయణ కథనాలలో మనకి రెండు ధోరణులు కనిపిస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్టు, రామాయణంలో ఉన్న “othering” ని ఉపయోగిచుకుంటూ &#8211; రామాయణాన్ని ఏదో ఒక వర్గపోరాటానికి ప్రాతినిథ్యం వహించిన కథనంగా విశ్లేషించడం, లేదా తిరిగి రాయడం మొదటిది.</p>
<p style="text-align: center; font-size: 13px;"><img class="aligncenter size-full wp-image-11501" title="page2" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/06/page21.jpg" alt="" width="810" height="476" /><br />
(అగ్నిప్రవేశం, మేవార్ రామాయణం, బ్రిటిష్ లైబ్రరీ)</p>
<p>ఆర్య-ద్రవిడ వాదాలు ఎక్కువగా ఉన్న రోజులలో, ఆర్య-ద్రావిడ సిద్ధాంతం బ్రాహ్మణ-అబ్రాహ్మణ జాతుల మధ్య సంఘర్షణలకి వేదికగా మారింది. ఆ సమయంలోనే, త్రిపురనేని రామస్వామి శంబుక వధ, రామాయణాన్ని ఆర్య-ద్రావిడుల సంఘర్షణగా చూపించింది. ఆయన దృష్టిలో శంబుక హత్యకు బ్రాహ్మణుల కుట్రే ఏకైక కారణం. ఈ కథలో ఆర్య ద్రావిడ వర్గకలహాలు చూడబోవటం బ్రాహ్మణ పాఠకులకి వెగటుగా తోచింది. కట్టుకథని ప్రచారం చేస్తున్నాడని సంప్రదాయ పండితులు రామస్వామిని ఖండించారు. ఈ అసంప్రదాయ కథనం ఒక దశాబ్దం పాటు సంప్రదాయవాదుల నుండీ ఎంతో ప్రతిఘటనని ఎదుర్కొంది. రామస్వామి ఈ ప్రతిఘటనని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు, ఆయన ఊరూరా తిరిగి తన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ముఖ్యంగా విద్యాధికులైన అబ్రాహ్మణ పాఠకులు, బ్రాహ్మణ్యాన్ని ప్రశ్నిస్తున్న అధునాతనులు అందుకు అనుకూలంగా స్పందించారు.</p>
<p>ఇటీవల వచ్చిన వ్యతిరేక రామాయణాల్లో సంపూర్ణమైంది, వివాదాస్పదమైంది ముప్పాళ్ళ రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం. రామాయణ విషవృక్షంలో మాత్రం రామాయణానికున్న బ్రాహ్మణ, అబ్రాహ్మణ వ్యాఖ్యానాలన్నిటినీ తీవ్రంగా నిరసిస్తూ రామాయణం ఏకైక లక్ష్యం తక్కువ కులాల వాళ్ళని, స్త్రీలని, రాచరికవ్యవస్థ బంధనాల్లో ఉంచటమే అనేది ఆవిడ ప్రతిపాదన.</p>
<p>వ్యతిరేక రామాయణ కథనాలలో మనకి కనిపించే రెండో ధోరణి, రామాయణంలో ఉన్న సమస్యాత్మకమైన ఘటనల ఆధారంగా, సంప్రదాయాలనీ, సంస్కృతినీ ధిక్కరించిన కథనాలు. ఈ ధోరణిలో తెలుగు సాహితీకారులు సంప్రదాయ రామాయణ మార్గాన్ని ప్రశ్నిస్తూ ఎన్నో రామాయణ వృత్తాంతాల్ని తిరగరాశారు. నాటకాలు, కవితలు, వ్యాసాలు చాలానే వచ్చాయి. వీటిల్లో ప్రధానమైనవి ముద్దుకృష్ణ అశోకం, చలం సీత అగ్నిప్రవేశం, నార్ల వెంకటేశ్వరరావు జాబాలి, సీత జోస్యం నాటకాలు.</p>
<p>వ్యతిరేక రామాయణ కథనాలలో రెండు ముఖ్యమైన అంతర్వాహినులున్నాయి. కొందరు ఏకైక మూలరామాయణం ఉన్నదని, అది వాల్మీకి కృతమని, బ్రాహ్మణ్యాన్ని సమర్థించటం దాని లక్ష్యమని, దాన్నే ప్రాంతీయ భాషా రచయితలు అనుసరించారని భావిస్తారు. ఇంకొందరు వాల్మీకి రామాయణంలోకి బ్రాహ్మణులు వాళ్ళకు అనుకూలమైన భాగాల్ని చొప్పించారని భావిస్తారు. మార్గాలేవైనా, ఈ రెండింటిలోను రామాయణ వ్యతిరేకత అంటే బ్రాహ్మణ్య వ్యతిరేకతే!</p>
<p>రామాయణ కథలోని సత్యదార్శనికతని (క్లెయిమ్‌ టు ట్రూత్‌)పూర్వపక్షం చేయటానికి వీరు ఎంచుకున్న మార్గం ఏమిటంటే ఒకటి, వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా ఒప్పుకోకపోవటం, రెండోది దానిలోని బ్రాహ్మణానుకూలతని సరిదిద్దటానికి ఆ కథను తిరగరాయటం.</p>
<p>రామాయణ కథా మూలం వాల్మీకం అనటమే రామాయణాన్ని గురించిన అన్ని క్లిష్టతలకూ మూలం అంటారు నారాయణరావుగారు. సంప్రదాయ రామాయణ పాఠకులూ, రామాయణ వ్యతిరేక వాదులూ కూడా వాల్మీకినే రామాయణ కర్తగా చూస్తారు. ఐతే ఈ రెండు వర్గాల మధ్యా ఒక ముఖ్యమైన తేడా వున్నది. రామాయణ వ్యతిరేకులు దీన్ని నిర్ధారించిన సత్యంగా ప్రకటిస్తారు. సంప్రదాయ పాఠకులకీ, శ్రోతలకీ వాల్మీకి కర్తృత్వానికి సాక్ష్యాధారాలేవీ అక్కరలేదు. అది వారికి ప్రశ్నించనవసరంలేని సత్యం.</p>
<p>కానీ, వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా అనుసరించే రామాయణ పాఠం మరొకటి లేదనేది మనం గుర్తించవలసిన విషయం. ఐనా కాని విశేషం ఏమంటే, వాల్మీకి చెప్పిన రామాయణాన్నే తను మళ్ళీ చెప్తున్నానని అనని రామాయణ కర్తలు చాలా అరుదు. అంటే, వాల్మీకి పేరు, ఆయన పేరిట ఉన్న కర్తృత్వమే ఆరాధ్యాలు కానీ, ఆయన అల్లిన పాఠం కాదు. మూలంలో ఉన్న కథనాన్ని, మూలం ఉద్దేశించిన ప్రయోజనాన్ని, రామాయణాన్ని తిరిగి రాసిన కవులందరూ తమ ప్రయోజనాలకి అనుగుణంగా మార్చుకున్నారు &#8211; ఈవిధంగా, వాల్మీకిని ఆరాధ్యుడిగా భావిస్తునే, ఆయన కథనాన్ని మాత్రం ఆరాధ్యంగా భావించరు. ఇది ఒక రకమైన అభాస &#8211; దీనిని రామాయణ వ్యతిరేకులెవ్వరూ గమనించలేదు. అందుకే, అన్ని రామాయణ కథనాలూ ఐతిహాస వాల్మీకాన్ని అనుసరించినవే అనే భావనే అందరిదీనూ.</p>
<p>మనం వాల్మీకిని, అతని పేర వున్న పాఠాన్ని విడదియ్యలేక పోవటానికి బహుశా కారణం ప్రతి రచనకు ముందు దాని కర్త ఒకరు ఉండి తీరాలని మనం విధించుకున్న ఆంక్షే. కావ్యమే కవిని తయారుచేస్తుందికానీ, కవి కావ్యాన్ని చెయ్యడు అనేది నారాయణరావు ప్రతిపాదించే ముఖ్యమైన, మౌలికమైన సిద్ధాంతం.</p>
<p>మన సంస్కృతిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే &#8211; కథతో మన సంబంధం మారుతూంటే, కవిని గురించి మనం చెప్పుకునే కథలు కూడా మారతాయి. ఈ రకంగా మనకి ఎందరో వాల్మీకులు ఉన్నారు. ఆదికవి వాల్మీకి ఒకడు &#8211; ఈయన మహర్షి. ఒకనాడు నారదుడు ఆయన దగ్గరకి వస్తాడు, రామాయణ కథని చెప్తాడు. ఆ తర్వాత వాల్మీకి తమసానదీ తీరానికి వెళ్తాడు, అక్కడ బోయవాడిని శపిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి ఆదేశంతో రామాయణం రాస్తాడు. ఇది ఐతిహాస రామాయాణం మనకి చెప్పిన వాల్మీకి కథ.</p>
<p>బందిపోటుగా వుండి రామనామ ధ్యానంతో భక్తుడైన మరో వాల్మీకి గురించి మనం విన్నాం. అతను “రామ” శబ్దాన్ని నేరుగా పొందటానికి అనర్హుడు గనుక బ్రాహ్మణులు దాన్ని “మరా”గా అతనికి ఇస్తారు. దాన్ని మంత్రంగా పదే పదే పునశ్చరణ చేసి అతను పవిత్రమైన రామ శబ్దాన్ని సాధిస్తాడు. ఋషిగా మారి తపోనిష్ఠలో ఉండగా అతని చుట్టూ వల్మీకం పెరుగుతుంది. రాముడు తన చరిత్రని పాడమని అడగటానికి అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వల్మీకం నుంచి వెలువడి వాల్మీకి అవుతాడు. భక్తి రామాయణాల్లో కనిపించే వాల్మీకి ఇతను.</p>
<p>ఇక స్త్రీల రామాయణాలలోని వాల్మీకి మరొకలా ఉంటాడు &#8211; స్త్రీల రామాయణాల్లో మనక్కనిపించే వాల్మీకి సీత పాత్రకు సముచిత స్థానాన్ని ఇవ్వకుండా అన్యాయం చేసే రామ పక్షపాతి. ఇంకొక వాల్మీకి తక్కువ కులాల వారి మీద ఉన్నత కులాల పురుషుల ఆధిక్యతని ప్రచారం చేసిన వాడు. చివరగా మరో వాల్మీకి అసలు కవి కూడ కాడు. రామాయణంలో కేవలం ఒక పాత్ర. ఇలా, మొత్తం మీద ఒక కర్తతో అవసరం కలిగిన ప్రతీ రామాయణమూ తన అవసరాలకు అనుగుణంగా ఒక వాల్మీకిని సృష్టించుకుంది; కర్త అవసరం లేకపోతే అతన్ని వదిలేసింది.</p>
<p>రామాయణ కథనాలన్నీ, ఒక మూల కథానిర్మాణాన్ని అనుసరించినా, వాటి కథనాలలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఉదాహరణకి, భక్తిరామాయణాల్లో హనుమంతుడికి పెద్ద పాత్ర ఉంటుంది, స్త్రీల రామాయణాలలో స్త్రీల సంఘర్షణల చిత్రణలు వేరుగా ఉంటాయి. దక్షిణాది రామాయణాల్లో రావణుడి పాత్రచిత్రణ కొంత ఉదాత్తంగా ఉంటుంది. కాబట్టి, ఇవన్నీ ఐతిహాస వాల్మీకంలో ఉన్నట్టు వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్దేశించి, రాచరిక సమస్యలకి పరిష్కారాలు చూపించేవి కానక్కరలేదు.</p>
<p>ఇకపోతే, రామాయణం ఒక పక్క భక్తి సంప్రదాయం అవడాన్ని అచ్చుయంత్రం వచ్చాక పబ్లిషర్లు బాగా ఉపయోగించుకున్నారు. సంస్కృత రామాయణానికే పారాయణ యోగ్యత ఉందనే నమ్మకం ఉండడంతో, దీన్ని ఉపయోగించుకుని “పారాయణ ప్రతులు” వేయించారు. సంస్కృతపాఠానికే పూజార్హత ఉందనే నమ్మకంవల్ల వాల్మీకమే పవిత్రస్థానంలో నిల్చింది.</p>
<p>ఇవన్నీ ఆధునికయుగంలో, ముఖ్యంగా తెలుగునాట రామాయణ సంస్కృతిలో వచ్చిన మార్పులు. ఈరోజు మనకి రామాయణ సంస్కృతితో ఉన్న సంబంధం ఎప్పుడూ ఇలానే ఉండేది కాదు. ఇవాల్టి అవసరాలని బట్టీ, ఈనాటి సమాజాన్ని బట్టీ ఇది ఏర్పడ్డది. ఈ మార్పులని పట్టించుకోవలసిన అవసరం సంప్రదాయవాదులకి లేదు. ముఖ్యంగా, హిందుత్వ జాతీయవాదులు ఈ దేశంలో ఉన్నదంతా ఒకటే సంస్కృతి అనీ, అది సనాతనంగా ఎప్పుడూ ఇలానే ఉండేదనే నమ్మకాన్ని శక్తివంతంగా ప్రచారం చేస్తుంటారు. ఈ ప్రచారంలో భాగంగానే రామాయణం నేషనల్-ఎపిక్ అయింది. రాముడు సూపర్ హీరో అవుతాడు, సీత భారత-స్త్రీకి ప్రతీక అవుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి.</p>
<p style="text-align: center;">***</p>
<p>When Sita Ceases to be a Sita అనే వ్యాసంలో, నారాయణరావుగారు మరింత ముందుకి పోయి, భారత సంస్కృతిలోని సాహిత్య కథనలాని (నారేటివ్స్)ని అర్థం చేసుకోడానికి మనకి ఒక కొత్త సాంస్కృతిక వ్యాకరణం (కల్చురల్ గ్రామర్) అవసరం అంటారు.</p>
<p>భారతదేశ చరిత్రని తేదీలు, యుగాలు, రాజవంశాల మాదిరిగా కాకుండా, ఇక్కడ మూడు రకాల నాగరకతలు ఉన్నాయని గుర్తించి, ఆ నాగరకతల సంస్కృతిని అర్థం చేసుకుని, వాటి ఆధారంగా మన చరిత్రని నిర్మించుకోవచ్చు అంటారు ఆయన.</p>
<p>భూమినుంచి ఆదాయం వచ్చేవారి నాగరకత ఒకటుంది &#8211; వీళ్లని లాండెడ్ కమ్యూనిటీస్ అంటాం. రెండోది పశువుల నుంచి ఆదాయం వచ్చే వారి నాగరకత &#8211; వీరికి భూమిమీద పెత్తనం అక్కరలేదు కానీ భూమి నుండీ వేరే ఏదో ప్రయోజనం కావాలి, అంటే భూమి కేవలం మేతకి కావాలి, అది ఎవరిదనే ప్రసక్తి లేదు. వీళ్లని పాస్టోరల్ కమ్యూనిటీస్ అంటాం. మూడోది &#8211; వ్యాపారం నుంచి ఆదాయం వచ్చే వారి నాగరకత. వీరిని మెర్సెంటైల్ కమ్యూనిటీస్ అంటాం. ఈ మూడు నాగరకతల సంప్రదాయాలు, సంస్కృతులు వేరుగా ఉంటాయి, భారతదేశ సాంసృతిక చరిత్ర అంతా ఈ మూడు నాగరకతల మధ్య సంఘర్షణగా చూడొచ్చు అంటాడు నారాయణరావు. ఈనాటికీ, ఈ మూడు నాగరకతలు మనకి ఉన్నాయి.</p>
<p>భూమిమీద ఆధారపడే వ్యవసాయ సమాజాలలో స్త్రీని భూమితో సమానంగా చూస్తారు. భూమి నుంచి పంట వస్తుంది, స్త్రీ నుంచి సంతానం వస్తుంది. అందుకని స్త్రీకి భూమితో సమానమైన గౌరవం, స్త్రీమీద అదే హక్కు ఈ నాగరకతలో ఉంటాయి. రాజు పృధ్వీపతి. భూమితో సమానంగా స్రీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరికి స్త్రీ పాతివ్రత్యం ఎంతో ముఖ్యం . ఈ నాగరకతలో వీరుడు స్త్రీకోసం, భూమికోసం యుద్ధంలో ప్రాణత్యాగం చేస్తాడు. భూమిని పరిరక్షించుకోవడంకోసం, స్త్రీని రక్షించుకోవడం కోసం అతను అవసరమైతే చచ్చిపోవాలి. ఎందుకంటే, భూమి మడిచి జేబులో పెట్టుకుని తీసుకుపోయే వస్తువు కాదు &#8211; దానిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రామాయణంలో వీరులు అందరూ ఈ కోవలోనివారు. యుద్దంలో వెన్నిచ్చి రావడం ఇక్కడ కుదరదు. ఇందులో స్త్రీకూడా, పురుషుడిని వీరుడిగా, తనని రక్షించుకోగలిగే పరాక్రమవంతుడిగానే కోరుకుంటుంది, తన ప్రాతివ్రత్యాన్ని అవసరమైతే అందరిముందు నిరూపించుకుంటుంది. వేరెవరివైపు కన్నెత్తికూడా చూడదు. రామాయణంలో సీత భూమికి ప్రతీక &#8211; బహుశా అందుకే ఆమెని భూమిసుతగా వర్ణిస్తారు.</p>
