<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; రాజశేఖర్ పిడూరి</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%B6%E0%B1%87%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>అ &#8216;సహాయ&#8217; శూరులు</title>
		<link>http://vaakili.com/patrika/?p=9106</link>
		<comments>http://vaakili.com/patrika/?p=9106#comments</comments>
		<pubDate>Wed, 30 Sep 2015 21:03:17 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రాజశేఖర్ పిడూరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=9106</guid>
		<description><![CDATA[<p>పాత తెలుగు సినిమాలు చూస్తూ బాల్యపు జ్ఞాపకాలని తిరిగి జీవించడం- కృతకంగా ఉన్నా సరే, రకరకాల భావాలు అత్యంత స్పష్టంగా వాళ్ళ గొంతుల్లో పలకడం, ఒకే మనిషి అనేక సినిమాల్లో ముఖాలు రకరకాలుగా మార్చుకోవడం చూస్తూ అచ్చెరువొందడం- సినిమా రంగంలోని సహాయ పాత్రల జగత్తు లోని కొందరు &#8216;నిస్సహాయ, సన్నకారు జీవుల&#8217; గురించి ఈ చిన్న రైటప్&#8230;</p> <p>సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న ఇన్సైడర్ వ్రాసింది కాదు ఇది. పాత తెలుగు సినిమాల్లోని భాషని వినాలనీ, ఆనాటి నటుల వాచకాలను తనివితీరా ఆస్వాదించేసెయ్యాలన్న ఆసక్తి &#8216;మితిమీరిన&#8217; కొన్నిసమయాలలో- కేవలం సినిమాలను చూసిన అనుభవంతో వ్రాసింది. factual errors ఉండవచ్చు. క్షమించేసి, సమగ్రం కాని ఈ చిన్న తునక లో మీరు గమనించిన తప్పులు సరిదిద్దండి.</p> <p>పాత సినిమాల్లోని టైటిల్స్ ని ఆసక్తిగా చదివే వాళ్ళకి తరచుగా కొన్ని పేర్లు కనపడుతూ ఉంటాయి. ఈ నటులలో చాలా మంది ఎంతో ప్రతిభగలవారైనా ప్రఖ్యాతులు కారు. వాళ్ళకున్న కొద్ది డైలాగులు చెప్పడంలోనే వారి &#8216;జీనియస్&#8217; ద్యోతకమవుతుంది. వీళ్ళకి క్లోజప్ షాట్లు దాదాపుగా ఉండవు. కొంచెం దూరం నుంచి చూస్తే ఒకే రకంగా ఉండే ఇలాంటి సపోర్టింగ్ యాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు పాత సినిమాలలో. వీరిని గుర్తు పట్టడానికి చాలా సార్లు వారి కంఠమే గతి.</p> <p>వారిలో కొంతమంది గురించి:</p> <p>1) చదలవాడ కుటుంబరావు: &#8216;మాయాబజార్&#8217; లో ఘటోత్కచుడి కింకరుడు &#8216;లంబు&#8217; గా ముఖ్య పాత్ర వేసినా కూడా ఎక్కువ మందికి తెలియని నటుడు. అత్యంత విలక్షణమైన వాచికం, అంతకు మించిన సహజాభినయం. &#8216;కన్యాశుల్కం&#8217; లో మధురవాణితో సరసమాడటానికి ప్రయత్నిస్తున్న పోలిసెట్టిగా ఆ చిన్న సీన్ లో ఈయన నటనావైదుష్యాన్ని చూస్తే గురజాడ హృదయాన్ని ఆవిష్కరింపజేసాడా అనిపించక మానదు.</p> <p>చదలవాడ గారు అనేక సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పాత్రలు వేశారు. అయితే తన ప్రతిభ చూపించే అవకాశం ఉన్న పూర్తి నిడివి గల పాత్రలు ఆయనకి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="font-size: 30px;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/09/film_roll.jpg"><img class="aligncenter size-full wp-image-9132" title="film_roll" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/09/film_roll.jpg" alt="" width="653" height="364" /></a>పా</span>త తెలుగు సినిమాలు చూస్తూ బాల్యపు జ్ఞాపకాలని తిరిగి జీవించడం- కృతకంగా ఉన్నా సరే, రకరకాల భావాలు అత్యంత స్పష్టంగా వాళ్ళ గొంతుల్లో పలకడం, ఒకే మనిషి అనేక సినిమాల్లో ముఖాలు రకరకాలుగా మార్చుకోవడం చూస్తూ అచ్చెరువొందడం- సినిమా రంగంలోని సహాయ పాత్రల జగత్తు లోని కొందరు &#8216;నిస్సహాయ, సన్నకారు జీవుల&#8217; గురించి ఈ చిన్న రైటప్&#8230;</p>
<p>సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న ఇన్సైడర్ వ్రాసింది కాదు ఇది. పాత తెలుగు సినిమాల్లోని భాషని వినాలనీ, ఆనాటి నటుల వాచకాలను తనివితీరా ఆస్వాదించేసెయ్యాలన్న ఆసక్తి &#8216;మితిమీరిన&#8217; కొన్నిసమయాలలో- కేవలం సినిమాలను చూసిన అనుభవంతో వ్రాసింది. factual errors ఉండవచ్చు. క్షమించేసి, సమగ్రం కాని ఈ చిన్న తునక లో మీరు గమనించిన తప్పులు సరిదిద్దండి.</p>
<p>పాత సినిమాల్లోని టైటిల్స్ ని ఆసక్తిగా చదివే వాళ్ళకి తరచుగా కొన్ని పేర్లు కనపడుతూ ఉంటాయి. ఈ నటులలో చాలా మంది ఎంతో ప్రతిభగలవారైనా ప్రఖ్యాతులు కారు. వాళ్ళకున్న కొద్ది డైలాగులు చెప్పడంలోనే వారి &#8216;జీనియస్&#8217; ద్యోతకమవుతుంది. వీళ్ళకి క్లోజప్ షాట్లు దాదాపుగా ఉండవు. కొంచెం దూరం నుంచి చూస్తే ఒకే రకంగా ఉండే ఇలాంటి సపోర్టింగ్ యాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు పాత సినిమాలలో. వీరిని గుర్తు పట్టడానికి చాలా సార్లు వారి కంఠమే గతి.</p>
<p>వారిలో కొంతమంది గురించి:</p>
<p><strong>1) చదలవాడ కుటుంబరావు:</strong> &#8216;మాయాబజార్&#8217; లో ఘటోత్కచుడి కింకరుడు &#8216;లంబు&#8217; గా ముఖ్య పాత్ర వేసినా కూడా ఎక్కువ మందికి తెలియని నటుడు. అత్యంత విలక్షణమైన వాచికం, అంతకు మించిన సహజాభినయం. &#8216;కన్యాశుల్కం&#8217; లో మధురవాణితో సరసమాడటానికి ప్రయత్నిస్తున్న పోలిసెట్టిగా ఆ చిన్న సీన్ లో ఈయన నటనావైదుష్యాన్ని చూస్తే గురజాడ హృదయాన్ని ఆవిష్కరింపజేసాడా అనిపించక మానదు.</p>
<p>చదలవాడ గారు అనేక సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పాత్రలు వేశారు. అయితే తన ప్రతిభ చూపించే అవకాశం ఉన్న పూర్తి నిడివి గల పాత్రలు ఆయనకి ఎక్కువ దొరకలేదు. అలా దొరికిన సందర్భాలలో ఆయన అత్యున్నతమైన టాలెంట్ ని చూడవచ్చు &#8211; &#8216;ఆడపెత్తనం&#8217; లో భార్యకి (కన్నాంబ) భయపడే భర్త పాత్ర వేసారు. ఈ సినిమాలో ఛాయాదేవి, కన్నాంబ, చదలవాడ – ఈ ముగ్గురు మహామహుల సంభాషణల తూకం చెప్పనలవి కాదు. &#8216;చిట్టి తమ్ముడు&#8217; లో అనాధ శరణాలయానికి వచ్చిన ఇన్సె్పక్టర్ గా సూర్యకాంతం తో కలిసి పండించిన హాస్యం, &#8216;బాలనాగమ్మ&#8217; (అంజలి, ఎన్టీఆర్) లో పులిని చంపానని గొప్పగా చెప్పే చాకలి తిప్పడుగా రాజు గారి ముందు చెప్పిన డైలాగ్ డెలివరీ విని తీరాల్సిందే.</p>
<p>శ్రీశ్రీ తను వ్రాసిన సినిమా పాటల్లో తనకిష్టమైనదానిని (&#8216;పంతాలు పట్టింపులు&#8217; సినిమా లో &#8216;యినుకోరా&#8217; అనే పాట) గురించి వ్రాసిన వ్యాసంలో ఆ పాట తనకిష్టం కావడానికి చదలవాడ కుటుంబరావు గారు కూడా ఒక కారణం అని రాసుకున్నారు. ఈ పాటలో ఒక చోట &#8216;ఈ బతుకుందే ఎంతో బరువు&#8217; అని ఉంటే &#8216;ఎంతో బరువు&#8217; ని &#8216;మాసెడ్డ బరువు&#8217; అని మార్చగలరేమో చూడండి&#8217; అని చదలవాడ సూచించడమూ, శ్రీశ్రీ గారు తక్షణమే ఆ సూచనని స్వీకరించడమూ జరిగాయట. ఆ తర్వాత రోజే చదలవాడ మరణించడం తను మర్చిపోలేని ఒక విషాద సంఘటన అని శ్రీశ్రీ అన్నారు.</p>
<p>కన్యాశుల్కం లింక్ &#8211; 1.00.55 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8">https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8</a></p>
<p><strong>2) పేకేటి శివరాం :</strong> &#8216;దేవదాసు&#8217; లో ANR కి తాగుడు అలవాటు చేసిన స్నేహితుడిగా ఆ తరం వారిలో ప్రసిద్ధుడు. &#8216;వద్దంటే డబ్బు&#8217; లో NTR స్నేహితుడిగా (జంధ్యాల తీసిన దీని రీమేక్ &#8211; బాబాయ్ అబ్బాయ్ లో సుత్తి వీరభద్రరావు వేసిన పాత్ర) పెద్ద నిడివి ఉన్న పాత్ర వేశారు. &#8216;మంచి మనసుకు మంచి రోజులు&#8217; లో కాంపౌండర్. &#8216;కన్యాశుల్కం&#8217; లో చెప్పినవి రెండు మూడు డైలాగ్స్ అయినా ఖంగుమంటాయి. మా ఇన్స్పెక్టర్ గారు నిన్నుపిలకుచ్చుకుని లాక్కు రమ్మన్నారంటూ రావఁప్పంతుల్ని బెదిరించి తర్వాత మధురవాణితో నర్మగర్భంగా &#8216;నాకు వల్లమాలిన పనుందూళ్ళో&#8217; అంటూ చెప్పే హెడ్ కానిస్టేబుల్.</p>
<p>ఈయన నటుడిగానే కాకుండా ఇతరత్రా కూడా చురుకుగా ఉండేవారుట. ప్రపంచ తెలుగు మహాసభలను డాక్యుమెంటరీ తీశారన్న విషయాన్నిశ్రీశ్రీ తన వ్యాసం లో ప్రస్తావించారు.</p>
<p>దేవదాసు లింక్: 57 నిమిషాల దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=X8dnjKmmObY">https://www.youtube.com/watch?v=X8dnjKmmObY</a></p>
<p><strong>3) రామకోటి :</strong> చాలా పాత సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే పేరు. ఓ మాదిరి పొట్టి విగ్రహం. &#8216;కన్యాశుల్కం&#8217; లో హెడ్ కానిస్టీపు (పేకేటి) రావఁప్పంతుల్ని(సీయస్సార్) బెదిరిస్తూ &#8216;బయట కనిస్టీపు కామయ్య కాచుక్కూచున్నాడు&#8217; అంటూ ప్రస్తావించిన కనిస్టీపు కామయ్యే ఈ రామకోటి. &#8216;రూపాయలు వేగిరం ఇవ్వండీ&#8217; అని అరిచి రావఁప్పంతుల్ని హడలేసి, కరటకశాస్త్రి దగ్గర రూపాయలు దఖలు పరిపించుకునేలా చేసిన కీచు కంఠం ఈయనదే.</p>
