కవిత్వం ఒక్కసారి పట్టుకుందంటే ఇక వదిలి పెట్టదు.
మరో లోకాలని సృష్టిస్తుంది.
మరో దృష్టిని ప్రసాదిస్తుంది.
నిజ జీవితానికి సమాంతరంగా మరో జీవితాన్ని నిర్మిస్తుంది.
మనసులో బందీ అయిన భావాల విడుదలకు మార్గాన్ని చూపిస్తుంది.
మామూలు మనుషులనుండి వేరు చేసి ఎక్కడో కూచోబెట్టి ,లేనిపోని భ్రమల్లో భ్రాంతుల్లో గిర్రున తిప్పుతూ తటాలున మళ్ళీ ఆ మనుషుల మధ్యే వదిలేసి పోతుంది.
వంట చేస్తుంటేనో,పుస్తకం చదువుకుంటుంటేనో, ఇంకేదో పని చేస్తుంటేనో లేక ఊరికే ఖాళీగా కూచుని కిటికీలోంచి చూస్తున్నా గబుక్కున ఏదో తడుతుంది.
ఓ ఆలోచన.
ఓ పదం.
కొన్ని పంక్తులు.
వెంటనే దాన్ని కాగితం మీద రాసుకోకపోతే ఎగిరి వెళ్ళిపోతుంది కాబట్టి వెంటనే ఏదో ఒకచోట రాసేసుకోవాలి.
ఇక అక్కడినించి ఆ పదమో పంక్తులో నన్ను, మమ్మల్ని కవితగా మార్చు మార్చు అని వెంటబడతాయి.
చెవి దగ్గర రొద పెడతాయి.
చేతి వేళ్ళ మీద వాలి రెక్కలార్చుతాయి.
అప్పుడు మళ్ళీ ఎప్పుడో కొత్త పంక్తులు, పదాలు మళ్ళీ గాలిలో అలా అల్లా తేలి వచ్చి కళ్ళ ముందు నిలబడతాయి.మమ్మల్నీ పాతవాటితో కలిపి అల్లమని.
ఇలాగే రోజులు గడుస్తాయి.
అర్ధ రాత్రో,తెల్లవారు ఝామునో,వెచ్చని మధ్యహ్నమో,చల్లని సాయంత్రమో కొత్త కొత్త కవితా పాదాలు తేలుతూ తేలుతూ వచ్చి పాత వాటికి అల్లుకుని,సొగసుగా చుట్టుకుని , చివరికి ఎప్పుడో పూల జడలాంటి కవిత ఒకటి ప్రత్యక్షమైతే
పది రోజులనుండి తిండి లేని మనిషి చేతిలో ఒక బుట్టెడు నేతి గారెలు పెట్టినట్టు, చిక్కి శల్యమైన ఋషికి భగవంతుడు ప్రత్యక్షమై జున్ను ముక్కలు తినిపించినట్టు బ్రహ్మానందం కలుగుతుంది.
ఎందుకింత ఆనందం? దీనివల్ల దమ్మిడీ ఆదాయం లేదే అని బుద్ధున్న వాళ్ళు ఎవరైనా అడగొచ్చు.
దమ్మిడీలు ఇచ్చే ఆనందం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందం.
ఇక మోక్షమే తరువాయి అన్నంత పారవశ్యం.
ఎందుకూ అంటే కవులైతేనే చెప్పగలరు.
కాగితాలు ముందేసుకుని,అటూ ఇటూ పచార్లు చేస్తూ,తేనీటి పొగల మధ్య రాసుకుంటూ దిద్దుకుంటూ గడిపే కవులైతేనే అనుభవించగలరు.
పిచ్చి వాడిని పిచ్చివాడు గుర్తించ లేక పోవచ్చు.కాని కవిని మాత్రం ఇంకో కవి ఇట్టే పోల్చుకోగలడు.
చిన్న పిల్లల అమాయకత్వం కనిపిస్తోంది.పదాల కూర్పు మాత్రమే కవిత్వం కాదేమో.ఒక భావతీవ్రత వెంతదందే,వేదిన్చందే ,నిద్రలేని రాత్రుల్ని సృస్తంచందే కవిత్వం రాదు.ఆ సేరియస్నేస్ ఉన్నవాళ్ళే మంచి కవులు కాగలరు
కవిత్వం ఒక్కసారి పట్టుకుందంటే ఇక వదిలి పెట్టదు.
మరో లోకాలని సృష్టిస్తుంది.
మరో దృష్టిని ప్రసాదిస్తుంది. నిజమే నాకు అలానే అనిపిస్తుంది
baagaa chepparu indraani garu … keep going all the best
Chala bagundi Indrani. I stopped writing sometime back. Chaduvutunte…. malli vrayatam modalu pettali anipistundi. Kani ippatnunchi Telugulo vrayataniki prayatnistanu.
నాకు కొంచెం అనుమానం .మీరు కవిత్వాన్ని మీ సంతోషం కోసం రాస్తున్నారా? లేదా ఏదైనా సామాజిక ప్రయోజనం ఆశించా? లేదూ గుర్తింపు కోసమా? నిజానికి ఎవరైనా రచనలు చేయడాని కి కారణం ఏముంటుంది?
