<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; మణి వడ్లమాని</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>మేమూ, అమ్మలమయ్యాము</title>
		<link>http://vaakili.com/patrika/?p=7210</link>
		<comments>http://vaakili.com/patrika/?p=7210#comments</comments>
		<pubDate>Wed, 31 Dec 2014 22:59:37 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథ]]></category>
		<category><![CDATA[మణి వడ్లమాని]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=7210</guid>
		<description><![CDATA[<p></p> <p>ఆ రోజు దీపావళి అమావాస్య! వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో సంబరంగా జరుపుకొనే పండగ. రంగు రంగుల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల కాంతులతో అంతటా వెలుగే వెలుగు. ఈ వెలుగును చూడలేక చీకటికే భయంవేసి పారిపోయింది. గోదారి ఒడ్డున ఆనుకొని ఉన్న సన్నపాటి సందులో, ఓ పాతకాలపు మేడ మీద చిన్న వాటాలో ఉ౦టున్న సావిత్రి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ కిటికీ లోంచి చూస్తూ&#8230;<br /> “ఒసే! రాణీ! రోజూ లోకమంతా నిద్రపోవడానికి రాత్రికోసం ఎదురుచూస్తుంటే మనం బతకడంకోసం ఎదురుచూస్తాం, కాని ఈ ఒక్క రోజు మాత్రం అందరూ మేలుకొంటారు. తెల్లవార్లూ టపాకాయల మోత వినిపిస్తూనే వుంటుంది. ఈ దీపావళి పండగ చిన్నప్పడు ఎంతబావుండేదో! నాన్న ఏదో రకంగా కొంచమైనా టపాకాయలు కొని ఇచ్చేవాడు. నేనూ, తమ్ముడు కాల్చుకుంటూవుంటే అమ్మ ఎంత మురిపెంగా చూసుకొనేదో! నాన్న యాక్సిడెంట్లో పోవడం, అమ్మా, తమ్ముడు విషజ్వరాల బారినపడి చనిపోవడంతో నన్ను ఈ కంపెనీలోకి పారిజాతం తీసుకొచ్చి పడేసింది” అని నవ్వింది.</p> <p>ఆ నవ్వులోని విషాదాన్ని ఒక్క రాణి మాత్రమే చూడగలిగింది. తక్కిన వాళ్ళు అదేదో జోక్ అనుకొని విరగబడి నవ్వారు. వెంటనే రాణి వాళ్ళతో “ఎందుకే అందరూ అంత విరగబడుతున్నారు? ఏం, అది నిజంకాదా? ఏం బతుకే మనది, వాడిన పూలలాగా, విసిరేసిన ఆకుల్లాగా ఎవడుపడితేవాడు” అని దుఃఖంతో ఎగశ్వాస వచ్చి గొంతు లోంచి మాట బయటకు రాలేదు.</p> <p>వెంటనే సావిత్రి “పోనీలే రాణీ, వాళ్ళకు మాత్రం ఏమంత తెలుసనీ, ఏదో సరదాగా మాట్లాడుతున్నానని అనుకొని నవ్వారు”</p> <p>“అది కాదు సావిత్రక్కా! ఏదైనా అద్భుతం జరిగి ఆ దేవుడు మనల్ని ఈ రొంపినించి బయటపడేస్తే ఎంత బావుంటుందో కదా!”</p> <p>ఇంకా ఏదో అనబోతుంటే సావిత్రి వారిస్తూ “రాణీ! పగటికలలు కనడం మానేయి. పారిజాతానికి తెలిస్తే ఈ ఉన్న నీడ కూడా పోయి రోడ్డున పడతాం. మనకి అంత అదృష్టం కూడానా!” [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/memoo.jpg"><img class="aligncenter size-full wp-image-7213" title="memoo" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/memoo.jpg" alt="" width="826" /></a></p>