<p>పాస్టోరల్ నాగరకతకి సంబధించిన కథలు కూడా మనకి చాలానే ఉన్నాయి. ఇందులో వీరుడు యుద్ధంలో వెన్నిచ్చి పారిపోయి రావొచ్చు. కాటమరాజు కథ ఇటువంటిదే. మహాభారతం కూడా ఒకవిధంగా, పాస్టోరల్ నాగరకతకి సంబంధించిన కథే. కృష్ణుడు యాదవుడు &#8211; అవసరమైతే, సొంత భూమిని వదిలేసి, మరో చోటుకి వెళ్ళిపోగలడు. పాండవుల తల్లి కుంతి భోజుడి కూతురు, అలానే సత్యవతి కూడా ఒక బేస్తవాడి కూతురు. విరాటుడిది ప్రధానంగా గోధనం, అలాగే ద్రుపదుడిది కూడా. ఈ నాగరకతలో స్త్రీకి చాలా స్వాతంత్ర్యం ఉంటుంది. వ్యవసాయ సమాజాలలోలాగ, ఇక్కడ స్త్రీ ప్రాతివ్రత్యానికి దుర్నిరీక్ష్యమైన పవిత్రత ఉండదు. రుక్ష్మిణి, ద్రౌపది, సత్యభామ, గాంధారి, కుంతి, ఉత్తర &#8211; వీళ్లంతా చాలా స్వతంత్రులైన స్త్రీలు. రామాయణంలో స్త్రీలకి &#8211; భారతంలో స్త్రీలకీ ఉన్న తేడా ప్రధానంగా ఈ నాగరకతల మధ్య ఉన్న తేడాతో వచ్చిందే. ఈ నాగరకతలో వీరత్వం కాస్త వేరుగా ఉంటుంది &#8211; ఇందులో వీరుడు యుద్ధంలోంచి పారిపోవచ్చు, వెనుతిరగవచ్చు, అవసరమైతే ఎత్తులూ, పై ఎత్తులు వేసి ఏదో విధంగా విజయం సాధించవచ్చు.</p>
<p>మన సంస్కృతిలో మూడో నాగరకత కూడా ఉంది &#8211; అది వ్యాపారుల నాగరకత &#8211; అంటే ప్రధానంగా డబ్బుతో ముడిపడిన నాగరకత ఇది. ఈ నాగరకత మనకి జానపద కథల్లో కనిపిస్తుంది &#8211; కథా సరిత్సాగరం, గాథా సప్తశతి మొదలైన ఎన్నో కథలు ఈకోవలోకి వస్తాయి. ఈ కథల్లో స్త్రీ పూర్తి స్వతంత్రురాలిగా ఉంటుంది, ఈ కథల్లో స్త్రీ తనని తానే రక్షించుకుంటుంది, అవసరమైతే పురుషుడికోసం తనే యుద్ధం చేస్తుంది కూడా. వ్యాపారం చేసుకునే కుటుంబాలలో డబ్బుని స్త్రీ, పురుషుడూ ఇద్దరూ వాడొచ్చు, అందుకని ఈ కులాలలో, కుటుంబాలలో స్త్రీకి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ నాగరకతలో పురుషుడూ, స్త్రీ ఇద్దరూ వీరులే. కానీ, ఇందులో యుద్ధంలో ప్రాణాలివ్వడానికి విలువ ఉండదు. బుద్ధి బలంతో గెలవడం, గొడవలు లేకుండా జిత్తులమారి తెలివితేటలతో నెగ్గుకురావడం ప్రధానమైన “వీరత్వం”. ఇందులో, స్త్రీ తన భర్తమీద మరో ఆడదాని కన్నుపడకుండా కాపాడుకుంటూ ఉంటుంది.</p>
<p>ఈ మూడూ విడదీసి, మూడు నాగరకతలు ఉన్నాయి, మూడు మర్యాదలు ఉన్నాయి, మూడు రకాల వీరత్వం ఉంది, మూడు రకాల స్త్రీత్వం ఉంది అని మనం భారతదేశ చరిత్రని మూడు భాగాలుగా చేసి చూస్తే మనం మన సంస్కృతిని కొత్తమార్గంలో అన్వేషించవచ్చు.</p>
<p>ఏ కారణంచేతనో కానీ, వ్యవసాయ-నాగరకత మర్యాదే, ప్రధానమైన “కల్చురల్ నారేటివ్”గా మన ఆలోచనలలో నాటుకుపోయింది. సంస్కృతంలో ఇతిహాసానికి ఉన్న స్థానం కథాసరిత్సాగరానికి ఏంచేతనో కానీ లేదు. దీని పర్యవసానంగా, మనకి రామాయణం “నేషనల్ ఎపిక్” అయిపోయింది, సీత భారత సంస్కృతిలో స్త్రీ-మర్యాదలన్నిటికీ, స్త్రీ సమస్యలన్నిటీకీ ప్రతీకగా నిలిచింది. బహుశా ఈ కారణాలచేతనే, ఇప్పటికీ, మనం రామాయణాన్నే మన సంస్కృతికి ప్త్రాతినిధ్యం వహించిన కథనంగా పరిగణిస్తూ, సీత కథనే చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటాం.</p>
<p>కాలక్రమంలో, సీత కథే ఎన్ని రకాలుగా మారుతూ వస్తూందో చూస్తే ఈ గందరగోళం మనకి అర్థం అవుతుంది.</p>
<p style="text-align: center; font-size: 13px;"><img class="aligncenter size-full wp-image-11503" title="page3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/06/page3.jpg" alt="" width="750" height="452" /><br />
(అశోకవనంలో సీత&#8221;, మేవార్ రామాయణం, బ్రిటిష్ లైబ్రరీ)</p>
<p>వాల్మీకంలో సీత పూర్తిగా మొదటి నాగరకతకి సంబంధించిన స్త్రీ. సుందరకాండలో సీతని హనుమంతుడు తనతో వచ్చెయ్యమంటాడు. దానికి సీత ఎంతో నర్మగర్భంగా, తెలివిగా రాలేనంటుంది. రాముడే వచ్చి రావణుడిని చంపి తనని తీసుకువెళ్లాలి, అదే ధర్మం అంటుంది. ఒకవైపు నుంచీ ఈమాటలు అంటూనే, లంకలో తన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో, రాముడు హుటాహుటిన రావడం ఎంత అవసరమో, కాకిమీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు, ఇప్పుడు ఎందుకు ఉదాసీనంగా ఉండిపోయాడో అంటూ రాముడిని నిలదీస్తుంది కూడా. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోడానికి నిప్పుల్లో దూకుతుంది. ఆ నాగరకత తాలూకూ మర్యాదలన్నీ ఈ సందర్భంలో మనకి తెలుస్తాయి. భర్తే వచ్చి తనని రక్షించాలి, తనకి పారిపోయే స్వతంత్రం ఉన్నా ఆ పని తను చెయ్యలేదు. భర్త తనకోసం రావడమే కాదు, పూర్తిగా శత్రువినాశనం చెయ్యాలి, శత్రువు సబాంధవంగా చచ్చిపోవాలి.</p>
<p>ఉత్తరకాండలో, ఆవిడ పాతివ్రత్యం మీద ప్రజలకి అనుమానాలు వచ్చినప్పుడు, ఆవిడమీద ఎంతో ప్రేమ ఉన్న రాముడు, విధిలేక ఆమెని అడవుల్లో వదిలేస్తాడు. లక్ష్మణుడు ఆవిడకి ఎంతో ప్రియమైన మరిది, వదినగార్ని తల్లితో సమానంగా పూజిస్తాడు &#8211; ఇది కూడా వ్యవసాయ నాగరకతల మర్యాదే. అడవిలో ఆమెని వదిలివస్తూ, అన్నగారితో ఏం చెప్పమన్నావు అంటాడు. దానికి సీత ఉక్రోషంగా &#8211; “ ఆ నిరంకుశుడికి సందేశం నువ్వు అడిగావు కాబట్టి, నీ మాట తీసెయ్యలేక చెప్తున్నాను &#8211; రాజ్యాన్నీ, ధర్మాన్నీ, ప్రజలనీ, తన ఆరోగ్యాన్ని కాపాడుకోమను, నా గురించి ఆలోచించవద్దని చెప్పు” అంటుంది. ఆ మాట అంటూనే, “మరీ కటువుగా అన్నానా?” అంటుంది. మరుక్షణంలో, “స్వర్గంలో శివపార్వతులు, భూమిమీద సీతారాములు” అనే కదా అందరూ అనే మాట అంటుంది. ఈ విధంగా, ఆవిడకి తన స్థానం ఏమిటో తెలుసు, రాముడు ఎందుకు తనని వదిలిపెట్టాల్సి వచ్చిందో తెలుసు, ఆయన నిస్సాహయత ఆవిడకి తెలుసు &#8211; ఎందుకంటే, ఆ నాగరకత తాలూకూ మర్యాదలన్నీ ఆమెకి తెలుసు కాబట్టి.</p>
<p>చివర్లో వాల్మీకి సీతని, లవకుశులని వెంటబెట్టుకుని రాముడి దగ్గరకి వస్తాడు. సీతకి మరోసారి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవలసి వస్తుంది. అయితే, ఈసారి సీత అనూహ్యంగా, తనని లోపలకి తీసుకొమ్మని భూమిని ప్రార్థిస్తుంది -. భూమి చీల్చుకుని, ఒక బంగారు సింహాసనం మీద భూదేవి వచ్చి, సీతని తనతో తీసుకుపోతుంది.</p>
<p>చివరకి, ఇక తననెవ్వరూ నమ్మరని, విసిగిపోయి కోపంతో నిష్క్రమిస్తుంది.</p>
<p>ఈ కథనే, తర్వాతి కవులు ఎన్నోరకాలుగా చెప్పారు &#8211; సీతారాములు విడిపోవడం ఏ కవికీ మింగుడు పడలేదు.. దిఙ్నాగుడి కుందమాల, భవభూతి ఉత్తరరామ చరిత్ర వీటిల్లో ముఖ్యమైన కథనాలు. ఈ ఇద్దరు కవులకీ, ఉత్తరకాండలో సీత నిష్క్రమణం నచ్చలేదు. ఎలోగోలా, సీతారాములని తిరిగి ఏకం చెయ్యడానికే ప్రయత్నించారు. దిఙ్నాగుడి కుందమాలలో ఒక సంభాషణ ఈ నాగరకతలోని స్త్రీ పాతివ్రత్యానికి నిర్వచనం లాంటిది:</p>
<p>అడవిలో లక్ష్మణుడు సీతని విడిచి వెళ్లిపోతాడు.</p>
<p>లక్ష్మణుడు వెళ్లాక, వాల్మీకి ఆవిడని చూస్తాడు. తనకి సాయం చెయ్యమని ఆయన్ని అడుగుతుంది.</p>
<p>“వర్ణాశ్రమధర్మాన్ని కాపాడే రాజే నిన్ను బహిష్కరిస్తే నీకు నేనెలా సాయం చెయ్యగలను” అంటాడు.</p>
<p>“నాకోసం కాకపోయినా, నా కడుపులో పెరుగుతున్న రఘువంశాంకురంకోసమైనా నాకు ఆశ్రయం ఇయ్య”మంటుంది.</p>
<p>“నువ్వు దశరథుడి కోడలివా” అంటాడు,</p>
<p>“అవును”, అంటుంది సీత.</p>
<p>“అయితే, సీతవి నువ్వేనా?” అని అడుగుతాడు.</p>
<p>“కాదు, నేను సీతని కాదు, నేనొక దురదృష్టవంతురాలిని” అంటుంది. (“నహీ సీతా భగవాన్, మందభాగినీ”)</p>
<p>ఈ సమాధానం ఈ నాగరకతని అర్థం చేసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారం. ఎప్పుడైతే, సీత తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోలేదో అప్పుడింక ఆవిడ సీత కాదు. పతివ్రత, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవలసిన బరువు ఆమే మొయ్యాలి &#8211; She is guilty until proven innocent. ఇది రామాయణ కథన వ్యాకరణంలో అతిముఖ్యమైన అంశం, వ్యవసాయ నాగరకతలకి ముఖ్యమైన అంశం ఇది.</p>
<p>ఎందుకంటే, భూమిని నమ్ముకుని బతికే కుటుంబాలు, ఉన్న ఊరిని వదిలేసి వెళ్లిపోలేవు, అందుకని వారికి కుటుంబ గౌరవం, పరపతి, పరువు చాలా ముఖ్యమైన ఆస్తులు, భూమి ఎంత విలువైనదో పరువు మర్యాదలు కూడా అంతే విలువైనవి. ఒకసారి, కుటుంబంలో ఎవరిమీదనైనా నింద పడితే, దాన్ని వదిలించుకోవడం అసంభవం, అంతే కాదు, ఒకసారి నిందపడిన కుటుంబం ఊరి వదిలివెళ్లిపోవలసిందే తప్పించి, అదే ఊరిలో బతకడం అసంభవం. ముఖ్యంగా స్త్రీ మీద అపవాదు వస్తే, దానిని పోగట్టుకోడానికి ఏదో అసంభవమైన కార్యం చెయ్యాలి, లేదో ఏ దైవ ఘటనో జరగాలి. అందుకనే, ఈ నాగరకతలో స్త్రీ-పాతివ్రత్యానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కట్టుబాటుకి లొంగిపోయి ఉండటం వల్ల ఆమె తన కుటుంబ మర్యాదని కాపాడే శక్తిని సంపాదిస్తుంది.</p>
<p>వ్యవసాయ నాగరకతలలోంచి వచ్చిన స్త్రీల రామాయణాలలో ఈ కథే కొంచెం వేరుగా ఉంటుంది. ఒక రామాయణ కథలో, లవకుశులు రామ లక్ష్మణులని యుద్ధంలో చంపేస్తారు, ఏమీ తెలియనట్టు సీతతో ఎవరో ఇద్దరు రాజులని యుద్ధంలో చంపేసామని చెప్తారు. సీత వచ్చి చూస్తుంది &#8211; చచ్చిపోయినవారు రామ లక్ష్మణులే అని గ్రహిస్తుంది. పాపం ఎంతో విలపిస్తుంది. వాల్మికి వచ్చి, తన తపశ్శక్తితో వారిని తిరిగి బతికిస్తాడు. రాముడు సీతనీ పిల్లలనీ తనతో వచ్చెయ్యమంటాడు, దానికి లవకుశులు ఒప్పుకోరు, తండ్రిని నానా మాటాలు అంటారు. సీత, వాల్మీకి, ఎంత వారించినా వాళ్లు వినరు. ఈ కథలు కూడా, వ్యవసాయ నాగరకతా మర్యాదలకి లోబడే ఉంటాయి. ఇందులో సీత తనని తాను రక్షించుకోలేదు, కానీ పిల్లలు తనకోసం తండ్రితో పోరాడుతారు.</p>
<p>ఈ విధంగా, వ్యవసాయ నాగరకత మర్యాదలని అనుసరించిన రామాయణ కథనాలన్నిటిలోనూ, పతివ్రత తనని తానే సృష్టించుకుంటుంది. ఆ పాతివ్రత్యంలోంచే ఆమె నాయకుడు, భర్త కూడా వస్తారు. ఈ విధంగా, సీత రాముడిని సృష్టిస్తే, ఆవిడ పాతివ్రత్యాన్ని నిరూపించుకునే అవకాశం ఆవిడకి కల్పిస్తూ, ఆమెని అమితంగా ప్రేమించినా అమె పాతివ్రత్యం సందేహంలో పడ్డప్పుడు ఆమెని త్యజించడానికి అశక్తుడవుతూ, ఆమెని రక్షించుకోడానికి సముద్రాలైనా దాటడానికి సిద్ధపడుతూ, రాముడు సీతని సృష్టిస్తాడు &#8211; ఇద్దరిదీ అవినాభావమైన, విడదీయలేని అనుబంధం.</p>
<p>అశోకవనంలో, రాముడిని ఎడబాసిన సీత &#8211; విశ్వాసం కోల్పోయిన శ్రద్ధలాగనూ, సందేహంలో పడ్డ స్మృతివాక్యంలాగనూ ఉందంటాడు వాల్మీకి! వారిద్దరి మధ్యా ఉన్న విడదీయలేని సంబంధాన్ని చూపించే గొప్ప కవితాత్మకమైన ఊహ అది. ఇదీ ఐతిహాస వాల్మీకంలోనూ, దానిని అనుసరించిన కావ్యాలలోనూ మనకి కనిపించే కథనం.</p>
<p>ఇరవయ్యో శతాబ్ధంలో, సంప్రదాయ విలువలన్నిటినీ ప్రశ్నిస్తూ, సమాజం వెనకబాటుతనాన్ని నిరసిస్తూ వచ్చిన రచనలు తెలుగులో ఎన్నో ఉన్నాయి.</p>
