<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; మన తెలుగు</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=402&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>భాషాసవ్యతకు బాటలు వేద్దాం &#8211; 6</title>
		<link>http://vaakili.com/patrika/?p=6047</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6047#comments</comments>
		<pubDate>Fri, 01 Aug 2014 14:44:18 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[మన తెలుగు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6047</guid>
		<description><![CDATA[<p>[ క్రితం నెలలో ఈ వ్యాసం ద్వారా పాఠకులకు రెండు ప్రశ్నలు వేసాము. వాటిలో దేనికీ జవాబు రాలేదు. మొదటి ప్రశ్న ఈ విధంగా వుంది: తిలాపాపం అనే సమాసం / పదబంధం సరైనదేనా? అదేవిధంగా ఆరాధనభావం సరైనదా, లేక ఆరాధనాభావం కరెక్టా? అసలు రెండు పదాలతో ఒక సమాసాన్ని తయారు చేసేటప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరానికి యెప్పుడు దీర్ఘం వస్తుంది, యెప్పుడు రాదు? దీనికి జవాబేమిటంటే, తిలాపాపం తప్పు, తిలపాపం సరైనది. ఒక సమాసం కోసం రెండు పదాలను వాడుతున్నప్పుడు, పూర్వపదం (మొదటి పదం) స్త్రీలింగమైనప్పుడు దాని చివరి అక్షరానికి దీర్ఘం వస్తుంది. అది పుంలింగమైతే దీర్ఘం రాదు. ఆ పదం ఒకవేళ నపుంసక లింగమైతే కూడా చాలా వరకు (దాదాపు అన్ని సందర్భాల్లో) దీర్ఘం రాదు.‘తిల’ స్త్రీలింగం కాదు, పుంలింగం. తిలభవం, తిలరసం అంటే (నువ్వుల) నూనె. తిలయంత్రం అంటే గానుగ. తిలకాష్టం అంటే నువ్వుల కట్టె. తిల అన్నది స్త్రీలింగమైతే ఇవన్నీ తప్పులు అవ్వాలి. అంటే వీటిలో ‘ల’ అనే అక్షరానికి దీర్ఘం వచ్చి ఆ పదాలు తిలాభవం, తిలారసం, తిలాయంత్రం, తిలాకాష్టం అవ్వాలన్న మాట. తిలాపాపం తలా పిడికెడు అన్న సామెతలో ‘తలా’కు సరిపోయే విధంగా ‘తిలా’ అని ప్రాస కూర్చి వుంటారెవరో! తర్వాతనుండి అందరూ ఆ ప్రయోగాన్నే అనుసరిస్తున్నట్టున్నారు. ఇక ఆరాధన నపుంసక లింగం కనుక, ఆరాధనభావం అనటమే సరైనది. పైగా ఆరాధనాభావం అని రాసినప్పుడు దాన్ని ఆరాధన + అభావం అని విడదీస్తే పూర్తిగా విరుద్ధమైన అర్థం వచ్చే అవకాశముంది. ఎందుకంటే అభావం అంటే లేకపోవుట అని అర్థం! ఏది స్త్రీలింగమో ఏది పుల్లింగమో తెలియాలంటే ప్రామాణిక నిఘంటువులను సంప్రదించక తప్పదు.</p> <p>మేము అడిగిన రెండవ ప్రశ్న: వ్యభిచారం అన్న పదానికి ‘నల్ల మేక తప్పు’ పర్యాయ పదం యెందుకైంది? దీనికి జవాబు ఈ వ్యాసకర్తకు కూడా తెలియదు!<br /> ఇక మన అసలు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg"><img class="alignleft  wp-image-5113" title="manatelugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg" alt="" width="393" height="282" /></a>[ క్రితం నెలలో ఈ వ్యాసం ద్వారా పాఠకులకు రెండు ప్రశ్నలు వేసాము. వాటిలో దేనికీ జవాబు రాలేదు. మొదటి ప్రశ్న ఈ విధంగా వుంది: తిలాపాపం అనే సమాసం / పదబంధం సరైనదేనా? అదేవిధంగా ఆరాధనభావం సరైనదా, లేక ఆరాధనాభావం కరెక్టా? అసలు రెండు పదాలతో ఒక సమాసాన్ని తయారు చేసేటప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరానికి యెప్పుడు దీర్ఘం వస్తుంది, యెప్పుడు రాదు? దీనికి జవాబేమిటంటే, తిలాపాపం తప్పు, తిలపాపం సరైనది. ఒక సమాసం కోసం రెండు పదాలను వాడుతున్నప్పుడు, పూర్వపదం (మొదటి పదం) స్త్రీలింగమైనప్పుడు దాని చివరి అక్షరానికి దీర్ఘం వస్తుంది. అది పుంలింగమైతే దీర్ఘం రాదు. ఆ పదం ఒకవేళ నపుంసక లింగమైతే కూడా చాలా వరకు (దాదాపు అన్ని సందర్భాల్లో) దీర్ఘం రాదు.