<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; శిఖామణి</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%B6%E0%B0%BF%E0%B0%96%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>మార్మిక పద్య మధుపాయి: భూమయ్య</title>
		<link>http://vaakili.com/patrika/?p=3684</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3684#comments</comments>
		<pubDate>Thu, 08 Aug 2013 19:38:49 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[శిఖామణి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3684</guid>
		<description><![CDATA[<p>1994లో అనుకుంటాను భూమయ్యగారి మొట్ట మొదటి పద్య కవితా సంపుటి ‘వేయి నదుల వెలుగు’ వారు పంపగా అందుకున్నాను. మంచి పద్యం ఎక్కడ కనపడ్డా కళ్ళ కద్దుకొని చదువుకునే నాకు ‘వేయి నదుల వెలుగు’లో కొత్త కాంతి లోకాలు కనిపించాయి. అప్పటికి నేను రాజమండ్రి సాహిత్య పీఠం లో బదిలీ పై పనిచేస్తున్నాను. తెలుగు పాదయారామం అనదగివ బేతవోలు రామబ్రహ్మం గారు పద్య కవిత్వానికి ‘క్రొత్త గోదావరి’ పరవళ్ళు నేర్పిస్తూ మరొక పక్క అవధానాలను తన కనుసన్నలతో శాసిస్తున్న కాలం. మరొక పక్క ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్. ఒక రకంగా పద్యానికి, వచన కవిత్వానికీ ఆరోగ్యకరమైన పోటీ వున్న కాలం. ఎవరు ముందు కవిత వినిపిస్తే ఆ రోజు వారికే అగ్ర తాంబూలం. అదీ ఘాటు పరిమళాల ఎక్ సౌ బీస్ జర్దాపాన్ తో. ఆ వాతావరణంలో చదువుకున్నాను భూమయ్యగారి పద్యాలు. దానికి రామబ్రహ్మంగారి ఆముఖం వుంది. వారూ సముఖంలోనే వున్నారు. రస స్వాదనకు ఇంకేం కొదవ. ఎక్కడో లోపల్లోపల ఆ కావ్య వస్తువుతో తెలియకుండానే తాదాత్మ్యం చెందడం జరిగింది. అప్పటికి భూమయ్య గారిని ప్రత్యక్షంగా చూసి వుండలేదు. అప్పటికి అయన ఎంత వయసు వారో కూడా తెలియదు. అయినా సాహసం చేసి ఆయనకు ఉత్తరం రాస్తూ ఇంత చిన్నవయసులో ఈ మార్మికత్వాన్ని ఎందుకు తలకెత్తుకున్నారు? అని రాసినట్టు గుర్తు. ఆ తర్వాత ఆయన ఇతర కావ్యాలు చదివినప్పుడు, ఆయన్ను చూసినపుడు, దగ్గరగా కలసి పనిచేసిననప్పుడు అనిపించింది, ఒక కవి తనది కానిది తప్ప ఇతరం ఏది రాయలేడని, ఇతరేతర కారణాల వల్ల రాసినా దాని ఆయుష్షు అత్యల్పమనీ -</p> <p>సాధారణంగా లోకంలో ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది విశ్వ విద్యాలయాలు, పరిశోధనా రంగం సృజన కారులకు బద్ధ శత్రువులనీ. ఈ అభిప్రాయాన్ని పూర్వ పక్షం చేసిన కవులలో ప్రధమ పంక్తి లోని వారు భూమయ్య. దాదాపు దశాబ్దన్నర కాలంగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/08/bhumaiah.jpg"><img class="alignleft size-full