<p>ఈ కథనాలలో సీత ఒక మధ్యతరగతికి చెందిన, నగరాలలో ఉద్యోగం చేసుకునే స్త్రీ. అంటే, వ్యవసాయ నాగరకతని వదిలేసి, వ్యాపార నాగరకతలోకి వచ్చేసిన యువతి అన్నమాట. ఒక కథనంలో, ఆవిడ రావణుడిని ప్రేమిస్తుంది, రాముడి సూటిపోటి మాటలు పడలేక, పాతివ్రత్యాన్ని నిరూపించుకోడానికి అగ్నిలో దూకడం బదులు, రావణుడి చితిలో దూకుతుంది, ఇంకో కథనంలో తన మంగళసూత్రాలు అగ్నిలో విసిరేస్తుంది. ఈ కథలన్నీ, వ్యవసాయ నాగరకతలోని మర్యాదని అతిక్రమించిన కథలు.</p>
<p>ప్రతి నాగరకతకి కొన్ని మర్యాదలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఇవి కాలక్రమంలో మారుతూ ఉన్నా ఆ మార్పులు కూడా ఆ నాగరకత మౌలికమైన పునాదికి లోబడే ఉంటాయి. ఆ మర్యాదని అతిక్రమించే కథనాలలోని సీత సీత కాదు అంటారు నారాయణరావుగారు. ఒక రకంగా, ఈ కొత్త కథనాలలో కనిపించే సీత-పాత్రకి ప్రతీకలు మనకి వేరే కథల్లో ఉన్నారు &#8211; మహాభారతంలో ఉన్నారు, బృహత్కథలోనూ, గాథాశప్తశతిలోనూ ఉన్నారు, మరెన్నో జానపద కథల్లో ఉన్నారు.</p>
<p>ఇటువంటి ఆధునిక కథకులకి, మనకి మూడు నాగరకతలు ఉన్నాయనీ, వాటి మర్యాదలు వేరనీ అర్థం కాలేదు. దీంతో మనకి బోలేడు సమస్యలు వచ్చాయి &#8211; ముఖ్యంగా, మనకి వ్యవసాయ నాగరకత ఒక్కటే ఉన్నట్టూ, ఈ వ్యాసం మొదట్లో లవకుశ సినిమాలో వాల్మీకి చెప్పినట్టు, రామాయణం మన సంస్కృతికీ, మన నాగరకత అంతటికీ అదే పట్టుగొమ్మ అన్న ఒక బలమైన నమ్మకం మనలో పాతుకుపోవడం వల్లనూ, రామాయణాన్నే మనం ప్రశ్నిస్తుంటాం. రామాయణాన్నే, మన సంస్కృతికంతటికీ ప్రతీకగా భావించటంతో మన సంస్కృతిలో ఉన్న మరెన్నో నాగరకతలని విస్మరించటం, వాటి తాలుకూ కథనాలని పట్టించుకోకపోవటం జరుగుతోంది.</p>
<p>రామాయణ సంప్రదాయంలో రచయితల కల్పనకు జాగా వుంది. కంబన్‌, తులసీదాసు వంటి గొప్ప కవుల రామాయణాలు సాహిత్యపరంగా కూడ ప్రఖ్యాతాలు. కాని పదమూడు పందొమ్మిది శతాబ్దాల మధ్య తెలుగులో వచ్చిన కొన్ని కథనాలకి అంత గుర్తింపు రాలేదు. ఇంకొన్ని రామాయణాల కర్తలెవరో తెలియదు. అయినా వాటినీ రామాయణాలుగానే అంగీకరిస్తారు. మూల రామకథ నుంచి కవులు వాళ్ళ దేశకాలాలకు అనుగుణంగా రామాయణాల్ని తయారుచేసుకున్నారని ఈ బాహుళ్యత సూచిస్తుంది. వాల్మీకంగా చెప్పబడే రామాయణానికి కర్తలూ అలాటి వారే.</p>
<p>The present reinterprets the past to control the future అంటారు నారయణరావు. ఇతిహాస కథలని తిరిగి రాయడం, వాటిని కొత్తగా చెప్పటం, సమకాలీన సమస్యల మూలాలని గతంలో వెతకడం, ఆ అన్వేషణలో భాగంగా కొత్త మర్యాదలని సృష్టించుకోడానికి పాతకథలనే వాడుకోవడం మన సాహిత్య సంప్రదాయంలో భాగమే. దానికి, భారతీయ కథన సంస్కృతి జాగా కల్పిస్తుంది. వెయ్యి సంవత్సరాలకి పైగా, రామాయణంతో మన సమజానికి ఉన్న రాజకీయ, సామాజిక సంబంధం ఎన్నో రకాలుగా మారుతూ ఉన్నప్పటికీ, ఒక కథగా, కావ్యంగా అది మన భావనలో లోతుగా అల్లుకుపోయింది &#8211; ఎందుకంటే, ప్రధానంగా అది చాలా గొప్ప సాహిత్యం . అందులోని పాత్రలు, వారి వ్యక్తిత్వాలలోని అమాయకమైన కవిత్వం ఆ కథని ఎవరు, ఏ విధంగా చెప్పినా రక్తి కట్టిస్తూ ఉంటాయి. నిజానికి, రామాయణం ఒక ‘కథ’ మాత్రమే కాదనీ, అది ఒక భాష లాంటిదనీ, ఆ భాషలో వ్యక్తులు ఎన్నో విషయాలు చెప్పవచ్చునని అంటారు నారయణరావు.</p>
<p style="text-align: center;">***</p>
<p>ఇటువంటి కొత్త ఆలోచనలతో, లోతైన విశ్లేషణలతో, మౌలికమైన ప్రతిపాదనలతో కూడిన వ్యాసాలు మరో పదమూడు ఉన్నాయి ఈ పుస్తకంలో. మన చరిత్రనీ, సాహిత్య సంస్కృతినీ అర్థం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న ప్రతివారూ చదవవలసిన వ్యాసాలివి.</p>
<p>ముఖ్యంగా, ఇప్పుడు మన సాహిత్యం అంతా రెండు, మూడు వాదాల మధ్య ఇరుక్కుపోయింది. అన్నిరకాల వాదాలకీ, ఇజాలకీ అసింటా జరిగి, విశ్లేషణాత్మకంగా, లోతైన చారిత్రక అవగాహనతో రాసిన ఈ వ్యాసాలు భారత సాంస్కృతిక చరిత్రలోని వైవిధ్యాన్ని నిజాయితీగా, నిబ్బరంగా, విశాలమైన మేధా పరిధితో మనకి కొత్తగా పరిచయం చేస్తాయి. అందుకే సమగ్రంగా వీటిని చర్చించవలసిన అవసరం ఉంది.</p>
<p>కానీ, ఇంత విస్తృతమైన పనిచేసిన ఈ తెలుగు మేధావిని తెలుగు దేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చేసిన పనిమీద ఇప్పటివరకూ సమగ్రమైన, సున్నితమైన చర్చ జరగలేదు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలన్నీ ఎప్పుడో కిటికీలు మూసేసుకున్నాయి. తెలుగు పండితులు అష్టావధానాలకీ, టి.వి.ల్లో ప్రవచనాలకీ పరిమితమైపోయారు. ఇకపోతే, మనకి మేధావివర్గం అంటూ ఏదీ లేదు &#8211; న్యూస్ పేపర్లో వచ్చే సంఘటనలకి రాజకీయ, సామాజిక వ్యాఖ్యానాలే మనకి ఇప్పుడున్న మేధావితనం. అందుకని మూలాలని ప్రశ్నించి వ్యాఖ్యానించే ఆలోచనలు బహుశా ఎవరికీ అక్కరలేదేమో!</p>
<p>1980 నుంచీ 1994 వరకూ, ఇంగ్లీషులో Farside అని ఒక కామిక్ వచ్చేది. గారీ లార్సెన్ వేసేవాడు. ఆ కామిక్ అప్పట్లో చాలా కొత్తగా, సర్రియలిస్ట్ కామిక్ గా పేరు తెచ్చుకుంది. చాలామందికి అందులో కొన్ని కార్టూన్లు నచ్చేవి కాదు, అవి ఒక్కోసారి ఏహ్యం కలిగించేటట్టు ఉండేవి, ఎంతో మార్మికంగా ఉండేవి. దానిమీద ఎడిటర్లకి పాఠకులు కోపంతో రాసిన ఉత్తరాలే ఒక పుస్తకంగా వచ్చాయి కూడా.</p>
<p>అవన్నీ పుస్తక సంపుటంగా వచ్చినప్పుడు, ఆ సంపుటాలకి రాసుకున్న ముందుమాటలో, లార్సెన్ అద్భుతమైన ఒక మాట అంటాడు:</p>
<p>“ఏ కార్టూనిస్టయినా నిజంగా భయపడేది &#8211; కార్టూన్ చదివిన పాఠకుడి నుండి నిరాసక్తమైన, నిశ్శబ్దమైన ఆవలింత ఒక్కదానికే. పాఠకుడికి మనం వేసిన కార్టూన్ నచ్చకపోయినా అతన్ని కనీసం ఎక్కడో గుచ్చలేకపోతే ఆ కార్టూను కోసం ఖర్చుచేసిన సృజన శక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరే”</p>
<p>నారాయణరావు ప్రశ్నిస్తాడు, కొత్తగా వ్యాఖ్యానిస్తాడు, మనల్ని కలవరపెడతాడు తప్ప, బోరుకొట్టించడు. మనల్ని తనతో అంగీకరించమని శాసించడు, అన్ని ప్రశ్నలకీ పరిష్కారాలు చూపించి మనల్ని నిద్రపుచ్చడు. ముఖ్యంగా &#8211; మనల్ని బతిమాలడు.</p>
<p>I bet that in this book, you will meet a public intellectual, a prodigious scholar and a provocative thinker.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<div style="font-size: 13px;">సుమారుగా పాతికేళ్ల వ్యవధిలో ఎక్కడెక్కడో సంకలనాలలోనూ, ఎకడెమిక్ జర్నల్సులోనూ వచ్చిన వ్యాసాలన్నీ సేకరించి, నారాయణరావుగారిని బతిమాలి, ఆయన్ని విసిగించి, చివరికి ఒప్పించి, ఈ వ్యాసాలన్నీ ఈ పుస్తకరూపంలో ఒక సంకలనంగా తేవడానికి కారణమైన పట్టువదలని విక్రమార్కుడు, మిత్రుడు పరుచూరి శ్రీనివాస్ కి ఈ సందర్భంగా నా జోహార్లు.[1] Sheldon Pollock, “Ramayana and Political Imagination in India”, The Journal of Asian Studies, Vol 52, No.2, 1993<br />
[2] Sheldon Pollock,”Introduction”, Valmikiramayana, Book-2, Edited by Robert Goldman, Motilal Banarsi Das, 2007.<br />
[3] Velcheru NarayanaRao &#8211; “<a href="http://permanent-black.blogspot.in/2016/05/text-and-tradition-in-south-india.html" target="_blank">Text and Tradition in South India</a>”, Orient Blackswan, India, 2016.</p>
<p>ఈ సంకలనంలో వచ్చిన వ్యాసాలలో కొన్ని ఈమాటలో తెలుగు అనువాదాలుగా ఇప్పటికే వచ్చాయి:<br />
<a href="http://eemaata.com/em/issues/201201/1895.html" target="_blank">ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన</a><br />
<a href="http://eemaata.com/em/issues/200309/471.html" target="_blank">తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు</a><br />
<a href="http://eemaata.com/em/issues/201203/1917.html" target="_blank">సీత గడియ</a><br />
<a href="http://eemaata.com/em/issues/201205/1956.html" target="_blank">లక్ష్మణదేవర నవ్వు</a><br />
<a href="http://eemaata.com/em/issues/201305/2101.html" target="_blank">మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు</a><br />
<a href="http://eemaata.com/em/issues/201307/2182.html" target="_blank">మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2</a><br />
<a href="http://eemaata.com/em/issues/201303/2071.html" target="_blank">తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం</a></p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11490</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>గజీతగాడు</title>
		<link>http://vaakili.com/patrika/?p=11223</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11223#comments</comments>
		<pubDate>Tue, 31 May 2016 21:55:45 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కవిత్వం]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11223</guid>
		<description><![CDATA[ఉదయాలన్నీ, షరా మామూలే <br/>
మాజిక్ ఫ్లూట్ సంచిలో వేసుకుని <br/>
మోహనగీతం విరజిమ్ముతూ <br/>
పగిలిన ముక్కలన్నీ పెద్దరికంతో అంటించుకుని <br/>
గుండెతడిని బతికించుకోడం కోసం <br/>
ఉక్కిరిబిక్కిరి పనిలో ఊపిరాడకపోవడం <br/>
ఎంత సుఖం!! <br/>
 <br/>
ఆత్మని తడిమే ఒక్క కవితకోసం వెంపర్లాట <br/>
ఏటిగట్లన్నీ నిరాకరించిన కన్నీటిపాట 
]]></description>
			<content:encoded><![CDATA[<div style="padding-left: 5em; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">దూ</span>రమైన అనుబంధంలో అపార్థంగా గుచ్చుకుని<br />
అక్కడే మరణించిన రహస్యాన్నీ<br />
ఎవరి కథలోనో పాత్రగా చతికిలబడి<br />
అర్థాంతరంగా ముగిసిపోయిన సశేషాన్నీ<br />
కొన్ని మాయదారి సాయంకాలాలు మోసుకొస్తుంటాయి</p>
<p>నల్లరాతి గోడల మధ్య ఇరుక్కున్న పదబంధాలతోనూ<br />
కవితలో ఇమడడానికి కత్తిరించబడ్డ కవిత్వ శకలాలతోనూ<br />
చీకటి ఉచ్చులు పన్ని<br />
నెగడుచూపుల రాత్రుళ్లు వేటాడుతుంటాయి<br />
బండరాతిమీద గుండె పగిలిన వర్షపు చినుకులై<br />
కళ్ళు రెండూ చిప్పిల్లుతాయి</p>
<p>చెమ్మగిల్లిన ఆకాశంలోకి తూటాని విసిరి<br />
వెనక్కివాలి ఊపిరిపీల్చుకున్న తుపాకీలా తేలికపడతాను</p>
<p>ఉదయాలన్నీ, షరా మామూలే<br />
మాజిక్ ఫ్లూట్ సంచిలో వేసుకుని<br />
మోహనగీతం విరజిమ్ముతూ<br />
పగిలిన ముక్కలన్నీ పెద్దరికంతో అంటించుకుని<br />
గుండెతడిని బతికించుకోడం కోసం<br />
ఉక్కిరిబిక్కిరి పనిలో ఊపిరాడకపోవడం<br />
ఎంత సుఖం!!</p>
<p>ఆత్మని తడిమే ఒక్క కవితకోసం వెంపర్లాట<br />
ఏటిగట్లన్నీ నిరాకరించిన కన్నీటిపాట</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11223</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఎదారి</title>
		<link>http://vaakili.com/patrika/?p=10969</link>
		<comments>http://vaakili.com/patrika/?p=10969#comments</comments>
		<pubDate>Sat, 30 Apr 2016 19:57:33 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కవిత్వం]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=10969</guid>