<p><span style="font-size: 30px;">ఆ</span> రోజు దీపావళి అమావాస్య! వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో సంబరంగా జరుపుకొనే పండగ. రంగు రంగుల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల కాంతులతో అంతటా వెలుగే వెలుగు. ఈ వెలుగును చూడలేక చీకటికే భయంవేసి పారిపోయింది. గోదారి ఒడ్డున ఆనుకొని ఉన్న సన్నపాటి సందులో, ఓ పాతకాలపు మేడ మీద చిన్న వాటాలో ఉ౦టున్న సావిత్రి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ కిటికీ లోంచి చూస్తూ&#8230;<br />
“ఒసే! రాణీ! రోజూ లోకమంతా నిద్రపోవడానికి రాత్రికోసం ఎదురుచూస్తుంటే మనం బతకడంకోసం ఎదురుచూస్తాం, కాని ఈ ఒక్క రోజు మాత్రం అందరూ మేలుకొంటారు. తెల్లవార్లూ టపాకాయల మోత వినిపిస్తూనే వుంటుంది. ఈ దీపావళి పండగ చిన్నప్పడు ఎంతబావుండేదో! నాన్న ఏదో రకంగా కొంచమైనా టపాకాయలు కొని ఇచ్చేవాడు. నేనూ, తమ్ముడు కాల్చుకుంటూవుంటే అమ్మ ఎంత మురిపెంగా చూసుకొనేదో! నాన్న యాక్సిడెంట్లో పోవడం, అమ్మా, తమ్ముడు విషజ్వరాల బారినపడి చనిపోవడంతో నన్ను ఈ కంపెనీలోకి పారిజాతం తీసుకొచ్చి పడేసింది” అని నవ్వింది.</p>
<p>ఆ నవ్వులోని విషాదాన్ని ఒక్క రాణి మాత్రమే చూడగలిగింది. తక్కిన వాళ్ళు అదేదో జోక్ అనుకొని విరగబడి నవ్వారు. వెంటనే రాణి వాళ్ళతో “ఎందుకే అందరూ అంత విరగబడుతున్నారు? ఏం, అది నిజంకాదా? ఏం బతుకే మనది, వాడిన పూలలాగా, విసిరేసిన ఆకుల్లాగా ఎవడుపడితేవాడు” అని దుఃఖంతో ఎగశ్వాస వచ్చి గొంతు లోంచి మాట బయటకు రాలేదు.</p>
<p>వెంటనే సావిత్రి “పోనీలే రాణీ, వాళ్ళకు మాత్రం ఏమంత తెలుసనీ, ఏదో సరదాగా మాట్లాడుతున్నానని అనుకొని నవ్వారు”</p>
<p>“అది కాదు సావిత్రక్కా! ఏదైనా అద్భుతం జరిగి ఆ దేవుడు మనల్ని ఈ రొంపినించి బయటపడేస్తే ఎంత బావుంటుందో కదా!”</p>
<p>ఇంకా ఏదో అనబోతుంటే సావిత్రి వారిస్తూ “రాణీ! పగటికలలు కనడం మానేయి. పారిజాతానికి తెలిస్తే ఈ ఉన్న నీడ కూడా పోయి రోడ్డున పడతాం. మనకి అంత అదృష్టం కూడానా!” అని చెప్పి, మళ్ళీ తనే “ఈ కార్తీకమాసం అంతా మన రాజమండ్రీ, గోదావరి కూడా కళకళలాడిపోతూ వుంటాయి. రేపటినుంచి కార్తీక స్నానాలు మొదలవుతాయి. గోదావరిని చూస్తూవుంటే మా అమ్మ గుర్తుకొస్తోంది. అచ్చు అమ్మలా అన్నీకడుపులో దాచుకొంటుంది” అని దీర్ఘంగా నిట్టూర్చింది.</p>
<p>“అవును అక్కా” అంటూ రాణి, సీత, లక్ష్మి మొదలైన వాళ్ళు వంతపాడారు.</p>
<p>అలా కిటికీ లోంచి గోదావరిని చూడటం సావిత్రికి ఎంతోఇష్టం. అందుకే కొత్త ఇంటికి మారటానికి కూడా ఇష్టపడటంలేదు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ గోదావరిని చూస్తూ తనలో తనే ఎన్నోచెప్పుకుంటుంది.</p>