wp-image-3686" title="bhumaiah" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/08/bhumaiah.jpg" alt="" width="149" height="214" /></a>1994లో అనుకుంటాను భూమయ్యగారి మొట్ట మొదటి పద్య కవితా సంపుటి ‘వేయి నదుల వెలుగు’ వారు పంపగా అందుకున్నాను. మంచి పద్యం ఎక్కడ కనపడ్డా కళ్ళ కద్దుకొని చదువుకునే నాకు ‘వేయి నదుల వెలుగు’లో కొత్త కాంతి లోకాలు కనిపించాయి. అప్పటికి నేను రాజమండ్రి సాహిత్య పీఠం లో బదిలీ పై పనిచేస్తున్నాను. తెలుగు పాదయారామం అనదగివ బేతవోలు రామబ్రహ్మం గారు పద్య కవిత్వానికి ‘క్రొత్త గోదావరి’ పరవళ్ళు నేర్పిస్తూ మరొక పక్క అవధానాలను తన కనుసన్నలతో శాసిస్తున్న కాలం. మరొక పక్క ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్. ఒక రకంగా పద్యానికి, వచన కవిత్వానికీ ఆరోగ్యకరమైన పోటీ వున్న కాలం. ఎవరు ముందు కవిత వినిపిస్తే ఆ రోజు వారికే అగ్ర తాంబూలం. అదీ ఘాటు పరిమళాల ఎక్ సౌ బీస్ జర్దాపాన్ తో. ఆ వాతావరణంలో చదువుకున్నాను భూమయ్యగారి పద్యాలు. దానికి రామబ్రహ్మంగారి ఆముఖం వుంది. వారూ సముఖంలోనే వున్నారు. రస స్వాదనకు ఇంకేం కొదవ. ఎక్కడో లోపల్లోపల ఆ కావ్య వస్తువుతో తెలియకుండానే తాదాత్మ్యం చెందడం జరిగింది. అప్పటికి భూమయ్య గారిని ప్రత్యక్షంగా చూసి వుండలేదు. అప్పటికి అయన ఎంత వయసు వారో కూడా తెలియదు. అయినా సాహసం చేసి ఆయనకు ఉత్తరం రాస్తూ ఇంత చిన్నవయసులో ఈ మార్మికత్వాన్ని ఎందుకు తలకెత్తుకున్నారు? అని రాసినట్టు గుర్తు. ఆ తర్వాత ఆయన ఇతర కావ్యాలు చదివినప్పుడు, ఆయన్ను చూసినపుడు, దగ్గరగా కలసి పనిచేసిననప్పుడు అనిపించింది, ఒక కవి తనది కానిది తప్ప ఇతరం ఏది రాయలేడని, ఇతరేతర కారణాల వల్ల రాసినా దాని ఆయుష్షు అత్యల్పమనీ -</p>
<p>సాధారణంగా లోకంలో ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది విశ్వ విద్యాలయాలు, పరిశోధనా రంగం సృజన కారులకు బద్ధ శత్రువులనీ. ఈ అభిప్రాయాన్ని పూర్వ పక్షం చేసిన కవులలో ప్రధమ పంక్తి లోని వారు భూమయ్య. దాదాపు దశాబ్దన్నర కాలంగా పరిశోధనా వాల్మీకంలో ఒక మహా రుషిలా గడిపారు భూమయ్య. మరీ ముఖ్యంగా భావ కవితా యుగపు మూల స్థంభాలలో ఒకరైన నాయని సుబ్బారావు గారి కృతుల మీద డాక్టరేటు పట్టా కోసం 1981లో ఆయన రూపొందించిన గ్రంధం ఒక రకంగా నాయని వాజ్మయ సర్వస్వం వంటిది. ఆ దాహం ఇంకా తీరకపోతే 2000 సం. ‘నాయనితో కాసేపు’ వారు ముచ్చటించి ఆ ముచ్చట్లను మనకు గ్రంథ రూపంలో అందించారు. ఆ కాలంలో కట్ట మంచి, ఉన్నవ, విశ్వనాథ, మధునాపంతుల, సినారె, వేమన వంటి వారి విలువైన పరిశోధన, విమర్శన గ్రంథాలు అందించారు. ఇంక చాలు అనకున్నా రేమో! కుబుసం విడిచిన సర్పంలా కావ్య రంగం లోకి ప్రవేశించారు. ఇన్నాళ్ళుగా ఎంత సృజనను లోలోపల అణచుకున్నారో అదిమి పట్టుకున్నారో! ఆకాశ గంగలా ఆయన కలం నుండి కావ్యగంగ వెల్లువెత్తింది. కురచకురచగా పెరుగుతున్న పద్య కేదారాలను సస్యశ్యామలం చేసింది.</p>