		<description><![CDATA[<p>వట్టిపోయింది తేనెతుట్టె<br /> ఒకటో రెండో తేనెటీగలు<br /> గుచ్చి చూడడానికే<br /> వచ్చిపోతుంటాయి</p> <p>నదిమీదకి ఒరిగిన చెట్టునీడ<br /> ఒకనాటి జ్ఞాపకం<br /> ఒరవడిలో నిలవలేనిది ఒకటి<br /> నీటిబొట్లన్నీ ఆకులైతేగానీ<br /> కదలలేనిది మరొకటి</p> <p>లోకం చేతిలో విరచబడి, మలచబడి<br /> అనేకంగా అమ్ముడుపోయింది అస్తిత్వం<br /> ఇక శరీరమొక్కటే పగలని నిజం</p> <p>వాక్యాన్ని ఆపే విరామచిహ్నం<br /> మొండిది, ఎంత తోసినా జరగదది<br /> మాసిపోయిన గతానికి, కాబోయే గాయాలకీ<br /> మధ్య చక్కని చుక్కలా జీవితం </p> <p>నమ్మకానికీ, సందేహానికీ మధ్య<br /> చీలిన దారిదగ్గర, చిరిగిన డేరాలో<br /> కుప్పకూలిన ఒంటెతో<br /> శరణార్థిగా<br /> నేను</p> <p style="text-align: center;">*</p>]]></description>
			<content:encoded><![CDATA[<div style="padding-left: 5em; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">వ</span>ట్టిపోయింది తేనెతుట్టె<br />
ఒకటో రెండో తేనెటీగలు<br />
గుచ్చి చూడడానికే<br />
వచ్చిపోతుంటాయి</p>
<p>నదిమీదకి ఒరిగిన చెట్టునీడ<br />
ఒకనాటి జ్ఞాపకం<br />
ఒరవడిలో నిలవలేనిది ఒకటి<br />
నీటిబొట్లన్నీ ఆకులైతేగానీ<br />
కదలలేనిది మరొకటి</p>
<p>లోకం చేతిలో విరచబడి, మలచబడి<br />
అనేకంగా అమ్ముడుపోయింది అస్తిత్వం<br />
ఇక శరీరమొక్కటే పగలని నిజం</p>
<p>వాక్యాన్ని ఆపే విరామచిహ్నం<br />
మొండిది, ఎంత తోసినా జరగదది<br />
మాసిపోయిన గతానికి, కాబోయే గాయాలకీ<br />
మధ్య చక్కని చుక్కలా జీవితం </p>
<p>నమ్మకానికీ, సందేహానికీ మధ్య<br />
చీలిన దారిదగ్గర, చిరిగిన డేరాలో<br />
కుప్పకూలిన ఒంటెతో<br />
శరణార్థిగా<br />
నేను</p>
<p style="text-align: center;">*</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=10969</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>Why is Sex Fun?</title>
		<link>http://vaakili.com/patrika/?p=10713</link>
		<comments>http://vaakili.com/patrika/?p=10713#comments</comments>
		<pubDate>Thu, 31 Mar 2016 22:22:17 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[గెస్ట్ ఎడిటోరియల్]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=10713</guid>
		<description><![CDATA[<p>‘చిత్తకార్తె కుక్క’ అంటాం కానీ, నిజానికి మనల్ని చూసే కుక్కలు ఆ మాట అనుకోవాలి. ఓ జిరాఫీవో, ఓ కుక్కో, ఓ సింహమో మన సెక్సువల్ సంబంధాలపై అభిప్రాయం చెప్పాల్సి వస్తే, మనల్ని చూసి “నవ్విపోతాయి” &#8211; “వీళ్ళేంటీ, ఎవరికీ కనిపించకుండా, అంత రహస్యంగా సెక్సులో పాల్గొంటారూ, ఒక్క వ్యక్తితోనే జీవితాంతం కలిసుంటారూ, సంవత్సరమంతా, సంతానోత్పత్తితో సంబంధంలేకుండా అనవసరమైన సెక్సుపై వీళ్లకెందుకంత కుతి చెప్మా?” అనుకుంటాయేమో.</p> <p>ఇదే శీర్షికతో పుస్తకం రాసిన జారడ్ డైమెండ్, మానవుల సెక్సువాలిటిలో ప్రత్యేకతలని టూకీగా ఈ విధంగా చెప్తాడు:</p> మానవులలో, అత్యధికశాతం స్త్రీ-పురుషులు దీర్ఘకాల దాంపత్యానికి కట్టుబడతారు. ఈ ఒడంబడిక కేవలం వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాక, చుట్టూ ఉన్న సమాజం కూడా వారిద్దరి ఒప్పందాన్ని గుర్తిస్తుంది. వివాహం కేవలం సెక్సువల్ సంబంధం మాత్రమే కాకుండా, పుట్టిన పిల్లల పెంపకంలో కూడా స్త్రీ-పురుషులు ఇద్దరూ సమాన భాగస్వామ్యం స్వీకరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా, స్త్రీ-పురుషుల మధ్య సెక్సు ఒక ప్రెవైటు వ్యవహారం &#8211; అది పబ్లిగ్గా, అందరి ముందూ జరిగే వ్యవహారం కాదు. It is a personal and private affair confined to closed door bedrooms. స్త్రీలలో అండోత్పత్తి రహస్యంగా ఉంటుంది &#8211; ఎప్పుడు స్త్రీ అండోత్పత్తికి సిద్ధంగా ఉందో బయటకి తెలియదు. (చాలా జంతువులలో, అండోత్పత్తి జరుగుతున్నప్పుడు వాటి శరీరంలో మార్పు వస్తుంది, అది కనడానికి సిద్ధంగా ఉందనే సంగతి మగ-జంతువుకి బాహాటంగా తెలుస్తుంది. వాటి మధ్య సంయోగం అప్పుడే జరుగుతుంది). అండోత్పత్తి రహస్యంగా ఉండటం వల్ల మగవాడికి ఎప్పుడు సంతానోత్పత్తి జరుగుతుందో తెలియదు. అంతే కాకుండా, స్త్రీ అన్ని రోజులలోనూ ‘రతికి’ సిద్ధంగా ఉంటుంది. అందుమూలంగా, చాలావరకూ స్త్రీ-పురుషుల సంభోగం సంతానం కోసం మాత్రమే కాకుండా, అది ఆనందాన్నిచ్చే రాసక్రీడగా మారింది. ఇది మానవుల పరిణామంలో చాలా ముఖ్యపాత్రని పోషించింది. అన్నిటికంటే చిత్రమైన విషయం &#8211; స్త్రీలకి ఒక వయస్సు దాటిన తర్వాత [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">‘చి</span>త్తకార్తె కుక్క’ అంటాం కానీ, నిజానికి మనల్ని చూసే కుక్కలు ఆ మాట అనుకోవాలి. ఓ జిరాఫీవో, ఓ కుక్కో, ఓ సింహమో మన సెక్సువల్ సంబంధాలపై అభిప్రాయం చెప్పాల్సి వస్తే, మనల్ని చూసి “నవ్విపోతాయి” &#8211; “వీళ్ళేంటీ, ఎవరికీ కనిపించకుండా, అంత రహస్యంగా సెక్సులో పాల్గొంటారూ, ఒక్క వ్యక్తితోనే జీవితాంతం కలిసుంటారూ, సంవత్సరమంతా, సంతానోత్పత్తితో సంబంధంలేకుండా అనవసరమైన సెక్సుపై వీళ్లకెందుకంత కుతి చెప్మా?” అనుకుంటాయేమో.</p>
<p>ఇదే శీర్షికతో పుస్తకం రాసిన జారడ్ డైమెండ్, మానవుల సెక్సువాలిటిలో ప్రత్యేకతలని టూకీగా ఈ విధంగా చెప్తాడు:</p>
<ol>
<ol>
<li>మానవులలో, అత్యధికశాతం స్త్రీ-పురుషులు దీర్ఘకాల దాంపత్యానికి కట్టుబడతారు. ఈ ఒడంబడిక కేవలం వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాక, చుట్టూ ఉన్న సమాజం కూడా వారిద్దరి ఒప్పందాన్ని గుర్తిస్తుంది.</li>
<li>వివాహం కేవలం సెక్సువల్ సంబంధం మాత్రమే కాకుండా, పుట్టిన పిల్లల పెంపకంలో కూడా స్త్రీ-పురుషులు ఇద్దరూ సమాన భాగస్వామ్యం స్వీకరిస్తారు.</li>
<li>అన్నిటికంటే ముఖ్యంగా, స్త్రీ-పురుషుల మధ్య సెక్సు ఒక ప్రెవైటు వ్యవహారం &#8211; అది పబ్లిగ్గా, అందరి ముందూ జరిగే వ్యవహారం కాదు. It is a personal and private affair confined to closed door bedrooms.</li>
<li>స్త్రీలలో అండోత్పత్తి రహస్యంగా ఉంటుంది &#8211; ఎప్పుడు స్త్రీ అండోత్పత్తికి సిద్ధంగా ఉందో బయటకి తెలియదు. (చాలా జంతువులలో, అండోత్పత్తి జరుగుతున్నప్పుడు వాటి శరీరంలో మార్పు వస్తుంది, అది కనడానికి సిద్ధంగా ఉందనే సంగతి మగ-జంతువుకి బాహాటంగా తెలుస్తుంది. వాటి మధ్య సంయోగం అప్పుడే జరుగుతుంది). అండోత్పత్తి రహస్యంగా ఉండటం వల్ల మగవాడికి ఎప్పుడు సంతానోత్పత్తి జరుగుతుందో తెలియదు. అంతే కాకుండా, స్త్రీ అన్ని రోజులలోనూ ‘రతికి’ సిద్ధంగా ఉంటుంది. అందుమూలంగా, చాలావరకూ స్త్రీ-పురుషుల సంభోగం సంతానం కోసం మాత్రమే కాకుండా, అది ఆనందాన్నిచ్చే రాసక్రీడగా మారింది. ఇది మానవుల పరిణామంలో చాలా ముఖ్యపాత్రని పోషించింది.</li>
<li>అన్నిటికంటే చిత్రమైన విషయం &#8211; స్త్రీలకి ఒక వయస్సు దాటిన తర్వాత ఋతుస్రావం ఆగిపోతుంది &#8211; అంటే అండోత్పత్తి ఇక జరగదు.</li>
</ol>
</ol>
<p>ఈ లక్షణాలన్నీ మానవులకి మాత్రమే ప్రత్యేకమైన లైంగిక చిహ్నాలు.</p>
<p>అసలు ప్రశ్నఏమిటంటే &#8211; మానవుడి పరిణామంలో ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? వీటి అవసరం పరిణామవాద సిద్ధాంతం ప్రకారం ఎలా వివరించాలి? పరిణామవాదం ప్రకారంగా చూసినా, మానవుల సెక్సువాలిటి చాలా చిత్రమైనది.</p>
<p>Every being is driven to produce as many offspring as possible. Therefore, for a male, it is in its interest to have sex with as many females as possible and vice versa. That ensures maximum gene pool.</p>
<p>కాని, (అధికశాతం) మానవులెందుకు ఒకే వ్యక్తితో జీవితాంతం ఉంటారు? ఎందుకు స్త్రీలలో అండోత్పత్తి జరిగే సమయం రహస్యంగా ఉంటుంది? మానవులెందుకు సెక్సుని సంతానోత్పత్తి కోసం కాకుండా రాసక్రీడగా మలచుకున్నారు? మెనోపాస్ ఆవశ్యకత ఏమిటి?</p>
<p>మగా,ఆడ జీవాలు ఒక పిల్లని పెట్టాక, దాని మానాన దాన్ని వదెలేసి వెళ్ళిపోయాయనుకుందాం. పుట్టిన పిల్ల దానంతట అదే పెరిగి పెద్దదైపోగలదనుకుందాం. అటువంటప్పుడు, తల్లి తండ్రులిద్దరికీ సంతానం విషయంలో ఏ పట్టింపూ లేకుండా వదిలేసి వెళ్లిపోతాయి. కానీ, కొంతకాలమైనా తల్లి తండ్రులలో ఎవరో ఒకరు సాకందే పుట్టిన సంతానం పెరిగి పెద్దదై తన కాళ్లమీద తాను నిలబడలేదు. దీన్ని ‘weaning off period’ అంటాం. ఈ పని సాధారణంగా ఆడ జంతువే చేస్తుంది &#8211; ఎందుకంటే, దాని కడుపులోనే సంతానం పెరుగుతుంది, తర్వాత పాలిచ్చి సాకాల్సింది కూడా అదే. అందుకే, చాలా స్తన్యజీవాల్లో మగదానికి సంతానాన్ని సాకడంలో ఏ పాత్రా ఉండదు.</p>
<p>అందుకని, ఒకసారి పుట్టిన సంతానాన్ని బతికించుకోగలిగే వరకూ, తల్లి-తండ్రుల్లో ఎవరో ఒకరు కొత్తగా సంతానోత్పత్తికోసం ప్రయత్నించడం వదులుకోవాలి. అదే, మానవుల్లో &#8211; పుట్టిన బిడ్డ తన కాళ్ల మీద తను నిలపడగలగడానికి కనీసం పన్నెండు నుంచీ పదిహేను సంవత్సరాలైనా పడుతుంది. ఆధునిక సమాజాలలో ఇది ఇరవై ఏళ్లకన్నా పైమాటే! అంటే, పదిహేనేళ్ళలో ఏ నలుగురైదుగురో కంటే ఎక్కువమంది సంతానాన్ని కనడం వీలుపడదు.</p>
<p>This is a very big investment for the female. అందుకని, స్త్రీకి పిల్లలని పెంచడంలో మగవాడిని కూడా బాధ్యుడిని చెయ్యగలిగితే పిల్లలని పెంచడంలో తాను చేస్తున్న త్యాగానికి కొంత ఫలితం ఉంటుంది. కొన్ని సంవత్సరాలపాటు మగవాడిని పిల్లలపెంపకంలో బాధ్యుడిని చెయ్యాలంటే ఎలా? మగవాడిని దీర్ఘకాలిక భాగస్వామిగా చేసుకోడానికే అండోత్పత్తి రహస్యం కావడం, సెక్సు ప్రైవైటు వ్యవహారం కావడం, ముఖ్యంగా సెక్సు ఒక రాసక్రీడగా మారడం జరిగిందంటారు పరిణామ జీవశాస్త్రజ్ఞులు.</p>
<p>ఇక మెనోపాస్ అవసరం ఎందుకు? ఎందుకని స్త్రీ సంతానోత్పత్తి అవకాశాన్ని వదులుకుంటుంది? దీనికి మానవులలో పిల్లలు పెరిగి పెద్దవాళ్లవడానికి చాలా సమయం పట్టడమే కారణం. అదీ కాకుండా, పెద్ద వయసు వచ్చాకా &#8211; గర్భదారణ ప్రమాదకరం కాబట్టి, కొత్తగా సంతానాన్ని కని, పెంచే బదులు, మనుమలని పెంచడంలో భాగస్వామి కావడం “బెటర్-ఛాయస్” అవుతుంది.</p>
<p>క్లుప్తంగా, స్త్రీకి పిల్లలని పెంచడం దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి దాంట్లో మగవాడిని కూడా భాగస్వామిగా చెయ్యడానికి సెక్సు ఒక క్రీడగా మారింది.</p>
<p>Sex had to become ‘fun’ so as to provide the evolutionary basis for the formation of long term marital relation between male and female humans.</p>
<p>సంతానోత్పత్తే పకృతి పరంగా ప్రతిజీవికి పరమార్థం అయినప్పుడు, ఈ మార్పువల్ల మగజీవికి ఒక రకంగా చాలా నష్టం జరుగుతుంది. మగవాడికి, ఒక్కసారి జరిగే వీర్యస్ఖలనంలోనే సుమారుగా 20 మిలియన్ల వీర్యకణాలు విడుదల అవుతాయి, అంటే, ఒకే భాగస్వామితో ఉండటం వల్ల, ఆమె గర్భం ధరించిన తొమ్మిది నెలల్లో సుమారుగా 500 మిలియన్ వీర్యకణాలు అతనికి సంతానోత్పత్తికి పనికిరాకుండా వృధా అవుతాయి.</p>