<p>మేకప్ వల్ల సరిగ్గా పోల్చుకోలేకపోయినా బహుశా రామకోటి గారే వేసి ఉంటారు అనుకునే కొన్ని పాత్రలు&#8230;<br />
1. కెబి తిలక్ సినిమా &#8216;ఉయ్యాల జంపాల&#8217; లో ప్రభాకరరెడ్డి చేసే చెడ్డపనులకి సహాయపడే నౌకరు తాతారావు. (నిడివి ఉన్న పాత్రే).<br />
2. &#8216;చిట్టి తమ్ముడు&#8217; లో (ఇదీ తిలక్ సినిమానే) నౌకరు అయోమయం.<br />
3. &#8216;ఇంటిగుట్టు&#8217; లో (NTR) నౌకరు పరదేశి.<br />
4. &#8216;ఆడపెత్తనం&#8217; లో కన్నుకొట్టే పెళ్ళికొడుకుగా చిన్న పాత్ర (?).</p>
<p>కన్యాశుల్కం లింక్: 1.08:38 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8">https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8</a></p>
<p><strong>4) బొడ్డపాటి కృష్ణారావు:</strong> ఒక్కసారి వింటే జన్మలో మర్చిపోలేని వాయిస్. &#8216;మాయాబజార్&#8217; సినిమాలో &#8216;శని ఈ గదిలో ఉండగా&#8230;&#8217; అంటు శకుని మామ దగ్గర సాగదీసిన శంఖు తీర్థుల వారు ఈయనే. &#8216;కన్యాశుల్కం&#8217; లో గయ్యాళి పూటకూళ్ళమ్మని ధాటీగా ఎదుర్కొని &#8216;ఆఁ.. గుడివీధి మధురవాణి&#8217; అంటూ ఛాయాదేవికి చల్లంగా ఉప్పు అందించిన పొటిగరాపు పంతులు గారు.</p>
<p>బొడ్డపాటి గారు చిన్నాచితకా వేషాలతో అవస్థలు పడుతున్న కాలంలో ఎన్టీఆర్ ఆయన లో ఉన్న విద్వత్తు చూసి తన పిల్లలకి ఆయన చేత తెలుగు ట్యూషన్ చెప్పించారట. చిల్లర పాత్రలు వేస్తూ ఉన్న బొడ్డపాటి గారు ఉన్నట్టుండి &#8216;నాకు హీరో వేషం దొరికిందోయ్&#8217; అని చెబుతుంటే పాండీబజార్ లో అందరూ ఆశ్చర్యపోయారట. మరి &#8216;వినాయక చవితి&#8217; సినిమాలో వినాయకుడు హీరోయే కదా!!</p>
<p>అందరూ &#8216;ముఖం చూపలేని హీరో&#8217; అని నవ్వుతుంటే బొడ్డపాటి గారు వినాయక చవితి నిర్మాత కె. గోపాల్రావు గారి దగ్గరకి వెళ్ళి ఓ చిన్న వేషం అదనంగా ఇప్పించుకున్నారట. యదువీరుడిగా సత్రాజిత్తు దగ్గరకి వెళ్ళి సత్యభామని కృష్ణునికిమ్మని అడగటమూ, ఆయన కాదన్న తర్వాత ఆ విషయాన్ని తిరిగి కృష్ణునికి చెప్పడమూ &#8211; ఈ రెండు చిన్న సన్నివేశాలలో నటించారు.</p>
<p>చిన్న చిన్న పాత్రలు అసంఖ్యాకంగా వేసి ఉంటారు. ఎంత చిన్న పాత్ర ఐనా, ఒక చిన్న మాట వినగానే ఈయనను గుర్తు పట్టొచ్చు. కొంచెం పొట్టిగా, లావుగా ఉంటారు కాబట్టి డైలాగులు ఆట్టే లేకపోయినా గుర్తుపట్టవచ్చు &#8211; నర్తనశాల లాంటి సినిమాలో కూడా. (వలలుడి దగ్గర సహాయకుడు)</p>
<p>కన్యాశుల్కం లింక్ 29:33 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8">https://www.youtube.com/watch?v=3OOXv5v8Xp8</a></p>
<p><strong>5) ముదిగొండ లింగమూర్తి:</strong> నాగయ్య గారి &#8216;త్యాగయ్య&#8217; లో జపేశుడు (త్యాగయ్య అన్న) పాత్రధారిగా ప్రసిద్ధుడు. &#8216;బాటసారి&#8217; (ANR, భానుమతి) లో దుష్ట మేనేజర్. ఈయన్ని మిడ్ షాటుల్లో చూస్తే సియస్సారేమో అని పొరపాటు పడే అవకాశం ఉంది. గొంతులో మాత్రం ముక్కామల కృష్ణమూర్తి గారికున్న టింబర్ ఉంది.</p>
<p>చక్కటి కథ, సంవిధానం, మాటలు ఉన్న &#8216;జమిందార్&#8217; (ముళ్ళపూడి, ANR) సినిమాలో నాగభూషణం చేత ఏడిపించబడే పాత్రని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు లింగమూర్తి గారు.</p>
<p>&#8216;పాండవ వనవాసం&#8217; లో శకుని పాత్రని ఎంత బాగా అభినయించినా దానికి ఎనిమిదేళ్ళ క్రితమే వచ్చిన &#8216;మాయాబజార్&#8217; లోని సీయస్సార్ గారి కంఠవైలక్షణ్యం ముందు లింగమూర్తి గారు వీగిపోయినట్లే అనిపిస్తుంది.</p>
<p>నర్తనశాల లో శకుని వేషానికి ఈయనని అడుగుతూ డిమాండ్ తగ్గింది కాబట్టి పారితోషికం తగ్గించుకోమంటే &#8216;మీరు ఇచ్చేది నా టాలెంట్ కి కదా? అది ఏమాత్రం తగ్గలేదే!?&#8217; అని అన్నారట. చివరకు ఆ పాత్ర మల్లాది సత్యనారాయణ గారికి దక్కింది.</p>
<p>లింగమూర్తి గారు కన్విన్స్ అవకుండా గుడ్డిగా డైలాగ్ చెప్పేవారు కాదుట. దీని కోసం బిఎన్ రెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్ తోనే తగాదా పడ్డారట. స్వర్గసీమలో హీరో (నాగయ్య) ని సెడ్యూస్ చేయమని తన కూతురు (భానుమతి) తో తను వేసిన తండ్రి పాత్ర చెప్పే సన్నివేశంలో డైలాగ్ ని ఎలా మార్చారో రావికొండలరావు గారు తన బ్లాక్ అండ్ వైట్ పుస్తకంలో వివరంగా రాశారు. మార్చి చెప్పిన డైలాగ్ &#8211; “వాడేం పులా సింగమా? ఊఁ&#8221; &#8211; ని ఇప్పుడు ఇంటర్నెట్ లో చూస్తే లింగమూర్తి గారి జీనియస్ తెలుస్తుంది.</p>
<p>స్వర్గసీమ లింక్: 34:16 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=UoqF-KPGcyk">https://www.youtube.com/watch?v=UoqF-KPGcyk</a></p>
<p><strong>6) పెరుమాళ్ళు :</strong> కండువా నలుపుకుంటూ వినయంగా మాట్లాడే నౌకరుగా, గుండెపోటుతో చనిపోయే ముసలి తండ్రిగా అసంఖ్యాకమైన పాత్రలు వేసి వేలాది చేరుమాళ్ళు సెంటిమెంటుతో తడిపేసిన వారీయన. పద్మనాభం గారు తీసిన &#8216;దేవత&#8217; లో మొదటి సావిత్రి తండ్రి. సారధి వారి &#8216;రోజులు మారాయి&#8217; లో హీరో నాన్న కోటయ్యగా నిడివి గల పాత్రలో నటించారు. &#8216;మనోరమ&#8217; లో హీరోయిన్ కృష్ణకుమారి తండ్రి.</p>
<p>1955 లో వచ్చిన &#8216;రోజులు మారాయి&#8217; లో ANR తండ్రిగా ముఖ్యపాత్ర వేసిన పెరుమాళ్ళుగారు డెబ్భైల్లో వచ్చిన &#8216;ప్రేమనగర్&#8217; లో ANR దగ్గర నౌకరుగా అతి చిన్న పాత్ర వేయడం విచిత్రమైన విషాదం. పెరుమాళ్ళు గారి విగ్రహం సాధారణం. ఆట్టే ప్రత్యేకత లేని వాచికం. అందువల్ల ఈయన్ని చప్పున గుర్తించడం కష్టం.</p>
<p>ప్రేమనగర్ లింక్: 9:57 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=pEgL6370kzc">https://www.youtube.com/watch?v=pEgL6370kzc</a></p>
<p><strong>7) డబ్బింగ్ జానకి:</strong> &#8216;శంకరాభరణం&#8217; సినిమాలో శంకరశాస్త్రులు తులసిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని అతన్ని బాయ్ కాట్ చేస్తూ పని మానేసిన వంటలక్క. &#8216;సాగరసంగమం&#8217; లో కమలహాసన్ తల్లి. చాలా సినిమాల్లో ముఖ్యంగా జంథ్యాల, కె విశ్వనాథ్ ల సినిమాల్లో నడి వయసున్న మధ్య తరగతి మహిళగా అనేక వేషాలు వేశారు.</p>
<p>ఈ సినిమాలన్నింటికన్నా ఆమె యొక్క టాలెంట్ పూర్తిగా చూడగల అవకాశం అక్కినేని కుటుంబరావు, ఓల్గా గార్లు నిర్మించిన &#8216;అమూల్యం&#8217; అనే సినిమాలో దొరుకుతుంది. ఆ సినిమాలో ఆమె నటన చూస్తుంటే ఎంతమంది గొప్ప కళాకారులు తెలుగు సినిమా రంగంలో ఉన్నారో అనిపిస్తుంది.<br />
67 లో ANR హీరోగా వచ్చిన &#8216;పూలరంగడు&#8217; సినిమా ప్రారంభంలో ANR ని &#8220;ఆమె తెచ్చే గడ్డి అంత రుచా!?” అని ఎకసెక్కమాడుతుంది. ఈ సినిమాలో ఆమెకి ఇదొక్కటే డైలాగు అయినా ఆమె పేరుని టైటిల్స్ లో వేశారు. బహుశా ఆమె అప్పటికే డబ్బింగ్ కళాకారిణిగా ప్రసిద్ధురాలు అయి ఉంటారు. అసంఖ్యాకమైన సినిమాల్లో డబ్బింగ్ జానకి గారిని వయసు మళ్ళిన పాత్రల్లో చూసి &#8216;పూలరంగడు&#8217; సినిమాలో నవయవ్వనంలో ఉన్న యువతిగా చూస్తుంటే &#8216;ఎంత చక్కగా ఉన్నారీవిడ!?&#8217; అని అనుకోకుండా ఉండలేం.</p>
<p>1975 లో వచ్చిన &#8216;అనురాగాలు&#8217; అనే సినిమాలో కూడా హీరోయిన్ (శ్రీదేవి) ఉన్న బ్లైండ్ స్కూల్ వార్డెన్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది జానకి గారే. ఇదే సినిమాలో ఆమె ఒక టీచర్ పాత్ర కూడా పోషించింది.</p>
<p>శంకరాభరణంలింక్: 46:39 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=nOQiVyJuj7M">https://www.youtube.com/watch?v=nOQiVyJuj7M</a></p>
<p><strong>8) వల్లభజోస్యుల శివరాం:</strong> చాలా పాత సినిమాల్లో వి. శివరాం అనే పేరు చూడవచ్చు. నాగయ్య గారి &#8216;భక్త పోతన&#8217; లో పోతనకి కొడుగ్గా వేశారట. ఈయన కంఠం చాలా ప్రత్యేకంగా పట్టించేస్తుంది. క్లోజప్ షాట్లు లేకపోవడం వల్ల ఈయనని గుర్తుపట్టాలంటే వాచికమే ఆధారం.</p>
<p>విప్రనారాయణ సినిమాలోని సంభాషణలని సంక్షిప్తశబ్దచిత్రంగా వి.ఎ.కె. రంగారావు గారు మలచిన ఆడియో క్యాసెట్ కవరు మీద ఇచ్చిన పేర్ల ఆధారంగా ఆ సినిమాలో ఈయనది రాజు పాత్ర అని తెలుసుకోవచ్చు. &#8216;విప్రనారాయణ&#8217; లో శివరాం గారు చెప్పిన కొద్ది డైలాగులు వింటే చాలు, దాని ఆధారంగా ఈయన కంఠాన్ని ఎన్నో సినిమాల్లో గుర్తుపట్టవచ్చు &#8211; రకరకాల మేకప్ ల వల్ల ముఖాన్ని గుర్తుపట్టలేకపోయినా&#8230; ఉదాహరణకి గులేబకావళి కథ&#8217; (NTR) సినిమాలో శిశువుని కాపాడిన ముని గొంతు ఈయనదే. అలాగే సారధి వారి &#8216;రోజులు మారాయి&#8217; లో రమణారెడ్డి రైతులకి కలెక్టర్ గారి మీటింగ్ కి వెళ్ళవద్దని చెప్పే సీనులో వల్లభజోస్యులవారి కంఠం వినపడుతుంది.</p>