<p>మళ్ళీ మొదటికొస్తే, ఆయన మొదటి పుస్తకం చదివి ఎందుకు మార్మికతను తలకెత్తుకున్నారు అన్నమాటకు వస్తే, ఇలాంటి అభిప్రాయంలో అపుడు చాలా మంది వున్నారని తెలిసింది. అందుకు ఉదాహరణగా వారి రెండవ కావ్యం &#8220;వెలుగు నగల హంస&#8221;కు రామబ్రహ్మంగారు రాసిన ఈ మాటలు చదవండి “మొదట్లో నేనూ అనుమానించాను. కొత్త పిచ్చి కాదు గదా అని సంశయించాను. ఆ దృష్టితోనే అక్షరాక్షరాలను విన్నాను. కన్నాను. కాదని తేల్చుకున్నాను. ఇందులోనూ అదే కవితా వస్తువు. అమ్మవారి పూనకం నుండి భూమయ్యగారి అంతఃచేతనా విడివడలేదు.” 1995లో రామ బ్రహ్మంగారు అన్న మాటలు భూమయ్యగారి విషయంలో నానాటికి బలపడ్డాయే కానీ, తగ్గలేదు. ఒక్క జ్వలిత కౌసల్య తప్ప ఆయన సృజన యావత్తు ‘అమ్మ’ కేంద్రం చుట్టూ తా సాగిందే. ఈ అమ్మ మామూలూ అమ్మ కాదు. పోతనగారన్నట్టు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆయమ్మను పోతన్న ఏమి కోరుకున్నాడు! మహాత్వకవిత్వ పటుత్వ సంపదలు. పోతన్నలాగే ఈ భూమన్న కూడా అలాంటి కవిత్వ సంపదనే కోరుకున్నాడు. అందుకే తెలుగు పద్య కవిత్వానికి ఈ వేయినదుల వెలుగులూ, వెలుగు నగల హంసలూ, అగ్ని వృక్షాలూ, చలువ పందిళ్ళూనూ.</p>
<p><strong><em>బ్రహ్మ లేడు, విష్ణువు లేడు పరమ శివుడు<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/08/velugunagalahamsa.jpg"><img class="alignright  wp-image-3687" title="velugunagalahamsa" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/08/velugunagalahamsa.jpg" alt="" width="241" height="358" /></a></em></strong><br />
<strong><em> లేడు వారి లోకము లేవి లేవు దేవి!</em></strong><br />
<strong><em> అందరికి ముందు నీవుండి, ఆత్మ దలచి</em></strong><br />
<strong><em> సృష్టి జేసితి లోకాలన్ని మాకు.</em></strong></p>
<p>ఈ దేవీ తత్వానికి మూలం కొంత ఉపనిషద్వాణి కాగా మరికొంత లలితాసహస్ర నామాలలో అనంతంగా సాగిన దేవీ విరాడ్రూప వర్ణన సరే! ఇంతవరకూ బాగుంది. మరి ఈ కవిత్వానికి ఇంత మృదుత్వం, మెత్తదనం ఎలా అబ్బింది. మామూలుగా అయితే కవి గొప్పదైన తన ప్రతిభా విశేషాల చేత సాధించాడు అంటారు విమర్శకులు. కాని కవిగారేమంటున్నారు ఆ మెత్తదనపు గొప్పదనం అంతా తనది కాదంటున్నాడు. ఆయమ్మదే అంటున్నాడు చూడండి.</p>
<p><strong><em>గుడికి వచ్చిన యపుడెను కోరకుండ</em></strong><br />
<strong><em> ఏమి పూవు నే దేవి! నాకిచ్చినావు</em></strong><br />
<strong><em> నీ ప్రసాదమనుచు, ఇది నీ హృదయము</em></strong><br />