<p>This is the trick that nature played on human male. Perhaps, this deep loss drives the primal need of human male to dominate and control the female.</p>
<p style="text-align: center;">***</p>
<p>కానీ, మనిషి మిగిలిన జంతువుల్లా కాక, వివేచించగలడు (Sentient Being). అందుకని, మనిషికి శారీరక, లైంగికావసరాలే కాకుండా, ప్రేమానురాగాలు, అనుబంధాలు, ఆత్మానందమూ కూడా అవసరమే. ఎన్నో లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలోంచీ వివేచించగలిగే ఆధునిక మానవుడు ఎదిగినా, ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి, బయాలజీ ఆఫ్ సెక్సుకీ, బయాలజీ ఆఫ్ లవ్ కీ మనకి ఇంకా ప్రస్ఫుటమైన తేడా తెలియదు.</p>
<p>మనుషుల్లో సెక్సుకి సంబంధించిన హార్మోన్లు, ప్రేమానురాగాలకి, ఆత్మానందానికి సంబంధించిన హార్మోన్లు వేరుగా ఉంటాయని ఇప్పుడు మనకి తెలుసు. టెస్టోస్టోరీన్, ఎస్ట్రోజెన్ అనేవి లస్ట్ హార్మోన్లు అయితే, డోపామైన్, ఆక్సిటోసీన్లని ‘ప్రేమానురాగాల” హార్మోన్లు అనుకోవచ్చు. ఇక, సెరిటోనిన్ హార్మోన్ “ఆత్మానందం” కలిగించే హార్మోన్ గా అనుకోవచ్చు.</p>
<p>ఉదాహరణకి, మీ అత్యంత సన్నిహితుడైన స్నేహితుడితోనో, స్నేహితురాలితోనో మీరు ఒక సాయంత్రం ఇష్టంగా గడిపారు అనుకోండి &#8211; ఆ అనుభూతి మీలో డోపామైన్, ఆక్సిటోసీన్ హార్మోన్లని విడుదల చేస్తుంది. భార్యాభర్తలు ఎంతోకాలం ప్రేమానురాగాలతో సంసారం చెయ్యడానికి, లస్ట్ హార్మోన్ల కంటే, ఈ సాహచర్యాన్ని పెంపొందించే హార్మోన్లే ఎక్కువ అవసరం. ఇక సెరిటోనిన్ హార్మోన్ మనల్ని సమాజంతో, అర్థవంతంగా మనగలిగేటట్టు చేస్తుంది &#8211; మనిషికి, తన అవసరం తన చుట్టుపట్లవారికి ఉందనే నమ్మకం ఎంతో భధ్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది.</p>
<p>అభివృద్ధి చెందిన డెమోక్రాటిక్ సమాజాల్లో, ఇప్పటికే చాలామంది వివాహానికి దూరంగా ఉంటూ, స్నేహితులతోనూ, సమాజంలో గుర్తింపు తెచ్చుకునే విధంగా జీవితాశయాలని మలచుకోవడం మూలంగానూ, సాహచర్యాన్నే ఎక్కువ కోరుకుంటున్నారు.</p>
<p style="text-align: center;">***</p>
<p>Literature begins where biology ends!!<br />
Memes are more powerful than genes,<br />
Literature creates new memes.</p>
<p>ఇప్పుడు, స్త్రీ-పురుష సంబంధాలమీదా, ముఖ్యంగా వివాహేతర లైంగిక సంబంధాలమీదా తెలుగులో ఎన్నో కథలు, రచనలూ వస్తున్నాయి. కానీ, ఇవన్నీ చాలావరకూ పైపైన ఉన్న సమస్యలనే రకరకాలుగా వ్యక్తీకరిస్తున్నాయి గానీ, మనకి కొత్త “మీమ్స్” ని ఇవ్వలేకపోతున్నాయి.</p>
<p>సాహిత్యం ఎదగనంత కాలం, సంస్కృతి కూడా ఎదగదు.</p>
<p>ఉదాహరణకి, మనం సొంత కుటుంబ సభ్యులని కామదృక్కులతో చూడలేం. కానీ జంతువులకి ఆ నియమేమీ ఉండదు కదా? కొన్ని ప్రాచీన సమాజాలలో, ముఖ్యంగా రాజవంశాలలో, రాజు తన కూతుర్నో, లేదా సోదరినో పెళ్లి చేసుకునేవాడు. కాని, అటువంటివి ఇప్పుడు మనకి ఆలోచించడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, అది సాహిత్యం సృష్టించిన ‘మీమ్’.</p>
<p>స్త్రీ-పురుషుల మధ్య శృంగారంకి మించిన అనురాగం, ప్రేమ సాధ్యమేనన్న మధ్యతరగతి ‘మీమ్స్’ ని 50-70 దశకాలలో వచ్చిన సినిమాలే మనకిచ్చాయి &#8211; రాజేష్ ఖన్నాలు, అక్కినేని నాగేశ్వరరావులు, శోభన్ బాబులు, సావిత్రులు &#8211; వారు నటించిన “సోషల్ ఫాంటసీ డ్రామాలు”, చాలా పెద్ద సాంస్కృతిక మార్పుకి దోహదం చేసాయి. అంతకుముందు మనకి సాహిత్యంలో, ధీరోదాత్తులు, ధృడచిత్తులూ అయిన హీరోలు, వెన్నెల సోకినా కందిపోయే సుకుమారత్వంతో నలిగిపోయే హీరోవీనులే ఉండేవారు.</p>
<p>జంతు సహజమైన సంతానోత్పత్తే జీవిత పరమార్థం అనే ప్రకృతి సూత్రాన్ని మనిషి, సామాజికంగానే కాకుండా, బయలాజికల్గా కూడా అధిగమించాడు &#8211; మానవులలో గే, లెస్బియన్ సంబంధాలు, వాటిని ప్రజాస్వామ్య సమాజాలు ఇప్పుడు గౌరవించడం అనేది మానవుడి పరిణామ క్రమంలో వచ్చిన చాలా పెద్ద మార్పు. ఈ మార్పులకి సంబంధించిన సాంస్కృతిక అవగాహన ఇంకా మనలో లేదు.</p>
<p>అయితే, సెక్సుకి సంబంధించి ఇప్పటికీ మారని ‘మీమ్’ ఒకటుంది మనకి. అనాదిగా, మనలో పాతుకుపోయిన ఆటవిక ప్రవృత్తి వల్ల కావొచ్చు, ఇప్పటికీ పురుషుడు ‘ఆక్రమించుకోవడం’, స్త్రీ ఇష్టంగానో, కష్టంగానో లొంగిపోవడం అనేదే primary sexual act మన సాహిత్యంలో &#8211; దీన్నే రకరకాలుగా తిప్పి, తిప్పి, తిరగేసి వడ్డిస్తూ ఉంటాం ఇప్పటికీ!</p>
<p>ఉదాహరణకి, వసుచరిత్ర చివర్లో వసురాజు, గిరికల శృంగార వర్ణన చూడండి &#8211; ఆమెని “నీకు సిగ్గెందుకూ” అంటూ, ఆమె అంగాంగాలనీ అదేపనిగా తడుముతాడు, మూలధనం పతి హరించగానే, ఆమె అతని చేతులలో చిక్కిపోయి ముద్దరాలుగా మిగిలిపోయిందట, ఆత్మసురక్షణానికి నియోగించిన సేవకులు ఆమెని పరాధీనం చేసారు అంటాడు కవి. ఈ వర్ణన పూర్తిగా చదివితే, ఈ మధ్య కొన్ని వందలకోట్లు పెట్టి హాలివుడ్ స్థాయిలో తీసిన తెలుగు సినిమాలో పాట ఒకటి గుర్తుకొస్తోందంటే &#8211; ఐదువందల సంవత్సరాల తర్వాత కూడా మన ‘ఇమాజినేషన్”లో మార్పేం రాలేదన్నమాటేగా?</p>
<p>మ. కరళాధార మతి ప్రవాళశయగుస్తంబంచు నభ్యంతర<br />
స్మరుడుత్తంభిత కంపలోల పటసంజ్ఞం బిల్వ బాలాపయో<br />
ధర దుర్గంబు గ్రహించె రాజకర మే తజ్జాతసంత్రాస వై<br />
ఖరి దెల్పె జఘన స్థలీవరణ జాగ్రద్ఘంటికాఘోషముల్</p>
<p>ఉ. తొయ్యలి ముద్దరాలు కుచ దుర్గములాత్మశయైక వంచనన్<br />
నెయ్యపు రేని పాల్పరిచి నీవియు గోల్పడగా దలంచె గా<br />
కయ్యెడ నేలకోయునిచె నాత్మశయ ద్వితయంబు మున్నెలో<br />
నయ్యె పరాగమై నృపక రార్పణకింక బెనంగ నేర్చునే!</p>
<p>I think it is time to knock such metaphors to rest and create some new memes based on equality and mutual consent.</p>
<p style="text-align: center;">***</p>
<p>వసంతం వచ్చిందంటే ప్రకృతి కొత్తగా మొగ్గతొడుగుతుంది, పువ్వులతో, పళ్లతో పులకరిస్తుంది, మోడువారిన శిశిరాన్ని మరచిపోయి, ప్రకృతంతా ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తుంది.ఈ వసంతాగమనాన్ని వర్ణించే చాలా గొప్ప వర్ణనలో ఒకటిగా మన సాహిత్యంలో నిలిచిపోయింది, వసుచరిత్రలోని మధుమాస వర్ణన:</p>
<p>సీ. లలనా జనాపాంగ వలనావసదనంగ<br />
తులనాభి కాభంగ దోః ప్రసంగ<br />
మలసానిలవిలోల దళ, సాసవరసాల<br />
ఫలసాదరశుకాలాపన విశాల<br />
మలినీ గరుదనీకమలినీ కృతధునీ, క<br />
మలినీ సుఖిత కోకకుల వధూక<br />
మతికాంత సలతాంత, లతికాంత రనుతాంత<br />
రతికాంత రణతాంత సుతనుకాంత</p>
<p>తే. మకృతకామోదకురవకా వికల వకుళ<br />
ముకుల సకల వనాంత ప్రమోద చలిత<br />
కలిత కలకంఠకులకంఠ కాకలీవి<br />
భాసురము పొల్చె మధువాస వాసరంబు!</p>
<p>ఈ అద్భుతమైన వసంతకాల వర్ణనతో పాఠక మిత్రులందరికీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p><span style="font-size: 13px;"><br />
[1] Jared Diamond, “Why Sex is Fun?”<br />
[2] Desmond Morris, “The Naked Ape”<br />
[3] <a href="http://www.youramazingbrain.org/lovesex/sciencelove.htm" target="_blank">http://www.youramazingbrain.org/lovesex/sciencelove.htm</a><br />
[4] <a href="http://theutopianlife.com/2014/10/14/hacking-into-your-happy-chemicals-dopamine-serotonin-endorphins-oxytocin/" target="_blank">Hacking Into Your Happy Chemicals</a><br />
[5] <a href="https://en.wikipedia.org/wiki/Biological_basis_of_love" target="_blank">Biological basis of love</a><br />
</span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=10713</wfw:commentRss>
		<slash:comments>27</slash:comments>
		</item>
		<item>
		<title>ఇసుక పరదాలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=10350</link>
		<comments>http://vaakili.com/patrika/?p=10350#comments</comments>
		<pubDate>Sun, 31 Jan 2016 23:00:42 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[గెస్ట్ ఎడిటోరియల్]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=10350</guid>
		<description><![CDATA[<p>మాటలు మాటలు మాటలు<br /> చేతివేళ్లలోంచి<br /> జలతారుగా జారిపోయే<br /> పసిడి పూతల ఇసుక పరదాలు</p> <p>శీతాకాలం ఉదయం,<br /> నూతిని మింగేసిన పొగమంచు పూసలు</p> <p>సిగరెట్టు దమ్ములా<br /> మెదడంతా కమ్ముకున్న బొగ్గు చారికలు.</p> <p style="text-align: center;">***</p> <p>Let me make a confession. I am an expert user and was also a profound victim of the Internet Chat Window.</p> <p>జీ-టాక్ వచ్చిన కొత్తలో అదో మత్తు. ఎవరెవరో, ముక్కు మొహం తెలియని వాళ్ళతో, మొదటి పరిచయంలోనే ఒక్క అరగంటలో ఏదో జన్మాంతర పరిచయం ఉన్నట్టు మా పెరట్లో నందివర్ధనం మొక్క దగ్గరనుంచీ, బెంగలూరులో ‘ది బెస్టు మసలా దోసె’ ఎక్కడ దొరుకుతుందో ఉచిత సలహాల వరకూ అన్నీటికి వీలుండేది ఆ రెండించీల విండోలో. ఎంతో మేలు చేసిన స్నేహాలు, మరెంతోగానో ఉపయోగపడ్డ సంభాషణలతో పాటూ, ఆ చిన్ని చాట్ విండో వెనకాల చేసిన యుద్ధాలు, కుప్పగూలిపోయిన స్నేహాలు కూడా ఉన్నాయి. ఐదేళ్ళపాటు పదిలంగా కట్టుకున్న నమ్మకం పునాదులు ఐదు నిమిషాల తొందరపాటుతో బీటలువారడం కూడా నాకు స్వానుభవమే.</p> <p>రెండు ఇంచీల వెడల్పూ, ఇంచిన్నర పొడుగు ఉన్న ఆ చతురస్రాకారపు కిటికీ ఇప్పుడు ప్రపంచాన్ని అంతే చిన్నది చేసేసింది &#8211; మనుషులూ, మానవ సంబంధాలు కూడా అంతే కురచ అయిపోయాయేమో కూడా! ఒకప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే దానికో సమయమూ, సందర్భమూ ఉండేవి, సంభాషణకి కొన్ని పద్ధతులూ, ప్రోటోకాల్స్ ఉండేవి. ఇప్పుడు, మన పేరుపక్కన ఒక చిన్న ఆకుపచ్చని చుక్క కనిపిస్తే, ఎప్పుడైనా మాట్లాడేయొచ్చు, ఏదైనా మాట్లాడేయొచ్చు.</p> <p>ఈమెయిలు పంపాలంటే సంగతీ సందర్భం అవసరం. అది పాతకాలం ఉత్తరానికి, కొత్తతరం మేకప్పు. కానీ చాట్-విండో అలా కాదు &#8211; ఇందులో పలకరింపులు, మాటలు, ఊసులు, ఊహలు, పుకార్లు, ప్రేమలు, పడగ్గది ముచ్చట్లు, జీవిత కథలు, ఏదైనా సరే, ఎదుటపడితే సిగ్గువిడిచి చెప్పుకోలేనివన్నీ, నిరాటంకంగా, సునాయాసంగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">మా</span>టలు మాటలు మాటలు<br />
చేతివేళ్లలోంచి<br />
జలతారుగా జారిపోయే<br />
పసిడి పూతల ఇసుక పరదాలు</p>
<p>శీతాకాలం ఉదయం,<br />
నూతిని మింగేసిన పొగమంచు పూసలు</p>
<p>సిగరెట్టు దమ్ములా<br />
మెదడంతా కమ్ముకున్న బొగ్గు చారికలు.</p>
</div>
<p style="text-align: center;">***</p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p>Let me make a confession. I am an expert user and was also a profound victim of the Internet Chat Window.</p>
