<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; రమా సుందరి</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BF" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>పసుపులేటి మల్లిఖార్జున గారి పక్షులు</title>
		<link>http://vaakili.com/patrika/?p=4421</link>
		<comments>http://vaakili.com/patrika/?p=4421#comments</comments>
		<pubDate>Sat, 30 Nov 2013 23:11:48 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[ప్రత్యేకం]]></category>
		<category><![CDATA[రమా సుందరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=4421</guid>
		<description><![CDATA[<p>దోవెమ్మట తలవంచుకొని పోతూ ఉంటే, ఎప్పుడో తప్పి పోయిన చిన్ననాటి చెలిమి అదాటుగా వచ్చి చేయి పట్టుకొంటే?! కళ్ళెత్తి చూసిన చూపులో ఎలాంటి విస్మయం గోచరిస్తుందో, అలాంటిదేదో నాలోనూ కనబడి ఉండాలి&#8230;. ఈ పుస్తకం దొరకగానే. పసుపులేటి మల్లిఖార్జునరావు గారు రచించిన “పక్షులు” నవల నేను మొదట ఎప్పుడు చదివానో గుర్తుకు రావటం లేదు. ఎన్ని సార్లు చదివానో కూడా గుర్తుకు రావటం లేదు. మా చిన్నప్పుడు ఆంధ్ర జ్యోతిలో నవలా ప్రియదర్శిని పేరు మీద సీరియళ్ళు వచ్చేవి. అవి చించి బైండింగ్ చేయించుకొనే వాళ్ళం. అలా ఈ పుస్తకాన్ని నా ఆరో తరగతిలో మొదట చదివినట్లు గుర్తు.</p> <p>నా ఊహ వికసించినప్పటి నుండి ఈ కధ నాతోనే ఉంది. ఒక్కో దశలో ఈ పుస్తకంలోని ఒక్కో సంగతి నన్ను ఆలోచింపచేసేది. కధలోని ఒక్కో జీవితం వ్యాకుల పరిచేది. వదలక వెంట ఉండే ఒక నీడలాగా &#8230;  బతుకు నిలువునా ఈ కధ నన్ను వెంబడించింది. ఇంతా చేస్తే ఇది నూట అరవై పేజీల చిన్న పుస్తకం.</p> <p>తెలంగాణాలోని  ఒక పల్లెలో ఈ కధ సాగుతుంది. 1976లో ఈ నవల ప్రచురితం అయింది. నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ఎమర్జెన్సీ కాలం అది. కధా స్థలం ఖమ్మంకి ఆరేడు మైళ్ళ దూరంలో మున్నేరు వడ్డున ఉండే గ్రామం. ఊర్లో సీయార్పి పోలీసులు గుడారాలు వేసుకొని ప్రజలను పీడిస్తుంటారు. అయితే రచయిత ఒక  పాతికేళ్ళ వెనక్కి వెళ్ళి కధ మొదలు పెడతాడు. తెలంగాణా సాయుధ పోరాటం ముగిసిన దశలో అసలు కధ ప్రారంభం అవుతుంది. రజాకార్ల  ఆగడాలు కూడా సమాప్తం అయ్యి…  ఆ ఆనవాళ్ళు మోస్తున్నపల్లె అది. జమిందారి వ్యవస్థ, గడీలు నశిస్తూ కొత్త ఆధిపత్య శక్తులు ఊపిరి పోసుకొంటున్నసంది కాలమది.</p> <p>గ్రామం లోని నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల ఆట పాటల ఆనందానికి శివయ్య మాష్టారు బడి ప్రారంభించి ఆటంకం కలిగిస్తారు. ఆ ఊళ్ళో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg"><img class="alignleft size-full wp-image-1705" title="rama_sundari" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg" alt="" width="146" height="172" /></a>దోవెమ్మట తలవంచుకొని పోతూ ఉంటే, ఎప్పుడో తప్పి పోయిన చిన్ననాటి చెలిమి అదాటుగా వచ్చి చేయి పట్టుకొంటే?! కళ్ళెత్తి చూసిన చూపులో ఎలాంటి విస్మయం గోచరిస్తుందో, అలాంటిదేదో నాలోనూ కనబడి ఉండాలి&#8230;. ఈ పుస్తకం దొరకగానే. పసుపులేటి మల్లిఖార్జునరావు గారు రచించిన “పక్షులు” నవల నేను మొదట ఎప్పుడు చదివానో గుర్తుకు రావటం లేదు. ఎన్ని సార్లు చదివానో కూడా గుర్తుకు రావటం లేదు. మా చిన్నప్పుడు ఆంధ్ర జ్యోతిలో నవలా ప్రియదర్శిని పేరు మీద సీరియళ్ళు వచ్చేవి. అవి చించి బైండింగ్ చేయించుకొనే వాళ్ళం. అలా ఈ పుస్తకాన్ని నా ఆరో తరగతిలో మొదట చదివినట్లు గుర్తు.</p>
<p>నా ఊహ వికసించినప్పటి నుండి ఈ కధ నాతోనే ఉంది. ఒక్కో దశలో ఈ పుస్తకంలోని ఒక్కో సంగతి నన్ను ఆలోచింపచేసేది. కధలోని ఒక్కో జీవితం వ్యాకుల పరిచేది. వదలక వెంట ఉండే ఒక నీడలాగా &#8230;  బతుకు నిలువునా ఈ కధ నన్ను వెంబడించింది. ఇంతా చేస్తే ఇది నూట అరవై పేజీల చిన్న పుస్తకం.</p>
<p>తెలంగాణాలోని  ఒక పల్లెలో ఈ కధ సాగుతుంది. 1976లో ఈ నవల ప్రచురితం అయింది. నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ఎమర్జెన్సీ కాలం అది. కధా స్థలం ఖమ్మంకి ఆరేడు మైళ్ళ దూరంలో మున్నేరు వడ్డున ఉండే గ్రామం. ఊర్లో సీయార్పి పోలీసులు గుడారాలు వేసుకొని ప్రజలను పీడిస్తుంటారు. అయితే రచయిత ఒక  పాతికేళ్ళ వెనక్కి వెళ్ళి కధ మొదలు పెడతాడు. తెలంగాణా సాయుధ పోరాటం ముగిసిన దశలో అసలు కధ ప్రారంభం అవుతుంది. రజాకార్ల  ఆగడాలు కూడా సమాప్తం అయ్యి…  ఆ ఆనవాళ్ళు మోస్తున్నపల్లె అది. జమిందారి వ్యవస్థ, గడీలు నశిస్తూ కొత్త ఆధిపత్య శక్తులు ఊపిరి పోసుకొంటున్నసంది కాలమది.</p>
<p>గ్రామం లోని నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల ఆట పాటల ఆనందానికి శివయ్య మాష్టారు బడి ప్రారంభించి ఆటంకం కలిగిస్తారు. ఆ ఊళ్ళో ఆ బడి రావటానికి కారకురాలైన జమీందారు కూతురు ఇంద్రాణితో ఈ పిల్లల స్నేహం ప్రారంభం అవుతుంది. ఇంద్రాణి దగ్గర ఎప్పుడూ ఉండే బొమ్మలు, పిప్పరమెంట్లు ఈ పిల్లల ఆకర్షణ అయితే…. తనకు దొరకని వారి స్వేచ్చా జీవితం, తుంటరి పనులు, ప్రకృతితో  వారి స్నేహం ఇంద్రాణికి అపురూపంగా ఉంటాయి.</p>
<p>ఇంద్రాణి పాత్ర పంజరంలో ఉండే మనిషిలోని స్వేచ్చా ప్రియత్వానికి ప్రతీకగా ఉంటుంది. రెక్కలు విప్పుకొని ఎగరాలని, కనుచూపు మేర విస్తరించిన మైదానాల్లో కాలికొద్ది పరిగెత్తాలనే కోరిక ప్రతి మనిషి అంతరంతరాల్లో నిక్షేపం అయి ఉంటుంది. ఆ బాల్య పిపాసను మనిషి ఎంత కాలం తనలో నిలుపుకోగలిగితే అంత సజీవంగా మనుగడ సాగించగలడు. అయితే ఈ సహజానుభూతులు నియంత్రించబడి &#8230; కృత్రిమ నియమాల, విలువల చట్రంలో ఇంద్రాణి తన బాల్యాన్నే కోల్పోతుంది. తన జమీందారీ కుటుంబం అందిచగలిగిన భోగభాగ్యాలు, సకల సౌకర్యాలు ఆమెను ఆనందపెట్టలేక పోతాయి. వాళ్ళ నాన్న అంటే భయపడే స్నేహితుల పిరికితనాన్ని అసహ్యించుకొంటుంది. ఆ పరిధి దాటి బయటకు రావాలనే చిన్ననాటి ప్రయత్నంలో తన స్నేహితులు బాధితులు అవటం గమనించి మౌనంగా, నిర్లిప్తంగా మిగిలిపోతుంది కానీ, మళ్ళీ ఛేదించాలనే ప్రయత్నం చేయదు. జమీందారీ వ్యవస్థకుండే నిర్ధయకత్వానికి, కర్కశ కాఠిన్యానికి తలవొగ్గుతుంది. దొరల హోదాకు చిహ్నంగా మిగిలిపోయిన శిధిలమైన గడీ లాగానే ఇంద్రాణి తన శరీరాన్ని, మనసుని ధ్వంసం చేసుకొని అక్కడే మరణిస్తుంది.</p>
<p>పిల్లల స్నేహం ప్రాతిపదికగా ఆషామాషీగా మొదలైనట్లుండే కధ &#8230; ఆ పిల్లల బ్రతుకుల్లోనే … ఆ నాటి రాజకీయ సామాజిక చిత్రాన్ని విపులీకరిస్తుంది. రజాకార్ల చేతిలో తండ్రి హతుడు కాగా, వారిచే మానభంగానికి గురైన లత అమ్మ ఈ కధలో మేలైన పాత్ర.  ఆమెను ఊరు ఆదరించి హత్తుకొన్న వైనం &#8230; ఆనాటి వారి సామాజిక కష్టానికి ప్రజల సామూహిక తోడ్పాటుని సూచిస్తుంది. ఏమి చదువుకోక పోయినా &#8230; కూతురు  తన కాళ్ళ మీద తను నిలబడటానికి శ్రమిస్తుంది  ఆమె. తను ఆశించిన ఎత్తుకు లత చేరుకొనే కాలానికి ఆమె కనుమరుగు అవుతుంది.</p>
<p>బాల్యవివాహం, పందొమ్మిది ఏళ్ళకే ఇద్దరు బిడ్డల తల్లిగా వైధవ్యం &#8230; యశులాంటి బాలికలు ఆ నాటి సమాజానికి కొత్త కాదు. అప్పటి దురాచారాల ఉనికికి గుర్తుగా ఈ స్త్రీల నీడలు తరువాత కొంత  కాలం పాటు చాలా ఇళ్ళల్లో విస్తరించి ఉండి కాల క్రమేణా అదృశ్యం అయ్యాయి. చేతివృత్తులకు ఆదరణ లేక సామూహిక ఆత్మహత్య చేసుకొన్న సారె రామయ్యలాంటి  కుటుంబాలు ఇప్పుడు మన చుట్టూ పుట్టగొడుగుల్లాగా పెరిగి దెయ్యాల్లాగా భయపెడుతున్నాయి. అయితే ఈ కధ రచయితలాంటి సున్నిత మనస్కులు కరువైన ఈ కాలంలో&#8230; ఈ మరణాలు ప్రభుత్వ లెక్కల్లో స్థానం సంపాదించుకోవటానికి &#8230; చచ్చిపోయిన తరువాత కూడా, పోరాటం చేస్తున్నాయి. ఆకలి చావులు, రైతులు ఆత్మ హత్యలు  సానుభూతి స్పర్శను కోల్పోయి చాలా రోజులే అయ్యింది.</p>