<p>ప్రతి ఏడాదీ కార్తీకమాసం నెల్లాళ్ళు గోదావరిలో స్నానం చెయ్యడం సావిత్రికి అలవాటు. తెల్లారగట్లే లేచిన సావిత్రి, రాణి తోడు రాగా ఇద్దరూ కలిసి గోదావరి స్నానానికి వెళ్లారు. ఇంటినుంచి పట్టుకెళ్లిన వత్తులు, నూనె, హారతి కర్పూరం, అగరొత్తులు వున్న బుట్టను అక్కడే వున్న ఒక సాధువును చూస్తూ వుండమని చెప్పి, ఇద్దరూ నదిలో దిగారు. చల్లటి నీళ్లను తాకేసరికి వణుకు మొదలయింది. ఒక్కసారి “శివశివా” అంటూ దేవుడిని తలచుకొని ఇద్దరు చేతులు పట్టుకొని ముక్కు మూసుకొని మూడుసార్లు మునకేసారు.</p>
<p>మొదటి రోజు కావటంతో చాలా మందే వున్నారు. స్నానం కానిచ్చుకొని ఇద్దరూ మెట్లెక్కి గోదావరి మాత విగ్రహం పక్కనే వున్న ఆడవాళ్ళు దుస్తులు మార్చుకొనే గదుల వైపుకి వెళ్లారు, వాళ్ళు అటువైపు వెళ్ళడం చూసిన కానిస్టేబులు కనకరాజు “ ఓరిని, వీళ్ళు పారిజాతం కంపెనీ లో వాళ్ళు కదా!” అనుకొంటూ దగ్గరగా వెళ్లి వాళ్ళే అని నిర్ధారణ చేసికొని “ఏంటే? మీరు ఇక్కడ కూడా బేరాలు మొదలు పెట్టేసేరా?” అంటూ లాఠీని అడ్డం పెడుతూ వాళ్ళని హేళన చేసాడు.</p>
<p>దానికి సావిత్రి దెబ్బతిన్న కుందేలు పిల్లలా బెదురుగా చూస్తూ “అదేంటి కనకరాజుగారు అలా అంటారు? ఇవ్వాళ నుంచి కార్తికమాసం కదా! ఈ నెల రోజులు గోదార్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని గుళ్ళో పూజారి గోరు చెప్పారు కదండీ, అందుకని పొద్దున్నే వచ్చామండి” అని అమాయకంగా అంది.“అద్గది అలా చెప్పండి! చేసేవి అన్నీ చీకటితప్పులు, వాటిని ఇలా గోదారి స్నానాలతో కడిగేసుకుని పుణ్యం మూటకట్టుకుంటారన్నమాట! అమ్మమ్మా..ఎంత జాణలే మీరు? దేవుడికే ఎసరు పెట్టేస్తారే? థూ!” అని బూతులుతిడుతూ “వెళ్ళండి వెళ్ళండి అసలు మీ లాంటి వాళ్ళ వల్లే ప్రపంచ౦ ఇలా తయారయింది” అంటూ లాఠీని వాళ్ళమీద కదిలిస్తూ అక్కడనుంచి వెళ్లి పోయాడు.<br />
ఆ మాటలు విన్న సావిత్రి, రాణి కళ్ళనీళ్ళపర్యంతం అయ్యారు.</p>
<p>“పొద్దున్నే వీడితో మాటలు పడ్డాం! మన లాంటి వాళ్ళకు గుడికి వెళ్ళే హక్కు కూడా లేదా? మనకి బతకడానికి వేరే దారి లేక ఈ రొంపిలో ఉన్నాము గాని ఇష్టమై రాలేదు కదా! అయినా, వీళ్లు ఏం పాపం చెయ్యలేదా? అన్ని పుణ్యాలే చేశారా? ఈ కనకరాజు గురించి ఊర్లో అందరూ ఎలా చెప్పు కుంటారని, మొదటి పెళ్ళాన్ని ఈయనే చంపాడనీ, పోలీసు ఉద్యోగంలో వున్నాడు కాబట్టి వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకొని తన మీదకి కేసు రాకుండా చూసుకొన్నాడనీ, తెగ ఇదిగా మాట్లాడుకుంటారు, అలాంటిది,వీడి వెనకాల ఇంత చరిత్ర పెట్టుకొని మనల్ని అంటాడా? ఏం కట్టుకున్న దానిని చంపటం మహా పాపం కాదా? వీడి లాంటి వాళ్ళని వదిలేసి ప్రపంచ౦ మనలాంటి వాళ్ళని ఎందుకు ఆడి పోసుకుంటుందో” అని ఉక్రోషంగా అంది రాణి.</p>