<strong><em> పండి రాల్చిన మెత్తని పద్యమేమో!</em></strong></p>
<p>ఇదీ రహస్యం. ఆమె గారి హృదయం పండిరాల్చిన మెత్తని పద్యాలు ఇవి. అందులో కాఠిన్యానికి ఇంకోచోటెక్కడ. ఈ పద్యం కవి సంస్కారాన్ని సూచిస్తుంది. ఈ సంస్కారం వారసత్వం గా వస్తున్నదే అని నన్నయ్యను చదివినా, పోతన్నను పలకరించినా తెలుస్తుంది. మెత్తగా రాయడమే కాదు అంతకంటే సుతిమెత్తగా పద్యాన్ని ఆలపించగలరు భోమయ్య. ఆయన పద్యాలు పాడేటప్పుడు మనం కళ్ళు మూసుకొని వింటే ఎక్కడో లోపల్నుండి సన్నగా జీరగా జీవునివేదన వినిపిస్తుంది. తెలుగు నాట మార్మిక కవిత్వం కొత్త గాదు. కాకపొతే అది ఆధునిక వచన కవిత్వంలో విస్తరించినంతగా పద్య కవిత్వంలో విస్తరించలేదు. రాసినా ఒకటీ అరా తప్ప ఇలా కావ్య పరంపరగా వెలువరించిన వారు అరుదు. ఆ ఘనత ఖచ్చితంగా భూమయ్యగారికే దక్కుతుంది. తన క్రమ పరిణామ గతిని కవిగారే ఈ పద్యంలో ఇలా చెబుతున్నారు. వినండి.</p>
<p><strong><em>మొన్నటి వరకు భూమిలో నున్న బీజ</em></strong><br />
<strong><em> మునయి దేవి, వర్షింప మొల్కనయి, చిగురు</em></strong><br />
<strong><em> లను తొడిగి తొడిగి ఒక చెట్టునయినాను</em></strong><br />
<strong><em> వేల పరిమళమ్ముల మూట విప్పినాను.</em></strong></p>
<p>చాలా పద్యాలకు మల్లె ఈ పద్యం లోను ఒక విశేషముంది. ఈ కావ్యాల అంతటా ‘దేవి’ శబ్దం సంభోదవాచకమే! అయితే పై పద్యంలో దేవి “శబ్దం వర్షానికి ముందు చేరడం వలన అది మామూలు వర్షం కాక, దేవి కరుణా వర్షంగా మారింది. అందుకే బీజం మొలకెత్తి , చిగురాకులు తొడిగి, మహా వృక్షంలా వేల పరిమళాలను వెదజల్లింది. ఇదీ ఆ దేవీకృతమే! తాను కేవలం నిమిత్త మాత్రం. కవి ఎంతటి శాక్తేయుడైనప్పటికి సమాజ రుగ్మతల పట్ల అతనికి స్పష్టమైన ఎరుక వుంది. జరుగుతున్న హింసపట్ల ఆవేదన వుంది. ఆ ఆవేదనకు అక్షర రూపం ఈపద్యం.</p>
<p><em><strong>“పరిమళములె జాల్వారు ఈపాలకొలను</strong></em><br />
<em><strong> నందు దేవి, రక్త పుటలలివేమి</strong></em><br />
<em><strong> హంసకాలికి మెత్తనైనట్టి చిన్ని</strong></em><br />
<em><strong> కత్తి కట్టి కనిపించు నిన్నటి గజ్జేలేదు”</strong></em></p>
<p>పౌరుషవంతమైన కోడిపుంజు కాళ్లకు కత్తులు కట్టడం పల్నాటి వీర చరిత్ర నమోదు చేసింది. కానీ శాంతానికి, సౌకుమార్యానికీ, క్షీరనీరన్యాయానికి పర్యాయ పదమైన హంస కాలికి గజ్జె స్థానంలో ఎవరో కత్తులు కట్టారనడం లోకం ఎంత హింసలో మునిగితేలుతుందో చెప్పే పదబంధం &#8211; ఈ కవితా వృక్షాలకు పూచినా మార్మిక పద పుష్పాల మధువును గ్రోలే మధుపాయి భూమయ్యగారు.</p>
<p><em><strong>పద్యమే మావియై దేవి! బ్రతుకు కనక</strong></em><br />
<em><strong> కోకిలలు వచ్చి పాటల గ్రుమ్మరించే</strong></em><br />