‘తిల’ స్త్రీలింగం కాదు, పుంలింగం. తిలభవం, తిలరసం అంటే (నువ్వుల) నూనె. తిలయంత్రం అంటే గానుగ. తిలకాష్టం అంటే నువ్వుల కట్టె. తిల అన్నది స్త్రీలింగమైతే ఇవన్నీ తప్పులు అవ్వాలి. అంటే వీటిలో ‘ల’ అనే అక్షరానికి దీర్ఘం వచ్చి ఆ పదాలు తిలాభవం, తిలారసం, తిలాయంత్రం, తిలాకాష్టం అవ్వాలన్న మాట. తిలాపాపం తలా పిడికెడు అన్న సామెతలో ‘తలా’కు సరిపోయే విధంగా ‘తిలా’ అని ప్రాస కూర్చి వుంటారెవరో! తర్వాతనుండి అందరూ ఆ ప్రయోగాన్నే అనుసరిస్తున్నట్టున్నారు. ఇక ఆరాధన నపుంసక లింగం కనుక, ఆరాధనభావం అనటమే సరైనది. పైగా ఆరాధనాభావం అని రాసినప్పుడు దాన్ని ఆరాధన + అభావం అని విడదీస్తే పూర్తిగా విరుద్ధమైన అర్థం వచ్చే అవకాశముంది. ఎందుకంటే అభావం అంటే లేకపోవుట అని అర్థం! ఏది స్త్రీలింగమో ఏది పుల్లింగమో తెలియాలంటే ప్రామాణిక నిఘంటువులను సంప్రదించక తప్పదు.</p>
<p>మేము అడిగిన రెండవ ప్రశ్న: వ్యభిచారం అన్న పదానికి ‘నల్ల మేక తప్పు’ పర్యాయ పదం యెందుకైంది? దీనికి జవాబు ఈ వ్యాసకర్తకు కూడా తెలియదు!<br />
ఇక మన అసలు వ్యాసానికి వద్దాం.]</p>
<p>ఒకే పదంలో శ, ష , స లకు సంబంధించిన అక్షరాలు ఉన్నప్పుడు, ఆ పదం విషయంలో కొందరు గందరగోళానికి లోనవుతారు. సుశ్రూష , శుస్రూష , సుష్రూష ,సుస్రూస &#8211; ఇవన్నీ తప్పులే. సరైన పదం శుశ్రూష. సహాయముకు సాయము అని ఒక సమానార్థక పదం ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రెండు పదాలే కాక సాహాయ్యము అనే పదం కూడా అదే అర్థాన్నిస్తుంది. “నిత్య సుమంగళి లాగ నీ పాపిటలో ఎప్పుడూ సింధూరం నిండి ఉండాలి” అనే సినిమా డైలాగు ఉందనుకోండి. ఈ వాక్యంలో ‘పాపిట’ తప్పు. పాపట సరైన పదం. పాపట = కేశవీధి. కొందరు పాపెట అని కూడా అంటారు. అది కూడా తప్పే. ఇక ‘సింధూరం’ కూడా తప్పే. సిందూరము అన్నదే సరైన పదమని చాలా మందికి తెలియదు. సిందురము కూడా సరైనదే. సింధురము అని మరో పదం ఉంది. దానికి అర్థం ఏనుగు. సౌరభము &#8211; సౌరభ్యము, సౌగంధము -సౌగంధ్యము లాగ సోదరుడు &#8211; సోదర్యుడు అని రెండు సమానార్థక పదాలున్న సంగతి కొందరికే తెలుసుననుకుంటాను. ఇంద్రునికి ఉన్న పేర్లలో స్వరాట్టు, స్వారాట్టు రెండూ సరైనవే. కాని సమ్రాట్టు, సామ్రాట్టు &#8211; ఈ రెండింటిలో మొదటిదే సరైన పదం. సామ్రాట్టు తప్పు. ఒకేలాగ ఉండే జంటపదాలు మరికొన్ని ఉన్నవి. కాని వాటి అర్థాలు వేరువేరు. ఉదా: అనలుడు = అగ్నిదేవుడు. అనిలుడు = వాయుదేవుడు. నిర్దారణము = చక్కగా చీల్చుట. నిర్ధారణము = నిశ్చయము. రిక్తము = శూన్యము. రిక్థము = ధనము. నిద్ర లేకపోవటాన్ని నిర్ణిద్ర అని రాస్తారు కొంత మంది. కాని నిర్నిద్ర అనటమే సరైనది – ‘నిమిత్తం లేని’ ని నిర్నిమిత్తం అన్నట్టుగా. ఇక శీర్షికలోనే భాషాదోషాలుండటం సీరియస్ విషయమే.</p>