<p>శ్మశానానికి వెళ్ళి బూడిద తీసుకొని రావాలనే పిల్లల సవాలును స్వీకరించి, దడుపు జ్వరంతో చనిపోయిన సత్యంను రచయిత కధ చివరి దాకా మర్చిపోడు. మనల్ని ఎప్పటికీ మర్చిపోనివ్వడు. గ్రామ కక్షలకు బలై పోయిన కుటుంబంతో బాటు ఊరు విడిచి వెళ్ళి పోయిన విస్సు మళ్ళీ ఎక్కడో తమకు తారసపడతాడేమోనని మురళి, ప్రసాద్  ఎదురుచూస్తూనే ఉంటారు. అప్పటి దాకా తమతో ఆడీ పాడిన నేస్తాల అగస్మాత్తు కనుమరుగు వారికి కలిగించిన బెంగ, దుఃఖం &#8230;. చిన్ననాటి మైత్రిని కోల్పోయిన ప్రతి ఒక్కరు అనుభూతి చెందుతారు.</p>
<p>శివయ్య మాస్టారు ఈ నవలలో కధా నాయకుడని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయ విద్యార్ధికి ఉండే సంబంధాన్ని యాంత్రికంగా కాక జీవితకాల అనుబంధంగా మార్చిన పంతుళ్ళు గతంలో అన్ని దగ్గర్లా ఉండే వాళ్ళు. కేవలం ‘మాష్టారు’ని, ‘టీచర్’ గారిని చూడాలని సొంత ఊరికి వెళ్ళే వాళ్ళను నేనేరుగుదును. శివయ్య మాష్టారు ఈ గౌరవానికి ఇంకొన్ని మెట్టు ఎక్కువ అర్హులు. చదువుని ఉపాధికి వనరుగా గుర్తించి&#8230;  గ్రామాలలోని అల్లరి చిల్లరి పిల్లలను ఏరి&#8230; బడులకు లాగి…. పరిశ్రమకు వంచి &#8230; మనసా వాచా కర్మణా ఉపాధ్యాయులుగా పూర్తి కాలం జీవితాన్ని వెచ్చించిన ఇలాంటి అయ్యవార్లు అక్కడక్కడ కనిపిస్తారు. స్వాతంత్రం వచ్చాక దేశ పునర్నిమాణం కోసం శ్రమించిన మేధావులలో ఈ పంతుళ్ళకే మొదటి స్థానం ఇవ్వాలి. కుటుంబాన్నికూడా పూర్తిగా వృత్తికి అనుసంధించి, చదువుల వాసన తెలియని కుటుంబాల నుండి వచ్చిన మురళి లాంటి పిల్లలకు పితృ మమకారాన్ని కూడా పంచుతాడు. పిల్లల చదువు కోసం ఆయన వేసిన కాలిబాటలు వారిని మెరుగైన జీవితం వైపు నడిపిస్తాయి. తన సిగెరెట్టు అలవాటు పిల్లల్ని తప్పు దారి పట్టిస్తుందని కష్టపడి మానేస్తాడు. ఉద్యోగం ఇప్పించిన దొర బిడ్డ ఇందు చదువు కోసం, భవిష్యత్తు కోసం దొర దగ్గర ఎంత గోజారుతాడో &#8230;. ఆ గ్రామం నుండి మొదటి సారిగా బయటికి చదువులకు వెళ్ళిన పేద ఆడపిల్ల లత గురించి చివరికంటా అంతే ఆరాట పడతాడు.</p>
<p>చల్లారి పోయిన తెలంగాణా పోరాటానికి ప్రతినిధిగా గురవయ్య కనిపిస్తాడు ఈ కధలో. సాయుధ పోరాటంలో పొరపాటున కాలు పోగొట్టుకొని మున్నేటి వడ్డున మిగిలి పోయిన గురవయ్యకు భవిష్యత్తు మీద అచంచలమైన నమ్మకం. ఇతడు సమసమాజ స్వాప్నికుడు. నిన్నటి కంటే ఈ రోజు, ఈ రోజు కంటే రేపు బాగుంటుందన్న ఆశావాదం. రోజూ ఏటి గట్టుకు స్నానానికి వచ్చి&#8230; తనకు వేపపుల్ల తుంచి ఇచ్చే పిల్లలకు తెలంగాణా పోరాట విలువలను చెబుతాడు. చదువు మనిషి కి వెలుగు చూపిస్తుందని వాళ్ళ వెన్ను నిమురుతాడు. పై చదువులకు ఖమ్మంకు పంపటానికి మురళి తల్లి తండ్రులు వెనకాడితే లత వాళ్ళ అమ్మ దగ్గర బుద్ది తెచ్చుకోమని గడ్డి పెడతాడు.</p>
<p>పిల్లలు బుద్ధి, జ్ఞానం, ప్రవర్తన, పరిశీలన శివయ్య మాష్టారు, గురవయ్యల దగ్గర నేర్చుకొంటే  &#8230;. ప్రకృతితో సంబంధం నెరపటం ఎంకడు నేర్పుతాడు. పాఠాలలో ఉండే విషయానికి , భూమి మీద ఉన్న నిజానికి నిలువెత్తు వ్యత్యాసం ఎంకడిగా కనిపిస్తుంది వాళ్ళకు. బెత్తెడు గోచి గుడ్డ తప్ప ఇంకేమి లేని ఎంకడికి &#8230; ఆకలికి, ఆవాసానికి ప్రకృతే ఆధరువు. జానెడు పొట్ట నింపుకోవటం కోసం వాడి నిరంతర వెదుకులాట &#8230; లేత రెక్కలను పెట్టుబడిగా పెట్టి చేసే వాడి కష్టం… ఎన్నో ప్రశ్నలను వాళ్ళలో రేపుతాయి. వాడి ఆకలికి పాపం, పుణ్యం తెలియవు. కార్తీక దీపాల్లో నూనె, బతకమ్మ లలో రాగి డబ్బులు వాడు సునాయసనంగా కొల్లగొట్టగలడు. వాడి ఆకలికి భయం ఉండదు. కాకులను వెళ్ళగొట్టి తర్పణాలను మహానందంగా తినగలడు. పీతలు, ఎండ్రకాయలు, దుంపల కోసం ఏటి వడ్డున వాడు తవ్విన గుంటలు కడుపాకలి తీరటానికి వాడు వేసికొన్న అచ్చులు. ఆ ఎంకడు బతుకు పోరాటంలో ఓడిపోయి ఆకలి చావు పాలవుతాడు.  కాగితాల్లో, చట్టాల్లో పరిమితం అయిన అభివృద్ధి &#8230; అంటుకు పోయిన వాడి పొట్టదాకా చేరక ముందే ఆకలి దెయ్యం వాడిని మింగేస్తుంది.</p>
<p>పౌరోహిత్య కుటుంబంలో పుట్టిన ప్రసాద్ నన్ను అప్పటికీ ఇప్పటికీ ఎక్కువ ఆకర్షించిన పాత్ర. రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే ప్రసాదు చివరికి నక్సలైట్ గా మారతాడు. మురళి, ప్రసాదులను ఒకే లాంటి సామాజిక, ఆర్ధిక వాతావరణం స్పృశించినా దానికి వాళ్ళు ప్రభావితం అయిన తీరు భిన్నంగా ఉంటుంది. మురళి జరుగుతున్నపరిణామాల్ని, మారుతున్న పరిస్థితుల్ని ఒక ప్రేక్షకుడిలాగా గమనిస్తూ విశ్లేషిస్తూ వెళతాడు. అవే పరిణామాలు, పరిస్థితులు ప్రసాదును వేరే సాంద్రతతో  తాకి, ఇంకో రకంగా ప్రేరేపిస్తాయి. ఒక జీవితకాలంలో ఉప్పెనలా వచ్చిన మార్పులను మురళి తట్టుకొని  పెనుమానుగా నిలబడిపోతే, ప్రసాదు కదిలిపోయి కారణాలు వెదుకుతాడు. సమాజం గురించి చెప్పని … గుమాస్తాలను తయారు చేసే చదువుల అవసరాన్ని ప్రశ్నిస్తాడు. ఎంకడి ఆకలి చావు ఇద్దర్నీకుదిపి వేసినా &#8230;  ప్రసాదులో రగిలిన కసి అతన్ని ఆయుధం వైపు మరలిస్తుంది. మనుషుల ఇడుములకు, అంతరాలకు వేర్లు వెదుకుతూ వెళతాడు.</p>
<p>విభిన్న వ్యక్తుల మధ్య స్నేహం ప్రాతిపదికగా ఏర్పడ్డ అనుబంధాలు ఈ కధకు ఇంధనాలు. పిల్లల మధ్యనే కాకుండా &#8230; గురవయ్య, ఎంకడి మధ్య &#8230; లతా వాళ్ళమ్మ, పిల్లల మధ్య … శివయ్య మాష్టారు, ఇందు మధ్య &#8230; మానవీయ సువాసనలతో కూడిన  గొప్ప సంబంధాలను స్థాపిస్తాడు రచయిత. ఈ బంధాలు అత్యంత సహజంగా ఉంటాయి. తల్లితండ్రులు కూడా పట్టించుకోని ఎంకడి శవానికి మురళి, ప్రసాద్ దగ్గరుండి అంత్య క్రియలు జరుపటం &#8230; వైభవంగా బతికి అనాధలా చనిపోయిన ఇందుకి మురళి తల కొరివి పెట్టటం ఈ బంధాలకు పరాకాష్ట.</p>
<p>ఆరడుగుల అందగాళ్ళు, పడవలాంటి కార్లు సాహిత్యాన్ని ఏలుతున్న డెబ్బై ప్రాంతంలో ఆనాటి సమాజాన్ని ప్రతిబింబించిన గొప్ప సాహిత్యం కూడా వచ్చింది. ఈ నవల తెలంగాణ పల్లెల్లో అప్పటి చారిత్రిక పరిస్థితులను ప్రక్షిప్తం చేసింది. స్వతంత్రం వచ్చిన తరువాత పల్లె జీవితం గురైన ఒడుదుడుకులను చర్చిస్తుంది. ఈ కధ ఎన్నికల పేరుతో ప్రచారానికి వచ్చిన ప్రజాస్వామ్యం డొల్లతనాన్ని ఒక బాల్యపు విభ్రాంతితో పరికిస్తుంది. జమిందారీ ప్రతిష్ట, పరదా పేరుతో సాంప్రదాయ సంకెళ్ళ ఉచ్చులో బిగించి ఊపిరి ఆడనివ్వక చంపేసిన స్త్రీ బతుకును మన ముందు పరుస్తుంది. ఇప్పుడు చదువుతుంటే &#8230; ఈ నవల వచ్చి నలభై సంవత్సరాలు అవుతున్నా తెలంగాణా పల్లెల్లోని ప్రజల జీవితాల్లో మౌలికంగా వచ్చిన మార్పు ఏమిటి అనే ప్రశ్నార్ధకాన్ని మన ముందుకు పంపి  ఈ కధ మౌనంగా నిల్చున్నట్లనిపించింది.</p>
<p>పట్టించుకొనే వాళ్ళు లేక  మరుగున పడిన ఇలాంటి ఆణి ముత్యాలను వెలికి తీసి పాఠకులకు అందించాల్సి ఉంది.</p>
<p style="text-align: center;">*** * ***</p>
<p>పక్షులు &#8211; పసుపులేటి మల్లిఖార్జున గారి నవల:<br />
<iframe id="doc_37110" src="//www.scribd.com/embeds/183433103/content?start_page=1&amp;view_mode=scroll&amp;show_recommendations=false" frameborder="0" scrolling="no" width="100%" height="600" data-auto-height="false" data-aspect-ratio="undefined"></iframe></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=4421</wfw:commentRss>