<em><strong> చిలుక లిటే వచ్చి ఫలముల పలకరించే</strong></em><br />
<em><strong> పథికుడొకడు రసానందుడై పరిమళించె</strong></em></p>
<p>కవి లోకానికి గొప్ప మాట చెబుతున్నాడు. కవి అనే వాడు, కావ్యం అనేది ఒక పచ్చని చెట్టులా వుండాలని, అప్పుడే కోకిలల, చిలకలు వంటి జీవనోత్సాహ సంరంభం ఆ చెట్టును ఆశ్రయించి వుంటుంది. భూమయ్యగారు పథికుడొకడు రసానందుడై పరిమళించాడు అన్నారు గానీ అది ఏకవచనం నుండి ప్రస్తుతం బహువనానికి విస్తరించింది. ఇప్పుడు ఆ పథికుడొకడు పదివేల మంది పథికులైనారు. అయితే ఆ రసానందం కేవల రసానందం కాదు. మన అలంకారికులు చెప్పిన రసోవైస లాంటి రసయోగం, రససిద్ధి. అందుకు మీరూ సిద్దమేనా?</p>
<p>(డా. అనుమాండ్ల భూమయ్య 65వ సంవంత్సరం లోకి అడిగిడుతున్న సందర్భంగా)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3684</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>మాయమైపోయిన నెమలీక</title>
		<link>http://vaakili.com/patrika/?p=3425</link>
		<comments>http://vaakili.com/patrika/?p=3425#comments</comments>
		<pubDate>Thu, 18 Jul 2013 18:48:47 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[తలపోత]]></category>
		<category><![CDATA[శిఖామణి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=3425</guid>
		<description><![CDATA[<p>సాహిత్య పరంగా నాకో చెడ్డ అలవాటుంది . అదేమిటంటే కవులు , రచయితల చిరునామాలు రాసి పెట్టుకున్న డైరీ ని ఎప్పుడు తిరగేసినా అప్పటి వరకూ చనిపోయిన వాళ్ళ చిరునామాలపై ఇంటూ గీతలు కొట్టడం. మొన్నటికి మొన్న కె.ఎస్. రమణ గారి చిరునామా కనబడితే ఎందుకో కొట్టి వేయబుద్ది కాలెదు. నా డైరీనిండా ఇలాంటివి ఎన్నో! వాటిలో కాల ధర్మం చెందిన జి.వి.ఎస్., నాగ భైరవ, తొక్కుడు బండ కృష్ణముర్తి, ఇస్మాయిల్, స్మైల్, అజంతా,మో , కొత్తపల్లి, వడలి మందేశ్వరరావు, జ్ఞానానంద కవి, సదాశివ వంటి పెద్దలూ, అకాల ధర్మం చెందిన మద్దెల శాంతయ్య, మద్దూరి నగేష్ బాబు, నాగప్పగారి సుందర్రాజు, నక్కా అమ్మయ్య, నాగపురి శ్రీనివాసులు, చంద్రశ్రీ, లాయర్ చంద్రశేఖర్, కలేకూరి ప్రసాద్ వంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు జాబితాలో తీసివేసినంత మాత్రాన వాళ్ళు మన స్మృతి పధం లోంచి చెరిగి పోయినట్లు కాదు. అలాగే సాహిత్యేతర మిత్రుల జాబితా కూడా! అలాంటి మిత్రుల జాబితా నుండి పుస్తకం లో దాచుకున్న నెమలీక లాంటి జ్ఞాపకం మాయమైపోయింది. అతని పేరు పొట్నూరి ప్రభునాథ్. చిరునామా ప్లాట్ నెం . 