<p>బి.ఎన్. రెడ్డిగారి &#8216;రంగుల రాట్నం&#8217; సినిమాలో విజయనిర్మల (అప్పటికి &#8216;నీరజ&#8217; గా వ్యవహరించుకుంటున్నారు) పాత్రకి మామగారు. &#8216;మంచి మనసుకి మంచి రోజులు&#8217; సినిమాలో హీరోయిన్ రాజసులోచనకి పని ఇప్పించిన ప్రెసిడెంట్ పాత్ర.</p>
<p>రంగుల రాట్నం లింక్: 1:37:51 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=ExLNSE8uAG8">https://www.youtube.com/watch?v=ExLNSE8uAG8</a></p>
<p><strong>9) కాకరాల (వీర వెంకట సత్యనారాయణ మూర్తి):</strong> బి.ఎన్. రెడ్డిగారి &#8216;రంగుల రాట్నం&#8217; సినిమాలో తూర్పు యాస మాట్లాడే పాత్ర వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పాత్ర పేరు సుబ్బారాయుడు &#8211; హీరోయిన్ ని పెళ్ళాడదామని ప్రయత్నించి విఫలుడైన పాత్ర. ANR &#8216;ప్రేమనగర్&#8217; సినిమాలో వాణిశ్రీకి దురాశాపరుడైన అన్న. ఒక కోణం నించి తీసిన షాట్స్ లో రాజబాబుగారి పోలికలు కొన్ని కనిపిస్తాయి.</p>
<p>&#8216;రంగుల రాట్నం&#8217; లో ఈయన నిలువెత్తు విగ్రహం, ఆకట్టుకునే వాచికం చూసింతరవాత బాపుగారి &#8216;తూర్పు వెళ్ళే రైలు&#8217; సినిమాలో హీరో తండ్రి పాత్ర వేసింది ఈయనే అంటే నమ్మలేం &#8211; &#8216;కన్యాశుల్కం&#8217; సినిమాలో ఠీవైన విగ్రహం, ఖంగుమనే కంఠంతో అగ్నిహోత్రావధానులుగా అదరగొట్టేసిన విన్నకోట రామన్నపంతులు గారు జంధ్యాల మొదటిసారిగా దర్శకత్వం వహించిన &#8216;ముద్దమందారం&#8217; సినిమాలో ముఖమంతా పీక్కుపోయిన తాగుబోతు పాత్రలో నటించారని ప్రత్యక్షంగా చూస్తున్నా నమ్మశక్యం కానట్టు! ఎంతో ప్రతిభావంతులైన వీళ్ళ శరీరాలని సినిమా రంగం తినేసిందని సరిపెట్టుకోవాల్సిందే.</p>
<p>రంగుల రాట్నం లింక్: 1:37:15 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=ExLNSE8uAG8">https://www.youtube.com/watch?v=ExLNSE8uAG8</a></p>
<p><strong>10) K.V.S. శర్మ:</strong> (పూర్తి పేరు తెలియదు) చాలా పాత సినిమాల్లో కనిపిస్తారు. ఈయన వాయిస్ లో కూడా ఏదో ప్రత్యేకత ఉంది &#8211; అయితే చాలా డైలాగులు విన్న తర్వాత కాని అది మనసుకి పట్టదు. కెబి తిలక్ గారి &#8216;చిట్టి తమ్ముడు&#8217; సినిమాలో చిన్నపిల్లల మాఫియా తాత, &#8216;నిత్య కల్యాణం పచ్చతోరణం&#8217; సినిమాలో కూడా ఇలాంటి గెటప్ తోనే ఒక &#8216;దాదా&#8217; వేషం వేశారు. &#8216;ఉయ్యాల జంపాల&#8217; లో మునసబు. భాగ్యరేఖలో NTR కి తండ్రి. &#8216;అన్న-తమ్ముడు&#8217; లో క్రిష్టియన్ ఫాదర్. NTR &#8216;గులేబకావళి కథ&#8217; లో రాజనాలకి సహాయం చేసే దుష్టబుద్ధి పాత్ర.</p>
<p>ఈయన విగ్రహంలో గొల్లపూడి మారుతీరావు గారి పోలికలు, వాచికంలో విన్నకోట రామన్నపంతులు గారి &#8216;రాపు&#8217; ఉన్నాయి.</p>
<p>భాగ్యరేఖ లింక్ 1:21:30 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=8u82s8YUec0">https://www.youtube.com/watch?v=8u82s8YUec0</a></p>
<p><strong>11) &#8216;సాక్షి రంగారావు&#8217;:</strong> అసలు పేరు రంగావజ్ఝల రంగారావు కానీ 1967 లో విడుదలైన బాపు-రమణ ల &#8216;సాక్షి&#8217; సినిమా నించీ ఈ పేరుతో ప్రసిద్ధుడు. &#8216;మట్టిలో మాణిక్యం&#8217; లో భానుమతి తో కలసి నటించిన సన్నివేశం లో అవిడ డైలాగ్ కి ఈయన రియాక్షన్ చూస్తే ఈయన టాలెంట్ అర్థమవుతుంది. అలానే కొన్ని విశ్వనాథ్, జంథ్యాల సినిమాలలో ఈయన నటనావైదుష్యం చూడవచ్చు. కానీ ఎక్కువగా సాదా, సాధారణ, పేలవమైన పాత్రలకే ఈయన టాలెంట్ అంతా వృధా అయిపోయిందేమో అనిపిస్తుంది &#8211; మరీ &#8216;రాజా&#8217; (శోభన్ బాబు, రాఘవేంద్రరావు) సినిమా లో విగ్గు పెట్టుకుని వేసిన తాగుబోతు పాత్ర లాంటివాటిని చూస్తే.</p>
<p>స్వర్ణకమలం లింక్ 13:45 దగ్గర చూడండి.<br />
<a href="https://www.youtube.com/watch?v=RboT-EhyqY0">https://www.youtube.com/watch?v=RboT-EhyqY0</a></p>
<p>&nbsp;</p>
<p><strong>ఇంకా :</strong><br />
&#8216;మాయాబజార్&#8217; లో &#8216;జంబు&#8217; గా, &#8216;చెల్లెలి కాపురం&#8217; (కె విశ్వనాథ్, బాలయ్య) లో చాకలి గా, &#8216;మంచి మనసుకి మంచి రోజులు&#8217; లో &#8216;హుఁ హుఁ&#8217; అని దగ్గుతూ హాస్యం పోషించడానికి ప్రయత్నించిన &#8216;మాలోకం&#8217; గా నటించిన నల్ల రామ్మూర్తి గారు;</p>
<p>సామాన్యమైన విగ్రహం ఉన్నా ఒక్క వాక్యం వింటేనే పట్టించేసే కంఠం ఉన్న దొరైస్వామి గారు (మల్లీశ్వరిలో భానుమతి నాన్న) ;</p>
<p>&#8216;మాయాబజార్&#8217; లో మాయతాత గా &#8216;అటు నేనే ఇటు నేనే&#8217; అంటూ ఘటోత్కచుడినే హడలేసిన కంచి నరసింహారావు గారు;</p>
<p>&#8216;కృష్ణార్జున యుద్ధం&#8217; లో అల్లురామలింగయ్య ప్రక్కన &#8216;అంచెలంచెలు&#8230; పాటలో నటించిన సురభి బాలసరస్వతి గారు;</p>
<p>&#8216;విప్రనారాయణ&#8217; లో &#8216;కట్టండి, చేతులు విరిచి కట్టండి&#8217; అన్న దండనాయకుడుగా, &#8216;మల్లీశ్వరి&#8217; లో పువ్వులు కోసుకుంటున్న టిజి కమలతో మాట్లాడిన సైనికాధికారిగా, &#8216;బాలరాజు&#8217; లో &#8216;నీ కూతుర్ని నా కొడుకుకివ్వు&#8217; అంటూ తగాదా వేసుకున్న వెంకన్నాయుడుగా వేసిన, గద్దించే కంఠం ఉన్నKV సుబ్బారావు గారు -;</p>
<p>ప్రధానపాత్రలు వేసే &#8216;అగస్త్యులకు&#8217; వీళ్ళు భ్రాతలని సరిపెట్టుకుందామంటే &#8211; అసలు వీళ్ళే అగస్త్యులేమో అని అనిపించకమానదు.</p>
<p>అవే పాత్రలను ఎన్నో సినిమాలలో జీవించి, మళ్ళీ మళ్ళీ అవే అవే సన్నివేశాలలో పాల్గొని, ఎన్నో జన్మలెత్తిన అనుభవాలు సంపాదించుకున్నారేమో అనిపిస్తుంది &#8211; చివర్లో నిజంగానే సన్యాసం పుచ్చుకున్న &#8216;ముదిగొండ లింగమూర్తి&#8217;, సంసారంలో ఉన్నా మానసికంగా సన్యాసి లాగా జీవించారని అందరూ చెప్పుకునే &#8216;సాక్షి రంగారావు&#8217; లాంటి వాళ్ళను చూస్తే.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=9106</wfw:commentRss>
		<slash:comments>13</slash:comments>
		</item>
		<item>
		<title>అంతర్వేదం</title>
		<link>http://vaakili.com/patrika/?p=8949</link>
		<comments>http://vaakili.com/patrika/?p=8949#comments</comments>
		<pubDate>Tue, 01 Sep 2015 02:11:14 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రాజశేఖర్ పిడూరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=8949</guid>
		<description><![CDATA[<p></p> <p>&#8216;అంతర్వేది&#8217; అనే పేరు తలచుకోగానే అంతర్ వేదం, అంతరంగంలోని వేదం అన్న మాటలతో పాటు &#8211; అంతరువు ఏది? (ప్రపంచానికీ నాకూ మధ్య) అన్న భావం కలుగుతుంది. అందుకనే అంతర్వేది అనే పేరులో ఏదో ఆధ్యాత్మిక భావన వినిపిస్తుంది.</p> <p>చిన్నప్పటి నించీ ఒక నది సముద్రంలో కలవడం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి, ఆకాంక్ష. ఇంత పెద్ద జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోట కొన్ని మైళ్ళ దూరం పాటు సముద్రంలో కూడా మంచి నీళ్ళే ఉంటాయిట అన్న ఆసక్తికరమైన సంగతి చిన్నప్పట్నించీ వింటూ ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని చూడాలన్న కుతూహలాన్ని పెంచింది (ఇది తప్పని &#8211; కనీసం వరద లేని వేసవి కాలంలో &#8211; అక్కడికి వెళ్ళాక తెలిసింది).</p> <p>గోదావరి గురించి నాకున్న పరిమితానుభవం గురించి&#8230;<br /> చిన్నప్పుడు ఒంగోలు నుంచి విశాఖపట్టణం వైపు రైల్లో వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జిని దాటిన అనుభవం ఉంది. గోదావరి రైలు బ్రిడ్జి కి ఇటుప్రక్క పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, బ్రిడ్జి దాటితే అటుప్రక్క తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి &#8211; ఇదీ నాకు తెలిసినది.</p> <p>కానీ ఇప్పుడు తిరపతి నించి రాజమండ్రికి బస్సులో వచ్చేటప్పుడు, గోదావరిని రెండుసార్లు చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే హైవే (స్వర్ణ చతుర్భుజి) లో వేసిన రోడ్డు రాజమండ్రికి కొన్ని కిలోమీటర్లు దక్షిణంగా గోదావరి నదిని దాటుతుంది. అంటే రైలు మార్గం తాడేపల్లి గూడెం, నిడదవోలు, కొవ్వూరుల రూట్ లో వచ్చి గోదావరిని దాటితే &#8211; స్వర్ణ చతుర్భుజి రోడ్డు మార్గం మాత్రం తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో దక్షిణం వైపుగా మళ్ళి తణుకు మీదుగా వచ్చి గోదావరిని దాటుతుంది. కానీ అప్పటికే గోదావరి రెండు పాయలుగా చీలి ఉంటుంది.<br /> తూర్పు వైపు ఉన్న పాయని &#8216;గౌతమీ గోదావరి&#8217; అని పశ్చిమం వైపు ఉన్న పాయని &#8216;వశిష్ట గోదావరి&#8217; అని పిలుస్తారు. గోదావరి జిల్లాలని వేరు చేస్తున్నవి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/09/Antarvedi.jpg"><img class="aligncenter size-full wp-image-9036" title="Antarvedi" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/09/Antarvedi.jpg" alt="" width="1200" height="675" /></a></p>