		<slash:comments>26</slash:comments>
		</item>
		<item>
		<title>భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=3566</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3566#comments</comments>
		<pubDate>Wed, 31 Jul 2013 21:12:08 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కబుర్లు]]></category>
		<category><![CDATA[రమా సుందరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3566</guid>
		<description><![CDATA[<p>ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి తో వచ్చిన విదేశీ మహిళలు&#8230; ఎవరూ వీటి నుండి తప్పించుకోలేక పోతున్నారు.</p> <p>అత్యాచారాలు జరిగినప్పుడల్లా రెండు వాదనలు ప్రముఖంగా వినిపిస్తాయి. సంప్రదాయవాదులు ఆడవారి వస్త్రధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నవని వాదిస్తారు. అంటే సాంస్కృతిక పరాయీకరణ వలన నష్టం జరుగుతుందన్న అర్ధం ఇందులో ధ్యనిస్తుంది. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదనలో సంస్కృతీ పరిరక్షణ బాధ్యత అంతా భారత స్త్రీలదేనన్న ధోరణి వ్యక్తం అవుతుంది. ఆ విధంగా స్త్రీల వ్యక్తిగత మరియు సామాజిక స్వాతంత్ర్యాలను, సంస్కృతీ పరిరక్షణ పేరుతో వీరు తిరస్కరిస్తారు.</p> <p>ప్రగతి కాముకులు అత్యాచారాలకు కారణాలను వస్త్రధారణలో కాకుండా వ్యవస్థలో చూడాలని కోరుతారు. సమాజంలో వస్త్రధారణ ప్రత్యేకమైన విడి అస్తిత్వం కలిగి ఉండే విషయం కాదని, వ్యవస్థను నడిపే ఆర్ధిక పునాదులు సంస్కృతిని శాసిస్తాయనీ, అలాంటి సంస్కృతిలో ఒకానొక భాగమే వస్త్రధారణ అని వారి వివరణ. వీరు కూడ సాంస్కృతిక పరాయీకరణ జరుగుతోందని అంగీకరిస్తూ దేశ సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తారు. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదన, సంస్కృతుల ఆధిపత్యాన్ని తిరస్కరించే ధోరణి తో ఉంటుంది.<br /> ప్రగతి కాముకులు వస్త్రధారణను, అత్యాచారాలకు కారణంగా అంగీకరించరు. ఎందుకంటే, అనేక సందర్భాలలో అత్యాచారం; అధికారం, ఆధిపత్యాలకు వ్యక్తీకరణగా ఉంటుంది. పశ్చిమ దేశాలలో మహిళలకు వస్త్రధారణలో ఇంతకంటే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇక్కడ కంటే విషసంస్కృతి విసృతంగా విస్తరించినప్పటికీ, అక్కడ అత్యాచారాల శాతం తక్కువ. భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్న పితృసామ్యం, కరడు కట్టిన పురుషాధిక్యత ఈ అత్యాచారాలకు ప్రధాన కారకాలని వీరు అంటారు.</p> <p>సంప్రదాయ వాదుల్లోనూ, ప్రగతి కాముకుల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం సాంస్కృతిక పరాయీకరణ పట్ల వ్యతిరేకత. కానీ వారికి ఉన్న [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg"><img class="alignleft size-full wp-image-1705" title="rama_sundari" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg" alt="" width="146" height="172" /></a>ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి తో వచ్చిన విదేశీ మహిళలు&#8230; ఎవరూ వీటి నుండి తప్పించుకోలేక పోతున్నారు.</p>
<p>అత్యాచారాలు జరిగినప్పుడల్లా రెండు వాదనలు ప్రముఖంగా వినిపిస్తాయి. సంప్రదాయవాదులు ఆడవారి వస్త్రధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నవని వాదిస్తారు. అంటే సాంస్కృతిక పరాయీకరణ వలన నష్టం జరుగుతుందన్న అర్ధం ఇందులో ధ్యనిస్తుంది. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదనలో సంస్కృతీ పరిరక్షణ బాధ్యత అంతా భారత స్త్రీలదేనన్న ధోరణి వ్యక్తం అవుతుంది. ఆ విధంగా స్త్రీల వ్యక్తిగత మరియు సామాజిక స్వాతంత్ర్యాలను, సంస్కృతీ పరిరక్షణ పేరుతో వీరు తిరస్కరిస్తారు.</p>
<p>ప్రగతి కాముకులు అత్యాచారాలకు కారణాలను వస్త్రధారణలో కాకుండా వ్యవస్థలో చూడాలని కోరుతారు. సమాజంలో వస్త్రధారణ ప్రత్యేకమైన విడి అస్తిత్వం కలిగి ఉండే విషయం కాదని, వ్యవస్థను నడిపే ఆర్ధిక పునాదులు సంస్కృతిని శాసిస్తాయనీ, అలాంటి సంస్కృతిలో ఒకానొక భాగమే వస్త్రధారణ అని వారి వివరణ. వీరు కూడ సాంస్కృతిక పరాయీకరణ జరుగుతోందని అంగీకరిస్తూ దేశ సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తారు. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదన, సంస్కృతుల ఆధిపత్యాన్ని తిరస్కరించే ధోరణి తో ఉంటుంది.<br />
ప్రగతి కాముకులు వస్త్రధారణను, అత్యాచారాలకు కారణంగా అంగీకరించరు. ఎందుకంటే, అనేక సందర్భాలలో అత్యాచారం; అధికారం, ఆధిపత్యాలకు వ్యక్తీకరణగా ఉంటుంది. పశ్చిమ దేశాలలో మహిళలకు వస్త్రధారణలో ఇంతకంటే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఇక్కడ కంటే విషసంస్కృతి విసృతంగా విస్తరించినప్పటికీ, అక్కడ అత్యాచారాల శాతం తక్కువ. భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్న పితృసామ్యం, కరడు కట్టిన పురుషాధిక్యత ఈ అత్యాచారాలకు ప్రధాన కారకాలని వీరు అంటారు.</p>
<p>సంప్రదాయ వాదుల్లోనూ, ప్రగతి కాముకుల్లోనూ ఉమ్మడిగా కనిపించే అంశం సాంస్కృతిక పరాయీకరణ పట్ల వ్యతిరేకత. కానీ వారికి ఉన్న కారణాలు వేరు వేరు. సంప్రదాయవాదులు తెలిసి చేసినా, తెలియక చేసినా నశించి పోతున్న, నశించవలసిన పాత విలువలను పట్టుకుని వేళ్ళాడుతూ అందులో భాగంగా సాంప్రదాయక వస్త్రధారణను కాపాడుకోవాలని భావిస్తారు. ఇందులో మనదైనది అంతా గొప్పే అనీ, పరాయిది అంతా చెడ్డదేననే ఒక తప్పుడు అవగాహన వ్యక్తం అవుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం, పశ్చిమ దేశాల పౌరసత్వాల కోసం, ఫారెన్ అల్లుళ్ళ కోసం పరితపించే వారే సంస్కృతి పరాయీకరణ పట్ల గుండెలు బాదుకోవడం తరచుగా కనిపిస్తుంది. వీరికి డాలర్లు కావాలి, కానీ డాలర్ల వెంట వచ్చే సంస్కృతీ విలువలు వద్దు.</p>
<p>ఈ విషయం లోతు &#8216;సంస్కృతి &#8216; అనే పదాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది. సంస్కృతులు అనేవి యధాతధంగా వాటి స్థానంలో అవి ఉన్నపుడు ఒకటి గొప్పా కాదు, మరొకటి చెడ్డా కాదు. వేటికవే ప్రత్యేకత కలిగినవి. ప్రజల సర్వతోముఖ అభివృద్ధితో ముడిపడి ఉన్నంతవరకు ఏ సంస్కృతి అయినా గొప్పదే. కానీ వచ్చిన చిక్కంతా చరిత్ర ఎక్కడి సంస్కృతిని అక్కడే ఉంచలేదు. వ్యాపార వాణిజ్యాలతో పాటు, పాత వలస పాలన, ఆధునిక సామ్రాజ్యవాద దోపిడి లాంటి ఆర్ధిక ఆధిపత్య కార్యకలాపాలు ప్రపంచంలోని వివిధ సంస్కృతులు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవటానికి, సంభాషించుకోవటానికి, సమ్మిళితం కావడానికి దారి తీసింది. అంతే కాక సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి దారి తీసింది.</p>
<p>వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాలు గతంలో పాటించేవారు. దుస్తులు చలి, వేడిల నుండి శరీరాన్ని కాపాడటానికి అనే ప్రాచీనయుగాల నుండి, నాగరికత అభివృద్ధిలో భాగంగా అనేక రూపాలు తీసుకొంటూ ఒక దశలో పరిణితి రూపం తీసుకొంది. అన్ని వర్గాల పిల్లలను ఒకటిగా కలపగల &#8216;యూనిఫామ్ &#8216; కల్చర్ లాగా, అన్ని రకాల శరీరాకృతి గలిగిన మనుషుల పొడవు, లావు, కండలు, ఎముకలు కప్పిపెట్టే ఒక విశ్వజనీన సాధనంగా దుస్తులు ఒకప్పుడు ఉండేవి. మళ్ళీ స్త్రీ, పురుషులకు వాళ్ళ అవసరాల రీత్య వేరు వేరు వస్త్రధారణ ఉండేది. ఇందులో ఆనాటి వ్యవస్థల ప్రభావం కూడ ఉండేది. కాల క్రమేణ సాంస్కృతిక సామ్యాజ్యవాద ప్రభావంతో భారతదేశంలో అత్యధిక శాతం పురుషుల దుస్తులు పాశ్చాత్స ప్రభావానికి గురయ్యాయి. అయితే స్త్రీల దుస్తులు 80 శాతం ఇంకా స్థానికతను కోల్పోలేదు. కాలక్రమేణ స్త్రీల క్రియాశీలక పాత్ర అన్ని రంగాలలో పెరగటం వారి వస్త్రధారణలో మార్పులకు దారి తీసింది.</p>
<p>ఆరడుగుల చీరల నుండి కురచ తక్కువ చీరలలోకి, తరువాత దక్షిణ భారతదేశ స్త్రీలు ఉత్తర భారతదేశ దుస్తులైన పంజాబీ డ్రెస్, చూడీదార్, షల్వార్ కమీజ్ వగైరాలలోకి మారిపోయారు. ఇందులో ఫాషన్ తో బాటు, సౌకర్యం కూడ పని చేసింది. ఇప్పుడు దక్షిణ భారతంలో కూలీ కెళ్ళే మహిళలు కూడ పంజాబీడ్రెస్ లోకి మారటం గమనించగలము. నగర ప్రాంత మహిళలు పాంటు, షర్ట్ లలోకి మారారు. ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో సేల్స్ గర్ల్స్ కూడ జీన్స్ పాంటులు ధరిస్తారు.</p>
<p>వేషధారణలో ఈ మధ్య వచ్చిన ఫాషన్ లో అంతర్లీనంగా కనిపించేది, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి ఆకర్షణ కోసం తమను తాము వ్యక్తీకరించుకునే చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. వ్యక్తిత్వ సౌందర్యంతో కాకుండా శారీరక సౌందర్యంతో ఆకర్షించుకునే ప్రయత్నం ఏ దేశంలోనైనా సహజమే అయినా పశ్చిమ దేశాల్లో అది విపరీత పోకడలకు పోయింది. పోర్న్ మాఫియా అభివృద్ది చెంది, వివిధ ఆర్ధిక కార్యకలాపాల్లో పై చేయి సాధించటానికి అదొక సాధనంగా అక్కడ అవతరించడం దానికొక కారణం కావచ్చు. ఇది స్త్రీ, పురుషుల ఆకర్షణకు సంబంధించిన డైనమిక్స్ పైన తీవ్ర ప్రభావం పడేసినట్లు కనిపిస్తోంది.</p>
<p>శారీరక సౌందర్య ఆకర్షణలో భాగంగా శరీర భాగాలను కూడా బహిర్గతపరుస్తూ ఆపోజిట్ సెక్స్ ను ఆకర్షించడమ్ పశ్చిమ దేశాల్లోనూ, కొన్ని లాటిన్ దేశాల్లోనూ ఒక ధోరణిగా ముందుకొచ్చింది. దుస్తులను రకరకాల షేపుల్లో కుట్టి ధరిస్తే అదొక ఫ్యాషన్ కావచ్చు. ఒకటికి రెండు, మూడు, లేదా ఐదారు దుస్తులు ఒకదానిపైన ఒకటి వేసుకొని లోచొక్కాలను బైటికి కనిపించేలా పై దుస్తులను కురచవి చేసుకొంటే అదొక ఫ్యాషన్ కావచ్చు. జుత్తుని రకరకాల షేపుల్లో కత్తిరించి ప్రదర్శించుకొంటే, పాతదైనా, లేటెస్టైనా, అదొక ఫ్యాషన్ కావచ్చు. కానీ శరీర భాగాల్ని చూపడం ఏమి ఫ్యాషన్? ఇక మనిషి దుస్తులను కనిపెట్టి ధరిస్తున్నదెందుకు? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలు.</p>
<p>స్త్రీ, పురుషల మధ్య ఆకర్షణలో భాగంగా వెర్రితలలు వేస్తున్న ఫ్యాషన్లు పాశ్చాత్య దేశాల్లో ప్రముఖ ధోరణి అయ్యింది. సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో భాగంగా అది మన దేశానికి వచ్చింది. శాటిలైట్ల పుణ్యమాని విదేశి టి.వి., మ్యూజిక్ లు దేశాన్ని ముంచెత్తితే, అంతర్జాలం పుణ్యమాని పోర్నోగ్రఫీకి గట్లు తెగి మారుమూల గ్రామీణ యువకుడి జేబులోకి సైతం జొరబడింది. ధనిక వర్గాలు అలవర్చుకొన్న పాశ్చాత్య సంస్కృతి, &#8216;పాలకుల భావాలే, పాలితుల భావాలు’ కనుక కింది వర్గాల మీదికి దూకింది. ఇందులో భాగంగా స్త్రీ, పురుష బేధం లేకుండా సకల వర్గాలు పబ్ సంస్కృతులకు, శరీర భాగాలు చూపుకొనే రకం ఫ్యాషన్లకు లోనవుతున్నారు. దుస్తులు తయారుచేసే పరిశ్రమలు కూడ ఈ రకం దుస్తులను తయారు చేసి జనం మీదకు వదులుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడ ఒక పెట్టుబడిదారుడు కాబట్టి ఈ దుస్తుల కంపెనీలకు అనేక రాయితీలు ఇచ్చి ఈ వస్త్ర సంస్కృతిని మనకు అంట కడుతున్నారు.</p>
<p>వాణిజ్య వ్యాపారాలు ప్రపంచానికి అవసరమే; కాని వ్యాపారం పేరుతో వచ్చే వలస పాలన, సామ్రాజ్యవాద దోపిడి అవసరం లేదు. సంస్కృతుల సంగమం అవసరమే; కానీ సాంస్కృతిక ఆధిపత్యం అవసరం లేదు.</p>
<p>పాత కొత్తల మధ్య సంఘర్షణ ఎప్పుడూ తప్పదు. సంఘర్షణ జరిగితేనే మెరుగైన అంశం బైటికి వచ్చి అభివృద్ది వైపుకి సమాజాన్నినడిపిస్తుంది. అలాగే ప్రపంచీకరణ యుగంలో స్థానికం, పరాయిల మధ్య సంఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణలోంచి పుట్టే మెరుగైన అంశాలను, అవి ఏవైపు నుండి వచ్చినా, స్వీకరించాల్సిందే.</p>
<p>డాలర్ వెంట వచ్చే సంస్కృతి మొత్తంగా చెడ్డది కాదు. ప్రతి సంస్కృతిలోనూ పాత, కొత్తలు; గొప్పలు, లోపాలు ఉంటాయి. వాటిలో మెరుగైన అంశాన్ని, ఆధునిక అంశాన్ని స్వీకరించి ప్రగతి నిరోధక చెడ్డ అంశాలను తిరస్కరించాలి. ఐతే: ఏది మంచిది, మెరుగైనది అనేది అలాగే ఏది ప్రగతి నిరోధకమైనదీ, చెడ్డదైనదీ అనేది ఎలా నిర్ణయించాలి అంటే ఒక్కటే దారి. ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావాలకు ఏది విలువ ఇస్తుందో అదే గొప్పది, అదే మెరుగైనది, అదే ఆధునికమైనది. కొత్తకు పునాది పాతే కనుక రెండింటిలోనూ ప్రజాస్వామిక విలువలకు, సమానత్వ భావనలకు విలువ ఇచ్చేవి ఉంటాయి. వాటిని కాపాడుకుని ఆ విలువలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని తిరస్కరించటమే నేటి మనిషి కర్తవ్యం. ఆ మాటకొస్తే ఏ కాలంలోనైనా, సంస్కృతి రీత్యా, మనిషికి కర్తవ్యం ఇదే. పాతలోంచి &#8216;మంచి &#8216;ని నిలుపుకొని కొత్తలోని అభివృద్ధిని ఆహ్వానించాలి.</p>
<p>భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశాల్లో కూడా ఆధిపత్య వర్గాలకు విదేశీ డబ్బు కావాలి. కానీ దానితో వచ్చే సంస్కృతిని అలవాటు చేసుకోకూడదు. ఆ ఆధిపత్యం అన్నీ రంగాల్లో కనబడుతుంది. పురుషులకైతే స్త్రీలు ఒద్దికగా ఉండాలి తప్ప కొత్త ఆర్ధిక వెసులుబాటు తెచ్చిన స్వేచ్చా స్వాతంత్రాలను వారు కోరుకోకూడదు. ధనికులకైతే పేదలు అణగిమణిగి ఉండాలి తప్ప సోకులు కోరుకోకూడదు. అగ్ర కులాలకైతే చిన్న కులాలు కష్టం చేసుకొని తొంగోవాలి తప్ప తన కష్టాన్ని నచ్చిన రీతిలో ఖర్చుచేసుకోగూడదు.</p>
<p>ఇందులో భాగమే స్త్రీల వస్త్రధారణపై ఆంక్షలు.</p>
<p>సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేది ఆర్ధిక సామ్రాజ్యవాదం యొక్క అనివార్య ఫలితం. ఇందులో సామ్రాజ్య వాద దేశాల సంస్కృతి గొప్పదిగా చెప్పబడుతుంది. పశ్చిమ దేశాలే ఇప్పటి ఆధిపత్య సామ్రాజ్య వాద దేశాలు కనుక అక్కడి సంస్కృతి, ప్రజల వేష భాషలు, ఆ దేశాల్లోని వివిధ సామాజిక పాత్రల మధ్య ఉండే సామాజిక సంభందాలు&#8230; ఇవన్నీ గొప్పవిగా చెలామణిలో ఉన్నాయి. ఆర్ధిక, సాంస్కృతిక దురాక్రమణలో ఉన్న దేశాలలోని సంస్కృతులు తక్కువ రకం; ఇవి వెనకబడి ఉన్నాయి; ఇక్కడి కుటుంబ సంబంధాలు ప్రాచీనమైనవి; బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల మధ్య ఉండే సంబంధాలు ఇంకా అభివృద్ది చెందలేదు… ఇలాంటి వాదనలు, భావాలు- రూపాన్ని నెత్తికెత్తుకొని సారాన్ని తృణీకరించేవి. దీనిని దేశంలోని ధనిక వర్గాలు ఆనందంగా స్వీకరిస్తాయి, ఆచరిస్తాయి. పాలకుల భావాలే పాలితుల భావాలుగా చెలామణి అవుతాయి గనుక కింది వర్గాలు కూడ వారిని అనుకరిస్తాయి. ఆ విధంగా దేశీయ సంస్కృతిని, దిగుమతి చేసుకొన్న పాశ్చాత్య సంస్కృతి ఆక్రమిస్తుంది.</p>
<p>అయితే, ఆధిపత్య వర్గాలకు దేశీయ సంస్కృతి కూడా కావాలి. దేశీయ సంస్కృతిలో కింది వర్గాలను -స్త్రిలు, కార్మికులు, రైతులు, కింది కులాలు మొ.- కట్టి పడేసే సాధనాలుగా ఉన్నాయి. కనుక అవి వారికి కావాలి. కానీ దేశీయ సంస్కృతిలోని ప్రగతి కాముకమైనవి, స్థానిక అస్థిత్వాన్ని కాపాడేవి మాత్రం వారికి వద్దు, అవి కింద వర్గాలను ఐక్యం చేస్తాయి కనుక.</p>