26, తారాపధ్ నగర్, పోస్టల్ కాలనీ, కాకినాడ &#8211; 533 003. మామూలుగా ఇలాంటి వ్యక్తిగత మిత్రులకు సాహిత్య పేజీల్లో స్థానం దక్కక పొవచ్చు. కానీ అతను కవి మిత్రుడు కావడమే విశేషం. కవులూ, కళాకారులూ తమ చుట్టూ తమ తమ మిత్ర బృందాలు లేకుండానే వారి ప్రోత్సాహం, ప్రోద్బలం లేకుండానే మేం ఇంతటి వారమయ్యామని ఎవరైనా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? ఏమో! ఎవరైనా చెప్పగలరేమో కాని నాకా ధైర్యం లేదు. కలం పట్టిన దాదిగా చుట్టూ ఎంతమంది లేకపోతే ఒక కవీ ,రచయితా, కళాకారుడు వున్నాడు చెప్పండి.</p> <p>ఇదుగో ఈ పొట్నూరి ప్రభునాథ్ అలాంటి వాడే! కాకినాడ పిఠా పురం మహారాజా వారి కళాశాలలో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sikhamani.jpg"><img class="alignleft  wp-image-3426" title="sikhamani" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/sikhamani.jpg" alt="" width="157" height="158" /></a>సాహిత్య పరంగా నాకో చెడ్డ అలవాటుంది . అదేమిటంటే కవులు , రచయితల చిరునామాలు రాసి పెట్టుకున్న డైరీ ని ఎప్పుడు తిరగేసినా అప్పటి వరకూ చనిపోయిన వాళ్ళ చిరునామాలపై ఇంటూ గీతలు కొట్టడం. మొన్నటికి మొన్న కె.ఎస్. రమణ గారి చిరునామా కనబడితే ఎందుకో కొట్టి వేయబుద్ది కాలెదు. నా డైరీనిండా ఇలాంటివి ఎన్నో! వాటిలో కాల ధర్మం చెందిన జి.వి.ఎస్., నాగ భైరవ, తొక్కుడు బండ కృష్ణముర్తి, ఇస్మాయిల్, స్మైల్, అజంతా,మో , కొత్తపల్లి, వడలి మందేశ్వరరావు, జ్ఞానానంద కవి, సదాశివ వంటి పెద్దలూ, అకాల ధర్మం చెందిన మద్దెల శాంతయ్య, మద్దూరి నగేష్ బాబు, నాగప్పగారి సుందర్రాజు, నక్కా అమ్మయ్య, నాగపురి శ్రీనివాసులు, చంద్రశ్రీ, లాయర్ చంద్రశేఖర్, కలేకూరి ప్రసాద్ వంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు జాబితాలో తీసివేసినంత మాత్రాన వాళ్ళు మన స్మృతి పధం లోంచి చెరిగి పోయినట్లు కాదు. అలాగే సాహిత్యేతర మిత్రుల జాబితా కూడా! అలాంటి మిత్రుల జాబితా నుండి పుస్తకం లో దాచుకున్న నెమలీక లాంటి జ్ఞాపకం మాయమైపోయింది. అతని పేరు పొట్నూరి ప్రభునాథ్. చిరునామా ప్లాట్ నెం . 26, తారాపధ్ నగర్, పోస్టల్ కాలనీ, కాకినాడ &#8211; 533 003. మామూలుగా ఇలాంటి వ్యక్తిగత మిత్రులకు సాహిత్య పేజీల్లో స్థానం దక్కక పొవచ్చు. కానీ అతను కవి మిత్రుడు కావడమే విశేషం. కవులూ, కళాకారులూ తమ చుట్టూ తమ తమ మిత్ర బృందాలు లేకుండానే వారి ప్రోత్సాహం, ప్రోద్బలం లేకుండానే మేం ఇంతటి వారమయ్యామని ఎవరైనా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? ఏమో! ఎవరైనా చెప్పగలరేమో కాని నాకా ధైర్యం లేదు. కలం పట్టిన దాదిగా చుట్టూ ఎంతమంది లేకపోతే ఒక కవీ ,రచయితా, కళాకారుడు వున్నాడు చెప్పండి.</p>