<p>“పోనిలే వదిలెయ్యి రాణి! అంతా ఆ దేవుడే చూసుకొంటాడు. వాడి పాపమే వాడిని కొడుతుంది” అని సావిత్రి అంది.</p>
<p>కానిస్టేబులు కనకరాజు వీళ్ళిద్దరినీ గదమాయించడం కొంచెం దూరంగా నించుని వున్న ఓ 60 – 65 ఏళ్ళు వయసు కలిగిన పెద్దాయన చూస్తూనే వున్నాడు. కొంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మౌనంగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు.</p>
<p>ప్రతిరోజు క్రమం తప్పకుండా తెల్లారగట్లే వచ్చి స్నానాలు చేసి గోదావరిలో కార్తికదీపాలు వదిలేవారు. తమకు ఈ జీవితంనుంచి విముక్తి కావాలని ఆ శివుడిని వేడుకొనే వారు. ఇలా వీళ్ళిద్దరూ రోజూ ఆ రేవుకి వచ్చినప్పుడు ఆ పెద్దాయన వీళ్ళని చూడటం సావిత్రి, రాణి కూడా గమనించారు. అతనిని చూస్తే తమలాంటి వాళ్ళదగ్గరకు వచ్చే మనిషిలా అనిపించలేదు. ఆయన స్ఫురద్రూపి, ఆజానుబాహుడు, దబ్బపండు ఛాయలోవున్నాడు. చూస్తేనే చెయ్యెత్తి దండం పెట్టాలి అనేటట్టు వున్నాడు. కాని తమని ఎందుకు అలా చూస్తున్నాడో వాళ్ళకి అర్ధం కాలేదు. ఆయన చూపులో కాని శారీరక బాష లో గాని ఏ మాత్రం అసభ్యత కనిపించలేదు. పైగా, ఆయన చూసే చూపులో కరుణనీ, ఆర్ద్రతని సావిత్రి గమనించింది.</p>
<p>ఆ రోజు కార్తికపౌర్ణమి. ఆ పవిత్రమైన రోజున జనసందోహం ఎక్కువగా వుంటుంది కాబట్టి దర్శనం తొందరగా అవదు అనే భయంతో ముందే వచ్చారు. ఇంతలో వాళ్ళకి మళ్ళీ ఆ కానిస్టేబులు కనకరాజు కనిపించాడు. “అబ్బా! అక్కా! మళ్ళీ వీడి పాలన పడ్డామా, ఇంతే సంగతులు” అంది రాణి.</p>
<p>“ఇవాళ మనలని ఏమన్నా అనాలి ఇక్కడే వాడి అంతు చూద్దాం!”కరకుగా అంది సావిత్రి.</p>
<p>కొంచెం దూరంలో స్నానంచేసి మెట్లు ఎక్కి పైకి వస్తున్న ఆ పెద్దాయన వీళ్ళ మాటలు విని “అమ్మా ముందు మీరు వెళ్లి స్నానం చేసి ఆ దేవుడి దర్శనం చేసుకొని రండి”అన్నాడు.</p>
<p>గంభీరంగా వినిపించిన ఆ గొంతు ఇద్దరినీ కూడా మారు మాట్లాడకుండా నది వైపు వెళ్ళేలా చేసింది.వాళ్ళిద్దరూ స్నానం చేసి దర్శనం చేసుకొని వచ్చేవరకు ఆయన ఆ గోదావరి మాత విగ్రహం దగ్గరే వున్నాడు. గుడినుంచి బయటకు వస్తున్న వాళ్ళిద్దర్నీ చూసి ఆయన వాళ్ళ దగ్గరగా వెళ్లి “అమ్మా! ఇలా రండి. ఈ మెట్ల మీద కూర్చోండి” అనగానే ఇద్దరు మొహమొహాలు చూసుకొన్నారు.</p>
<p>మళ్ళీ ఆయనే “ అమ్మా! భయపడకండి! నాకు మీ గురుంచి అంతా తెలుసు. మిమ్మల్ని నేను కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నాను. ఆ గుళ్ళో పూజారిగారు మీ గురుంచి మీ మంచితనం గురుంచి కూడా చెప్పారు. ఒక మారు ఆ పోలీసాయన మీతో మాట్లాడింది కూడా విన్నాను. అది లోక నైజం. మీరు బాధపడకండి. మీరు ఒప్పుకొంటే మీకు నచ్చని ఈ జీవితాన్ని వదిలేసి తల్లి ప్రేమను