<p>“సమకాలీన కవితా రంగంలో సంఖ్యాపరంగా చూస్తే వచన కవులది ఒక రకంగా గుత్తాధిపత్యం” అన్నాడొక కవి మిత్రుడు. ఇక్కడ గుత్తా అనేది వైకృత విశేష్యము (Noun) కాగా ఆధిపత్యము సంస్కృత విశేష్యము. ఈ రెండింటి మధ్య కుదిరే సమాసం వైరి సమాసమే అవుతుంది. భక్తి ఫ్రధానమైన రేడియో, టీ.వీ. కార్యక్రమాల్లో ‘భక్తి రంజని’ అనేది ఒకటి ఉండటం గమనిస్తాం మనం. అయితే దీని వ్యుత్పత్తి ఏమిటి? ‘భక్తులను రంజింపజేసేది’ అయితే ‘భక్త రంజని’ అవ్వాలి. ‘భక్తిని రంజింపజేయడం’ అనేది అసంబద్ధమైన విషయం. ‘భక్తి చేత రంజింపజేసేది’ అవుతుందా? యథార్థము అనే పదాన్ని కూడా చాలా మంది యదార్థము అని తప్పుగా రాస్తారు. పత్రికల్లో కూడా ఆ పదం అలానే అచ్చు కావడం మనం గమనించవచ్చు.</p>
<p>ఒక పదం తాలూకు అర్థం మీద Stress (ఊనిక) ను ధ్వనింపజేయటం కోసం కొన్ని సార్లు ఆ పదంలోని ఒక అక్షరాన్ని ద్విత్వాక్షరంగా మార్చడం, లేక వత్తును ఇవ్వటం మామూలే. ఉదాహరణకు ‘ఒఖ్ఖడికీ’ సరైన అర్థం తెలియదు అంటాం. అదేవిధంగా ‘ఛస్తే’ మళ్లీ నీ ముఖం చూడను అన్న వాక్యం. ఆధునిక వచన కవితా సందర్భంలో ఇటువంటి ప్రయోగాలను శుద్ధ తప్పులు అని కొట్టి పారేసి వాటి వాడుకను మానెయ్యలేము.</p>
<p>ఇక కొంత మంది రచయితలు తమ రచనల్లో ఇంగ్లిష్ పదాలను పుష్కలంగా గుప్పిస్తారు. అయితే ఆ పదాల సరైన ఉచ్చారణ తెలియనప్పుడు వాటిని ఆంగ్లలిపిలో ఇవ్వక తెలుగు అక్షరాల్లో ఇస్తే ఇబ్బందే. ఆంగ్ల పదాల సరైన ఉచ్చారణ తెలియటం ఆషామాషీ విషయం కాదు. ఇంగ్లిష్ భాష మీద పట్టును కలిగి వుండక, ఆంగ్ల పదాలను తెలుగు లిపిలో రాస్తూ దోషభూయిష్ఠంగా రచనలు చేస్తున్న కథారచయితలు కొందరు మనకు అక్కడక్కడా తారస పడుతారు. అట్లాంటి వాళ్లకు కూడా ఉపయోగకరంగా ఉండేట్టు కొన్ని ఉదాహరణలతో వివరణలు ఇస్తాను. నోబెల్ ప్రైజ్ అనే బదులు నోబుల్ ప్రైజ్ అని రాస్తారు కొందరు. నోబుల్ (Noble) అంటే ఉదాత్తమైన అని అర్థం. ఇక నోబెల్(Nobel) అన్న పదం ఒక వ్యక్తి పేరును సూచిస్తుంది. కాబట్టి నోబుల్ ప్రైజ్ అనకూడదు, నోబెల్ ప్రైజ్ అనాలి. కౌన్సిలర్, కౌన్సెలర్ కూడా భిన్నమైన పదాలు. కౌన్సిలర్ (Councillor) అంటే కౌన్సిల్ లోని ఒక మెంబరు. కౌన్సెలర్ (Counsellor) అంటే సలహా ఇచ్చేవాడు. బిజినెస్ మాగ్నేట్ అని రాసే బదులు బిజినెస్ మాగ్నెట్ అని రాస్తారు కొందరు. మాగ్నేట్ (Magnate) అంటే పలుకుబడి, ప్రభావం బాగా ఉన్నవాడు (ముఖ్యంగా బిజినెస్ లో). మాగ్నెట్ (Magnet) అంటే అయస్కాంతం. కెరియర్, క్యారియర్ కూడా వేరువేరు. కెరియర్ (Career) ను మనం పని చేసే రంగంలోని అంశమని స్థూలంగా చెప్పుకోవచ్చు. ఇక క్యారియర్ (Carrier) అంటే టిఫిన్ క్యారియర్ లోని డబ్బా లేక డబ్బాల సముదాయం. సైకిలుకు వెనకాల ఉండే సీటును కూడా క్యారియర్ అంటాము. మోసే వాడు అని మరో అర్థం కూడా ఉంది. అదే విధంగా Chance కూ Choice కూ మధ్యన ఉన్న భేదాన్ని గుర్తించరు కొందరు. Chance అంటే అవకాశం, Choice అంటే ఎంపిక. “నేనూ మాట్లాడుతాను, నాకు చాయిస్ ఇవ్వండి” అనకూడదు. చాన్స్ ఇవ్వండి అనాలి. అదే విధంగా “ఎన్నో డిజైన్లలో ఉన్నాయి చీరలు. చాయిస్ నీదే” అనాలి తప్ప చాయిస్ కు బదులు చాన్స్ అన్న పదాన్ని వాడకూడదు. మెషీన్ గన్ (Machine gun) కు బదులు మిషన్ గన్ (Mission gun) అనడం కూడా తప్పే. Mission అంటే వేరే అర్థం ఉంది మరి! Alternate, alternative అన్న పదాలు కూడా తికమకను కలిగించేవే. Alternate days అంటే దినము విడిచి దినము. Alternative అంటే ప్రత్యామ్నాయం (మరో మార్గం). డిబాచెరీ (Debauchery) చేసేవాడు అనే అర్థంలో డిబాచెలర్ అనే పదాన్ని వాడుతారు కొంత మంది (బ్యాచెలర్ అంటే బ్రహ్మచారి కనుక, డిబాచెరీ చేసేవాణ్ని బ్రహ్మచారి లాగా ప్రవర్తించనివాడి లాగా భావించి, అలా రాయాలనుకుంటారేమో!). డిబాచెరీ చేసేవాడిని సూచించటానికి ప్రత్యేకమైన పదం ఆంగ్లంలో కనపడదు. ప్రామాణికం కాని నిఘంటువుల్లో డిబాచీ (Debauchee) అన్న పదమొకటి ఉంది. ఫిడేలును వైలిన్ అనాలి ఇంగ్లిష్ లో. వయొలిన్ అనకూడదు, దాని స్పెలింగ్ Violin అయినా కూడా! Pizza ను పీట్జ అని పలకాలని తెలిసినవాళ్లు కూడా (విదేశాల్లో ఉంటున్న వారిని మినహాయిస్తే) తక్కువ మందే వుంటారు. విడాకులు (Divorce) ను డివాస్ అనాలి. కనీసం డివోర్స్ అన్నా ఫరవా లేదు. కాని చాలా మంది డైవర్స్ అని రాస్తారు. డైవర్స్ అన్నదానికి Divers, Diverse అని రెండు భిన్నమైన పదాలున్నాయి ఆంగ్లంలో. Divers = డైవ్ చేసే వాళ్లు, Diverse = భిన్నమైన.</p>
<p>ఇక ప్రజెంటేషన్ (ప్రెజెంటేషన్), కాన్సంట్రేషన్ (కాన్సెంట్రేషన్), సెలబ్రిటీ (సెలెబ్రిటీ), జనరేషన్ (జెనరేషన్),జీసెస్ (జీసస్), సిజర్ (సిజర్స్), డ్రస్సింగ్ టేబుల్ (డ్రెసింగ్ టేబుల్), అర్జంట్ (అర్జెంట్), మొమెంటో (మెమెంటో), ఫోర్ లైన్స్ రోడ్ (ఫోర్ లేన్ రోడ్), హానెస్టీ (ఆనెస్టీ), డిస్ట్రబ్ (డిస్టర్బ్), గార్డన్ (గార్డెన్), డెకరేషన్ (డెకొరేషన్), సింబాలిజమ్ (సింబలిజమ్), జండర్ (జెండర్), సిటిజన్ (సిటిజెన్), కరంటు (కరెంటు), రడీ (రెడీ) &#8211; ఇలా కుప్పలుతెప్పలుగా తప్పులు చేస్తుంటాం. గూడ్సు, స్పాంజి అనే పదరూపాలు మన భాషలో యెంతగా పాతుకుపోయాయంటే, రోడ్డు, రైలు, కాలేజిలలాగా అవి దాదాపు తెలుగు పదాలైపోయాయి. అయితే సామాన్లు లేక వస్తువులను ఆంగ్లంలో గుడ్స్ (Goods) అనీ, వాటిని మోసుకెళ్లే రైలును గుడ్స్ ట్రెయిన్ (Goods train) అనీ పలకుతారు. అదేవిధంగా Sponge ను స్పంజ్ అని ఉచ్చరిస్తారు. మరి అర్జంట్, జండర్, సిటిజన్ మొదలైన పదాలు కూడా తెలుగులో పాతుకుపోలేదా అంటే పాతుకుపోయాయి, నిజమే. అందుకే ఇటువంటి పదాలను వర్గీకరించేటప్పుడు ఇదమిద్ధమైన విభజనరేఖను నిర్ణయించటం కష్టం.</p>
<p>ఒకే అక్షరం రెండు సార్లు పక్కపక్కన వచ్చినప్పుడు దాని ఉచ్చారణలో ద్విత్వం రాదు. ఉదాహరణకు yellow = యెలో (యెల్లో కాదు), illicit = ఇలిసిట్ (ఇల్లిసిట్ కాదు), cherry = చెరి (చెర్రీ కాదు), sitting = సిటింగ్ (సిట్టింగ్ కాదు), rubber = రబర్ (రబ్బర్ కాదు), shimmer = షిమర్ (షిమ్మర్) కాదు. H అన్న అక్షరం వచ్చినప్పుడు కూడా వత్తును పలక కూడదు. ఉదాహరణకు ghost = గోస్ట్ (ఘోస్ట్ కాదు), thousand = తౌజెండ్ (థౌజెండ్ కాదు), channael = చానెల్ (ఛానెల్ కాదు) మొదలైనవి. తెలుగులో మనం ఉపయోగించే ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ వంటి ఉచ్చారణలు ఆంగ్లభాషలో లేవు. దీనికి ఏమైనా మినహాయింపులున్నాయో ఏమో తెలియదు నాకు. అయితే ఇటువంటి అంశాలు చాలా చిన్నవి కనుక వీటిని పాటించకపోయినా ఫరవా లేదు.</p>
<p>* * *</p>