<p>ఇదుగో ఈ పొట్నూరి ప్రభునాథ్ అలాంటి వాడే! కాకినాడ పిఠా పురం మహారాజా వారి కళాశాలలో బియ్యేలో నా క్లాస్ మేట్ . నేను బి.ఎ.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/prabhunath.jpg"><img class="alignright size-full wp-image-3427" title="prabhunath" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2013/07/prabhunath.jpg" alt="" width="166" height="237" /></a> స్పెషల్ తెలుగు అతగాడు ఎకనామిక్స్. ఒక్క తెలుగు క్లాసులప్పుడు తప్ప మిగతా సమయంలో అంతా కలిసే! ఎన్.సి.సీ లోనూ, విద్యార్ధి రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. మంచి పొడగరి. ధృడకాయుడూను. ఇద్దరం కలసి తిరగడం వల్ల అధ్యాపకులైన సాహితీవేత్తలు ఇస్మాయిల్, పేరాల భరత శర్మ, మిరియాల రామకృష్ణ, నందుల గోపాల కృష్ణ వంటి వారికీ, కాలేజీమేట్స్ అయిన సాహిత్య పరులు చైతన్య ప్రసాద్, విన్నకోట రవి శంకర్, రసజ్ఞ శ్రీ, ప్రయాగ సుబ్రహ్మణ్యం వంటి వారికీ ప్రభునాధ్ పరిచితుడు.</p>
<p>అతను కేవలం కాలేజీ మిత్రుడయితే ఇంత కధ రాయనవసరం లేదు.. దానికి మించి తన మిత్రత్వంతో అతను నన్ను తమ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా చేసాడు. తొలి రోజుల్లోని నా బి.ఎ., చదువుకూ తర్వాత నా సాహితీ సృజనకు తనకూ, నాకు తెలియనంతగా అజ్ఞాత దోహదం చెసాడు. అప్పట్లో నేను యానాం నుండి కాకినాడ కాలేజీకి రోజూ బస్సులో వెళ్లి వచ్చేవాణ్ణి. &#8216;మా బాప్ప&#8217; పెద్ద కూతురు, నా వదిన సత్యవతి ఎప్పుడో తెల్లవారు ఝామున లేచి కట్టెల పొయ్యి మీద వండి డబ్బాలో పెట్టిన అన్నం, ఆలుగడ్డల కూర మధ్యాహ్నానికి నీరుగారి చప్పబడిపోయేది. అది చూసిన ప్రభునాధ్ అమ్మ అగ్నేశమ్మగారు నా డబ్బాను పక్కకు నెట్టి ఇంట్లో వండినవి వడ్డించేది. నా గురించి తెలిసిన అగ్నేశమ్మగారు ఎంతో ప్రేమగా చూసుకునేది తన నలుగురు కొడుకుల్లాగే! ఆమె నా ప్రక్కనే కూచుని నాకు కూరలు వడ్డిస్తుంటే, వాడికి అంత ఎక్కువ ఎందుకు పెడుతున్నావంటూ నా కంచంలోని మాంసం కూరో, చేపల కూరో చేత్తో తీసుకునేవాడు ప్రభునాధ్! అదంతా సరదాగా సోదర ప్రేమే అనుకునేవాణ్ణి. ఒకసారి నేను వేసుకున్న చొక్కాకు బొత్తం లేకపోతే చొక్కా విప్పించి, బొత్తాం కుట్టి ఇచ్చిందాయమ్మ. ఇలా మూడేళ్ళలో ఎన్నో సందర్భాల్లో తల్లిని తలపించారామె! 1995లో ఆమె ఆకస్మికంగా మృతి చెందినపుడు ఆమె గురించి నేను రాసిన కవిత &#8216;పిల్లకోడి&#8217; ఆ ఏడాది ఆంధ్ర జ్యోతి దీపావళి సంచికలో అచ్చయింది. అందులోంచి కొన్ని పాదాలు:</p>
<p><em>&#8220;తల్లి లేని బిడ్డడనీ ! ప్రేమగా చూడాలనీ</em><br />
<em> నీవు కొసరి కొసరి వడ్డించి నప్పుడు నేనెరుగని నాకన్నతల్లి</em><br />
<em> అన్నమై వచ్చి కంచంలో కూర్చునేది</em><br />
<em> గుండీ లేని చొక్కాతో బడికెలా వెళ్తావని</em><br />
<em> నా చొక్కాకు నీ గుండెను గుండీగా కుట్టిచ్సిన అగ్నేశమ్మ!</em><br />