పంచే భాద్యత గల జీవనం సాగించగలరా? అదీ మీకు ఇష్టమైతేనే! ఇందులో ఏ మాత్రం బలవంతం లేదు. దానికి ముందు నా గురించి మీకు విపులంగా చెపుతాను. నేను ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాను. బాగా చదువుకొన్నాను, పెళ్లిచేసుకొన్నాను, విదేశానికి వెళ్ళాను. అక్కడే ఇద్దరు మగపిల్లలుకూడా పుట్టారు. అలా నా జీవితం పూల నావలా సాగిపోతుండగా మన దేశానికి వచ్చిన నా భార్య యుక్తవయస్సు వచ్చిన నా పిల్లలిద్దరూ కూడా అప్పుడు జరిగిన మతోన్మాదుల మారణహోమంలో మరణించారు. అది యెంత దారుణంగా అంటే వాళ్ళ శరీరాలని కూడా గుర్తు పట్టలేనంతగా . ఆ పరిస్థితి పగవారికి కూడా రాకూడదు. అయినవాళ్ళని అందరిని ఒక్కసారే పోగొట్టుకొన్న దురదృష్టవంతుడిని. ఆ విధంగా జీవచ్ఛవంలా పడివున్న నాకు ఒక మహాను భావుడు ధైర్యం చెప్పి “ఇలాంటప్పుడే గుండెనిబ్బరంగా వుండాలి! చూడు చాలా మంది నీకంటే దయనీయమైన పరిస్థితి లో వున్నారు. వాళ్ళందరికి చేయూతనివ్వు . అదే నీకు శాంతి కలిగిస్తుందని” చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలకి నిజంగానే నా మనసు శాంతించింది.</p>
<p>నా లాగా ఎంతో మంది వున్నారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలని కోల్పోయిన తల్లిదండ్రులు. అదిగో అప్పుడు వచ్చింది నాకు ఒక ఆలోచన . అదే ‘అమ్మఒడి’ని స్థాపించడం. అందుకే విదేశంలో వున్న నా ఆస్తులన్నీ కూడా అమ్మేసి, డబ్బు చేసుకొని ఇక్కడికే వచ్చాను. ఇది నా స్వంత ఊరు. ఇక్కడ నాకు ఒక పెద్ద ఇల్లు కూడా వుంది. ఆ ఇంటినే ఇప్పడు ‘అమ్మఒడి’ గా మార్చాను. ఈ ఊరిలోవున్న పేరుమోసిన డాక్టర్లు, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా నాకు చేయూత నిచ్చారు. ఇంకా ఈ లోకంలో మంచి, మానవత్వంవున్నాయనిపించింది. ఈ మహత్తర కార్యంలో ఆ మానవతా మూర్తులు తమ పూర్తి సహాయ సహకారాలను అందించారు. అయితే నా దగ్గర చిన్నచిన్న పిల్లలు చాలా మంది వున్నారు. వాళ్ళకి అమ్మ కావాలి, వాళ్ళకోసం అమ్మల్ని దత్తత తీసుకోవాలని నిశ్చయించుకొన్నాము. అంటే ఆ పిల్లలకి జీవితాంతం అమ్మగా వుండటానికి ఇష్టపడే వాళ్ళని తీసుకొందామని అనుకొన్నాను. ఇదిగో! ఈ గోదావరి మాత సాక్షిగా నాకు మీరు కనిపించారు. చెప్పండమ్మా! ఆ అనాధ పిల్లలికి తల్లులవుతారా? ఆ చిన్నారి జీవితాలలో వెలుగు నింపుతారా? మీకు పూర్తిగా రక్షణ కలిపిస్తాను. మీ గురుంచి ప్లీడరుగారి తో కూడా మాట్లాడతాను. మీరు ఎవరికీ భయపడనక్కరలేదు. మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతకొచ్చు. ఆలోచించి నాకుచెప్పండి” అని “అమ్మా! నా పేరు విశ్వనాధం. ఇది నా కార్డ్. ఇందులో నా ఫోన్ నం, అడ్రస్ అన్ని వున్నాయి. మీరు నాకు ఎప్పుడైనా సరే ఫోన్ చెయ్యచ్చు ‘అమ్మఒడి’ మీకోసం ఎప్పుడూ తెరిచే వుంటుంది” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు.</p>