<p>కేవలం ఆధునిక వచన కవిత్వాన్నీ మామూలు వచనాన్నీ మాత్రమే రాస్తూ భాషాసవ్యత పట్ల ఎంత మాత్రం పట్టింపు లేనివాళ్లకు ఈ వ్యాసం వృథా అనిపించటంలో ఆశ్చర్యం లేదు. అయితే దీనికి భిన్నమైన కోణం కూడా వుంది. ‘భాషాపరంగా సవ్యమైనవి’ అంటూ ఇందులో చెప్పిన పదాలనన్నింటినీ ఆధునిక రచనల్లో తప్పక ఉపయోగించాలని చెప్పలేము. ఉదాహరణకు ఒత్తిడి అన్న పదం తప్పు ‘ఒత్తడి’ మాత్రమే సరైనది అని నిఘంటువులు చెప్పినంత మాత్రాన, “మానసిక ఒత్తడితో నా మనసు క్రుంగిపోయింది” అని ఒక ఆధునిక వచన కవితలో గాని, కథలోపలి వాక్యంలో గాని రాస్తే అదంత బాగుండదు. ‘మానసిక ఒత్తిడితో’ అనే రాయాల్సి ఉంటుంది &#8211; స్ట్రిక్టుగా చూస్తే అది భాషాదోషమైనప్పటికీ (అసలు ‘మానసిక ఒత్తిడి’ వైరి సమాసమౌతుందనుకోండి, అది వేరే విషయం). కాని ఏవి భాషాదోషాలో క్షుణ్ణంగా తెలిసి ఉంటే మనకు భాష మీద పట్టు దొరికి, అన్ని సందర్భాలకు తగిన సవ్యమైన రచనలు చేయడానికి అవసరమైన గట్టి పునాది ఏర్పడుతుంది. ఛందోబద్ధమైన పద్యాలను రాసేటప్పుడు మాత్రం భాషాపరమైన శుద్ధతను తప్పక పాటించాల్సి ఉంటుంది. అయినా కనీసం మాతృభాషలోనైనా పరిపూర్ణతను సాధించే ప్రయత్నం చేయలేకపోతే పరాయి భాషలో ఆ దిశగా ప్రయత్నం చేయగలమా మనం?</p>
<p>కథలు, వ్యాసాలు, నవలలు మొదలైన వచన రచనలు చేయాలనుకునేవాళ్లకు చక్కని వాక్యం రాయటమెలా అన్నది మొదట తెలిసి ఉండాలి. ఎందుకంటే వాక్యాలు బాగున్నప్పుడే ఆ రచన చదివింపజేస్తుంది. విడవకుండా చదివింపజేయలేని రచన నిరర్థకం కనుక కథల్లో, నవలల్లో, వ్యాసాల్లో చక్కని వాక్యం యెంతో అవసరం. చక్కని వాక్యమంటే కేవలం భాషాదోషాలు లేకపోవటం మాత్రమే అని భ్రమ పడకూడదు. భాషాదోషాలు లేకపోవడంతో పాటు, వాక్యంలో నిర్దిష్టత ఉండటం చాలా అవసరం. అంటే సరైన స్థానాల్లో సరైన పదాలు పడాలన్న మాట. ఒక వాక్యంలో పది పదాలు ఉన్నాయనుకోండి. వాటి స్థానాలను తారుమారు చేస్తూ ఆ వాక్యాన్ని ఎన్నో రకాలుగా రాయవచ్చు. కాని ఎన్ని రకాలుగా రాయడానికి వీలున్నా వాటిలో the best possible ఐనటువంటి వాక్యాలు ఒకటో రెండో మాత్రమే ఉంటాయి. అట్లాంటి వాక్యాల్ని రాసే నైపుణ్యాన్ని వశం చేసుకోవాలి. కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్యాల్లో అటువంటి నిర్దిష్టత కనపడుతుంది. సోమర్సెట్ మామ్ (Somerset Maugham) అనే ఆంగ్ల రచయిత, కొన్నిసార్లు ఒకే ఒక్క పెద్ద వాక్యాన్ని చాలా నిర్దిష్టంగా, పూర్తి సంతృప్తికరంగా రాయటానికి తనకు పదిహేను రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాడు!</p>
<p>కథల్లో, నవలల్లో, కవిత్వంలో మాండలికాన్ని రాసినప్పుడు, ఆ మాండలికం సంపూర్ణంగా కాక పాక్షికంగా వుంటే, అది యెంతమాత్రం సహజంగా, సమంజసంగా అగుపించదు. కేవలం పాత్రలే మాండలికం మాట్లాడేవి ఐనప్పుడు, ఆ పాత్రల సంభాషణలు పూర్తిగా (each and every word wherever applicable) మాండలికంలోనే వుండి, మిగతాది శిష్టవ్యావహారికంలో వున్నా ఫరవా లేదు. కథ చెప్పే రచయిత ఒకవేళ మాండలికంలో చెప్తే, ఆయన/ఆమె చెప్పేదంతా కూడా మాండలికంలో వుండటం సాధారణంగా న్యాయం. అయితే దీన్ని కచ్చితంగా పాటించే వాళ్లు చాలా అరుదు. రాయలసీమ నుండి నామిని, తెలంగాణ నుండి తెలిదేవర పూర్తిగా మాండలికంలో రాస్తారు. ఈ మధ్య ఒకరిద్దరు ఇతర కొత్త రచయితలు కూడా మాండలికాన్ని బాగానే రాస్తున్నట్టున్నారు. పాత్ర మాట్లాడే వాక్యంలో కొన్ని పదాలు మాత్రమే మాండలికంలో వుండి వేరే చోట్ల మాండలిక పదానికి అవకాశం వున్నా శిష్టవ్యావహారికమో సంస్కృత పదమో వుంటే, అది సహజత్వమెలా అవుతుంది? ముఖ్యంగా వాక్యం చివర్లో మాత్రమే మాండలిక పదం వుండి, మిగతా పదాలన్నీ శిష్ట వ్యావహారిక పదాలైనప్పుడు గుర్రం శరీరానికి గొర్రెతోకను తగిలించినట్టుగా వుంటుందని చెప్పాల్సివస్తుంది. అయితే మాండలికాన్ని చదవగానే చాలామంది పాఠకులు ఒక రకమైన పారవశ్యానికి లోనై, ఆ రచనను బాగా మెచ్చుకుంటారు. మాండలికమే కవిత్వం అని భ్రమపడే పాఠకులు యీ రోజుల్లో చాలా మంది వుండటం విచారకరం. మాండలికం రాసినా మళ్లీ అందులో కవిత్వం ఉండాలని మరచిపోకూడదు.</p>