<em> నిన్ను చూసాక దేవుడు కూడా తప్పకుండా</em><br />
<em> ఎవరో ఒక తల్లికే పుట్టి వుంటాడనిపించింది&#8221;</em> &#8211; అని రాసుకున్నాను. ఇదుగో ఇలాంటి తల్లిని నాకు ఇచ్చిన ప్రాణ మిత్రుడు ప్రభునాధ్ ఇప్పుడు లేడు.</p>
<p>బి.ఎ. తరువాత ఎం.ఎ. కోసం ఆంధ్రా యునివర్సిటీ కొచ్చాను. ప్రభునాధ్ కొన్నాళ్ళు బి.ఇడి చదువుకోసం ప్రయత్నించాడు. మరికొన్నాళ్ళు ఎస్.ఐ. అవుదామని ప్రయత్నించాడు. అవేమి కుదరక కాకినాడ పోర్టులో కాబోలు కొన్నాళ్ళు పనిచేశాడు. అక్టోబర్ 18, 1987 నా మువ్వల చేతి కర్ర కవితా సంపుటి ఆవిష్కరణ ఆంధ్ర విశ్వవిద్యాలయం, అసెంబ్లీ లో ఏర్పాటు చేశాం! యానాం నుండి మహమ్మద్ ముస్తఫా ఖాన్, కాకినాడ నుంచి ప్రభునాద్ కలిసి బయలుదేరారు. ముస్తఫా, నేను యానంలో ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. ముస్తఫా ఇస్మాయిల్ గారికి దూరపు బంధువు. కాకినాడలో పేర్రాజు పేట లోని చిలుకలు వాలిన చెట్టు గల గూడ పెంకుల మండువా లోగిలి ఇంట్లో ఇస్మాయిల్ గారి ప్రధమ దర్శనం నాకు ముస్తఫా వలన కలిగింది. కాకినాడ నుండి విశాఖకు బస్సులో బయలుదేరిన ఇద్దరూ కారణంతరాల వల్ల తుని లో దిగి కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. తెల్లవారు ఝామున రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ గదికి వచ్చిన ముస్తాఫాను చూసి భయకంపితున్నయినాను. ముస్తఫా బట్టల నిండా రక్తపు మరకలె. విషయం ఏమిటంటే విశాఖకు సమీపం లో పరిగెడుతున్న రైలు నుండి ప్రభునాధ్ జారి పడిపోయాడని. ఆ సమయంలో మాస్టారు అత్తలూరి నరసింహారావు, చప్పా సూర్య నారాయణ, దారా సుబ్బరాజు, వర్షాల పురుషోత్తం వంటి వారు చేసిన సహాయం మర్చి పోలేనిది. అంత బాధ లోను సభ బాగా జరగాలని మాకు శుభా కాంక్షలు చెప్పి. సభానంతర సభలో తనను మర్చిపోవద్దని గుర్తు చేసాడు హాస్పిటల్ బెడ్ మీద నుండే. అతని మొండి ధైర్యానికి, చిలిపి తనానికి అంత దుఃఖంలోనూ అందరం నవ్వుకున్నాం.</p>
<p>1987 లో మృత్యువును జయించిన ప్రభునాధ్ 2013 జులై 2న దానికి తలవంచక తప్పలేదు. ఇస్మాయిల్ గారు చనిపోయిన తరువాత సి. ధర్మారావు గారు ఫోను చేసి &#8216;శిఖా! మనకు కాకినాడకు ఇక దారులు మూసుకుపోయాయి అన్నారు. అయన అన్నట్లు గానే కాకినాడ వెళ్ళకుండానే ధర్మారావు గారు ఇస్మాయిల్ గారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోయారు. కవితా కల్ప తరువు ఇస్మాయిల్ గారు లేని కాకినాడకు మిత్రధనుడు ప్రభునాద్ లేని కాకినాడకు ఎలా వెళ్ళేది? ఏ దారి లేదాయే&#8230;&#8230; కాకినాడకు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=3425</wfw:commentRss>
		<slash:comments>10</slash:comments>
		</item>
	</channel>
</rss>