<p>సావిత్రి, రాణి ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి వచ్చారు. విశ్వనాధం చెప్పిన మాటలు మళ్ళి ఒక్కసారి మననం చేసుకొన్నారు.</p>
<p>“నేను ఆ రోజునే అన్నాను కదా అక్కా!,ఏ దేవుడో మనల్ని ఆ రొంపి నుంచి బయట పడేస్తాడని,అలాగే జరిగింది.”</p>
<p>“అవునే రాణి! నిజంగా ఇది అద్భుతమే! ఆ విశ్వనాధం గారు మనపాలిట దేవుడే, అడగకుండానే మన కు ఇంత మంచి వరాన్ని ప్రసాదించారు”. అని భక్తిగా తలచుకున్నారు.</p>
<p>వాళ్ళ మనో నేత్రాలకి &#8220;తాము కనకుండానే అమ్మతనంలోని మాధుర్యాన్ని చూపించే అమాయకమైన చిన్నారులు అమ్మా! అమ్మా!&#8217; అని పిలుస్తున్నట్లుగా అనిపిస్తోంది. &#8220;మేమూ అమ్మల మయ్యాము&#8217; అని ఈ లోకం లో తలెత్తుకుని గర్వంగా బతకొచ్చు.ఆ పసికందుల కళ్ళలో కనిపించేబోయే ఆనందాన్ని, వాళ్ళు గోదావరిలో వదిలిన కార్తికదీపాలతో పోల్చుకుంటున్నారు. చీకటిని చీల్చుకొంటూ ముందుకు సాగిపోతుంటే ఆ దీప కాంతుల తళతళలూ, పున్నమి చంద్రుని వెన్నెల కిరణాలతో పోటి పడుతూ వారిరువురికి ఆశాకిరణాలుగా మారి, ఆనందబాష్పాలై వారి కళ్ళలో మెరిసాయి.</p>
<p>ఆ మెరుపుల్లో తాము కోరుకొంటున్న సుస్థిరమైన, గౌరవప్రదమైన అందమైన జీవితచిత్రం కదలాడింది.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
<p style="text-align: left;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/mani.jpg"><img class="alignleft  wp-image-7214" title="mani" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/mani.jpg" alt="" width="128" height="184" /></a><br />
పరిచయం:<br />
హైదరాబాదులో నివాసం. సాహిత్యమంటే ఇష్టం. 2010 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉద్యోగం నుంచి బయటపడ్డాను. అప్పటి నుంచి కధలు రాయాలనే అభిలాష తో రాసిన తొలి కధ &#8220;కృష్ణం వందే జగద్గురుం&#8221; కౌముది లో ప్రచురిచతమైంది. ఇప్పటి దాక దాదాపుగా పదిహేను కధలు రాసాను. నా కధలు ఆంధ్రభూమి, తెలుగువెలుగు, కౌముది, సారంగ, ఆంధ్రప్రభ.కాం, గో తెలుగు.కాం (హాస్యకధలపోటిలో ప్రధమ బహుమతి వచ్చింది) మాలిక.ఆర్గ్ లో , అచ్చంగా తెలుగు.కాం వంటి వివిధ పత్రికలలో వచ్చాయి. అప్పుడప్పుడు కవితలు కూడా రాస్తుంటాను. నాలో కలిగిన భావాలని నలుగురితో పంచుకోవాలన్న తపనే నన్నుమౌస్ పట్టేలా చేసింది. ఫేస్ బుక్ లో కథల పోటీ పెట్టిన కథాగ్రూపు, సాయిఅఖిలేష్ ప్రొడక్షన్స్ కి మరియు కథను ప్రచురిస్తున్న వాకిలి సంపాదకులకు కృతజ్ఞతలు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=7210</wfw:commentRss>
		<slash:comments>21</slash:comments>
		</item>
	</channel>
</rss>