<p>ఈ ఆధునిక రచనా యుగంలో కొన్ని పదాలను రెండు రకాలుగా రాయవచ్చు. వాటిలో దేన్నీ అసమంజసం అనలేము &#8211; స్ట్రిక్టుగా చూస్తే వాటిలో ఒకదాంట్లో వ్యాకరణపరమైన దోషం వున్నప్పటికీ. ఉదాహరణకు కొందరు ఒక్క, ఉదయం, ఉత్పత్తి, ఉధృతి మొదలైన పదాలను వొక్క , వుదయం, వుత్పత్తి, వుధృతి అని రాస్తారు. అదేవిధంగా ఎక్కడ, ఇష్టం, ఎలా, ఇల్లు మొదలైన పదాలను యెక్కడ, యిష్టం, యెలా, యిల్లు అని రాస్తారు. చదవడం, పలకడం అని కొందరు రాస్తే, మరి కొందరు చదవటం, పలకటం అని రాస్తారు. ఇట్లా రాసేవారిలో మళ్లీ రెండు రకాలవాళ్లను మనం గమనించవచ్చు. కొందరు అప్పుడప్పుడు మాత్రమే ‘ఉ’కారానికి బదులు ‘వు’కారాన్ని,‘అ’కారానికి బదులు ‘య’కారాన్ని రాస్తే, మరికొందరు ప్రతిసారీ అట్లానే రాస్తారు. అందులో మనం ఏ విధానాన్ని పాటించబోతున్నాం అనే విషయంలో స్పష్టతను కలిగి ఉండాలి ఎవరికి వారు. మరొక్క విషయం: ఒక formలో, ఒక modeలో రాయటం మొదలు పెట్టింతర్వాత వ్యాకరణానికి గట్టిగా అతుక్కోకుండా సందర్భానికి తగినట్టుగానే – అంటే ఆ form లో, ఆ mode లో ఒదిగిపోయేట్టుగానే &#8211; రాయడం సమంజసం (ఉదాహరణకు అన్ని వాక్యాల్లో వచ్చాడు, లేచాడు, తిన్నాడు మొదలైన పదాల్ని వాడుతూ, మధ్యన వొకచోట అకస్మాత్తుగా వచ్చెను అని కాని, వచ్చిండు అని కాని రాయటం). కొన్ని పదాలను రెండు మూడు విధాలుగా రాయవచ్చునని చెప్పినంత మాత్రాన, ప్రాథమిక భాషా సూత్రాలను కాలదన్ని మన ఇష్టమొచ్చిట్టుగా పదాలను వాడొచ్చునని కాదు దాని అర్థం.</p>
<p>భాషాపరులెవరైనా ఒక సూచనను చేసినప్పుడు, బల్లిలాగా దానికి మరీ గట్టిగా అతుక్కుపోవాల్సిన అవసరం లేదేమో. ఉదాహరణకు ‘బడు’ ప్రయోగం వద్దని యెవరో అన్నారు. కాని ‘బడు’ ప్రయోగాన్ని మానుకుంటూ ఏ రకమైన అపసవ్యతా లేకుండా వాక్యాన్ని రూపొందించటం అందరికీ అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చును. మరికొన్ని సార్లైతే అట్లా ప్రయత్నించినప్పుడు పూర్తిగా విరుద్ధమైన అర్థం ఉత్పన్నం అయ్యే అవకాశం కూడా వుంది. ఉదాహరణకు ‘ఆహ్వానింపబడిన వారు’ అనటానికి బదులు ‘బడు’ ప్రయోగాన్ని మానుకుంటూ ‘ఆహ్వానించిన వారు’ అని (‘నిర్వాహకులు ఆహ్వానించిన వారు’ అనే అర్థంలో) వాడితే పూర్తిగా విరుద్ధమైన అర్థం వస్తుంది. ఇట్లాంటి సంఘటన వొకటి నిజంగా జరిగింది కూడా! ఒక అపసవ్యతను లేక ఎబ్బెట్టుతనాన్ని లేక భిన్నమైన అర్థాన్ని తప్పించుకునే ప్రయత్నంలో మరింత అపసవ్యత లేక ఎబ్బెట్టుతనం లేక విరుద్ధమైన అర్థం కలిగిన వాక్యాన్ని రూపొందించడం కంటె, తక్కువ అపసవ్యత వున్న ఆ మొదటి వాక్యాన్నే రాయటం నయం కాదా? వీలైన చోట ‘బడు’ ప్రయోగాన్ని మానుకుంటే ఫరవా లేదు. ‘యొక్క’ అన్న ప్రయోగం కూడా యిటువంటిదేనని అనిపిస్తుంది ఒక్కొక్కసారి.</p>