<p>అంటే తాగి తందనాలాడి లిక్కర్ మాఫియాను పోషించేందుకు పబ్ లు కావాలి. కానీ అందులోకి స్త్రీలు రాకూడదు. రేసు గుర్రాలు, వాటిపై కాసే పందేలు కావాలి. కాని సంక్రాంతి పండగలో భాగమైన కోడి పుంజు పోటీలు నేరం. ఫ్యాంటు, షర్టు; సూటు, బూటు; షార్ట్ లు, జీన్స్ కావాలి. వాటితో బాటు వచ్చే మిడ్డీలు, చడ్డీలు, లేడి జీన్స్, లేడీ టీషర్ట్ లు వద్దు. ఇది వివక్ష తప్ప మరొకటి కాదు.<br />
దేశీయ సంస్కృతిని పరిరక్షించుకోవడానికి వీలుగా పాశ్చాత్య సంస్కృతుల్లోని అవాంఛనీయ ధోరణులను అడ్డుకోవాలంటే మొదటి దేనిని అడ్డుకోవాలి? ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్యవాదాన్ని మొదట అడ్డుకోవాలి. దేశ వనరులు దేశ ప్రజలకు దక్కేలా కాపాడుకోవాలి. దేశ వనరుల నుండి పుట్టిన వస్తువులు, డబ్బులు దేశ ప్రజల పరం కావాలి. ఆ విధంగా ధన, వస్తు సంపదలు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ అయినపుడు వాటిని అంటిపెట్టుకొని ఉండే సాంస్కృతిక, సామాజిక భావాలు, అలవాట్లు కూడా ప్రజాసామ్య పద్దతులకు లోబడి తమదైన స్వంత అభివృద్ధి బాటపైన పరుగులు పెడతాయి. అది జరిగినపుడు స్త్రీ, పురుష వస్త్రధారణ, దాని పరిణామం ఏ పరిమితుల్లో ఉండాలో ఆ పరిమితుల్లోనే ఉంటుంది. ప్రజాస్వామిక వాతావరణం ఉన్నపుడు సంస్కృతీ పరిరక్షణ భారం ఒక్క స్త్రీలపై మోపడమే విచిత్రంగా, అవాంఛనీయంగా మారుతుంది.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3566</wfw:commentRss>
		<slash:comments>38</slash:comments>
		</item>
		<item>
		<title>నేనంటే హార్మోనులే!</title>
		<link>http://vaakili.com/patrika/?p=2998</link>
		<comments>http://vaakili.com/patrika/?p=2998#comments</comments>
		<pubDate>Fri, 31 May 2013 20:30:31 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కవిత్వం]]></category>
		<category><![CDATA[రమా సుందరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=2998</guid>
		<description><![CDATA[<p>కన్నె మేరి కన్నప్పుడు<br /> కానుకలు పట్టుకొని దైవదూతలు వచ్చారట.<br /> పదమూడేళ్ళకే నా ఆటపాటలు బందు<br /> చేయించిన అమ్మ చెప్పలేదు<br /> ఇంతి చేమంతులు<br /> మగువతనాన్ని మోసుకొచ్చి<br /> నాలో ప్రతిష్టించాయని.<br /> నాటి నుండి నేటి వరకు<br /> కాలచక్రంతో కాపలా కాస్తున్నాయి నాకవి.<br /> కొన్నిసార్లు అలలు లేని నదులలాగా<br /> నాతో సరాగాలాడుతాయి<br /> ఇంకొన్నిసార్లు నడి సంద్రంలో<br /> తెగిపడిన నౌక రెక్కలాగా<br /> అతలాకుతులం చేస్తాయి<br /> నెల మధ్యలో విజృంభించి<br /> నెలసరితో శాంతించే ప్రళయ గోదావరులవి<br /> నా దేహదాహాన్ని, కడుపాకలిని<br /> కనుసన్నలలో ఆడించే మంత్ర గత్తెలవి<br /> వంటి బరువును, చెంప నునుపును<br /> నియంత్రించే మేటి వైద్యురాళ్ళవి.<br /> కంటి మెరుపును, కురుల నలుపును<br /> ప్రజ్వలించే చందమామలవి.<br /> తనువంతా మరులు ఉసికొల్పే<br /> పున్నాగ పూలవి.<br /> నిష్పత్తులు మార్చుకొంటూ<br /> నిలువెల్లా అశాంతి నింపి<br /> వికటాట్టహాసం చేసే కంతిరీ కన్నెలవి.<br /> నా భావోగ్వేదాలను బానిసలు చేసుకొన్న<br /> కర్కశ యజమానులవి.<br /> బతుకంతా భయోత్పాదకం సృష్టించినా<br /> అమ్మతనాన్ని నాకు కమ్మగా అందించి<br /> ముందు బతుకు పండగ చేసుకోమంటున్నాయి.</p>]]></description>
			<content:encoded><![CDATA[<p>కన్నె మేరి కన్నప్పుడు<br />
కానుకలు పట్టుకొని దైవదూతలు వచ్చారట.<br />
పదమూడేళ్ళకే నా ఆటపాటలు బందు<br />
చేయించిన అమ్మ చెప్పలేదు<br />
ఇంతి చేమంతులు<br />
మగువతనాన్ని మోసుకొచ్చి<br />
నాలో ప్రతిష్టించాయని.<br />
నాటి నుండి నేటి వరకు<br />
కాలచక్రంతో కాపలా కాస్తున్నాయి నాకవి.<br />
కొన్నిసార్లు అలలు లేని నదులలాగా<br />
నాతో సరాగాలాడుతాయి<br />
ఇంకొన్నిసార్లు నడి సంద్రంలో<br />
తెగిపడిన నౌక రెక్కలాగా<br />
అతలాకుతులం చేస్తాయి<br />
నెల మధ్యలో విజృంభించి<br />
నెలసరితో శాంతించే ప్రళయ గోదావరులవి<br />
నా దేహదాహాన్ని, కడుపాకలిని<br />
కనుసన్నలలో ఆడించే మంత్ర గత్తెలవి<br />
వంటి బరువును, చెంప నునుపును<br />
నియంత్రించే మేటి వైద్యురాళ్ళవి.<br />
కంటి మెరుపును, కురుల నలుపును<br />
ప్రజ్వలించే చందమామలవి.<br />
తనువంతా మరులు ఉసికొల్పే<br />
పున్నాగ పూలవి.<br />
నిష్పత్తులు మార్చుకొంటూ<br />
నిలువెల్లా అశాంతి నింపి<br />
వికటాట్టహాసం చేసే కంతిరీ కన్నెలవి.<br />
నా భావోగ్వేదాలను బానిసలు చేసుకొన్న<br />
కర్కశ యజమానులవి.<br />
బతుకంతా భయోత్పాదకం సృష్టించినా<br />
అమ్మతనాన్ని నాకు కమ్మగా అందించి<br />
ముందు బతుకు పండగ చేసుకోమంటున్నాయి.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=2998</wfw:commentRss>
		<slash:comments>13</slash:comments>
		</item>
		<item>
		<title>వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=2983</link>
		<comments>http://vaakili.com/patrika/?p=2983#comments</comments>
		<pubDate>Fri, 31 May 2013 20:27:15 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కథన కుతూహలం]]></category>
		<category><![CDATA[రమా సుందరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=2983</guid>
		<description><![CDATA[<p>&#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; మీద పుస్తక పరిచయం</p> <p>కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన &#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన &#8216;మొగుడు చచ్చిన&#8217; ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే కాదు; జ్ఞానం, దేహం కూడ నిరాకరించిన క్రూరత్వం నుండే చలం ప్రవక్తగా పుట్టాడు. ఇప్పుడు రమేశు అదే బాట పట్టాడు.</p> <p>ఎనిమిదో ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలైన కన్నెమ్మను, పూజలు (డిజైన్) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు, రెండు రయికలతో చుట్టింటికి (వంటిల్లు) పరిమితం చేసారు. “తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. మారుతల్లి ఆ ఇంటికి వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు. పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు.&#8221;</p> <p>అలాంటి కన్నెమ్మను నిండు యవ్వనంలో మడేలు మురుగుడు వలచాడు. కన్నెమ్మ బతుకులో వసంతం వచ్చింది. &#8220;మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.&#8221; మురుగుడు తెచ్చిన జిలేబినీ ఒకరికొకరు తినిపించుకొంటుండగా వెనుకనుండి గొడ్డలి తో పొడిచి అతని ప్రాణం తీసాడు తమ్ముడు రాజిరెడ్డి. ఏమీ ఎరగనట్లు భార్యతో, కన్నెమ్మతో అత్తారింటికి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="text-decoration: underline;"><strong><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg"><img class="alignleft size-full wp-image-1705" title="rama_sundari" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg" alt="" width="146" height="172" /></a>&#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; మీద పుస్తక పరిచయం</strong></span></p>