<p><span style="font-size: 30px;">&#8216;అం</span>తర్వేది&#8217; అనే పేరు తలచుకోగానే అంతర్ వేదం, అంతరంగంలోని వేదం అన్న మాటలతో పాటు &#8211; అంతరువు ఏది? (ప్రపంచానికీ నాకూ మధ్య) అన్న భావం కలుగుతుంది. అందుకనే అంతర్వేది అనే పేరులో ఏదో ఆధ్యాత్మిక భావన వినిపిస్తుంది.</p>
<p>చిన్నప్పటి నించీ ఒక నది సముద్రంలో కలవడం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి, ఆకాంక్ష. ఇంత పెద్ద జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోట కొన్ని మైళ్ళ దూరం పాటు సముద్రంలో కూడా మంచి నీళ్ళే ఉంటాయిట అన్న ఆసక్తికరమైన సంగతి చిన్నప్పట్నించీ వింటూ ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని చూడాలన్న కుతూహలాన్ని పెంచింది (ఇది తప్పని &#8211; కనీసం వరద లేని వేసవి కాలంలో &#8211; అక్కడికి వెళ్ళాక తెలిసింది).</p>
<p>గోదావరి గురించి నాకున్న పరిమితానుభవం గురించి&#8230;<br />
చిన్నప్పుడు ఒంగోలు నుంచి విశాఖపట్టణం వైపు రైల్లో వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జిని దాటిన అనుభవం ఉంది. గోదావరి రైలు బ్రిడ్జి కి ఇటుప్రక్క పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, బ్రిడ్జి దాటితే అటుప్రక్క తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి &#8211; ఇదీ నాకు తెలిసినది.</p>
<p>కానీ ఇప్పుడు తిరపతి నించి రాజమండ్రికి బస్సులో వచ్చేటప్పుడు, గోదావరిని రెండుసార్లు చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే హైవే (స్వర్ణ చతుర్భుజి) లో వేసిన రోడ్డు రాజమండ్రికి కొన్ని కిలోమీటర్లు దక్షిణంగా గోదావరి నదిని దాటుతుంది. అంటే రైలు మార్గం తాడేపల్లి గూడెం, నిడదవోలు, కొవ్వూరుల రూట్ లో వచ్చి గోదావరిని దాటితే &#8211; స్వర్ణ చతుర్భుజి రోడ్డు మార్గం మాత్రం తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో దక్షిణం వైపుగా మళ్ళి తణుకు మీదుగా వచ్చి గోదావరిని దాటుతుంది. కానీ అప్పటికే గోదావరి రెండు పాయలుగా చీలి ఉంటుంది.<br />
తూర్పు వైపు ఉన్న పాయని &#8216;గౌతమీ గోదావరి&#8217; అని పశ్చిమం వైపు ఉన్న పాయని &#8216;వశిష్ట గోదావరి&#8217; అని పిలుస్తారు. గోదావరి జిల్లాలని వేరు చేస్తున్నవి &#8211; గోదావరి నదీ(ధవళేశ్వరం దాకా), ఆ తరవాత వశిష్ట పాయలే. అంటే పశ్చిమ గోదావరి జిల్లా నించి తూర్పు గోదావరి జిల్లాలోకి హైవే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ముందుగా వశిష్ట గోదావరిని దాటాలి. అప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తాం. ఆ తర్వాత గౌతమీ గోదావరి పాయని దాటి కొంచెం ఉత్తరం వైపుగా ప్రయాణిస్తే రాజమండ్రి చేరతాం.</p>
<p>ఈ వశిష్ట, గౌతమి పాయల మధ్య ఉన్న రావులపాలెం మీదుగా హైవే వెళుతుంది. ఈ ఊరుని &#8216;కోనసీమ ముఖద్వారం&#8217; అని పిలుస్తారు. కాబట్టి రైల్లో అయితే గోదావరిని దాటే అవకాశం ఒకసారే కాని ఈ హైవే మీద రాజమండ్రికి వెళితే వశిష్టని, గౌతమిని కూడా చూడొచ్చు!</p>
<p>సరే రాజమండ్రి లో దిగాక &#8211; ఇంకేముంది బస్ స్టాండ్ నించి తిన్నగా అంతర్వేది బస్ ఎక్కడమేగా &#8211; అని అమాయకంగా, నిర్లక్ష్యంగా వెళ్ళాను పొద్దున్నే ఆరు గంటలకి. &#8216;అంతర్వేదికి బస్సు ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుంది?&#8217; అని ధాటీగా అడుగుతున్న నన్ను చూసి నీళ్ళు నమిలాడు అక్కడ ఎంక్వయిరీలో కూర్చుని ఉన్న యువకుడు. ఆ ఆవరణలోనే ఒక ప్రక్కగా వేరేగా ఉన్న ఇంకో చిన్న బస్టాండ్ వైపు చూపిస్తూ &#8216;కాకినాడ బస్సు&#8217; అంటూ ఏదో గొణిగాడు.</p>
<p>సరే అనుకుంటూ ఒక మూలగా ఉన్న ఆ బుల్లి బస్టాండ్ దగ్గరకి వెళ్ళి అడిగితే ఒకాయన &#8216;మీరు రాజోలు వెళ్ళి అక్కడ నుండి వేరే బస్సులో వెళ్ళాలి&#8217; అన్నాడు. మళ్ళీ వెనక్కొచ్చి ఎంక్వయిరీ కౌంటర్ యువకుడికి విషయం తెలియచేయాలని అతని దగ్గరకి వెళ్ళగానే అతడు హంబుల్ గా &#8220;సార్ నాకు తెలియక చెప్పాను, లోపల మా వాళ్ళని కనుక్కున్నాను. మీరు రాజోలు బస్ ఎక్కాలి ఫలానా ప్లాట్ ఫారం మీద&#8221; అన్నాడు. &#8216;మీకు విషయం తెలియచేద్దామనే&#8217; వచ్చాను అని నవ్వి రాజోలు బస్సు ఎక్కాను. బస్ కండక్టర్ &#8220;రాజోలు వెళ్ళి అక్కడ నించి సఖినేటిపల్లి వెళ్ళే బస్ పట్టుకుని మధ్యలో మలికిపురంలో దిగి అక్కడ నించి ఆటోలో వెళ్ళాల్సిందే&#8221; అని వివరించాడు.</p>
<p>సరే, ఇక రాజమండ్రిలో బయల్దేరిన రాజోలు బస్ బుర్రిలంక, కడియపు లంక, చెముడు లంకలను దాటి దక్షిణంవైపు గా ప్రయాణిస్తూ గౌతమీ గోదావరి పాయని దాటింది. అంటే రావులపాలెం అన్నమాట. రావులపాలెం దాటి పశ్చిమంగా ప్రయాణించి వశిష్ట గోదావరి పాయని చేరడానికి కొంచెం ముందే మళ్ళీ దక్షిణం వైపుకు తిరిగింది బస్సు. ఈ లెఫ్ట్ టర్న్ తీసుకున్న ప్రదేశం పేరు ఈతకోట. ఇహ అక్కడ్నించీ దాదాపు గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకే ప్రయాణిస్తూ గంటి, గంటిపెదపూడి (జి పెదపూడి), తాటిపాక మీదుగా రాజోలు చేరింది. అన్నీ చిన్న ఊర్లే అని చెప్పొచ్చు. తాటిపాక మాత్రం చిన్న టౌన్. రాజోలు అంతకన్నా కొంచెం పెద్ద టౌన్.</p>
<p>రాజోలు నించి అంతర్వేదికి బస్‌ సౌకర్యం లేదు. బహుశా రోజుకొకటి లేదా రెండు బస్సులు ఉన్నాయేమో! ఎవర్నడిగినా సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం అనే ఊళ్ళో దిగి అక్కణ్ణించి ఆటోలో వెళ్ళమన్నారు. సరే, అలాగే వెళ్ళి మలికిపురం చేరాను. అక్కడ షేర్ ఆటో ఎక్కాను. (మామూలుగా ఆంధ్రాలో అన్ని ఊళ్ళల్లో కుక్కినట్లే ఇక్కడ కూడా &#8211; 20 కి.మీ ప్రయాణం కాబట్టి ఛార్జి 20 రూపాయలు. జనం నిండిందాకా ఆటో కదలదు కాబట్టి వేళ కాని వేళలో మలికిపురం చేరామంటే ఇరుక్కుపోతాం)</p>
<p>అదృష్టవశాత్తూ నేను అరగంట కన్నా ఎక్కువ వేచి ఉండనక్కరలేకుండానే పదకొండు గంటలకంతా అంతర్వేదికి చేరిపోయాను &#8211; అరటి, కొబ్బరి ఇంకా ఎన్నో పచ్చపచ్చని ఫల పుష్ప వృక్ష జాతులు దారికిరుప్రక్కలా కన్నుల పండువ చేస్తుండగా చాలా చిన్నచిన్నగోదారిపల్లెల గుండా ప్రయాణం. దారి పొడుగూతా గోదారి కాల్వ &#8211; కాటన్ మహాశయుణ్ణి గుర్తు చేస్తూ.</p>
<p style="text-align: center;">***</p>
<p>అంతర్వేది. చిన్న పల్లెటూరు. గాలిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే తోచింది &#8211; బహుశా నా మనసులో ఉన్న భావనే అయిఉండవచ్చు ! బస్టాండ్ ఉండేంత పెద్ద ఊరు కాదు. లక్ష్మీనరసింహస్వామి గుడి బయట పందిళ్ళు వేసి ఉన్న స్థలంలో ఆటో ఆగింది. ప్రాకారం దాటి గుడి లోపలకి వెళ్ళీ వెళ్ళగానే చుట్టూ తిరిగాను. నలువైపులా నాలుగు ద్వారాలు. దక్షిణం, పశ్చిమం ద్వారాల నుంచి బయటికి చూస్తే విశాలమైన ప్రదేశం &#8211; దూరంగా నదీ పరివాహిక ప్రాంతం. రక్తకుల్య అనే నది కూడా ఇక్కడ ఉంది. ఈ నదికి స్థల పురాణంలో ఒక ప్రత్యేక పాత్ర ఉందిట. లక్ష్మీనరసింహస్వామి గుడికి ఐదారు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కృష్ణమ్మ అనే జమిందారు దీనిని పునరుద్ధరించాడు.</p>
<p>ఈ గుడి కన్నా పురాతనమైన నీలకంఠేశ్వరస్వామి గుడి (చాలా చిన్నది) దీనికి కొంచెం దూరంలోనే ఉంది. క్షేత్ర పాలకుడైన ఈ నీలకంఠేశ్వరస్వామి గర్భగుడి ముఖద్వారం పశ్చిమం వైపుకు ఉండటం ఒక ప్రత్యేకతట.</p>
<p>అన్ని గుళ్ళ మాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కూడా స్పెషల్ దర్శనం టిక్కెట్టంటూ వేరేగా ఉంది. (ఇది కొన్న వాళ్ళకే లక్ష్మీ నరసింహస్వామిని దగ్గరగా చూసే అవకాశం &#8211; మిగతా వారిని కొన్ని అడుగుల ముందుగా ఆపేస్తారు) కానీ జనం చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది &#8211; వాతావరణంలో కమర్షియల్ గోల లేదు. గుడి లోపల నలువైపులా చక్కని దారి, చెట్లు. ఈశాన్య మూలలో ఒక చిన్న బావి. దానిలో ఒక పెద్ద తాబేలు, కొన్ని చిన్న తాబేళ్ళు.</p>