<p>జీ-టాక్ వచ్చిన కొత్తలో అదో మత్తు. ఎవరెవరో, ముక్కు మొహం తెలియని వాళ్ళతో, మొదటి పరిచయంలోనే ఒక్క అరగంటలో ఏదో జన్మాంతర పరిచయం ఉన్నట్టు మా పెరట్లో నందివర్ధనం మొక్క దగ్గరనుంచీ, బెంగలూరులో ‘ది బెస్టు మసలా దోసె’ ఎక్కడ దొరుకుతుందో ఉచిత సలహాల వరకూ అన్నీటికి వీలుండేది ఆ రెండించీల విండోలో. ఎంతో మేలు చేసిన స్నేహాలు, మరెంతోగానో ఉపయోగపడ్డ సంభాషణలతో పాటూ, ఆ చిన్ని చాట్ విండో వెనకాల చేసిన యుద్ధాలు, కుప్పగూలిపోయిన స్నేహాలు కూడా ఉన్నాయి. ఐదేళ్ళపాటు పదిలంగా కట్టుకున్న నమ్మకం పునాదులు ఐదు నిమిషాల తొందరపాటుతో బీటలువారడం కూడా నాకు స్వానుభవమే.</p>
<p>రెండు ఇంచీల వెడల్పూ, ఇంచిన్నర పొడుగు ఉన్న ఆ చతురస్రాకారపు కిటికీ ఇప్పుడు ప్రపంచాన్ని అంతే చిన్నది చేసేసింది &#8211; మనుషులూ, మానవ సంబంధాలు కూడా అంతే కురచ అయిపోయాయేమో కూడా! ఒకప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే దానికో సమయమూ, సందర్భమూ ఉండేవి, సంభాషణకి కొన్ని పద్ధతులూ, ప్రోటోకాల్స్ ఉండేవి. ఇప్పుడు, మన పేరుపక్కన ఒక చిన్న ఆకుపచ్చని చుక్క కనిపిస్తే, ఎప్పుడైనా మాట్లాడేయొచ్చు, ఏదైనా మాట్లాడేయొచ్చు.</p>
<p>ఈమెయిలు పంపాలంటే సంగతీ సందర్భం అవసరం. అది పాతకాలం ఉత్తరానికి, కొత్తతరం మేకప్పు. కానీ చాట్-విండో అలా కాదు &#8211; ఇందులో పలకరింపులు, మాటలు, ఊసులు, ఊహలు, పుకార్లు, ప్రేమలు, పడగ్గది ముచ్చట్లు, జీవిత కథలు, ఏదైనా సరే, ఎదుటపడితే సిగ్గువిడిచి చెప్పుకోలేనివన్నీ, నిరాటంకంగా, సునాయాసంగా చెల్లిపోతుంటాయి.</p>
<p>ఇప్పటికీ గుర్తే &#8211; మర్నాడు అమెరికా ప్రయాణం పెట్టుకుని, ఓ రోజు అర్థరాత్రి పనిచేసుకుంటుంటే, ఇంటర్నెట్టులో పరిచయమైన ఒక అమ్మాయే &#8211; హఠాత్తుగా “మీకో ఐదు నిమిషాల టైముందా” అని అడిగింది. ఇది చాట్ సంప్రదాయంలో నాలుగో నెంబరు తుఫాను హెచ్చరిక. మరో గంట తర్వాత “నేను పచ్చిగా మోసపోయాను” అని భళ్ళుమంది అటుపక్కనుండీ అభిజాత్యం విడిచిన మబ్బు తునకలా. ఆవిడకి నేనేదో అన్నయ్యనో, ఆత్మీయుడినో కాదు. మరి నాతో ఎందుకూ అంటే &#8211; అది చాట్ విండో ఇచ్చిన సౌకర్యం. పాత తెలుగుసినిమాల్లో హీరోయిన్ అంతరాత్మ అద్దంలో కనిపించి మాట్లాడుతూ ఉంటుంది &#8211; మనతో మనం మాట్లాడుకోడానికి సినిమా వ్యాఖ్యానం అది, చాట్ విండోలో అవతల మనిషికి తమదైన ఒక రూపు, గొంతు ఉండవు కాబట్టి, మనతో మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది, అందుకే ఏ సంకోచమూ లేకుండా ఏమైనా మాట్లాడుకోడానికి ఒక పెద్ద అవకాశం ఇచ్చింది చాట్-విండో.</p>
<p>2011లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఉదయం నిద్రలేవగానే పక్కమీదనుంచే ఫేస్బుక్, వాట్సాప్ మెసేజీలు, ఈమెయిలు చూస్తారట 35% మంది నెటిజెనులు, రాత్రి నిద్రపోవడానికి ముందు కూడా అంతే. సుమారుగా రెండు బిలియన్ల నెటిజెన్లు, ఐదుబిలియన్ల స్మార్ట్ ఫోను వాడుకదార్లు ఉన్నారు ప్రపంచంలో. ఎవరెస్టు పర్వతం మీద కూడా ఒక సెల్ టవరు పెట్టారట ఈ మధ్య. వీటన్నిటి మూలంగా మన డిజిటల్ అవతారమే మన జీవితాలలో ప్రధానమైన అస్తిత్వమైపోయింది అంటాడు, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్లిఫోర్డ్ నాస్,</p>
<p>సాంఘికంగా మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి, మనకే తెలియని కొన్ని అవసరాలు ఉంటాయి. నిజజీవితంలో, మన ఇంట్లో వాళ్ళో, ఆఫీసులో మనతో పనిచేసే సహోద్యోగులో పనిగట్టుకుని మన ప్రతి చర్యని పట్టించుకుని, మనం అన్న ప్రతి చిన్న మాటని ప్రశంసించరు కదా? మన ప్రతి అభిప్రాయాన్నీ ఎవరు అంతగా పట్టించుకోరు, మనం తీసిన ప్రతి ఫొటోకి ఆహాఓహో అంటూ మెలికలు తిరిగిపోరు. గంటలు గంటలు ఏ సంకోచంలేకుండా ఎవరు మాత్రం మాట్లాడగలరు &#8211; అందులోనూ, మధ్యలో మరేదో పని చేసుకుంటూ? మనకి బాగా కావల్సినవాళ్ళు మనల్ని అంత సీరియస్గా తీసుకోరు. కానీ, అదే మనుషులు మనపట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలు కూడా విస్మరించరు. కాని, నెట్ ప్రపంచంలో అంతా తల్లకిందుల వ్యవహారం.</p>
<p>“We are lonely but fearful of intimacy. Constant connectivity offers the illusion of companionship without the demands of friendship. We can’t get enough of each other if we can have each other at a distance and in amounts that we can control” అంటారు Sherry Turkle.</p>
<p>“<em>పూలు పూయని కాలంలో</em><br />
<em> మాటలతో దోసెళ్ళు నింపి</em><br />
<em> మంచుశిలవై, ఇసక అడుగువై</em><br />
<em> ఏ పిచ్చికలల్లో చెదిరిపోయావో</em>”</p>
<p>అన్న స్వాతికుమారి కవిత ఈ బాధ్యతారహితమైన సాహచర్యమనే భ్రమకి ఒక అద్భుతమైన నిర్వచనంగా తోస్తుంది నాకు.</p>
<p>ఆ కవితలోనే మరోచోట,</p>
<p>“<em>మళ్లీ రమ్మంటానో లేదో!,</em><br />
<em> ఈ గుప్పెడు కలల్నీ ఎక్కువ తక్కువగా పంచేసుకుందాం ఇప్పుడే!</em><br />
<em> కాసేపుండు నాతో</em>”</p>
<p>అన్న చరణం పగిలిన ఆకాశం ముక్కలాంటి చాట్ విండో తెచ్చిన ట్రాజెడీకి కవితాత్మకమైన తీర్పు, షెర్రీ టర్కిల్ చివరి వాక్యానికి వేదనగా ఉప్పొంగిన వ్యాఖ్యానం. అందుకే, నెట్ గ్రూపులన్నీఒక రకమైన “సామూహికమైన ఒంటరితనమే” అంటుంది టర్కిల్. అవన్నీ ఒంటరివాళ్ళ గంపులు, ఒంటరితనాన్ని పోగొట్టలేక, దేనికోసమైతే వెతుకుతున్నామో దాన్నే పణంగా పెట్టించే విషవలయాలు.</p>
<p>నాకు బాగా గుర్తు &#8211; విజయనగరంలో సాయంత్రం ఏ కందాళ వెంకటాచార్యులుగారి ఇంటిలోనో, ఆలమూరు రమణమూర్తిగారి మండువాలోనో, పేరిశాస్త్రిగారి ఇంటి ముందుగదిలోనో చాలా గొప్ప చర్చలు జరిగేవి. ఆ సంభాషణలలో ఎంతో లోతు ఉండేది, వాటిలో పాల్గొనేవారికి ఏంతో చాతుర్యం ఉండేది, అలా మాట్లాడటానికి ఎంతో, భాష రావాలి, చమత్కారం తెలియాలి, ఎదుటివారిపై గౌరవం ఉండాలి. ఇంట్లో మాటలుకూడా ఒక పద్ధతిగా ఉండేవి. అటుపైన కాలేజీలోను, క్లాసురూములోనూ, యూనివర్శిటి కాంటీన్లలోనూ చర్చలు కూడా లోతుగా జరిగేవి. దానికో లక్ష్యం ఉండేది. సంభాషణకి కావాల్సిన నైపుణ్యం, చర్చకి కావాల్సిన విషయసమగ్రత మొదలైనవి వేగవంతమైపోయిన డిజిటల్ మీడియంలో పెరుగుతున్న అసహనంతో పాటూ కనుమరుగైపోతున్నాయి.</p>
<p>సెల్ ఫోన్లకి, ఛాట్లకి అలవాటుపడిన విద్యార్ఠులు, గంటసేపుకూడా పాఠం వినలేకపోతున్నారనీ, పదే పదే ఒకే రకం ప్రశ్నలు అడుగుతుంటారనీ. రాను రానూ, ఆలోచనా శక్తి, అధ్యయనాభిలాష యూనివర్శిటి విద్యార్థులలో కూడా తగ్గిపోతున్నాయని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి.</p>
<p>బాహ్యప్రపంచంలో ఇద్దరి మధ్య సంబంధం ఎవరికీ తెలియకుండా మరుగుపరచడం దాదాపు అసాధ్యం, అదే నెట్లో స్నేహాలు మూడోకంటికి తెలియకుండా నడపవచ్చు (స్వర్వాంతర్యామి గూగూలమ్మకి తెలియని రహస్యం ఉండదనుకోండి). దీనిమూలంగా ఎన్నో సమస్యల పాలవుతూ ఉంటారు చాలా మంది. ఒకప్పుడు, తెలుగు నెట్ ప్రపంచంలోనే, అసలు లేని వ్యక్తులని సృష్టించి, ఉన్నట్టుగా అందర్నీ నమ్మించిన ఉదంతాలు ఉన్నాయి. మన మాటలు గాల్లో కలిసిపోతాయి, కాని చాట్లో టైపు చేసిన మాటలు ఎంచక్కగా అవతల మనిషి దాచుకొని, వాటితో ఏమైనా చెయ్యొచ్చు.</p>
<p>ఆన్లైనులో మనం వేసుకునే మేకప్పు, స్టేజి మీద డ్రామా ఆర్టిస్టు మేకప్పులాంటిదే. అదే నిజం కాదు. అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, విజయవంతంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ, ఆ ఆకుపచ్చ చుక్క వెనకాల చిక్కటి చీకటి చాలానే ఉంటుంది. “We are compelled to show the successful, happy side of ourselves on the net, which is a farse” అంటున్నారు ఎంతోమంది సోషియాలజిస్టులు. దీనిమూలంగా, చుట్టూ ఉన్నవారిమీద ఒకరకం ఒత్తిడి పెరుగుతుంది &#8211; అంతా ఎంతో బాగున్నారు, మనమెందుకిలా ఉన్నాం అనే ప్రశ్న తొలుస్తూ ఉంటుంది.</p>
<p>అందుకే, ఇంటర్నెట్ వాడకం, ఛాటింగుపై మనకి నియంత్రణ అవసరం అంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఫేస్బుక్ లో జరిగే సంభాషణలు అధ్యయనం చేసిన బృందం, మానసిక ఆరోగ్యానికి, ఫేస్బుక్ లో దొరికే “సాహచర్యానికి” కొంత సంబంధం ఉందని ప్రకటించింది: </p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/01/InternetChat-3.png"><img class="aligncenter size-full wp-image-10351" title="InternetChat-3" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/01/InternetChat-3.png" alt="" width="696" height="743" /></a></p>
<p>ఏదేమైనా, నెట్ మన జీవితాలని, సామాజిక సంబంధాలని ఆక్రమించుకుంది. ప్రపంచం చిన్నదైపోవడం మూలంగా ఎన్నో కొత్త అవకాశాలు, సౌకర్యాలు ఉన్నాయి. స్లాక్, స్కైపు లాంటి సాధానాలవల్ల ప్రపంచంలొ ఎక్కడైనా ఉండి, అంతా ఒకేచోట ఉన్నట్టుగా పనిచేసుకోవచ్చు. ఉదాహరణకి, వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్ వేరు వేరు దేశాల్లో ఉన్నా కూడా, స్కైపు, ఈమైలు ద్వారానే కలిసి పనిచేస్తూ ఎన్నో పుస్తకాలు రాసారు.</p>
<p>అందుకే ఇంటర్నెట్టు సౌకర్యాలని తీసిపారెయ్యలేం, కానీ వీలయినంతవరకూ, రోజులో కొంతభాగం ఇంటర్నెట్టుకి, డిజిటల్ పరికరాలకి దూరంగా అసలైన ప్రపంచంతో, మనవారైన మనుషులతో గడపడం మాత్రం చాలా అవసరం.</p>
<p>టర్కిల్ మాటల్లోనే “We are not doing justice to the complexity of the problems we face, just as we are not doing justice to each other. We need to learn how to be on a digital diet so that we can make healthy choices about the kind of life we want to lead, the kind of life that will make us productive, and how we can be content and fulfilled individually and in relationships”.</p>
<p>In an uninhibited space, I could be dangerous to others అనే చట్టపరమైన హెచ్చరిక ఒకటి ఇక ప్రతి మనిషిపైన ప్రకటించాలేమో!</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<div style="font-size: 11px;">స్వాతికుమారి బండ్లమూడి, <a href="http://patrika.kinige.com/?p=2148" target="_blank">“అనుకోకుండా [2]</a>”, కినిగె పత్రిక, ఏప్రెల్, 2014<br />
Samuel Greengard, “<em>Living in a Digital World</em>”, CACM, October, 2011<br />
Robert Kraut and Moira Burke, “<em>Internet Use and Psychological Well Being &#8211; effects of Activity and Audiance</em>”, CACM, December 2015<br />
Sherry Turkle, <em>Alone Together: Why We Expect More from Technology and Less from Each Other</em>, Basic Books; First Trade Paper Edition edition<br />
Sherry Turkle’s TED Talk: “<a href="https://www.ted.com/talks/sherry_turkle_alone_together?language=en" target="_blank">connected but alone</a>”<br />
Clifford Nass, “<em>The Man Who Lied to His Laptop: What Machines Teach Us About Human Relationships</em>” Penguin Group, 2010</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=10350</wfw:commentRss>
		<slash:comments>8</slash:comments>
		</item>
		<item>
		<title>సైలెంట్ రీడింగ్</title>
		<link>http://vaakili.com/patrika/?p=8874</link>