పిచ్చి వాడిని పిచ్చివాడు గుర్తించ లేక పోవచ్చు.కాని కవిని మాత్రం ఇంకో కవి ఇట్టే పోల్చుకోగలడు….true!
avunu nijame.i felt same feelings while writing
varsham naa kavitha meeda john hide gaari revew chadavandi……. kavitvam oka alkemi. kavitvam ninnu nuvvu avishkarinchukune maadyamam, akupachani jeevana kala, baavalu puritinoppulaku guriaite gaani prasavinchadu kavitha vinta kantitho, kavitvam patla mee svantha anuboothulu bagunnai.
‘వానకు తడిసిన పువ్వులు’ ఇంద్రాణి కవితలు. ఆమె కవిత గాని, ఆమె గురించి గాని కనబడితే చదవకుండా ఉండలేను – మాకినీడి
పిచ్చి వాడిని పిచ్చివాడు గుర్తించ లేక పోవచ్చు.కాని కవిని మాత్రం ఇంకో కవి ఇట్టే పోల్చుకోగలడు…..great
ఏమిటో అర్ధం కానట్లుంది
పిచ్చి వాడిని పిచ్చివాడు గుర్తించ లేక పోవచ్చు.కాని కవిని మాత్రం ఇంకో కవి ఇట్టే పోల్చుకోగలడు…ఈ మాట అక్షరాల నిజం. కాని కవిత్వం మాత్రం పిచ్చి కాదు. కవిత్వం సామాజిక ప్రయోజనాలు సాధిస్తుంది, విప్లవాలకు ఆజ్యమూ పోస్తుంది, కాని మౌలికంగా కవిత్వం కవి తన కోసమే రాసుకుంటాడు. తాను రాసింది పదిమంది చదవాలని ఆశిస్తాడు..అంటే మొదటిది సంతోషం కోసం, రెండవది గుర్తింపు కోసం.. ఆ కవిత సామాజిక ప్రయోజనాలు సాధించడమూ తదితర పరిణామాలు కవితలోని శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి. కాని కవిత్వం అనేది మనిషిలోని భావానుభూతులు, ఆవేదనలు, ఆవేశాలకు దర్పణం పడుతుంది. కవిత్వం ఎలా పుడుతుందో చాలా చక్కగా చెప్పారు.
సామాజిక ప్రయోజనాలు సాధిం చే కవిత్వం ఇప్పుడు వస్తుందా? ఏమో ఈ వెబ్ పత్రికల్లో వచ్చే కవిత్వమంతా అత్మశ్రయంగానే కనిపిస్తుంది?
‘పిచ్చి వాడిని పిచ్చివాడు గుర్తించ లేక పోవచ్చు.కాని కవిని మాత్రం ఇంకో కవి ఇట్టే పోల్చుకోగలడు’… లైన్ చాలా బాగుంది.
మీరు రాసిన ప్రతి వాక్యం ప్రతి కవికీ ఎప్పుడోకప్పుడు ఎదురయ్యే సందర్భమే…
పిచ్చివాడు ప్రేమికుడు కవి ఊహాలోకాల్లో విహరిస్తుంటారని ఏనాడో షేక్స్పియర్ చెప్పారు.కవిత్వం ఇలానే ఉండాలనే నియమంలేదు.వస్తువు ఎంపిక కవి ఇష్టం. సామాజికాంశాలు రాస్తే మంచిదే ..విప్లవం చెప్పినా విరహంచెప్పినా అది కవి స్పందించే తీరులో ప్రతీకలతో కవితను నిర్మించే రీతిపై ఆధారపడిఉంటుంది. నాకు తెలిసి ఎవడూ గొప్పకవి కాడు.అలా అని వాడికి లేబుల్ తగిలిస్తాం.అందరూ అనుకరణకవులే కొత్తగా ఏదో చెబుతున్నామనుకుంటారు.విశ్వకవిత్వాన్ని తిరగేస్తే నీవుచెప్పినది ఎవడో ఎపుడో ఎక్కడో అనేసి ఉంటాడు .కాకపోతే కచ్చితంగా నీలానే చెప్పి ఉండకపోవచ్చు.ఇవాళ సంగీతం సాహిత్యం కవిత్వం అన్నీ కాఫీలే ..ప్రపంచంలోని వస్తువులను కాళిదాసైనా నేటి కాసులదాసుకవులైనా చూసేదృష్టినిబట్టి ఊహించేవిధానాన్నిబట్టి కాస్తఅటు ఇటుగా కవిత్వీకరిస్తారు.కలియుగంలో కాఫీరాయుళ్లు గొప్పకవులుగా సినిమావాళ్లుతెలుగుభాషను ఉద్దరించే ప్రపంచసభల అతిథులుగా (వీరుతెలుగుభాషకేం సేవలుచేశారో)తెలుగు సరిగ్గా మాట్లాడ టం రాని రాజకీయనాయకులు ప్రపంచతెలుగు మహాసభల్లో సన్మానితులుగా చెలామణి అవుతున్న ఈ కాలంలో కవిత్వం అంటేతెలియని మార్కెటింగ్ కవులకు అమ్మానీవు చెప్పిన కవిత్వపు గొప్పదనం ఎలా అర్తమవుతుంది.మెధడుతో రాసేవాళ్లను వదిలేద్దాం హృదయంతో రాసే కవిత్వాన్ని స్వాగతిద్దాం.బాగాచెప్పావు .