<p>మధ్యాహ్నపు ఎండ బయట కారం దంచుతున్నట్లుంది &#8211; అగ్నివర్షంట &#8211; ఆరోజు (మే 23, 2015) ఉష్ణోగ్రత నలభై ఎనిమిది దాటిందేమో తూ.గో లో బహుశా. కానీ లోపల గుడిలో భరించలేనంత వేడిగా ఏం లేదు. గుడి వెనక ఉన్న ఒక హాలులో నిత్యాన్నదాన పథకం క్రింద భోజనం పెడుతున్నారు. ఇది రోజూ జరిగే కార్యక్రమమేనట. తిన్న వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసే నిధుల నించే ఈ కార్యక్రమం నడుస్తుందట. ఎవరైనా ఒక్కోరోజు పూర్తిగా స్పాన్సర్ చేసేవాళ్ళు కూడా ఉంటారట. ఆ రోజు ఎవరో స్పాన్సర్ చేసినట్లున్నారు &#8211; బ్రహ్మాండమైన గోదావరి జిల్లా భోజనాన్ని కొసరి కొసరి మరీ వడ్డిస్తున్నారు.</p>
<p>తీవ్రమైన వేసవి కాబట్టి జనం ఎవరూ కనపడుతున్నట్లు లేరు. ఆలయోద్యోగులు తప్ప. భోజనమయ్యాక బావిలో తాబేళ్ళని కాసేపు చూసి గుడి ఆవరణలో కూర్చున్నాను. అప్పుడప్పుడూ చల్లని గాలి వీచి బయటి ఎండని మరిపిస్తోంది. ఆలయంలో దాదాపుగా జనం లేనట్లే.</p>
<p>ఇంతలో ఒక హరికథా కళాకారిణి &#8211; మంధా నాగమణి గారట యానాం నించి వచ్చారు &#8211; ఆ మిట్ట మధ్యాహ్నం పూట &#8220;కృష్ణ రాయబారం&#8221; కథ చెప్పడం ఆరంభించారు.</p>
<p>లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆస్థాన కళాకారుడు మృదంగంతోనూ, బయట నుంచి వచ్చిన వేరొకరు హార్మోనియంతోనూ నాగమణి గారికి సహకారం అందించారు. మైక్ సెటప్ చేయడానికి ముందు ఆవిడ కొన్ని కీర్తనలు చక్కగా ఆలపిస్తుంటే (పన్నెండున్నరనించి ఒంటి గంట దాకా) &#8216;ఎవరో గాయని అయిన భక్తురాలు పాటలు పాడుతున్నారేమో&#8217; అనుకున్నాను. తర్వాత సంప్రదాయానుసారం చిరతలు, పూలమాల ధరించి ఒంటి గంట నించీ దాదాపు రెండున్నరదాకా ఖంగుమనే కంఠంతో హరికథ చెప్పారు &#8211; ఎక్కడా &#8216;గొంతు&#8217; దాచుకున్నట్లు అనిపించకుండా.<br />
&#8216;ఇదేమిటి ఇంత మండు వేసవి మధ్యాహ్నంలో హరికథా?&#8217; అని అక్కడున్న ఆలయ ఉద్యోగిని అడిగితే ఆయన నవ్వి &#8216;అవునండీ ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం ఉంటుంది &#8211; వేసవికేం ఎక్సెప్షన్ లేదు&#8217; అన్నారు. బహుశా సాయంత్రం ఏర్పాటు చేస్తే జనం తిరిగి వెళ్ళడానికి ఇబ్బంది పడతారని మధ్యాహ్నం ఏర్పాటు చేశారేమో ! (అంతర్వేది చాలా మారుమూల పల్లెటూరు, రాకపోకలకి రోడ్లు ఇరుకుగా ఉంటాయి) మొత్తానికి మధ్యలో &#8216;గోవిందోహారి&#8217; చెప్పేవాళ్ళు, చివర్లో చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోయినా నాగమణి గారు నిరుత్సాహపడినట్లు కనిపించకుండా మధ్యమధ్యలో చక్కని జోక్స్ చెప్తూ హరికథాకాలక్షేపం చేశారు.</p>
<p>రాయబారం వెళ్ళేముందు కృష్ణుడితో ద్రౌపది చెప్పిన తిక్కన గారి పద్యం &#8220;ఇవి దుస్ససేను వ్రేళ్ళందవిలి&#8221; &#8211; ఆ రోజుల్లోనే క్లోజప్ షాట్ ని ఈ పద్యం ద్వారా తిక్కన స్ఫురింపచేశాడు అని శ్రీశ్రీ పొగిడినది &#8211; పాడతారేమోనని ఆశగా ఎదురు చూశాను. కాని పాడలేదు. రాయబార ఘట్టంలో ప్రసిద్ధమైన పాండవోద్యోగ నాటక పద్యాలు (జండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో) అన్నీ పాడారు.</p>
<p>సాగర సంగమంకి ఎలా వెళ్ళాలి అని గుళ్ళో ఇద్దరు ముగ్గుర్నడిగితే దారి కన్నా జాగ్రత్తలు ఎక్కువగా చెప్పారు. చాలా లోతు ఉంటుంది, ప్రమాదాలు జరిగాయి వగైరా..<br />
నాలుగున్నరకి బయల్దేరి ఊళ్లోకి వచ్చి &#8216;సాగరసంగమం ఎక్కడండీ?&#8217; అని ఒకాయన్ని అడిగితే &#8216;అలా శివాలయం ప్రక్కనుండి తిన్నగా వెళ్ళిపోండి&#8217; అంటూ &#8216;కాళ్ళు కూడా కడుక్కోవద్దండీ దయచేసి &#8211; ఎక్కడ ఎంత లోతుంటుందో ఎవరికీ తెలియదు&#8217; అని భయపెట్టారు. ఆయన చెప్పిన శివాలయం అక్కడకి చాలా దగ్గరే &#8211; ఇదే క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం. అక్కడకి వెళ్ళాక &#8216;సాగరమునకు దారి&#8217; అన్న బోర్డు చూసి మలుపులేమీ తిరక్కుండా బోర్డులో సూచించిన దారి వైపు వెళ్ళాను. ఒక కిలోమీటరుకి పైగానే నడక. తాటి చెట్లూ, మధ్యలో చిన్న చిన్న చెరువుల లాంటి గుంటలూ, ఓయన్జీసి వాళ్ల పెట్రోల్ బావుల వాసనలు, దూరంగా వినిపిస్తూ క్రమంగా దగ్గరవుతున్న సముద్రపు హోరు. సముద్రం చాలా ఉద్ధృతంగానే ఉన్నట్లనిపించింది. కొద్దిమంది స్నానాలు చేస్తున్నారు. &#8216;మరీ కాళ్ళు కూడా తడపనంత ప్రమాదం ఏముందబ్బా ఇక్కడ&#8217; అని అనుకున్నాను.</p>
<p>&#8216;ఇంతకీ గోదావరి ఎటున్నట్లు? ఎక్కడ కలుస్తోంది సముద్రంలో?&#8217; అని ఆలోచించుకుంటూ &#8216;పోనీ అలా తీరం వెంబడే నడుచుకుంటూ పోదామా&#8217; అనుకున్నాను. ఉత్తరం వైపు (ఇది ఈశాన్యం &#8211; సముద్రం దగ్గిర దిక్కులు తెలీక చాలా గందరగోళం గా ఉంటుంది) చూస్తే అనంతమైన సముద్రం. మరో వైపు మాత్రం తీరం వంపు తిరిగి ఉంది. కాబట్టి బహుశా గోదారి అటువైపు ఉండవచ్చు అనిపించింది. కొంచెం సేపటికి ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి అక్కడే చాలాసేపు గడిపాను. చిరుచీకట్లు పడేటప్పుడు మళ్ళీ నడుస్తూ బయలుదేరి గుడికి వెళ్ళకుండా మలికిపురం వెళ్ళే రోడ్డు లోకి తిరిగేసి అలా రెండు కిలోమీటర్లు నడుస్తూ పోయాను ఆటో దొరికిందాకా.</p>
<p>ఆటోలో ఒక రైతు సోదరుడితో పరిచయం. ఆయన పేరు ప్రభోజీ! &#8216;ఇలాంటి పేరు ఎక్కడా వినలేదండీ&#8217; అంటే &#8216;విశాఖపట్టణం జిల్లాలో కసింకోట అనే ఊళ్ళో ఉన్న ఒక ముస్లిం గురూజీని కొలిచే వారు ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని చెప్పాడు. గోదావరి జిల్లాల్లో చాలా మంది హిందువులు (ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ఆలయ పూజారులతో సహా) ఈయనని ఆరాధిస్తారట &#8211; హిందూ మతాన్ని పాటిస్తూనే.</p>
<p>మలికిపురంలో ఆటో దిగి మళ్ళీ ఇంకో షేర్ ఆటోలో రాజోలు వచ్చేసి రాత్రికి రాజమండ్రి చేరాను. తర్వాత రోజంతా అంతర్వేదిలో నిర్జనంగా ఉన్న ఆలయ ప్రాంగణం, తాబేళ్ళ బావి, హరికథ, సముద్రం &#8211; వీటన్నిటినీ రెలిష్ చేసినా అసలు గోదావరి సముద్రంలో కలిసే చోటు చూడలేకపోయానే అని మనసంతా పీకుతూనే ఉంది. దీన్ని గురించి ఇంకొంచెం తెలుసుకుందామని గూగులించితే నరసాపురం నించి అంతర్వేది లోని సాగరసంగమానికి లాంచి సర్వీసు ఉందని ఏదో వెబ్సైట్ లో కనపడింది.</p>
<p style="text-align: center;">***</p>
<p>మర్నాడు బండలు పగిలే ఎండలో, వడగాడ్పులో పదిన్నరకి రాజమండ్రిలో నరసాపురం బస్ ఎక్కాను.</p>
<p>మునుపు తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది వెంబడే దక్షిణం వైపు గా ప్రయాణిస్తూ అంతర్వేది చేరుకుంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించి గోదావరి నదికి దాదాపు సమాంతరంగా అంతర్వేదికి వెళ్తున్నాననమాట. ఎందుకంటే వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి రాజోలు తూర్పు వైపున ఉంటే నరసాపురం పశ్చిమం వైపు ఉంది.<br />
ఈ రకంగా పశ్చిమ గోదావరి వైపున్న ఊళ్ళు కూడా చూడవచ్చు అనుకుంటూ రాజమండ్రిలో బస్ ఎక్కాను. ఆంధ్రదేశంలో అగ్నిమండలం విస్ఫోటనం చెందిందా అన్నట్లుంది వాతావరణం.<br />
బస్సు రాజమండ్రి నుంచి దక్షిణంగా గౌతమీ గోదావరికి సమాంతరంగా ప్రయాణించి గౌతమీ పాయనీ, రావులపాలెం నూ దాటి, వశిష్ట గోదావరిని కూడా దాటింది. అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిందన్నమాట. దొంగరావిపాడు అనే ప్రాంతం దగ్గర బస్సు ఎడమ వైపు తిరిగి వశిష్ట గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకి ప్రయాణించింది. సిద్ధాంతం, వడలి (ఈ ఊరు చూడగానే సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులైన వడలి మందేశ్వరరావు గారు గుర్తొచ్చారు), చెరుకువాడ, పెనుగొండ, మార్టేరు, కవిటం, వేడంగి (రేలంగి లాగా కనపడుతూ ఎన్నో పాత సినిమాల్లో వేళంగి అనే పేరుతో హాస్య పాత్రలు వేసిన యక్కల కోటేశ్వరరావు అనే నటుడిదీ ఊరేనా), పాలకొల్లుల మీదుగా నరసాపురం చేరుకుంది.</p>
<p>మిట్టమధ్యాహ్నపు రోడ్డుపై మండుటెండ నోటికొచ్చినట్లు పేలుతూనే ఉంది. నరసాపురం బస్టాండ్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఒకాయన్ని లాంచి సర్వీసు గురించి అడిగాను. ఆయన &#8216;సాగరసంగమానికి లాంచి సర్వీసు తీసేసి చాలా రోజులయిందనీ, కొద్ది దూరంలోనే వశిష్ట గోదావరి పాయ ఉందనీ, దాన్ని పంటు మీద ఐదు నిమిషాల్లో దాటుకుని అటువైపు గట్టునించి ఆటో తీసుకుని మలికిపురంలో దిగి వెళ్ళమని అన్నాడు.</p>
<p>అయ్యో, మొన్నటి రూటే పట్టుకోవలసి వచ్చిందే! అనుకున్నాను. కాని పంటు ఎక్కడం కొత్త అనుభవమే కదా అనుకుంటూ ఆయన్ని దారి అడిగాను. తన బండి మీదే ఎక్కించుకుని పంటు బయల్దేరే చోట నన్ను దింపాడు. పది రూపాయలకి టిక్కెట్టు కొనుక్కుని పంటులో కూర్చున్నాను. ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంది కాని పది నిమిషాల్లోనే ఎన్నో సైకిళ్ళు, కొన్ని మోటారు సైకిళ్ళు, ఒక కారు వచ్చి పంటు ఎక్కాయి. బయట ఎండ భయంకరంగా ఉన్నా గోదావరి నీళ్ళని చూస్తే మనస్సులో చల్లగా ఉన్నట్లనిపించింది.</p>