<p>కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన &#8216;రయిక ముడి ఎరుగని బతుకు&#8217; కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన &#8216;మొగుడు చచ్చిన&#8217; ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే కాదు; జ్ఞానం, దేహం కూడ నిరాకరించిన క్రూరత్వం నుండే చలం ప్రవక్తగా పుట్టాడు. ఇప్పుడు రమేశు అదే బాట పట్టాడు.</p>
<p>ఎనిమిదో ఏటనే భర్తను పోగొట్టుకొని విధవరాలైన కన్నెమ్మను, పూజలు (డిజైన్) లేని కారికం గుడ్డతో కుట్టించిన రెండుపావళ్లు, రెండు రయికలతో చుట్టింటికి (వంటిల్లు) పరిమితం చేసారు. “తొలిముట్టుకు మూడునెలల ముందు కన్నతల్లిని పోగొట్టుకొనింది. మారుతల్లి ఆ ఇంటికి వస్తానే కన్నెమ్మ చేత ఎర్రకోకను కట్టించి, రయికను విప్పించింది. అప్పుడు ఎడమయిపొయిన రయిక మరలా ఆయమ్మ ఒంటిని తాకనే లేదు. పాముపడగ నీడలో కప్ప బతికినట్టు బతికింది మారుతల్లి ఒడిలో కన్నెమ్మ. కూచుంటే తప్పు, నిలబడితే తప్పు, నోటినిండా నవ్వితే తప్పు, గొంతెత్తి మాట్లాడితే తప్పు, కడుపుకు కావలసింది అంత తింటే తప్పు, కన్నారా కునికితే తప్పు.&#8221;</p>
<p>అలాంటి కన్నెమ్మను నిండు యవ్వనంలో మడేలు మురుగుడు వలచాడు. కన్నెమ్మ బతుకులో వసంతం వచ్చింది. &#8220;మర్రిమాను కింద ఆ గబ్బు చీకటిలో మురుగడి పక్కన చేరి ఒళ్లంతా వెలుగును నింపుకొనేది కన్నెమ్మ.&#8221; మురుగుడు తెచ్చిన జిలేబినీ ఒకరికొకరు తినిపించుకొంటుండగా వెనుకనుండి గొడ్డలి తో పొడిచి అతని ప్రాణం తీసాడు తమ్ముడు రాజిరెడ్డి. ఏమీ ఎరగనట్లు భార్యతో, కన్నెమ్మతో అత్తారింటికి చేరాడు. ఆ రోజు నుండి కడదాక, కన్నెమ్మ బతుకు పొంత కడవ బతుకయ్యి వదినె పుట్టింటికి ఊడిగం చేయటంలోనే గడిచిపోయింది. “అయిదు బారల ఎర్రప్రసను కోకను తుంటిదోపు (మొగుడు చనిపోయిన వాళ్లు కుచ్చిళ్లు పోయకుండా కట్టే కట్టు) కట్టుకొని, ఇంకొక కోకను చుట్టి చంకలో పెట్టుకొని వాళ్ల వెనకాలనే కన్నెమ్మ కూడా ఈ ఇల్లు కడప తొక్కింది”</p>
<p>ఎవరీ కన్నెమ్మ?</p>
<p>“కన్నెవ్వ మా మేనత్త ఆడబడుచు. ఆ ఇంట్లో పని చేయడం తప్ప ఎవరితో మాట్లాడటం నేను చూడలేదు, నా బాల్యంలో. ఎవరూ లేనప్పుడు నన్ను దగ్గరకు లాక్కొని ముద్దులు పెట్టుకొనేది.&#8221; అప్పుడు ఆమె కంట్లో తడికి సమాధానం స.వెం. రమేశుకు ఆమె ఎత్తుబడి (కర్మకాండలు) తరువాత తల్లి నుండి తెలిసింది.</p>
<p>ఈ కధ కాలం యాబ్భై అరవై యేళ్ళ క్రితమయి ఉండాలి. తెలుగు దేశాన ఉత్తరాదిన పుట్టిన చలం దక్షిణాన ఉన్న చదువురాని కన్నెమ్మను చేరలేదు. మడేలు మురగడితో ఆమె అనుభవానికి చాలా మూల్యం చెల్లించింది. ఈ దేశంలో పెళ్ళై భార్యలు ఉన్నఅన్ని వయసుల మగవాళ్ళు కూడా యధేచ్చగా, సునాయాసంగా కొనుక్కోగల, క్రీడించగల అతి చౌకైనా శృంగారం; యవ్వనంలో ఉన్న వితంతువు కన్నెమ్మకు నిషేధం. సహజాతిసహజమైన ఆమె మేని దాహం, ఆమె అనాధ మనసు కోరిన స్నేహం తన ప్రియ ప్రాణాన్ని బలిగొని ఆమెను కడదాక జీవన్మృతురాల్ని చేసింది.</p>
<p>ఇలాంటి ఇతివృత్తంతో కధలు కొన్ని వేలు వచ్చి ఉంటాయి. ఇక సినిమాలు చెప్పనక్కరలేదు. అందులో చాలా వరకు మనకు సంబంధం లేని లోకాల్లో, పరాయి వ్యక్తుల గురించి విన్నట్లు, చూసినట్లు ఉంటుంది. కాని రమేశు కధ నడక అసాధారణంగా ఉంటుంది. ఒక మగ రచయిత స్త్రీ పాత్రను సృష్టించినపుడు; ఆమె అంతరంగ ఆవిష్కరణ, కృతిమత్వం లేకుండా, బండతనం లేకుండా మాటలకందించటం కత్తి మీద సామే. అందుకోసం ఆడవాళ్ళ వగపు పట్ల దయ, ఔదార్యం ఉంటే సరిపోదు. వాళ్ళ హృదయపు లోతులను సృజించగలగాలి. వాళ్ళ గుండె చప్పుళ్ళు వినగలగాలి. వాళ్ళ మనసు సంవేదనలను భ్రాంతులు, భ్రమలు అంటించకుండా నికార్సుగా మన పరం చేయ గలగాలి. ఆ పని రమేశు అత్యధ్భుతంగా చేసి కూర్చున్నాడు ఈ కధలో.</p>
<p>ప్రకృతి లోని అన్ని జీవ రాశుల సృష్టి కార్యాలను అంగీకరించే మనుషులచేత; ఒక స్త్రీ మోహాన్ని, వాంఛనీ అంతే సహజంగా ఆమోదింపచేయటం సులభమైన పని కాదు. అందుకే మనుషులు అందుకోలేనీ, అందుకొన్నా అంగీకరించిన ఆడదాని దేహ కాంక్షలను మట్టితో చెప్పించాడు రమేశు. &#8220;ఎవరికీ పట్టనట్టు, ఊరంతా కలిసి వెలేసినట్టు ఆ మూలన పడి ఉండే నా దగ్గరకు పోతయ్య వచ్చి, నన్ను తాకి చూసినాడు. ఎన్నో నాళ్ల తరువాత ఒక మగోడి చెయ్యి తగిలేసరికి ఎంత నెమ్మది పడినానో. నీకు నేను ఉండానులే తొప్పర (బాధ) పడవద్దు అన్నట్టు నన్ను నిమిరినాడు. రెండు చేతుల నిండుగా నన్ను జవురుకొని జల్లలో పండుకోవెట్టి, ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఈ కానగమాను కింద చోటు చూపించినాడు. ఈ పొద్దో రేపో నాకొక కొత్త బతుకును ఇవ్వపోతా ఉండాడు.&#8221; అని నల్లమట్టి కుమ్మరి పోతయ్య స్పర్శకు పులకరించి పోతూ చెబుతుంది. “ఎవరు ఏమన్నా అనుకోండి, ఈ మాటను చెప్పే తీరాల. కుమ్మరోడి కింద తొక్కుడు పడిన చేరుమన్ను బతుకే బతుకు. ఆ ఇమ్ము (సుఖం) చవికొన్న వాళ్లకే తెలుస్తాది. కొవ్విన పుంజుకోడి కొప్పరించి మిందకు వస్తే ఒదిగి తోవ చూపిస్తాదే పెట్టకోడి, అట్ట మెదిగి పోయినాను పోతయ్య కాళ్ల కింద నేను.”</p>
<p>వస్తువులు తమను మనుషులుగా వ్యక్తీకరించుకోవటం ఈ కధకు గల ప్రత్యేకత. కధ జరుగుతున్న స్థలంలో, కాలంలో తను లేని లోటును పూడ్చటానికి, రచయిత అక్కడ వున్న గృహ పరికరాల ద్వార కధను చెప్పించాడు. కడుపులో దాచుకొన్న క్షోభని, బ్రతుకంతా నోరు విప్పి చెప్పని కన్నెమ్మ కధను చెప్పుకొన్నది పొంతకడవ, ఎత్తు బొట్ట, దొంతిగుడవ,బియ్యం జల్లెడ, చింకి చాప, రాగి చెరవ, అంబటి బాన, ఊదర బుర్ర, తూకు వెళుకు (తూర్పు వెలుగు). &#8220;ఇంకా సాకలి సొలుపు తీరలేదా&#8221; అనే దెప్పిపొడుపు మాట వెనుక అంతరార్ధం అంచలంచలుగా చెప్పుకొన్నాయి ఈ వస్తువులు. మధ్యలో ‘అయ్యో కూతురా, మడేలుకు ఒళ్లు అప్పగించేసిందా కన్నెమ్మ’ అన్న ఊదర బుర్రను తీవ్రంగా మందలించాయి. ‘ఒసే ముయ్యే. మనుసులు నిన్ను ఊది ఊది, వాళ్ల లోపలి కువ్వాళం అంతా నీలో చేరిపొయినట్టు ఉండాది.&#8217; అని ఎకసెక్కం చేసాయి. ఆమె దుఃఖాన్నీ తమ సొంతంగా భావించి వల వలా ఏడ్చాయి. పొంత కడవ మాత్రం ఆమె కధ విన్న తరువాత తల్లడిల్లిపోయింది. &#8216;పగలు పొద్దుగూకులూ కాగికాగి కాలిపోయే నాకు, కడకు మిగిలేది మసే కదా. పండగపూట కూడా పొంతకడవకు అంత పసుపూకుంకుమా పెట్టరే. ఇంటిల్లిపాదికీ ఇంత ఊడిగం చేసే నన్ను, కడాన ఉలవరించుకొని పొయిననాడు దిబ్బలోనే కదా వేసేది. ఓటి మంగలానికి ఉండే మతింపు కూడా పొంతకడవకు ఉండదే.. నా బతుకు మాదిర బతుకే కదా ఆయమ్మది కూడా.&#8217; అని తల పోసి వగచింది.<br />
మేనల్లుడు కూడ &#8216;సాకలి సొలుపు తీరితే కదా&#8217; అనగానే దినమంతా కూడూనీళ్ళు ముట్టకుండా అర్ధరాత్రి పుట్టినింటి నుండి తెచ్చుకొన్న రాగిచెరవను కావలించుకొని పొగిలి పొగిలి ఏడుస్తుంది కన్నెమ్మ. ఆ ఏడుపును చూసిన పొంతకడవ తను కూడ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి చుక్క పుట్టే పొద్దుకు పగిలిపోతుంది.</p>
<p>‘ఓస్ ఆడోళ్ళు చేసే ఎలాంటి పనైనా మేము చేసేయగలం&#8217; అనే అహంకారం ఎంత అమానుషమో, &#8216;ఆడది ఎంత పనైనా తన కుటుంబం కోసమే కదా చేసేది&#8217; అంటూ దాన్ని సహజ సూత్రంగా స్వీకరించటం కూడా అంతే అన్యాయం. స్త్రీ శ్రమని ఉపరితలం నుండి చూడటం, తేలిక చేయటం ఇక్కడే మొదలౌతుంది. ప్రతిపని మర నొక్కి చేసే రోజులు కావవి. నడుమును విల్లులా వంచాలి, భుజ కండరాలను పూర్తి స్థాయిలో ఉపయోగ పెట్టాలి. చేతులు, కాళ్ళు నిరంతరం శ్రమించాలి. పొద్దు పొడిచింది మొదలు, ఊరు గురకలు పెట్టేవరకు ఎడతెరిపిలేని, సృజనాత్మకత లేని వెట్టి చాకిరి అది. &#8216;దేవత, అనురాగమయి, త్యాగమయి&#8217; పిలుపులు మాత్రమే (అదీ పొదుపుగా) భత్యంగా వచ్చే దగాకోరు దోపిడి. (కన్నెమ్మకు ఆ జీతం, భాగ్యం కూడ లేవనుకోండి). రచయిత చుట్టింట్లో పీట వేసుకొని దినమంతా కూర్చొన్నా కూడ ఆ శ్రమను అంత సజీవంగా అక్షరాల్లో పెట్టటం అసాధ్యం. ఒక రోజులో ఒక స్త్రీ చేసే కష్టాన్ని రచయిత తను కూడ చేసి ఉంటేనే అలా రాయగలడు అన్పిస్తుంది ఆ వర్ణన చదివితే. ఆ భాగం మాత్రం మీరు చదవాల్సిందే.</p>