<p>కొందరు ‘కాళ్ళు’ అని రాస్తారు. కొందరేమో ‘కాల్లు’ అని తప్పుగా రాస్తారు. మరికొందరు తమ విచక్షణను ఉపయోగించి ‘కాళ్లు’ అని రాస్తారు. అదేవిధంగా అతన్ని, అతణ్ణి, అతణ్ని – ఈ మూడు రకాలుగా పదాలను రాతలో, అచ్చులో చూస్తాం మనం. ఈ వ్యాస రచయిత కాళ్లు, అతణ్ని అన్న రూపాల వైపే మొగ్గు చూపుతాడు. లేకపోతే ‘అతడిని’ అని రాయొచ్చు, ఆ సందర్భం అనుకూలంగా వుంటే. ‘అతడ్ని’ అని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ రాయాలనిపించదు. ఎందుకంటే దాని ఉచ్చారణ ఎంత మాత్రం శ్రావ్యంగా ఉండదు. నిజానికి అందులో అపశ్రుతి ధ్వనిస్తుంది. కాని, దీనికి కూడా వొక భిన్నమైన కోణం వుంది. అదేమిటంటే ‘మో’ కవిత్వం వంటి సందర్భాల్లో వ్యాకరణ సూత్రాలు తమ ప్రసంగయోగ్యత (Relevance) ను కోల్పోతాయి కనుక వాటికి చెల్లుబాటు వుండదు. అటువంటి సందర్భాల్లో ‘అతడ్ని’ వంటి ప్రయోగాలు కూడా చక్కగా ఒదిగిపోతాయి. ఒకే అక్షరం రెండు సార్లు వరుసగా (అంటే పక్కపక్కన) రావడం చాలా సందర్భాల్లో ఉచ్చారణపరంగా బాగుండదు. ఉదాహరణకు పాడడం, వాడడం, వండడం మొదలైనవి. వీటికన్న పాడటం, వాడటం, వండటం అన్న రూపాలే బాగుంటాయి. కాని నిర్మించటంను ‘కట్టటం’ అనక తప్పదు. ఎందుకంటే ‘కట్టడం’ అన్నామనుకోండి. అప్పుడది వేరే అర్థాన్నిచ్చే విధంగా ఒక నిర్మాణాన్ని (Structure ను / Building ను) సూచిస్తుంది &#8211; ‘తాజ్ మహల్ వొక గొప్ప కట్టడం’ అనే వాక్యంలో మాదిరిగా. ఇక సొంత విషయం గురించి చెప్తూ రాసే వాక్యాల్లో చివర్న కాదు లేక కాను అన్న పదం వచ్చే సందర్భాలుంటాయి కొన్ని. ఉదాహరణకు నేను పండితుణ్ని కాదు అనవచ్చు, లేదా నేను పండితుణ్ని కాను అనవచ్చు. అప్పుడు ‘కాను’ తో ముగించిన వాక్యమే ఒకవిధంగా బాగుంటుందనిపిస్తుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలన్నది వాస్తవం.</p>
<p>కొన్ని సార్లు ఒక సమాసంలోని రెండు పదాలను కలిపి (వాటి మధ్యన ఖాళీ లేకుండా) రాయకపోతే పూర్తిగా భిన్నమైన అర్థం వచ్చే ప్రమాదం ఉంది. ఉదాహరణకు “అశాంతిపెనం మీద అటూయిటూ కదిల్తేనే / అందమైన కవిత్వపు కుందనపు బొమ్మ వెలుస్తుంది” అనే కవితాపంక్తులు ఉన్నాయనుకోండి (ఇవి స్వీయ కవితా పంక్తులు). ఇక్కడ అశాంతిపెనం అంటే అశాంతి అనే పెనం అని అర్థం. కాని అశాంతిపెనం అని కాక అశాంతి పెనం అని విడివిడిగా రాస్తే అశాంతి అన్నది విశేషణం అవటానికి బదులు విశేషణం కాని మామూలు నామవాచకంగా మారి వేరే అర్థాన్నిస్తుంది. అంటే విడివిడిగా రాసినప్పుడు అది సమాసం కాకుండా పోయి భిన్నమైన అర్థానికి దారి తీస్తుందన్న మాట. అదే విధంగా ‘రాత్రిలోయ అంచున నిలబడ్డాను’ అన్నప్పుడు, ‘రాత్రి అనే లోయ అంచున’ అనే అర్థం వస్తుంది. అలా కాక, రాత్రి లోయ అంచున నిలబడ్డాను అని మొదటి రెండు పదాలను విడివిడిగా రాసినప్పుడు, ‘రాత్రివేళలో లోయ అంచున నిలబడ్డాను’ అనే భావం స్ఫురిస్తుంది! పొగమంచులా (ఏదో ) వ్యాపించడం వేరు, పొగ మంచులా వ్యాపించడం వేరు. ప్రేమ సంకెళ్లు వేయడం వేరు, ప్రేమసంకెళ్లు (ఎవరో) వేయడం వేరు. ఈ విధంగా సమాసంలోని రెండు పదాలు విడివిడిగా వున్నప్పుడు పూర్తిగా భిన్నమైన అర్థం వచ్చే ఉదాహరణలను ఎన్నైనా చూపవచ్చు. ఈ యిబ్బందంతా రెండు అచ్చతెలుగు పదాలతో సమాసాన్ని ఏర్పరచినప్పుడే వస్తుంది. ‘నిశాగాధంలో (నిశ + అగాధంలో)’ అని రెండు సంస్కృత పదాలతో సమాసాన్ని తయారు చేసి ప్రయోగిస్తే ఏ తికమకా వుండదు. ఎందుకంటే ఆ సమాసంలోనే ‘నిశ అనే అగాధంలో’ అన్న అర్థం వస్తుంది తప్ప వేరే అర్థం వచ్చే అవకాశం దాదాపు లేదు. అయితే అటువంటి సంస్కృత పద ప్రయోగం ఆధునిక వచనకవితా సందర్భాల్లో చాలాసార్లు నప్పదనేది వాస్తవమే. ఇక అవసరమైన చోట కామా లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడేలా కొన్ని ఉదాహరణలిస్తాను. జి. ఎస్. శివ రుద్రప్ప రాసిన కన్నడ కవితకు ఈ వ్యాస రచయిత చేసిన అనువాదంలో<br />