		<comments>http://vaakili.com/patrika/?p=8874#comments</comments>
		<pubDate>Tue, 01 Sep 2015 02:16:03 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[గెస్ట్ ఎడిటోరియల్]]></category>
		<category><![CDATA[పప్పు నాగరాజు]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=8874</guid>
		<description><![CDATA[<p>తలమునకలుగా పుస్తకంలో లీనమైపోయి, దీక్షగా కళ్ళు వాక్యాలవెంట పరుగులు తీస్తుండగా, ఏవేవో ఆలోచనలతో, ఊహలతో తమ ఉనికినే మరిచిపోయినట్లున్న పాఠకులు మనకి లైబ్రరీలలో, కాఫీషాపుల్లో, ట్రైన్లలో, బస్సుల్లో, వెయిటింగురూముల్లో, ఇంకా మరెన్నోచోట్ల కనిపిస్తూ ఉంటారు. పుస్తకంలో మునిగిపోయిన పాఠకుడికీ పుస్తకానికీ మధ్య జరిగే అద్భుతమైన మౌనసంభాషణకి ఏ సాక్ష్యమూ మిగలదు &#8211; పుస్తకంలో లీనమైపోయిన ఆ పాఠకుడి ముఖ కవళికలు తప్ప!!</p> <p>మన కళ్ళకి చదవడం తెలుసు. తెలుగు వాక్యాన్ని చదవకుండా, దాన్నో బొమ్మలా చూడటం మనకి అసాధ్యం. కళ్ళకి ఇటువంటి ‘చదివే’ శక్తి ఈ మధ్యనే వచ్చిందంటాడు జూలియన్ జీన్స్. ఆయన సిద్ధాంతం ప్రకారం, కళ్ళకి వాటంతట అవే చదివే శక్తి క్రీ.పూ మూడో సహస్రాబ్దికి ముందు లేదు. అప్పట్లో శరాకారలిపిని కంటితో చూసినా, అందులోని శబ్దాన్ని చెవులతో వినేవారు, అంటే ఒక లిపిని చదివినప్పుడు దాని శబ్దాన్నే మెదడు గ్రహించేది. ఎలాగంటే, మనం ఎన్నోసార్లు విన్న పాట సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ పాట ఎక్కడో చెవుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది కదా? దీనినే aural hallucination అంటాడు జీన్స్.</p> <p>మనసులో చదవడం సాహిత్య చరిత్రలో రాతమూలకంగా వచ్చిన చాలా పెద్ద మార్పు. ఈమార్పు చారిత్రకంగా చాలా కొత్తదీ, ఈ మధ్యనే బలపడినదీనూ. ఒకప్పుడు, చదవడమంటే బిగ్గరగా పైకి చదవడమే. ప్రాచీన వాక్‌సాహిత్యమంతా పైకి చదవడానికి కల్పించబడ్డదే. వాక్‌సాహిత్యం నుంచీ లిఖిత సాహిత్యం స్పష్టంగా వేరుపడే ప్రక్రియలో రాసే పద్ధతులూ, కథనరీతులూ, సాహిత్యశైలిలో వచ్చిన మార్పులకి సమాంతరంగా, చదవడం కూడా సామూహికం నుంచీ వ్యక్తిగతమూ, ఏకాంతమూ, ఆంతరంగికమూ అవుతూ వచ్చింది.</p> <p>ఈ మార్పు చాపకింద నీరులా వచ్చింది.</p> <p style="text-align: center;">***</p> <p>మీరొక వేదపాఠశాలకి వెళ్ళారనుకోండి, అక్కడ చెట్లకిందో, గదుల్లోనో ఒంటరిగానో, గుంపుగానో విద్యార్థులు బిగ్గరగా వేద పాఠాన్ని వల్లెవేస్తూ కనిపిస్తారు. అక్కడి గురువుగారు, కాలేజీ ప్రొఫెసర్లా పుస్తకంలో విషయాన్ని ఉపన్యాసంగా బోధపరచరు. ఆయన వేదం స్వరయుక్తంగా పఠిస్తూ ఉంటే, ఆయన వెంట విద్యార్థులుకూడా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="font-size: 30px;">త</span>లమునకలుగా పుస్తకంలో లీనమైపోయి, దీక్షగా కళ్ళు వాక్యాలవెంట పరుగులు తీస్తుండగా, ఏవేవో ఆలోచనలతో, ఊహలతో తమ ఉనికినే మరిచిపోయినట్లున్న పాఠకులు మనకి లైబ్రరీలలో, కాఫీషాపుల్లో, ట్రైన్లలో, బస్సుల్లో, వెయిటింగురూముల్లో, ఇంకా మరెన్నోచోట్ల కనిపిస్తూ ఉంటారు. పుస్తకంలో మునిగిపోయిన పాఠకుడికీ పుస్తకానికీ మధ్య జరిగే అద్భుతమైన మౌనసంభాషణకి ఏ సాక్ష్యమూ మిగలదు &#8211; పుస్తకంలో లీనమైపోయిన ఆ పాఠకుడి ముఖ కవళికలు తప్ప!!</p>
<p>మన కళ్ళకి చదవడం తెలుసు. తెలుగు వాక్యాన్ని చదవకుండా, దాన్నో బొమ్మలా చూడటం మనకి అసాధ్యం. కళ్ళకి ఇటువంటి ‘చదివే’ శక్తి ఈ మధ్యనే వచ్చిందంటాడు జూలియన్ జీన్స్. ఆయన సిద్ధాంతం ప్రకారం, కళ్ళకి వాటంతట అవే చదివే శక్తి క్రీ.పూ మూడో సహస్రాబ్దికి ముందు లేదు. అప్పట్లో శరాకారలిపిని కంటితో చూసినా, అందులోని శబ్దాన్ని చెవులతో వినేవారు, అంటే ఒక లిపిని చదివినప్పుడు దాని శబ్దాన్నే మెదడు గ్రహించేది. ఎలాగంటే, మనం ఎన్నోసార్లు విన్న పాట సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ పాట ఎక్కడో చెవుల్లో ధ్వనిస్తూనే ఉంటుంది కదా? దీనినే aural hallucination అంటాడు జీన్స్.</p>
<p>మనసులో చదవడం సాహిత్య చరిత్రలో రాతమూలకంగా వచ్చిన చాలా పెద్ద మార్పు. ఈమార్పు చారిత్రకంగా చాలా కొత్తదీ, ఈ మధ్యనే బలపడినదీనూ. ఒకప్పుడు, చదవడమంటే బిగ్గరగా పైకి చదవడమే. ప్రాచీన వాక్‌సాహిత్యమంతా పైకి చదవడానికి కల్పించబడ్డదే. వాక్‌సాహిత్యం నుంచీ లిఖిత సాహిత్యం స్పష్టంగా వేరుపడే ప్రక్రియలో రాసే పద్ధతులూ, కథనరీతులూ, సాహిత్యశైలిలో వచ్చిన మార్పులకి సమాంతరంగా, చదవడం కూడా సామూహికం నుంచీ వ్యక్తిగతమూ, ఏకాంతమూ, ఆంతరంగికమూ అవుతూ వచ్చింది.</p>
<p>ఈ మార్పు చాపకింద నీరులా వచ్చింది.</p>
<p style="text-align: center;">***</p>
<p>మీరొక వేదపాఠశాలకి వెళ్ళారనుకోండి, అక్కడ చెట్లకిందో, గదుల్లోనో ఒంటరిగానో, గుంపుగానో విద్యార్థులు బిగ్గరగా వేద పాఠాన్ని వల్లెవేస్తూ కనిపిస్తారు. అక్కడి గురువుగారు, కాలేజీ ప్రొఫెసర్లా పుస్తకంలో విషయాన్ని ఉపన్యాసంగా బోధపరచరు. ఆయన వేదం స్వరయుక్తంగా పఠిస్తూ ఉంటే, ఆయన వెంట విద్యార్థులుకూడా వల్లె వేస్తూ ఉంటారు. వారెవరైనా తప్పుగా చదివితే, ఆయన వారి ఉచ్చారణని సరిచేస్తాడు. మనకి సుపరిచితుడైన మౌనపాఠకుడికి అక్కడ స్థానంలేదు.</p>
<p>మౌఖిక సాహిత్యంలో వేదాలకి అతి ముఖ్యమైన స్థానం ఉంది. ఈనాడు పాటలు భద్రపరచడానికి టేప్ రికార్డులు, సిడిలు ఎలా వాడతామో, అలా వేదాలకి వాటిని జీర్ణించుకున్న పండితులే వాటిని భద్రపరిచిన టేప్ రికార్డులు. వాళ్ళ జ్ఞాపక శక్తే వేదాలకి హార్డ్ డిస్క్. ఈనాటికీ అవి మనుషుల ధారణశక్తి ద్వారానే పదిలంగా ఉన్నాయి, వాటికి వేరే ఏ భౌతికమైన ఉపాధీ అవసరంలేదు. అందుకే వేదం చదవడానికి నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయి. ఒక శ్లోకంలో ఒక్కపదం కూడా ఉచ్చారణ మారిపోకుండా, ఒక్క పదం కూడా శ్లోకంలోంచి జారిపోకుండా వైదిక పండితులు ఎన్నో పద్ధతులు కనిపెట్టారు.</p>
<p>ఇస్లాం మతంలోకూడా కొరాన్ పైకి చదవడానికే ప్రాముఖ్యత ఉండేది.అల్-గ్వాజీ మాటల్లో “ ఏడేళ్ళ కుర్రాడు కూడా కొరాన్ మొత్తాన్ని పొల్లుపోకుండా కంఠోపాఠంగా అప్పచెప్పగలడు. మిగిలిన మతాలలా కాకుండా, ఇస్లాంలో, ప్రవక్త ప్రవచనాలన్నీ ఎన్నో తరాలబాటు నమ్మకంగా మౌఖికంగా భద్రపరచబడ్డాయి, రాతలో భద్రపరిచిన పుస్తకాలలో వ్రాయసకారుల మూలంగా ఎన్నో తప్పులు కాలక్రమంలో ప్రవేశిస్తాయి” అంటాడు.</p>
<p>అల్-ఘజలీ కొరాన్ చదవడానికి కొన్ని నియమాలని ఏర్పరిచాడు, “బిగ్గరగా, నీకు బాగా వినిపించేలా చదువు, చదవడమంటే ప్రతి శబ్దాన్నీ ప్రయత్నపూర్వకంగా అర్థం చేసుకోవడం. అలా చదివితేనే బాహ్యప్రపంచం నుంచి తప్పించుకోగలవు” అని ఆయన ఏర్పరిచిన తొమ్మిదో నియమం చెప్తుంది. ఇలాంటి నియమాలే సుమారుగా అన్ని సంస్కృతులలోనూ ఉండేవి.</p>
<p>మా చిన్నతనంలో, మనసులో చదువుతే తిట్టేవారు, గొంతెత్తి బిగ్గరగా చదివితేనే విషయం పూర్తిగా మెదడులోకి ఎక్కుతుందనే నమ్మకం అప్పటికింకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ, పిల్లలు ఏదైనా కంఠతా పెట్టవలసివస్తే గొంతెత్తి చదవమనే చెపుతాం. మన దేశంలోనే కాదు, అన్ని సంస్కృతులలోనూ ముందునుంచీ చదవటమంటే గొంతెత్తి పైకి బిగ్గరగా చదవడమే ఆచారం.</p>
<p>“Scripta volant, Verba manent” అనే నానుడి ఈనాడు రాత శాశ్వతం, మాట క్షణికం అనే అర్థాన్ని సంతరించుకున్నా, ప్రాచీనకాలంలో అది కాగితానికి అతుక్కుపోయిన రాత అవిటితనాన్ని పోగొట్టి, దానికి పక్షిలా ఎగరగలిగే స్వేచ్ఛని ఇచ్చేదే మాట అనే అర్థంలోనే వాడేవారు. పైకి చదవడం ద్వారా అక్షరానికి తనగొంతుతో ప్రాణం పొయ్యడం చదువరి బాధ్యతగా భావించేవారు. అందుకే పవిత్ర గ్రంథాలని కేవలం కళ్ళతోకాకుండా, శరీరం మొత్తం పఠనంలో పాలుపంచుకునేట్టుగా చదివేవారు. ఇప్పటికీ, భక్తిపాటలు, భజనలు పాడేటప్పుడు అందరూ పైకిపాడుతూ, చప్పట్లో తప్పట్లో కొడుతూ, లయకి అనుగుణంగా భక్తిపారవశ్యంతో ఊగిపోవడం మనం చూస్తూ ఉంటాం.</p>
<p>ఈనాటికీ పారాయణ పుస్తకాలని మనవాళ్ళు పైకే చదువుతారు. ప్రతిరోజూ, క్రమం తప్పకుండా పైకి శ్రావ్యంగా, స్వరసహితంగా చదవడం వల్ల కొన్నాళ్ళకి ఆ రచన పూర్తిగా కంఠోపాఠం అయిపోతుంది. రామాయణ భాగవతాలు పైకే చదవాలని, ఆ కథలు చదువుతున్నప్పుడు హనుమంతుడో, నారదుడో వచ్చి వింటారనే నమ్మకం అచ్చంగా మౌఖిక సంస్కృతి తాలూకు చిహ్నం. తులసీదాసు కాశీలో రామాయణ గానం చేసేటప్పుడు హనుమంతుడు వచ్చి వినేవాడట. ఇటువంటి కథలు మౌఖిక సంస్కృతుల్లో విడదీయరాని భాగంగా ఉంటాయి. దానికి బలమైన కారణం ఉంది. మౌఖిక సంస్కృతిలో, పదికాలాల పాటు ఒక రచనని ప్రజలు మరచిపోకుండా ఉండాలంటే, దాన్ని వారు సొంతం చేసుకునే విధంగా ఉండాలి. అందుకని, ఆ కథలలో మార్పు చేర్పులు చేసుకోవడానికి, వాటిని పాడుకోవడానికి, వాటిలో వారి ఆలోచనలు, వ్యక్తీకరణలు, ఉద్వేగాలు చేర్చుకోవడానికి అవకాశం ఈ సాహిత్యం కల్పిస్తుంది, ఎందుకంటే &#8211; ఈ కథలు మనకి మనం చదువుకునేవి కాదు, ఎవరైనా పదిమందిని పోగుచేసి జనరంజకంగా చెప్పవలసినవి.</p>
<p>ముఖ్యంగా పురాణాల విషయంలో, పౌరాణికుడి తోడ్పాటు లేనిదే అది సంపూర్ణం కాదు. వెల్చేరు నారాయణరావుగారు, <em>తెలుగులో కవితా విప్లవాల స్వరూపంలో</em> ఇలా అంటారు “ ప్రదర్శకుల తోడ్పాటు లేనిదే నాటకం సంపూర్ణం కానట్టే, సమర్థుడైన పౌరాణికుడి ప్రవచనం లేనిదే పురాణాలు సంపూర్ణం కావు. అందుకని, పౌరాణికుడు చేసే పని కేవలం అర్థం చెప్పడం కాదు, కళాసృష్టి చెయ్యడం. ఈ కారణం వల్ల వాక్‌సాహిత్యం, రాత రూపంలో వచ్చినప్పటికీ, దానికి, లిఖిత సాహిత్యానికి ప్రధానమైన తేడా రచయిత విషయంలో వస్తుంది. వాక్‌సాహిత్యానికి కూడా ఒక “సృష్టికర్త” ఉన్నప్పటికీ, ఎవరైతే దాన్ని కథగా పదిమందికీ చెప్తారో, ఆ వ్యాఖ్యాత కూడా, కథ చెపుతున్న సమయంలో “రెండో రచయిత” అవుతాడు. కథని చెప్పినప్పుడు, అతను కొన్ని శ్లోకాలు వదిలెయ్యవచ్చు, కొన్ని ఘట్టాలు పెంచవచ్చు, అందులో తనకి తెలిసిన కథలు, వ్యాఖ్యానాలు చొప్పించవచ్చు. అందుకే, చెప్పిన ప్రతి సారీ అదో కొత్త కథనం అవుతూ ఉంటుంది. వాక్‌సాహిత్యం కథ చెప్పేవాడికి రెండో రచయితగా జాగా కల్పిస్తుంది. దానికి అనువుగానే, ఆ సాహిత్యం కల్పన ఉంటుంది.”</p>
<p>రామాయణం నుంచి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.అరణ్యకాండలో ఖర-దూషణాదుల వధ సుమారుగా ఎనిమిది సర్గల కథ. ఇందులో రాముడు మొత్తం పద్నాలుగు వేలమంది రాక్షసులని వధిస్తాడు, అంత యుద్ధమూ అయినాక ఆయన చెక్కుచెదరడు. కథకి సంబంధించినంతవరకూ ఆయన ఇద్దరిని చంపినా, పదిమందిని చంపినా, పదివేలమందిని చంపినా ఏం తేడా పడదు. కానీ, పదిమంది చేరిన దగ్గర కథ రక్తికట్టాలంటే, చెప్పేవాడికి కథని “కళ్లకి కట్టించి, కథలోకి మనని తీసుకుపోవడానికి&#8221; కొంత సరంజామా కావాలి. ఇటువంటి సన్నివేశాలు అటువంటి అవకాశాన్ని ఇస్తాయి. ఈ సన్నివేశం మనం “కళ్ళతో మౌనంగా చదివితే” ఓ ఐదు/పది నిమిషాలకంటే ఎక్కువ పట్టదు, అదే ఎవరైనా చెపితే &#8211; బహుశా రెండు రాత్రులు పడుతుంది, విన్నవాళ్ళు పంచవటిలో ఆ యుద్ధాన్ని అనుభవిస్తారు.</p>