<p>ఇక రచయిత భాషా, వస్తుపరిజ్ఞానం అపరిమితం. గతంలో విరివిగా వాడి, ఇప్పుడు సాహిత్యంలోను, మ్యూజియం లోనూ మాత్రమే కనిపిస్తున్న గ్రామీణ శ్రమలను, వస్తుసంపదను ఆయన మన కళ్ళకు కట్టించాడు. ముఖ్యంగా కుమ్మరి కుండలు చేసిన చేసే వైనం మన ముందు సాక్షాత్కరింపచేసాడు.</p>
<p>&#8220;మరునాడు తెల్లవారి లేచి మబ్బు (తొక్కి పెట్టిన మట్టి ముద్ద) పక్కనే సారెను పెట్టి, సారెను గిరగిర తిప్పుతా దాని మీద నన్ను పెట్టి చేతి ఒడుపును చూపించినాడు. ఆ ఒడుపుకు పులకరించిపొయిన నా ఒళ్ళు తీరుతీరున సాగింది. నేను పంతెను అయినాను, పటువను అయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లి మూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పు అటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవక పంటి, కడవ, కలి కడవ, పొంత కడవ, బాన, చాకలి బాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము,పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము… ఒక తీరు కాదు ఒక తెన్ను కాదు, వాడు చేతిలో ఏమి మరులమందు పెట్టుకొని నన్ను ముట్టుకొన్నాడో, నేను ఇన్ని పెడలుగా పొడలు కట్టినాను.&#8221; ఇవి మట్టి చేత రచయిత పలికించిన పలుకులు.</p>
<p>నెళవు (పరిచయం), పసను (రంగు), రెయ్యికోళ్ళు(కీచురాళ్ళు), ఇర్లనాటికో వెల్లనాటికో (అమావాస్యకో పౌర్ణమికో), కడంగి (ప్రయత్నించి), ఉల్లము (మనసు) లాంటి అచ్చతెలుగు పదాలు పాఠకులను ఉర్రూతలూగిస్తాయి.</p>
<p>ఈ కధను స్మరించుకొంటున్న సందర్భంలో కధ గురించి కొందరి అభిప్రాయాలు కూడ ఉటంకిస్తే బాగుంటుందనిపించింది.</p>
<p>&#8220;వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు,కనిపించే చిత్రం చాటున మూసుకు పోయిన కళ్ళని చూసి నమ్మకాల దారపు పోగులు తెగిపోతున్నసమయంలో, తాను నమ్మినదాన్ని శ్వాసించి, జీర్ణించి, అనుభవించి వ్యక్తీకరించే కృషి చేస్తున్నాడు రమేష్. పిచుకల కధలుతోనో, రయికముడి ఎరుగని బ్రతుకుల వ్యధలనో తన గొంతుకతో వినిపించాడు.కొత్త వడ్లతో చేసిన మొలక బియ్యం సారం అనుభవిస్తున్నత ఆనందం వుంది రమేశ్ కథలలో.&#8221; రమేశ్ కధల గురించి ఒక పాఠకురాలు హరిత అభిప్రాయం.</p>
<p>“ఒకమనిషిని మరొక మనిషి చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ఆ మనిషిలో ఒక లోపాన్ని వెతికి దాన్ని తురుఫు ముక్కలా వాడుకుని ఆమెని ఆ ఒక్క మాటతో కుప్పకూలేలా చెయ్యడం అనే రాజకీయం ఎంతకాలంగానో నడుస్తూనే వుంది . మానవజీవితావసరమైన ఒకానొక సుఖాన్ని ఒక లిప్త కాలం అనుభవించడం నేరం అయిపోయిన అస్వతంత్ర కన్నెమ్మ అనగా ఎంత? ఏడ్చి ఏడ్చి పొంతకుండ పగిలిపోయింది .కన్నెమ్మ ఇంకా ఎంతకాలం అట్లా కన్నీళ్ళు ఇగరబెట్టుకుంటూ బ్రతకాలి? జీవితం, తిండి ,వస్తువులు.అన్నిటా స్థానీయత తొణికిసలాడే కథ. ‘రవిక ముడి ఎరగని బ్రతుకు’ అక్షరాలను దృశ్యాలుగా మలిచే చిత్రకారుడు రమేష్ .పాఠకులని తన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించే మాంత్రికుడు.అచ్చతెలుగు అతని స్వంతం.” -సత్యవతి పి. (రచయిత్రి)</p>
<p>“అది ఒక కన్నీటి గాధ.&#8217;రయిక ముడి ఎరుగని బ్రతుకులు&#8217; లో నా చిన్నప్పటి మహనీయ స్త్రీమూర్తులు ఎందరో నా మనసులో మెదిలాడారు.వేకువనే లేచి గబగబ అన్నం వండి, పొద్దున్నే పిల్లలకింత పెట్టి తానింత టిపినులో పెట్టుకొని పొలం కూలీకి పరుగులు తీసిన అమ్మ,గర్భాశయ కేన్సర్ తోనే ఇంటిల్లిపాదికీ వండివార్చిచాకిరీ చేసిన అమ్మమ్మ,తలజడ వేసుకోటం మాని, ముడి తోనే దూది ఉన్ని నేకి తనవాళ్ళ కడుపులు నింపిన నాయనమ్మ,ఎన్నని చెప్పేది ఎందరిని తలుచుకునేది?ఆ దృశ్యాలెన్నో రమేశ్ మన కళ్ళకు కట్టాడు.”- నూర్ భాషా రహంతుల్లా (డిప్యూటి కలెక్టర్, విజయవాడ).</p>
<p>మట్టిని తవ్వితే మాణిక్యాలు దొరుకుతాయి. పల్లెటూర్లలో నులకమంచాల్లో ముడుచుకొని ఉన్న ముసలమ్మలను కదిలిస్తే నాణ్యమైన జీవితాలు లభిస్తాయి. ఎటొచ్చి వినదగ్గ వారే వినాలి.రాయదగ్గ వారే రాయాలి. మరుగున పడ్డ, మసిగుడ్డలుగా మారిన మహోన్నత స్త్రీ మూర్తుల చీకటి గాధలను, ధవళ హృదయాలను సమస్త లోకానికి ఎరిక పర్చవా రమేశు! నీ సత్యమైన తీక్షణ దృష్టితో,నీ కధనా కౌశలంతో, నీ విశిష్ట భాషా పరిజ్ఞానంతో!</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=2983</wfw:commentRss>
		<slash:comments>23</slash:comments>
		</item>
		<item>
		<title>ఆత్మాభిమానం  కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!</title>
		<link>http://vaakili.com/patrika/?p=1412</link>
		<comments>http://vaakili.com/patrika/?p=1412#comments</comments>
		<pubDate>Thu, 28 Feb 2013 15:34:58 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[రమా సుందరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=1412</guid>
		<description><![CDATA[<p style="text-align: left;">ఈ జీవితానికి నాకు మధ్య ఎప్పుడూ యుద్దమే!</p> <p style="text-align: left;">నా భాధతోనే కాదు &#8211; ఈ లోకంలోని భాధ అంతటితోనూ,</p> <p style="text-align: left;">చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.</p> <p style="text-align: left;">అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం</p> <p> -చలం</p> <p>‘నిర్జన వారధి &#8216; రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.</p> <p>తన తొంభై రెండు ఏళ్ళ వయస్సులో ఇంచుమించు ఎనిమిది దశాబ్ధాలు ప్రజాజీవితంలో గడిపిన ఆమె  జీవితం కచ్చితంగా ఇతర స్రీల జీవితాల కంటే వైవిధ్యమైనది, విశిష్టమైనది. ఆమె జీవితం ఉద్యమం, సాహిత్యం, సంగీతం, నాటకంతో పెనవేసుకొని ఆమెను ఒక విభిన్న వ్యక్తిగా నిలబెట్టాయి. ఉద్యోగాన్ని కూడా తన మనసుకు నచ్చిన విధంగా మలచుకొని తన సర్వ జీవచైతన్య శక్తులు చివరివరకు సజీవంగా ఉంచగలిగారు. అందుకే తొంభై ఏళ్ళ వయసులో కూడా తేటినీలాపురం పక్షులని చూసి పరవశించగలిగారు.</p> <p>ఈ పుస్తకంలో జాతీయోద్యమం, తెలంగాణా సాయుధపోరాటం,కమ్యునిస్టు ఉద్యమంలో ఆమె తన పాత్రను వివరించటంతో బాటు తనతో పని చేసిన వారిని పేరు పేరునా తలుచుకొన్నారు. కఠోర అజ్నాత వాసంలో ఆమె డెన్ లో ఉన్నప్పుడు, గర్భం పోగొట్టుకొని, కదలలేని నిస్సహాయస్థితిలో ఆమె మైల బట్టలు ఉతికిన కామ్రేడ్ నరశింహరావును తరువాత పోలిసులు చంపివేసారని విన్నప్పుడు ఆమె పడ్డ వేదన పుస్తకంలో సజీవంగా రికార్డ్ చేయగలిగారు. తన సమకాలికులు మానికొండ సూర్యావతి, డా. అచ్చమాంబ, ఉదయం, తాపీ రాజమ్మ  మొదలైన వారితో ఆమె మహిళ సంఘ కార్యక్రమాలు, వారి స్నేహం హృద్యంగా వర్ణించారు. సుందరయ్యగారు, చండ్ర రాజేశ్వరావు గారు వంటి మహోన్నత వ్యక్తుల సాంగత్యం ఆమెకు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: left;"><em><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg"><img class="alignleft size-full wp-image-1705" title="rama_sundari" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/rama_sundari.jpg" alt="" width="146" height="172" /></a>ఈ జీవితానికి నాకు మధ్య ఎప్పుడూ యుద్దమే!</em></p>