<p>ఈ గట్టు నించి అవతలి గట్టుకి చేరడానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదేమో! అవతలి గట్టున (తూ.గో. జిల్లాలో) ఉన్న ఊరు సఖినేటిపల్లి లంక. అక్కడ సిద్ధంగా ఉన్న ఆటో ఎక్కాను. మధ్యాహ్నపు అగ్నిహోత్రుడి మీద మంత్రాల్లా పైనుంచి రాలుతున్న నిప్పుల్లోంచి గోలగోలగా పరిగెత్తుతూ ఆటో మలికిపురం చేరేప్పటికి రెండు గంటలయింది.</p>
<p>ముందురోజు రాజోలు నుంచి సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం దిగాను. ఈరోజేమో సఖినేటిపల్లి లంక నుంచి రాజోలు వెళ్ళే రూటులో ప్రయాణించి మధ్యలో ఉన్న మలికిపురంలో దిగాను.</p>
<p>ఆ సమయంలో ఆటోలు ఏమీ లేవు. మూడు మజ్జిగలూ, ఒక నిమ్మకాయ షోడా తాగేసి మూడున్నరకి బయల్దేరిన ఒక ఆటోలో ఎక్కి అంతర్వేదికి చేరేటప్పటికి నాలుగయింది. వదలకుండా ఎండ ఇంకా తీవ్రంగా ఉపన్యసిస్తూనే ఉంది. కొంచెం సేపు లక్ష్మీనరసింహస్వామి గుడిలోనే కూర్చుని అక్కడి వాళ్ళని సాగరసంగమం గురించి ఈసారి కొంచెం వివరంగా అడిగాను. అందరూ సముద్రం దగ్గరకి వెళ్ళే దారి గురించే చెప్తున్నారు (జాగ్రత్త లతో సహా) కానీ నదీ సాగర సంగమం గురించి అడుగుతూంటే సరిగా బదులివ్వడం లేదు. ఈ మధ్యనే ఏవో సంఘటనలు జరిగిఉంటాయి అనుకున్నాను వాళ్ల ధోరణి చూసి.</p>
<p>గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే ఒకాయన &#8220;ఆ ప్రదేశం చాలా దూరం అండి. మీరు అంతదూరం నడవలేరు. ఒకవేళ ఇప్పుడు బయలుదేరినా అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి పడొచ్చు&#8221; అంటున్నాడు. (అప్పుటికి సాయంకాలం అయిదు అవుతూ ఉంది). &#8216;ఫర్వాలేదండి. చూసి ఒచ్చేస్తాను&#8221; అని కొంచెం మాటలు కలిపినాక &#8216;నీలకంఠేశ్వర స్వామి గుడి దాటాక కుడి ప్రక్కకి వెళ్ళే సందులోకి తిరిగి తిన్నగా వెళ్ళిపోండి&#8221; అని అన్నాడు.</p>
<p>&#8216;ఈ మలుపు తిరగకకుండా తిన్నగా వెళ్ళడం వల్లే నదీ సాగరసంగమానికి బదులు బీచ్ కి వెళ్ళిపోయాను నిన్న&#8217; అనుకుంటూ ఆ మలుపు తిరిగి త్వరత్వరగా నడవడం ప్రారంభించాను. కనీసం చూసి వచ్చేద్దాం అనుకుంటూ.</p>
<p>ఓ అయిదు నిముషాలు నడవగానే ఎవరో ఒక యువకుడు బండి మీద వెళుతూ &#8220;ఎక్కడికి వెళుతున్నారండీ?&#8221; అని నన్ను పలకరించి &#8220;నాతో రండి&#8221; అంటూ తన బండి మీద ఎక్కించుకున్నాడు. కొంత దూరం తిన్నగా ప్రయాణించి తర్వాత రోడ్డు దిగి ఒక పేటలోకి ప్రవేశించి చాలా మలుపులు తిరిగి ఒకచోట ఆపి &#8220;ఇక్కడ నుంచి తిన్నగా వెళితే లైట్ హౌస్ వస్తుంది. దాని పక్క నుంచి వెళితే సాగరసంగమం వస్తుంది&#8221; అని నన్నుదించి వెళ్ళిపోయాడు.</p>
<p>ఓ పది నిమిషాలు నడిచి సాగరసంగమం చేరుకున్నాను. కుడివైపు చూస్తే అఖండ గోదావరి. ఎడమవైపు కొద్ది దూరంలోనే మహోధృతంగా వినిపిస్తున్న సముద్రఘోష. మేట మీదుగా నడుచుకుంటూ నది దగ్గరకి వెళ్ళాను. నలుగురైదుగురు తప్పితే అక్కడ ఎవరూ లేరు. ఒకరిద్దరు జాలర్లు మాత్రం తీరం వెంబడే కర్రలు పాతుతూ వాటికి వలలు చుట్టుకుంటున్నారు. నదిలో దిగి స్నానం చేయాలని ఇచ్ఛ. అక్కడే దిగితే అక్కడున్న నలుగురైదుగురూ వద్దని వారిస్తారేమోనని భయం వేసి మేట మీద ఏటవాలుగా కుడివైపు తీరం వెంబడే ఒక అరకిలోమీటరు నడుస్తూ కొన్ని చెట్లు, పొదలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ నది కొద్దిగా వంపు తిరిగి ఉండటం వల్ల ఆ ప్రదేశం ఎవరికీ కనిపించదు. అక్కడ నదిలోకి దిగడానికి తయారవుతుండగా ఒక జాలరి ఉన్నట్లుండి ప్రత్యక్షమై &#8216;జాగ్రత్తండోయ్&#8217; అంటూ కొద్ది దూరంలోనే తన వలను అల్లుకుంటూ కూర్చున్నాడు.</p>
<p>గోదావరిలోకి దిగాను. పైన విశాలమైన ఆకాశంలో అస్తమించడానికి ఉద్యుక్తుడవుతున్న సూర్యుడూ, చుట్టూ అఖండ గోదావరి, దూరంగా సముద్రపుఘోష. మనసంతా మౌనం.<br />
ఏదైనా నది &#8211; వంపు తిరిగి వెనక్కి రావడం (కాశీ దగ్గర గంగ, ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు దగ్గర గోదావరి), సాగరంలో లీనమై తన ఐడెంటిటీ కోల్పోవడం &#8211; నీ మూలస్థానంలో కలిసిపోవడం, నిన్ను నువ్వు కోల్పోవడం, అంతర్ముఖుడవడం &#8211; ఇలాంటి వాటికీ నదీ సాగర సంగమానికీ ఏదైనా సంబంధం ఉందేమో!</p>
<p>ఒక గంట సేపు నీళ్ళల్లో గడిపి బయటకి వచ్చాక ముందురోజు చూసిన బీచ్ మీదుగా వెళ్ళవచ్చుకదా అని అనిపించింది. గోదావరి గలగలలు వింటూ సముద్రం వైపుకి నడిచాను. సాగరసంగమాన్ని దర్శించి ఎడమ ప్రక్కకు తిరిగి మరో అరకిలోమీటర్ నడిచి బీచ్ పాయింట్ కి చేరుకున్నాను.</p>
<p>కొంతసేపు అక్కడ గడిపి నదీ సాగరసంగమాన్ని చూడగలిగానన్న తృప్తితో వెనక్కి మళ్ళాను.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=8949</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>దాసరి సుబ్రమణ్యం కథలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=8746</link>
		<comments>http://vaakili.com/patrika/?p=8746#comments</comments>
		<pubDate>Sat, 01 Aug 2015 03:05:41 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[రాజశేఖర్ పిడూరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=8746</guid>
		<description><![CDATA[<p>అజ్ఞాత రచయితగా ఎన్నో పిల్లల నవలలు రాసి చందమామలో కొడవటిగంటి కుటుంబరావు గారికి కుడిభుజంలా వ్యవహరిస్తూ యాభై ఏళ్ళ పాటు ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ దాదాపు అనామకంగా మరణించిన వ్యక్తి దాసరి సుబ్రమణ్యం గారు. &#8216;ఇన్ని దశాబ్దాలపాటు ఒకే ఇంట్లో అద్దెకి ఉన్నది భూమండలం మీద నేనొక్కడినేనేమో!&#8217; అనేవారుట.</p> <p>ఈయన రాసిన పెద్దల కథల సంకలనాన్ని వాహినీ బుక్ ట్రస్ట్ వారు 2011 లో దాసరి సుబ్రమణ్యం కథలు అనే పేరుతో తెచ్చారు. కథల్లో వాక్య నిర్మాణం చాలా చోట్ల అచ్చు గుద్దినట్లు కొ.కు గారిదే. ఇంక కథనం, శైలి, జాన్రా మాత్రం చాలా వరకు కొమ్మూరి సాంబశివరావు (ఉవ్వి) గారిదీ, కొంతవరకు కొ.కు గారిది. ఏ కథలోనూ ఎక్కడా ఒక్క పదం కూడా &#8216;నసగదు&#8217;. చురుకుగా కథను కదిలించే ఉవ్వి డిటెక్టివ్ రచనా శైలి. ఏదో ఒక చమక్కునీ, విషయాన్ని నూతనంగా చెప్పాలనే ధోరణినీ, ఆంధ్ర సమాజంలో అప్పుడప్పుడే ఆధునిక విద్యావంతులలో కలుగుతున్న నవీన భావజాలాన్నీ ఈ కథల్లో చూపించడానికి ప్రయత్నించారు దాసరి సుబ్రమణ్యం గారు. ఈ లక్షణం కొ.కు తొలి రచనల్లో కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. మరీ కొన్ని కథలు అయితే కొ.కు నే రాశారా అన్న భ్రమని కలుగచేస్తున్నాయి.</p> <p>&#8216;చందమామ&#8217; లోని కథన శైలి కనిపిస్తూనే ఉంది. కాబట్టి &#8216;ఏనుగుల్ని గుండెల మీద ఎక్కించుకున్నంత చందమామ ఎడిటింగ్ పని&#8217; లో ఈయనకీ ప్రముఖపాత్ర ఉండి ఉంటుంది.</p> <p>దా.సు. గారు కొన్ని కథల్ని మారు పేర్లతో రాశారు. వీటిల్లో కె.కె. దాసు, కామినీ కాంచన దాసు అన్న కలం పేర్లలోని కకారాలు కొ.కు ని గుర్తు చేసేందుకే పెట్టారా అని అనిపించక మానదు. ఇంకా సుశీలాదాసు, దాసు, సుజాత అన్న పేర్లు కూడా ఈయన వాడారు. ఈయన ఎంత &#8216;కీన్ ఐ&#8217; ఉన్న ఎడిటరో చెప్పడానికి ఒక ఉదాహరణ – తన కథల ప్రతులన్నింటినీ కారా మాష్టారు గారి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/08/dasari.jpg"><img class="alignleft size-full wp-image-8747" title="dasari" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/08/dasari.jpg" alt="" width="315" height="409" /></a><span style="font-size: 30px;">అ</span>జ్ఞాత రచయితగా ఎన్నో పిల్లల నవలలు రాసి చందమామలో కొడవటిగంటి కుటుంబరావు గారికి కుడిభుజంలా వ్యవహరిస్తూ యాభై ఏళ్ళ పాటు ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉంటూ దాదాపు అనామకంగా మరణించిన వ్యక్తి దాసరి సుబ్రమణ్యం గారు. &#8216;ఇన్ని దశాబ్దాలపాటు ఒకే ఇంట్లో అద్దెకి ఉన్నది భూమండలం మీద నేనొక్కడినేనేమో!&#8217; అనేవారుట.</p>
<p>ఈయన రాసిన పెద్దల కథల సంకలనాన్ని వాహినీ బుక్ ట్రస్ట్ వారు 2011 లో దాసరి సుబ్రమణ్యం కథలు అనే పేరుతో తెచ్చారు. కథల్లో వాక్య నిర్మాణం చాలా చోట్ల అచ్చు గుద్దినట్లు కొ.కు గారిదే. ఇంక కథనం, శైలి, జాన్రా మాత్రం చాలా వరకు కొమ్మూరి సాంబశివరావు (ఉవ్వి) గారిదీ, కొంతవరకు కొ.కు గారిది. ఏ కథలోనూ ఎక్కడా ఒక్క పదం కూడా &#8216;నసగదు&#8217;. చురుకుగా కథను కదిలించే ఉవ్వి డిటెక్టివ్ రచనా శైలి. ఏదో ఒక చమక్కునీ, విషయాన్ని నూతనంగా చెప్పాలనే ధోరణినీ, ఆంధ్ర సమాజంలో అప్పుడప్పుడే ఆధునిక విద్యావంతులలో కలుగుతున్న నవీన భావజాలాన్నీ ఈ కథల్లో చూపించడానికి ప్రయత్నించారు దాసరి సుబ్రమణ్యం గారు. ఈ లక్షణం కొ.కు తొలి రచనల్లో కూడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. మరీ కొన్ని కథలు అయితే కొ.కు నే రాశారా అన్న భ్రమని కలుగచేస్తున్నాయి.</p>