<p>ఇలాంటి సన్నివేశాలే యుద్ధకాండ నిండా ఉంటాయి &#8211; అందులో, ఒక రాక్షసుడు పెద్ద సైన్యాన్ని వెంటపెట్టుకుని యుద్ధానికి బయలుదేరతాడు, ఇంతలో దుశ్శకునాలు కనిపిస్తాయి, అయినా బెదురుపాటు, భయమూ లేకుండా అతను యుద్ధభూమిలోకి చొరబడతాడు, కాస్సేపు భయంకరంగా యుద్ధం చేస్తాడు. ఇంతలో ఎవరో ఒక వానర యోధుడు కొండచరియతోనో, పరిఘతోనో, అతనిని కొట్టి చంపేస్తాడు. తర్వాతి సర్గలో మరో రాక్షసుడు, అచ్చం అలాగే వస్తాడు, అచ్చం అలానే చస్తాడు. ఇదే కథ పేర్లు మారుతూ ఎన్నోసార్లు వస్తుంది. పుస్తకం పట్టుకుని చదివితే చాలా విసుగు పుట్టించేదిగా ఉండే కథన పద్ధతి ఇది. అదే ఎవరైనా ఇదే కథని పదిహేను రాత్రులు చెప్పారనుకోండి, కథ చివరకి వచ్చేసరికీ, శ్రోతలు ఆ యుద్ధాన్ని తమ మనోఫలకంమీద చిత్రించుకుని, ఆ యుద్ధం తీవ్రతకి లొంగిపోయి, రావణుడు యుద్ధభూమిలోకి వచ్చే సమయానికి, ఆ యుద్ధభూమికి తనుకూడా రవాణా అయిపోతాడు. రామ-రావణుల యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసులు, వానరులు, ఆకాశంలో సిద్ధులూ, దేవతలూ అందరూ నిలుచుని చూస్తూ ఉండిపోయారు, వాళ్ళందరితో పాటూ వింటున్న పాఠకుడు కూడా ఒకడు. ఎన్నో రోజులపాటు ముక్కలు ముక్కలుగా చెప్పుకునే కథలకి ఇటువంటి కథనరీతి అవసరం. ఈరకమైన Narrative Re-inforcement వాక్‌సాహిత్యంలో ప్రధానమైన కథన సామగ్రి.</p>
<p>ప్రాచీన కావ్యాలని రాసిన తీరు గమనిస్తే, వాటిల్లో ఎక్కడా వాక్యాలని పదాలుగా విడగొట్టడం, వాక్యాల చివర్లో విరామ చిహ్నాలు పెట్టడం, పదాల మధ్య చదువుకోడానికి వీలుగా కామాలు పెట్టడం ఉండేది కాదు. శబ్దానికి అలవాటుపడ్డ చెవులు శబ్దాన్ని వాక్యాలుగా, పదాలుగా విడగొడుతూ ఉండేవి, చదివేవారికి ఆ పుస్తకాలని ఎలాగ చదవాలో ముందే తెలిసేది కాబట్టి, అర్థవంతంగా పదాలని విడగొడుతూ చదివేవారు. ఈనాటికీ పారాయణ పుస్తకాలు ఇలానే ఉంటాయి, ప్రతిరోజూ పారాయణ చేసిన కన్ను శ్లోకాన్ని చదువుకుంటూ పోతుంది, చెవి అర్థాన్ని గ్రహిస్తుంది.</p>
<p>ఇక పాశ్చాత్య సంస్కృతి విషయానికి వస్తే, వారికి మౌనపఠనం మనకంటే చాలా ముందు నుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది. మౌనపఠనం గురించిన మొదటి ఆధారం మనకి సెయింట్ అగస్టీన్ రచనలలో కనిపిస్తుంది. రోములో తను చెప్పే పాఠాలు నేర్చుకునేవారే కానీ, తన కష్టానికి డబ్బులిచ్చేవారు లేరని తెలుసుకుని, క్రీ .శ. 383 నాటికి మిలన్‌కి తన నివాసం మార్చుకున్నాడు అగస్టీన్. అదే సమయంలో, అక్కడ సెయింట్ అంబ్రోస్ బిషప్‌గా ఉండేవాడు. ఒంటరితనంవల్లో, కాకపోతే తన తల్లి ప్రత్యేకంగా అంబ్రోస్ గురించి చెప్పడంవల్లో, ఆయన్ని కలవడానికి వెళ్ళాడు అగస్టీన్. ఆయన వెళ్ళేటప్పటికి అంబ్రోస్ తన గదిలో ఒంటరిగా ఏదో పుస్తకంలో మునిగిపోయున్నాడు. ఆ సన్నివేశాన్ని అగస్టీన్ ఎంతో ఆశ్చర్యంగా ఇలా వర్ణిస్తాడు: “ఆయన చదువుతున్నప్పుడు కళ్ళు పుస్తకం వెంట పరుగులు తీస్తుండేవి. ఏకాగ్రచిత్తంతో అర్థాన్ని గ్రహించడంలో హృదయం నిమగ్నమై ఉండేది. నాలుక మాత్రం నిశ్చలంగానే ఉండేది. ఆయన బయటికి చదివేవాడు కాదు.” ఈ రోజుల్లో ఇటువంటి దృశ్యం మనకి సర్వసాధారణం, కాని అగస్టీన్ రోజుల్లో, అది ప్రత్యేకంగా, ఆశ్చర్యం గొలిపించే దృశ్యం. అగస్టీన్ వర్ణనే, పాశ్చాత్య చరిత్రలోనమోదైన మౌనపఠనం యొక్క మొదటి నిదర్శనం.</p>
<p>అంతకు మునుపు కొన్ని వర్ణనలు ఉన్నా అవేవీ కచ్చితమైనవి కావు. క్రీ.పూ. ఐదో శతాబ్దికి చెందిన రెండు నాటకాలలోని పాత్రలు మౌనంగా పుస్తకం చదువుతున్న సన్నివేశాలు ఉన్నాయి. హిప్నోలైటిస్ అనే నాటకంలో, థెసూస్ చనిపోయిన తన భార్య చేతిలో ఉన్న ఉత్తరాన్ని నిశ్శబ్దంగా చదువుతాడు. ది నైట్స్ అన్న నాటకంలో గణాచారి పంపిన ఒక పలకపై ఉన్న సందేశాన్ని మౌనంగా చదివి, నిశ్చేష్టుడవుతాడు డెమొస్తనీస్. మౌనపఠనం గురించిన మరొక కథనం ప్లూటార్క్ రచనల్లో కనిపిస్తుంది. అలెగ్జాండర్, తల్లి పంపిన ఉత్తరాన్ని మౌనంగా చదువుకుంటుంటే, చూసిన సైనికులు, ఆశ్చర్య చకితులయారట. రెండో శతాబ్దంలో క్లాడియస్ టాలమి, ఆన్ ది క్రైటీరియన్ అనే పుస్తకంలో “కొంతమంది ఏకాగ్రతగా, మనసు పుస్తకంపై లగ్నం చెయ్యడం కోసం మౌనంగా చదువుతారు, ఎందుకంటే బయటికి వినిపించే గొంతు ఆలోచనలని కేంద్రీకృతం చెయ్యనివ్వదు” అంటాడు. ఇటువంటి కొన్ని చెదురు మదురు వర్ణనలు తప్పించి, బిగ్గరగా చదవటమే ఆనాటి కాలంలో రివాజు.</p>
<p>మనకి ఇప్పుడు ఎంతో అలవాటైపోయిన విరామ చిహ్నాలు, కళ్ళకి భాషని గుర్తుపట్టే ప్రక్రియలో ఉపకరణాలుగా అభివృద్ధిచెందాయి. క్రీ.పూ 200 బైజాంటియన్ కి చెందిన అరిస్టొఫనీస్ మొదటిసారిగా విరామచిహ్నాలు ప్రవేశపెట్టాడంటారు. ఏడో శతాబ్దంనాటికి బిందువులు, చిన్నగీతలు, సెమికోలను, కామాలు వచ్చాయి. విరామచిహ్నాల వాడకం పరిశీలిస్తే, “వాచకం” నుంచి “పఠనం” దిశగా చదవడం మారడాన్ని గుర్తించవచ్చు. మౌఖికత్వంనుంచీ, లిఖిత పరమైన సమాచార వ్యవస్థవైపు సమాజం మొగ్గుచూపడంకూడా ఇందులో భాగమే.</p>
<p>తొమ్మిదో శతాబ్దంనాటికి, ఐర్లండుకి చెందిన లేఖకులు భాషని కళ్ళతో చదువుకోడానికి అనువైన ఉపకరణాలని, నియమాలని అబివృద్ధి చేశారు. సుమారుగా ఆకాలంలోనే, క్రైస్తవ సంఘారామాల్లో పైకి చదవరాదని, మౌనంగా మనసులోనే చదువుకోవాలనే నియమం వచ్చింది. అదెంతవరకూ పోయిందంటే, లేఖనశాలలో పనిచేసే సన్యాసి కొత్తపుస్తకం కావాల్సివచ్చినా, సిరాకానీ, కలంగానీ, కాగితాలుకానీ కావాల్సి వచ్చినా అక్కడి అధికారిని మౌనంగా సంజ్ఞలతోనే అడిగేవాడు.</p>
<p style="text-align: center;">***</p>
<p>లిఖిత సంప్రదాయంలో కథనరీతి ఎలా ఉంటుందంటే, కథని ఎవరికి వారే చదువుకోవాలి. ప్రతి వాక్యమూ, ప్రతి పదమూ చదువుకుంటూ, ఆ వాక్యాలు మనల్ని పుస్తకంలోకి లాగేసుకుని, బాహ్యప్రపంచంనుంచీ మనల్ని వేరుచెయ్యగలగాలి. ఒకవేళ ఎవరైనా ఆ కథని చెప్పాలంటే, దాని లోతుపాతులని విశ్లేషించగలగాలి, సమీక్షించగలగాలి, బోధపరచగలగాలే తప్ప, కథని అనుభవించగలగడం మాత్రం ఆ కథని ఎవరంతట వారు చదివితేనే లభిస్తుంది తప్పించి ఎవరో చెబితే లభించదు. రచయితకీ, పాఠకుడికీ మధ్య అనుసంధానం పుస్తకమనే వస్తువే తప్పించి, వేరే కథకుడికి ఇందులో భాగంలేదు. ఈ రకంగా కథకుడనే రెండో రచయిత అవసరం పోయి, చదవడం ఆంతరంగికమైన, ఏకాంతమైన వ్యవహారంగా మారింది.</p>
<p>తెలుగు సాహిత్యంలోకూడా ఈ మార్పు &#8211; పౌరాణిక కవులనుంచీ ప్రబంధకవుల సాహిత్యంలో గమనించవచ్చు. వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్‌మాన్ మనుచరిత్ర ఆంగ్లానువాదానికి రాసిన ముందుమాటలో తెలుగు సాహిత్యం పెద్దన మనుచరిత్రతో స్పష్టంగా లిఖిత సాహిత్యంగా మారిందని అంటారు.</p>
<p>వారి మాటల్లోనే:<br />
“పెద్దన కవిత్వంలో లిఖితాత్మకత (written-ness) ఉంది. ప్రతి అక్షరాన్ని, పదాన్ని, పద్యాన్ని, వచనాన్ని ఆయన ఒక శిల్పిలా సానబెడతాడు. ఒక్కో అక్షరాన్ని ఎంతో శ్రద్ధగా పద్యంలో పొదుగుతాడు. పెద్దన కావ్యం పదిమంది కలిసి చదివేది కాదు. అంతమాత్రం చేత ఆయన పద్యం కేవలం చూపులతో చదివేసి అర్థాన్ని మాత్రం గ్రహించవలసిన వచన వ్యవహారం కాదు, ఆ పద్యంలోని సంగీతాన్ని వినాలి, కాని ఆ వినడం ఇప్పుడు ఒక ఏకాంత పాఠకుడు తనకోసం చదువుకోవడంలో ఉంది. కవిత్వం పెద్దన దగ్గరనుంచీ, వ్యక్తిగతమైన, ఏకాంతమైన వ్యవహారం అయిపోయింది. ఇప్పుడిక పుస్తకాన్ని తనకోసమే చదువుతాడు పాఠకుడు. ఇక్కడ నుంచీ అందరికీ చదివి వినిపించి, కథని తన చాతుర్యంతో రక్తి కట్టించే కథకుడనే రెండో రచయిత అవసరం పోయింది. పెద్దన దగ్గరనుంచీ వచ్చిన తెలుగు కావ్యాలు, ప్రదర్శనకోసం కల్పించబడిన దృశ్య, శ్రవ్య కావ్యాలు కావు, వాటిని మనం “పాఠ్య” కావ్యాలు అనవచ్చు. ఇటువంటి సాహిత్యాన్ని అనుభవించడానికి ఎంతో తీరుబడి కావాలి”.</p>
<p style="text-align: center;">***</p>
<p>మౌఖిక సంప్రదాయంలో గాయకులు, పౌరాణికులు, ఆశుకవులు, కథకులు మొదలైన వారే ప్రధానంగా సాహిత్యాన్ని భద్రపరచి, దానిని సమాజంలోకి తీసుకుని వెళ్ళే పాత్రధారులు. అందుకనే మౌఖిక సమాజాల్లో జ్ఞాపకశక్తికి ప్రముఖమైన స్థానం ఉంది. గ్రహణ ధారణ పటుత్వ శక్తి అంటే ఒకసారి విన్నదాన్ని గ్రహించి, దాన్ని యథాతథంగా జ్ఞాపకం పెట్టుకుని, ఎంతకాలమైనా మరచిపోకుండా ఉండగలగే శక్తి. అందుకనే అవధానాలు, ఆశువుగా పద్యాలు అల్లడం, అమరకోశం వంటి నిఘంటువులని మొత్తంగా కంఠోపాఠంగా గుర్తుపెట్టుకోవడం, కొన్ని వందల, వేల శ్లోకాలని పొల్లుపోకుండా అప్పచెప్పడం – ఇవన్నీ మౌఖిక సంప్రదాయంలో పండితులు ప్రయత్నపూర్వకంగా అభ్యసించి నేర్చుకునే విద్యలో భాగం. అలాగే వేద వాఙ్మయం శబ్ధ ప్రధానమైనది, అందుకని దాన్ని ఒక శబ్ధగ్రంథంగా భద్రపరచడానికి వేదపండితులు ఎన్నో సాధనాలు కనిపెట్టారు.</p>
<p>వేద పండితుల, ఆశుకవుల జ్ఞాపక శక్తి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అయితే, ఇటువంటి సంప్రదాయం అన్ని సంస్కృతులలోనూ ఉంది. గ్రీకు, లాటిన్ సంస్కృతులలో, ఆనాటి “ఆరేటర్స్”కి ఎంతటి క్లిష్టమైన, పొడుగాటి పాఠాన్నైనా పొల్లుపోకుండా జ్ఞాపకం పెట్టుకోడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. వారికి ఈ సంప్రదాయం పదిహేనో శతాబ్దందాకా ఉండేది &#8211; జియార్డానో బ్రూనో చేసిన “మెమిరీ-ఫీట్స్” గురించి అద్భుతమైన కథనాలు ఉన్నాయి. లిఖిత సంప్రదాయంలో జ్ఞాపకశక్తి కంటే మేధస్సుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.</p>
<p>లిఖిత సంప్రదాయంలో ఏ రచననైనా ‘పుస్తకం’ అనే వస్తురూపంలోనే పదిలపరచబడుతుంది. అదొక వస్తువు కాబట్టి దానికో మార్కెట్ విలువ ఉంటుంది, దాన్ని శ్రద్ధగా, పనివాడితనంతో తయారుచెయ్యాలి, దానికి ఎంతో ఖర్చు అవుతుంది, అందులో లాభ నష్టాలు ఉంటాయి. మౌఖిక సంప్రదాయంలో అంతర్భాగమైన కథకుడి పాత్ర పోయి, రచనని ఏకాంత వ్యవహారంగా మార్చే ఈ ప్రయత్నంలో ఎడిటర్లు, టైపోగ్రాఫర్లు, బుక్-డిజైనర్లు మొదలైన కొత్త పాత్రలు వచ్చాయి. ఈ హంగులన్నిటితో, ఒకనాడు పదిమంది కలిసి పైకి చదువుకునే ఒక సాంఘిక ప్రక్రియ, కాలక్రమంలో వ్యక్తిగతమూ, మానసికమూ, ఏకాంతమూ అయ్యింది. పుస్తకానికి చదువరికి మధ్య “మూడోకంటికి” తెలియని అనుబంధం మౌనపఠనం సాహిత్య చరిత్రలో తెచ్చిన ఒక పెద్ద విప్లవం.</p>
<p style="text-align: center;">*** * ***</p>
<p>[<span style="font-size: 11.5px;"><em>ఐదేళ్ళ క్రితం యథాలాపంగా గూగుల్ ఛాట్లో పరుచూరి శ్రీనివాస్ గారితో ఏదో మాటల్లో కాలిగ్రఫీ గురించి చర్చ వచ్చింది, అది అక్కడనుండి పుస్తక చరిత్రని అధ్యయనం చెయ్యడంగా మారింది. ఇప్పుడు, వెల్చేరు నారాయణరావుగారు, పరుచూరి శ్రీనివాస్, నేను కలిసి భారత సంస్కృతిలో రాత మూలకంగా వచ్చిన సామాజిక, సాంస్కృతిక మార్పులని అధ్యయనం చేసి, కొన్ని వ్యాసాలు రాస్తున్నాం. అందులో భాగంగా, కొన్నాళ్ళ క్రితం సైలెంట్ రీడింగ్ మీద రాసుకున్న నోట్సులోంచి కొంతభాగమే ఈ సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని సమీక్షించిన శ్రీనివాస్ గారికి, ప్రూఫు రీడింగులో ఎంతో సాయం చేసిన త్రివిక్రమ్ గారికి నా ధన్యవాదాలు - రచయిత</em></span>]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=8874</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
	</channel>
</rss>