<p style="text-align: left;"><em>నా భాధతోనే కాదు &#8211; ఈ లోకంలోని భాధ అంతటితోనూ,</em></p>
<p style="text-align: left;"><em>చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.</em></p>
<p style="text-align: left;"><em>అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం</em></p>
<p> -చలం</p>
<p>‘నిర్జన వారధి &#8216; రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.</p>
<p>తన తొంభై రెండు ఏళ్ళ వయస్సులో ఇంచుమించు ఎనిమిది దశాబ్ధాలు ప్రజాజీవితంలో గడిపిన ఆమె  జీవితం కచ్చితంగా ఇతర స్రీల జీవితాల కంటే వైవిధ్యమైనది, విశిష్టమైనది. ఆమె జీవితం ఉద్యమం, సాహిత్యం, సంగీతం, నాటకంతో పెనవేసుకొని ఆమెను ఒక విభిన్న వ్యక్తిగా నిలబెట్టాయి. ఉద్యోగాన్ని కూడా తన మనసుకు నచ్చిన విధంగా మలచుకొని తన సర్వ జీవచైతన్య శక్తులు చివరివరకు సజీవంగా ఉంచగలిగారు. అందుకే తొంభై ఏళ్ళ వయసులో కూడా తేటినీలాపురం పక్షులని చూసి పరవశించగలిగారు.</p>
<p>ఈ పుస్తకంలో జాతీయోద్యమం, తెలంగాణా సాయుధపోరాటం,కమ్యునిస్టు ఉద్యమంలో ఆమె తన పాత్రను వివరించటంతో బాటు తనతో పని చేసిన వారిని పేరు పేరునా తలుచుకొన్నారు. కఠోర అజ్నాత వాసంలో ఆమె డెన్ లో ఉన్నప్పుడు, గర్భం పోగొట్టుకొని, కదలలేని నిస్సహాయస్థితిలో ఆమె మైల బట్టలు ఉతికిన కామ్రేడ్ నరశింహరావును తరువాత పోలిసులు చంపివేసారని విన్నప్పుడు ఆమె పడ్డ వేదన పుస్తకంలో సజీవంగా రికార్డ్ చేయగలిగారు. తన సమకాలికులు మానికొండ సూర్యావతి, డా. అచ్చమాంబ, ఉదయం, తాపీ రాజమ్మ  మొదలైన వారితో ఆమె మహిళ సంఘ కార్యక్రమాలు, వారి స్నేహం హృద్యంగా వర్ణించారు. సుందరయ్యగారు, చండ్ర రాజేశ్వరావు గారు వంటి మహోన్నత వ్యక్తుల సాంగత్యం ఆమెకు ఊపిరి పోసాయి.</p>
<p>కొండపల్లి సీతారామయ్యగారితో ఆమె వైవాహిక జీవితం వ్యధాభరితంగా ముగిసినా ఆమె ఉన్నతికి, ఆమె లోని ప్రతిభను వెలికి తీయటానికి, ప్రజాజీవితంలో ఆమెను మమేకం చేయటానికి ఆయన అందించిన తోడ్పాటు గొప్పది. &#8216;గ్రహింపే కాదు, ప్రశ్నించే ధైర్యం కావాలి&#8217; అని ఆయన నూరి పోసారు. కన్యాశుల్కం నాటకంలో నటించటానికి  &#8217;వేశ్యగా ముద్ర పడతానేమోనని ఆమె తటపటాయిస్తుంటే మూడు రోజులు నిరాహరణ దీక్ష చేసి ఆమెను ఒప్పించారు. ఆమె సాంఘీక జీవనానికి, సర్వతోముఖాభివౄద్ధికి తోడ్పడిన భర్తే ఆయన బలహీనతలను  ప్రశ్నించినప్పుడు &#8220;నువ్వు<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/nirjanavaaradhi.jpg"><img class="alignright size-full wp-image-1684" title="nirjanavaaradhi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/02/nirjanavaaradhi.jpg" alt="" width="204" height="315" /></a> అందరితో చనువుగా ఉంటే నేను కూడా నిన్ను అనుమానించవచ్చుకదా&#8221;! అని ఆయన మానసిక ధౌర్భల్యాన్ని బయట పెట్టుకొన్నారు.  &#8221;నువ్వు వితంతువైనా నిన్ను పల్లకీ ఎక్కించాను&#8221; అని ఆమెలో ఇన్నాళ్ళు తనే పెంచి పోషించిన ఆత్మస్తెర్యానికి గొడ్డలి వేటు వేసారు.</p>
<p>జీవితంలో ఈ దెబ్బే ఆమెను నిర్వాణంగా మార్చింది. బహుశ తరువాత జీవితంలో కొడుకు,కూతురు, తల్లి మరణాల దుఃఖాలు అధిగమించడానికి ఇది తొలి మెట్టు అయి ఉండాలి. చివరి దశలో తన దగ్గరకు చేరిన సీతారామయ్యగారిని తామరాకు మీద నీటి బొట్టు లాగ, ఎలాంటి ఉద్విగ్నతలకు లోను కాకుండా చూడగలిగింది. మానసికంగా ఆయనను స్వీకరించలేక పోయినా, తోటి మనిషిగా ఆదరించగలిగిన మానసిక పరిపక్వతకు చేరుకో గలిగారు.</p>
<p>సీతారామయ్యగారు తన పూర్తి జీవితాన్ని, సాహసాలతోను,త్యాగాలతోను గడిపారు. కాని తన స్రీ పట్ల ఆయన క్రూరమైన ఉదాసీనత, దుర్మార్గమైన అవకాశవాదం, పితృసామ్యసమాజ నేపధ్యంలో మనకు అర్ధం అవుతున్నప్పటికీ, (ఆమోదం కాదు) కమ్యునిష్ట్ వ్యతిరేకులకు, కమ్యునిష్ట్ విమర్శకులకు ఇది ఒక సువర్ణావకాశంగా మారింది. &#8216;ఈనాడు&#8217; లో ఈ పుస్తకం గురించి చదివిన నా మిత్రులు కొందరు ఆశ్చర్యంగా ఫోన్ చేసారు.( కొందరి గొంతులో సంభ్రమం కూడా వినిపించింది.)</p>
<p>భర్త తిరస్కారానికి గురైన చాలా మంది స్రీల లాగనే ఆమె ఆంధ్ర మహిళాసభకు చేరారు. అందరి తల్లులలాగే పిల్లలు తనకు దూరమైన, వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు కావాలనుకొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారిణి గా, విప్లవ వనితగా తన హోదాలన్నీ వదిలేసి నిరాడంబరమైన మేట్రిన్ ఉద్యోగానికి తన మనఃశరీరాలను బదలాయించగలిగారు. చివరకు తన తల్లి తండ్రుల నుండి సంక్రమించిన ఆస్తిపై అధికారాన్ని వదులుకోని, ఆత్మగౌరవంతోను, స్వాభిమానంతో నిలబడ్డారు. పురుషాదిక్యతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరు చరితాత్మకమైనది. అందుకే  ఆమె అప్రకటిత స్రీ వాది. ఆత్మగౌరవం మూర్తీభవించిన మానవి. చదువు వదిలేసి కొడుకు విప్లవకారుడుగా మారటానికి తన తప్పు ఏమైనా ఉందా అని ఆమె మధనపడటంలో తల్లిగా ఆమె మనస్సును అర్ధం చేసుకోవచ్చు. పరిణితి చెందిన కొడుకు తమ దగ్గర ఉన్న సంవత్యర కాలం ఆమె పూర్తి ఆత్మస్తెర్యానికి తోను, సంతోషం తోను ఉన్నట్లు అన్పిస్తుంది.</p>
<p>అంతలోనే అతని మరణం( రాజ్యహత్య), దాన్ని ఆమె దిగమింగుకున్న వైనం కళ్ళనీరు తెప్పించింది. ఎందరో కామ్రేడ్స్ ప్రాణత్యాగం చూసిన ఆమె తన కన్నపేగుకే అది అనుభవం అయినప్పుడు అందరిలా విధిని నిందించకుండా, కొడుకు మరణానికి కారణాలు అన్వేషిస్తూ తిరిగింది.</p>
<p>ఆమె తన ఉద్యోగ జీవితంలో అలవర్చుకొన్న నిబ్బరం, చదువు పెద్దగా లేకపోయినా తాను సొంతంగా పెంపొందిచుకొన్న దృఢ చిత్తం; విద్యావతి, డాక్టర్ అయిన వారి కూతురు కరుణలో లోపించాయి.కరుణ మరణం ఆమె అంతిమ దుఃఖం.</p>
<p>చండ్ర రాజేశ్వరరావు గారు ఆమె గురించి &#8220;అక్షర బువ్వ నిన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది&#8221; అన్నారు. ఆయన మాట ఎంత వాస్తవమో పుస్తకానికి అనుబంధంగా ఉన్న ఆమె రచనలు చదువుతుంటే అర్ధం అవుతుంది. రచనా వ్యాసాంగాన్ని ఆమె వెంటిలేషన్ గా ఉపయోగించుకొన్నారు.</p>
<p>చందు (కుమారుడు) మీద ఆమె రాసిన కవితను చదివితే కళ్ళనీళ్ళు పెట్టుకోని వారు ఉండరంటే అతిసయోక్తి కాదు.</p>
<p>చందూ!</p>
<p>&#8220;<em>అమ్మ అక్కున వొదిగి,</em></p>
<p><em>చెక్కిలిపై చేతులెట్టి మక్కువ నెరపిన</em></p>
<p><em>చక్కదనాల బాల చంద్రుని రూపం,</em></p>
<p><em>పోలిసుల కంట పడనీయక అమ్మ</em></p>
<p><em>తన ఎదలో పదిలపరిచిందిరా!&#8221;</em></p>
<p>మహాశ్వేతా దేవి కన్నతల్లి నవలకు ఇలాంటి తల్లులు ఎందరో ప్రేరణ అయి ఉంటారు.</p>
<p>మానికొండ సత్యవతి, ఉదయం గార్ల గురించిన  రచనలు ఆమె హృదయంలో ముంచి పంచిన స్నేహ పరిమళాలు వెదజల్లాయి. మధురవాణి  పాత్ర ను ఆమె అర్ధం చేసుకొన్న తీరు అద్భుతం.</p>
<p>ఓల్గాగారు &#8220;జీవితంలో అత్యంత క్లిష్టమైన ఘట్టంలో దిటవుగా ఉండటానికైనా, మళ్ళీ నిర్లిప్తంగా తన జీవితం కొనసాగించటానికైన ఎంత శక్తి కావాలి! అంత శక్తి దాగి ఉంది కోమలంగా, సున్నితంగా, ప్రేమగా కనిపించే కోటేశ్వరమ్మలో&#8221; అంటారు ఆమెను ఉద్దేశించి.</p>
<p>ఆమె సుధీర్ఘ రాజకీయ, ఉద్యమ, సాంస్కృతిక, వ్యక్తిగత జీవితం నుంచి ఆధునిక మహిళలు నేర్చుకోవలిసినది ఎంతో ఉంది.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=1412</wfw:commentRss>
		<slash:comments>22</slash:comments>
		</item>
	</channel>
</rss>