<p>&#8216;చందమామ&#8217; లోని కథన శైలి కనిపిస్తూనే ఉంది. కాబట్టి &#8216;ఏనుగుల్ని గుండెల మీద ఎక్కించుకున్నంత చందమామ ఎడిటింగ్ పని&#8217; లో ఈయనకీ ప్రముఖపాత్ర ఉండి ఉంటుంది.</p>
<p>దా.సు. గారు కొన్ని కథల్ని మారు పేర్లతో రాశారు. వీటిల్లో కె.కె. దాసు, కామినీ కాంచన దాసు అన్న కలం పేర్లలోని కకారాలు కొ.కు ని గుర్తు చేసేందుకే పెట్టారా అని అనిపించక మానదు. ఇంకా సుశీలాదాసు, దాసు, సుజాత అన్న పేర్లు కూడా ఈయన వాడారు. ఈయన ఎంత &#8216;కీన్ ఐ&#8217; ఉన్న ఎడిటరో చెప్పడానికి ఒక ఉదాహరణ – తన కథల ప్రతులన్నింటినీ కారా మాష్టారు గారి &#8216;కథానిలయం&#8217; కి పంపిస్తూ ఓ కథ పేరు అచ్చుప్రతిలో &#8216;శతృత్వం&#8217; అని ఉంటే దానిని &#8216;శత్రుత్వం&#8217; అని మార్చి పంపారట.</p>
<p>ఈ పుస్తకం లోని కథలకి సంబంధించి కొన్ని విశేషాలు -</p>
<p>&#8216;తాడు-బొంగరం&#8217; కథలోని శైలి ముమ్మూర్తులా కొ.కు గారిదిలానే ఉంది. కలం పేరు కామినీ కాంచనదాసు. కథలో యువతీయువకులిద్దరికీ పరిచయం కావడానికి థియేటర్ లో త్రిడి సినిమాని చూడటం అనే సందర్భాన్ని వాడుకున్నారు దా.సు. గారు &#8211; పంతొమ్మిది వందల నలభైల్లోనే! త్రిడి కళ్ళజోళ్ళు పెట్టుకుని సినిమా చూస్తూ, పిక్చర్లో కర్రో కత్తో విసరబడినప్పుడల్లా &#8216;ముందున్న అమ్మాయి సుందరి కుర్చీ పట్టుకోబోయి ఒకటి రెండు సార్లు ఆమె జడ అందిపుచ్చుకున్నాడట శేఖరం&#8217;. ఔరా, కథకుని చాతుర్యం! అని ఆధునిక పాఠకుడికి అనిపించకమానదు ఈ కథ చదువుతుంటే.</p>
<p>ఆ తర్వాత వచ్చే సంఘటనలు ముఖ్యంగా సుందరి ఇంట్లో ముసలాయన డైలాగులు కొ.కు కలం నుంచి ఊడిపడినట్లున్నాయి.</p>
<p>ఇక &#8216;లైంగికేయుడు&#8217; అన్న కథ చలం గారి మీద సెటైర్ లా ఉంది. కొ.కు కి, ఉవ్వికి చలం అంటే గిట్టనట్లే దా.సు. గారికి కూడా గిట్టనట్లుంది. చలం గారి పోలికలు తెలిసేలాగా ఓ రచయితని సృష్టించి ఆ పాత్రని ఓ ఇడియట్ లా చిత్రించారు దా.సు. గారు. కథ చివర్లో సింబాలిక్ గా ఆ రచయిత కలం పాళీ మొద్దుబారిపోయినట్లు చూపించారు. ఈ కథ రాసింది 1950 జనవరిలో. (అప్పుడే చలం గారు రమణాశ్రమానికి చేరుకుంటున్నారు).</p>
<p>&#8216;జర్నలిజం అంటే నాకు చర్మం ఒలవడం అని వినబడుతుంటుంది&#8217; అని ఒక పాత్ర చేత అనిపించడం బావుంది &#8211; అవ్యక్తం కథలో<br />
ఒక కథకి పేరు &#8216;కనువేదురు&#8217; అని పెట్టారు దా.సు. గారు. దీనికర్థం నిఘంటువులో &#8216;తొలి చూపులో కలిగే ఉన్మాదం లాంటి వలపు పిచ్చి&#8217; అని ఉంది.<br />
కళవెళపడటం, ప్రాణగొడ్డము లాంటి పదాలు కథల్లో చదవడం సరదాగా ఉంది. మొత్తం మీద ఆసక్తిగా చదివించే పుస్తకం.</p>
<p>దా.సు. గారి <a title="www.kathanilayam.com" href="http://www.kathanilayam.com" target="_blank">www.kathanilayam.com</a> కి వెళ్ళి &#8216;కథలు&#8217; శీర్షికలో రచయిత పేరుతో వెతికితే పన్నెండు కథలు దొరుకుతాయి. ఇవన్నీ తెలుగు స్వతంత్ర, అభిసారిక పత్రికలలో 1949 – 1951 మధ్య ప్రచురించబడినవి.</p>
<p style="text-align: center;">***** (*) *****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=8746</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>నా ఎఱుక</title>
		<link>http://vaakili.com/patrika/?p=8503</link>
		<comments>http://vaakili.com/patrika/?p=8503#comments</comments>
		<pubDate>Mon, 01 Jun 2015 02:12:18 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[రాజశేఖర్ పిడూరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=8503</guid>
		<description><![CDATA[గ్రాంథిక శైలిలో రాయబడ్డ పుస్తకాన్ని ఆధునిక పాఠకుడు సులభంగా చదువుకోవడానికి వీలుగా మోదుగుల రవికృష్ణగారు ఎంతో శ్రమకోర్చి పరిష్కరించి వేసిన ప్రతి ఇది. ఈ పుస్తకానికి రవికృష్ణగారు రాసిన ముందుమాట చదివితే పుస్తకం లోపలికి ప్రవేశించకుండా ఉండలేం.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/06/Ajjada_Adibhatla_Narayana_Dasu.jpg"><img class="alignleft size-full wp-image-8506" title="Ajjada_Adibhatla_Narayana_Dasu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/06/Ajjada_Adibhatla_Narayana_Dasu.jpg" alt="" width="220" height="303" /></a>ఆదిభట్ల నారాయణ దాసుగారు రాసిన తన జీవిత కథ &#8216;నా ఎఱుక&#8217;</p>
<p>గ్రాంథిక శైలిలో రాయబడ్డ పుస్తకాన్ని ఆధునిక పాఠకుడు సులభంగా చదువుకోవడానికి వీలుగా మోదుగుల రవికృష్ణగారు ఎంతో శ్రమకోర్చి పరిష్కరించి వేసిన ప్రతి ఇది. ఈ పుస్తకానికి రవికృష్ణగారు రాసిన ముందుమాట చదివితే పుస్తకం లోపలికి ప్రవేశించకుండా ఉండలేం.</p>
<p>1864-1945 మధ్యలో జీవించిన దాసుగారు ఆ నాటి వాతావరణాన్నిచక్కగా వర్ణించారు. అంతేగాక తనలో ఉన్న లోపాల్ని నిర్భయంగా వెళ్ళగక్కారు. కాబట్టి శ్రీ శ్రీ ఆద్యుడేం కాదు ఇలాంటి ఒప్పుకోళ్ళకు. ఇలాంటి ఎన్నో భ్రమల్ని బద్దలు కొట్టే గ్రంథం ఇది.<br />
దాసుగారి జననం దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జరిగింది. తనలో ఉన్న సంగీత సాహిత్య ప్రతిభ కాకుండా ఆయన బాల్యం గురించి చెప్పుకునేటప్పుడు కనిపించే ఒక ముఖ్యమైన విశేషం వాళ్ళ నాన్న గారు. ఈయన పరమ పరిశుద్ధుడై ఉండి ఉండాలి అని అనిపించక మానదు &#8211; దాసుగారు ఈయన్ని గురించి రాసిన ఒకటి రెండు సంఘటనలు చదివితే (నిప్పు కణిక కాలి మీద పడినా ఏమీ తొణక్కుండా &#8216;బ్రాహ్మణుడూ అగ్ని ఒకటే&#8217; అనడమూ, బావిలో గంగ పడడానికి మంత్రం పఠించడమూ &#8211; అంతకన్నా ముఖ్యం ఇలాంటి సంఘటనల పట్ల ఎలాంటి ఆర్భాటమూ లేకుండా సాక్షీమాత్రంగా ఉండడమూ).</p>
<p>పదమూడు పద్నాలుగేళ్ళకే సంగీతంలోనూ, సాహిత్యంలోనూ వీణ్ణి కొట్టేవాడు లేడురా అని అందరి చేతా అనిపించుకునేంత ప్రతిభ చూపించేరట దాసుగారు. కన్నమనాయుడు అనే ఆయన హరికథ చెప్తుంటే విని తను కూడా అలా ఆడి పాడి రంజింప చేయాలన్న కోర్కె కలిగి హరికథా ప్రక్రియ మీద పడ్డారు. ఇక ప్రతి ఉన్నతోద్యోగి వద్దా, జమిందారుల వద్దా అష్టావధానమో (గ్రీకు అక్షరాలతో సాముగరిడీలు, ఆల్జీబ్రా ప్రాబ్లమ్ సాల్వ్ చేయుట అనే అంశాలు కూడా దాసుగారు చేసిన అవధానాల్లో ఉన్నై &#8211; అంటే అప్పుడే ఈ ప్రక్రియలో వినూత్న ధోరణులు ప్రవేశ పెట్టారన్నమాట దాసుగారు), హరికథలను అప్పటికప్పుడు రాసి పాడటమో, ఆరేడు గంటల పాటు ఏకబిగిన అందరినీ స్పెల్ బౌండ్ చేస్తూ కథాకాలక్షేపం చేయడమో చేసి కట్నాలు లాగడం (నగదు, ఇతర బహుమతులు) లాంటి సంఘటనలను వర్ణించారు ఈ పుస్తకంలో. దాంతో పాటే చిన్న గురుడికీ (అంటే దేశవాళీ నల్లమందు మత్తు) తర్వాత క్రమంగా పెద్ద గురుడికీ (అంటే సీమ సరుకు) అలవాటు పడ్డారు. నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే అలవాటైన ఈ విపరీతాలకు తోడు వేశ్యాలంపటం. ఇవేవీ దాచకుండా 1940 ల్లోనే ఇంత నిర్భయంగా తన జీవిత చరిత్రని రాసుకోవడం ఒక రకంగా గొప్ప విషయమే. వీటన్నింటినీ యవ్వనపు &#8220;శాఖామృగచేష్టలు&#8221; గా అభివర్ణించుకున్నారు దాసుగారు.</p>
<p>ఆ కాలంలో ఉన్నత వర్గాల (జమిందార్లు, ఉన్నతోద్యోగులు) వద్ద సాంప్రదాయికంగా కళాప్రదర్శన చేసే వారికి లేని సౌలభ్యం దాసుగారి వద్ద ఒకటి (సంగీత సాహిత్యాలలో తనకున్న అత్యుత్తమ ప్రతిభావ్యుత్పత్తులు కాక) ఉండేదని మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదేమిటంటే ఇంగ్లీషులో కూడా కవిత్వం చెప్పగలగడం. తను తెలుగులో, సంస్కృతంలో పాడిన వాటిని తక్షణమే ఇంగ్లీషులోకి కవితాత్మకంగా మార్చగలిగే ప్రతిభ దాసుగారికి ఉండేది. తెలుగు తెలియని మైసూరు మహారాజా గార్ల లాంటి వారి వద్ద తన తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషులోకి వెంటనే అనువదించి చెప్పగలగడం వల్ల మిక్కిలిగా కీర్తి, ధనమూ సంపాదించారు.</p>
<p>అయినా తను చేసేదంతా రంజింప చేయడమేననీ, &#8216;అసలు&#8217; కాదని అంతర్గతంగా దాసుగారికి అనిపించిందేమో! &#8211; ఒకచోట &#8216;రూపమునకెల్కగాని చేయునవి పందికొక్కు చేష్టలన్నట్లు విశ్వాసమునకు తగు వైరాగ్యమబ్బలేదు. తత్త్వజ్ఞానమునేమాత్రమును లేదు&#8217; అని రాసుకున్నారు.</p>
<p>ఇంకా ఒకళ్ళ వద్ద ఉద్యోగం చెయ్యలేని తన ధోరణిని, స్వేచ్ఛాప్రవృత్తిని వివరిస్తూ &#8211; &#8216;విహంగన్యాయమున బ్రతుక నిశ్చయించితిగాని యొరుల నౌకరీసేయునుద్దేశము నాకెన్నటికినీ లేదు. మరియూ కొండలు, నదులు, వనములు, జంతుజాలములు, సూర్యాదిగ్రహములు, ప్రకృతి మహిమయూ చూసి ఆనందించుటయు, జనుల మంచి చెడ్దలు కనిపెట్టి తర్కించుటయు, తరచుగా గురునివశమున యదేచ్ఛాసంచారము సేయుచుంట నా వృత్తి&#8217; అన్నారు.</p>
<p>రంజింప చేసే ప్రతిభే కాకుండా దాసుగారిలో పాండితీప్రకర్షకి కొదవ లేదని తెలుస్తుంది. కా్త్వర్థక ప్రయోగంలో భిన్న కర్తృకం ఉండేటట్లు ఏదో పద్యం చెప్పారట దాసుగారు విజయనగరం రాజా వారి ముందు. (ప్రధాన క్రియ ముందు వాడే అసమాపక క్రియా రూపాలు &#8211; చేసి, చూసి, నిలబడి లాంటివాటిని కా్త్వర్థక క్రియలు అంటారు. ఇవి ప్రయోగించబడిన వాక్యంలో క్రియలన్నింటికీ ఆశ్రయంగా ఉండే కర్త ఒకరే ఉండాలనేది బాల వ్యాకరణంలో ప్రముఖ సూత్రం. నేను పాలు తాగి వాడు నిద్ర పోయాడు లాంటి వాక్యాలు వ్యాకరణ సమ్మతాలు కాదు అని చెప్పేది ఈ సూత్రం).</p>
<p>&#8216;మీరు చేసిన ప్రయోగం తప్పు అని ఒప్పుకోండి లేదా ప్రమాణమైనా చూపండి&#8217; అని రాజావారు అంటే ఆ రాత్రి భారతమంతా వెతికి భిన్న కర్తృక కా్త్వర్థక ప్రయోగానికి – &#8216;రాహుకంఠముదెగి దేహము ధరణిబడియె&#8217; అనే దాన్ని ప్రమాణంగా చూపించారట.<br />
దాసుగారు &#8216;శంభో&#8217; అంటే విజయనగరమంతా ప్రతిధ్వనించడం, కాళ్ళతో చేతులతో తలతో ఐదు భిన్న తాళాలను ఏకకాలంలో వేయగలగడం లాంటి విషయాలు చాలా ప్రసిద్ధాలు కాని కా్త్వర్థక ప్రయోగాల గురించి కూడా పండితుల్ని ఎదుర్కొనే సత్తా, పాండితీవైదగ్ధ్యం ఉందన్న విషయం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. దాసుగారి దగ్గు కూడా లయబద్ధమే అంటున్నారు శంకర శ్రీరామారావు అనే ఆయన తన వ్యాసంలో (అనుబంధంలో ఇచ్చారు).</p>
<p>(కా్త్వర్థకాలు భిన్న కర్తృకాలను సహించవు అనే సూత్రానికి చాలానే మినహాయింపులని చేకూరి రామారావు గారు తన తెలుగు వాక్యం అనే పుస్తకంలో సంశ్లిష్ట వాక్యాలు అనే రెండో అధ్యాయంలో విపులంగా చర్చించి ఇచ్చారు &#8211; గొర్రెలని తినేవాడు పోయి బర్రెలని తినేవాడు వచ్చాడు, ఈ రాష్ట్రంలో కమ్యూనిష్టులు గెలిచి ఆ రాష్ట్రంలో కాంగ్రెసోళ్ళు గెలిచారు లాంటివి. ఆసక్తి కలవారు చేరా పుస్తకం చూడవచ్చు)</p>
<p>ముప్ఫై ఏళ్ళు దాటాక ఇక తన సంసారాన్నీ, దాంతో పాటే సంప్రదాయాన్నీ, తనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఫ్యూడల్ సంస్కృతినీ కాపాడుకోవాల్సిన అగత్యం దాసుగారికి కలిగినట్లు కనపడుతుంది. పోకిరీ వేషాలు (సానులు, మత్తు మందులు వగైరా) కొంత మానినట్లు దాంతో పాటే హిపోక్రిట్ గా మారినట్లు అనిపిస్తుంది. కొంత వయసొచ్చాక ఆయన – &#8216;సంగీత విద్యకలవానికి దుష్ప్రవర్తన సహజం&#8217;, &#8216;సంసార స్త్రీలకు భోగం స్త్రీలకిమల్లే సంగీతం నేర్పకూడదు&#8217; లాంటి భావాలు వెలిబుచ్చారు.</p>
<p>తను శారీరక భోగాలన్నీ బాగా అనుభవించేసి కొంత వేడి తగ్గాక ఛాందస భావాలతో దేశోద్ధరణ చేసే భావజాలం అనిపిస్తుంది ఇదంతా. అట్లానే వితంతు వివాహాల్ని, స్త్రీ విద్యను, కందుకూరి వీరేశలింగం గారి కార్యక్రమాల్ని వ్యతిరేకించారు దాసుగారు.</p>
<p>దాసుగారి కన్నా రెండేళ్ళు ముందు పుట్టి దాసుగారి కన్నా ముప్ఫై ఏళ్ళ ముందే మరణించిన గురజాడకీ ఈయనకీ ఎంత తేడా? అనిపిస్తుంది.</p>
<p>ఎన్ని దురలవాట్లు ఉన్నా, డబ్బు కోసం ఉద్యోగుల వెంటా ప్రభువుల వెంటా పడినా దాసుగారిలో ఉన్న ఒక అమోఘమైన తేజస్సు, శక్తి వల్ల అందరూ ఆయనకి దాసోహం అయ్యారు అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. ఒక మునసబు గారితో దాసుగారి సంభాషణ దీన్ని పట్టిస్తుంది.</p>
<p>ఈ పుస్తకంలో ఆసక్తి కలిగించే పదాలు, ప్రస్తావించబడ్డ విశేషాలు, సంఘటనలు &#8230;.</p>
<p>1. పిడకలు ఎత్తుకునే అమ్మాయికి దాసుగారు &#8216;కరీషకరండవాహిని&#8217; అనే పదం వాడారు (రాజులకి తాంబూలం కట్టి ఇచ్చే అడపకత్తెను తాంబూలకరండవాహిని అన్నట్లుగా). ఏదో పితూరి వచ్చి కరీషకరండవాహినితో కలబడ్డారట దాసుగారొకసారి!</p>
<p>2. గురజాడ తన డైరీలలో ప్రస్తావించిన మద్రాసు ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదం గురించి దాసుగారు కూడా ఒకచోట ప్రస్తావించారు. అట్లానే బెంగుళూరు లాల్ బాగ్ లో పుష్పప్రదర్శనని చూశారట దాసుగారు.</p>
<p>3. కించిద్భోగోభవిష్యతి కథ – నారదుడు ఓ పుర్రెనెత్తుకుని (సముద్రతీరంలో) తన తాత దాని నుదుటన రాసిన కష్టాలు, సుఖాలు చదివి చివర్లో &#8216;చనిపోయిన కొన్నేళ్ళకు అనుకోని అపూర్వమైన అదృష్టం పడుతుంది&#8217; అన్న వాక్యం చదివి ఆశ్చర్యపోయాట్ట. ఇదేంటో తెలుసుకుందామని బ్రహ్మలోకం వెళ్ళి తాతగారిని ప్రశ్నిస్తే &#8220;ఎంత తలక్రిందులుగా తపస్సు చేసినా లభ్యం కాని బ్రహ్మలోక ప్రవేశం ఈ వ్యక్తి పుర్రెకు లభించింది కదా! అదే ఆ అదృష్టం అన్నాట్ట.</p>
<p>4. ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా &#8211; అంటే ఈ జన్మలో నేర్వకుండానే పూర్వజన్మ నించి పట్టుబడ్డ విద్యలట. కుమార సంభవం లో పార్వతి గురించి కాళిదాసు అన్న ఈ మాటను తనకి దాసుగారు అన్వయించుకున్నారు. నిజమే కదా! అని అనిపించక మానదు.</p>
<p>5. ఏతచ్చిత్ర పటం భాతి&#8230;. &#8211; పటంలో ఉన్న పచ్చిక బయలు కళ్ళకు ఎలా తృప్తినిస్తుందో విద్వాంసులు కూడా దర్శనమాత్రం చేత సంతోషాన్ని కలిగిస్తారు.</p>
<p>6. వేసవికాలం గురించి దాసుగారి కవితాత్మక వాక్యం &#8211; &#8216;అగ్ని తూలుతున్నట్లున్న ఎండ&#8217; చదివితే శ్రీశ్రీ వాక్యాలు &#8211; ఎండ తీవ్రంగా ఉపన్యసిస్తోంది, మధ్యాహ్నపు మండుటెండ నోటికొచ్చినట్లు పేలుతోంది&#8217; లాంటివి గుర్తుకొస్తాయి.</p>
<p>7. అచ్చతెలుగు మాటలు వాడటంలో ఘనుడనిపించుకున్న దాసుగారు రిహార్సల్స్ కి &#8216;శుష్కేష్టి&#8217; అన్న సంస్కృత పదం వాడటం ఆశ్చర్యం అనిపిస్తుంది &#8211; &#8216;ఒద్దికలు&#8217; అన్న తెలుగు మాట ఉండగా.</p>
<p>ఈ పుస్తకం వేయడంలో రవికృష్ణ గారి కృషి అభినందనీయం. కొన్ని సందేహాలు, సూచనలు &#8230;.</p>
<p>1. దాసుగారు చేసిన ప్రయాణాలు, కలుసుకున్న ప్రభువులు, పొందిన అనుభవాలు &#8211; వీటి గురించి ఆయన రాసుకున్న ధోరణి చూస్తే ఆయనలో సహజంగా కొంత పెడసరితనం, మొండితనం, తెంపరితనం ఉన్నాయనిపిస్తుంది. ఈ విషయాన్ని చక్కగా ముందుమాట లో నిదానించారు మోదుగుల రవికృష్ణగారు. కాని దాసుగారు తన చెడ్డ అలవాట్లన్నింటిని ముప్ఫై ఏళ్ళకే వదుల్చుకున్నారని తేల్చేశారు. తిరుమల రామచంద్రగారి ఆత్మకథ – &#8216;హంపీ నుంచి హరప్పాదాకా&#8217; లో &#8211; నెల్లూరు మూలపేట వేదపాఠశాలలో చదువుకుంటున్న సమయంలో దాసుగారి హరికథా కాలక్షేపానికి వినాయక హాలుకి వెళ్ళాననీ, ఆరోజు దాసుగారు వేదిక మీదకి వచ్చి &#8216;వ్యత్యస్త పాదారవిందా&#8217; అని అంటూ తూలి విరుచుకు పడిపోయారని టిక్కెట్లు కొని వచ్చిన జనం పెద్ద గోల చేశారని రాసుకొచ్చారు. ఈ సంఘటన తిరుమల రామచంద్రగారి కథనం ప్రకారం 1932-34 మధ్య జరిగింది. అంటే దాసుగారికి దాదాపు డెబ్భై ఏళ్ళన్నమాట. కాబట్టి ముప్ఫై ఏళ్ళకే దురలవాట్లన్నింటిని వదుల్చుకున్నారన్న విషయం సరికాదనిపిస్తుంది.</p>
<p>2. బందరులో దాసుగారికిచ్చిన వీడ్కోలు సభలో ఒకాయన బొంబాయిలోని &#8216;బ్రాడ్లా&#8217; గారి గురించి ప్రస్తావించారు. ఈ బ్రాడ్లా ఎవరనే వివరం అధోజ్ఞాపికలో ఇస్తే బాగుండేది.</p>
<p>3. మత్తుమందులు, శృంగారపిపాసలతో సలసల మరిగిపోతూ తన సంగీత సాహిత్యాలతో ఉర్రూతలూగించగల దాసుగారు పరమ పవిత్రమైన హరికథలు చెప్పడం మనస్సుకి కష్టంగా తోచి ఒక ప్రముఖ వెలయాలు సలహా ఇచ్చిందట &#8211; &#8216;మీకు ఉద్యోగమే ఉచితం, సానిపాప వలె ఆడి జీవించుట కాదు. పరమ పవిత్రులు చేయాల్సిన హరికథావృత్తికి మీ వంటి శృంగార శేఖరులు తగరు&#8217; అని. దానికి ఆదిభట్ల గారి జవాబు &#8220;కొలనునుండి కొండకేగిన కలహంసది తప్పుగాని కాకిది తప్పా?” &#8211; ఈ జవాబు కొంచెం కన్ఫూ్యజింగ్ గా ఉంది. అంటే నిజానికి తాను కలహంసలాగా కనిపించే కాకినని దాసుగారి ఉద్దేశమా? నేను కాకి వంటి వాడినే, నాకు ఈ రంజింపచేసే వృత్తే (కొండ మీద కాకిలాగా తిరగడం) విధాయకం అని దాసుగారు అంటున్నారా? అన్న సందేహం వస్తుంది. అలా చటుక్కున అనేసే వ్యక్తి కాదు అని కూడా అనిపిస్తుంది. దీనికి కొంచెం వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.</p>
<p>సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఆనాటి సమాజపు ధోరణులు తెలుసుకోవాలనుకున్నవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=8503</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
	</channel>
</rss>