ఇది నిద్రా? మరణమా?<br />
లేక ఒక కొత్త పుట్టుకా?<br />
ప్రతిదీ పరిచితం కానిది<br />
కొత్తది, సందేహాస్పదమైనది</p>
<p>అన్నప్పుడు చివరి పంక్తిలో కామా వుంటే ‘కొత్తది మాత్రమే కాకుండా సందేహాస్పదమైనది కూడా’ అనే అర్థం వస్తుంది. కామా లేకపోతే మాత్రం ఏదైతే కొత్తదో అది సందేహాస్పదమైనది అన్న భావం సూచితమౌతుంది. అదేవిధంగా ‘అమ్మ , నాన్న యిచ్చిన కానుక’ అన్నప్పుడు తల్లీ తండ్రీ యిద్దరూ కలిసి యిచ్చిన కానుక అని అర్థం. కామాను ఎగరగొడితే మాత్రం అమ్మ యొక్క నాన్న (తాత) యిచ్చిన కానుక అవుతుంది! మరో ఉదాహరణ చూడండి. “నా భార్య చికిత్స కోసం ఇరవై వేలు, అవసరమైతే ముప్ఫై వేలు అప్పు చేస్తా” అనే వాక్యముందనుకోండి. ఇది సూచించే అర్థమేమిటి? అవసరమైతే ఇరవై వేలే కాదు, ముప్ఫై వేల రూపాయలైనా అప్పు చేస్తాను అనే కదా? కాని ఈ వాక్యంలో కామాను పెట్టకపోతే “ఇరవై వేలు మాత్రమే అవసరమయినా అంతకంటె పది వేలు యెక్కువగా అప్పు చేస్తాను” అనే భిన్నమైన అర్థం రాదా?!</p>
<p>ఆధునిక వచన కవితా పంక్తుల్లో కామా, ఫుల్ స్టాప్, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం మొదలైన చిహ్నాలను పెట్టకపోవటమే మంచిదనే వొక అభిప్రాయం స్థిరపడిపోయింది. కాని కొన్ని సార్లు అవసరమైన చోట కొన్ని గుర్తుల్ని పెట్టకపోతే భావం అర్థం కాక, గందరగోళం నెలకొనే ప్రమాదం వుంది. ఉదాహరణకు ఈ కవితా పంక్తుల్ని పరిశీలించండి.<br />
బయట వొక చెట్టు<br />
బాగా కురుస్తున్న వెన్నెల్లో<br />
వేడి నిట్టూర్పుల వడగాడ్పులు<br />
కలత చెందే మనసు లోపల<br />
ఒక అసంబద్ధ సమ్మిశ్రణం మనసును చిత్రవధ చేస్తూ –</p>
<p>ఇందులో మొదటి పంక్తిలో ఒక భావం, తర్వాతి రెండు పంక్తుల్లో ఒక భావం, చివరి రెండు పంక్తుల్లో మరో భావం ఉందనుకోవాలా, లేక మొదటి రెండు పంక్తుల్లో ఒక భావం, తర్వాతి రెండు పంక్తుల్లో ఒక భావం, చివరి పంక్తిలో ఒక భావం ఉందనుకోవాలా? ఎందుకంటే ఆధునిక వచన కవితా శిల్పం యెన్నో కొత్త పుంతలు తొక్కి, వాక్యాలను వ్యతిరేక క్రమం (Reverse order) లో రాయటం ఈ రోజుల్లో మామూలు అయిపోయింది. మొదటి పంక్తిలోనే ఒక భావం అయిపోతే ఆ పంక్తి చివర, అంటే ‘చెట్టు’ తర్వాత ఒక అడ్డుగీత &#8211; రెండు హైఫన్లంత నిడివి ఉన్నది &#8211; పెట్టాలి. అట్లా కాదంటే రెండవ పంక్తిలోని ‘వెన్నెల్లో’ తర్వాత ఒక అడ్డుగీత, నాలుగవ పంక్తిలోని ‘లోపల’ తర్వాత ఒక అడ్డుగీత, లేక చుక్క పెట్టాలి. గందరగోళానికి తావిస్తాయనిపించే పంక్తుల చివర ఫుల్ స్టాప్ పెట్టకుండా కవిత్వం రాసినప్పుడు అయోమయం చోటు చేసుకోవటానికి అవకాశముంది. ఇంగ్లిష్ కవితలలో ఒక భావం ముగిసింతర్వాత ఫుల్ స్టాప్ పెడుతున్నారు. అదే విధంగా తెలుగు వచన కవితలలో కూడా అవసరమైన కొన్ని చోట్ల ఫుల్ సాప్ (చుక్క) పెట్టే పద్ధతి రావాలని ఈ వ్యాసకర్త అభిప్రాయం. కవిత్వం పూర్తి స్పష్టంగా ఉండకూడదు కనుక చుక్క పెటట్టకపోవటమే మంచిది అని వాదించే వాళ్లూ వుంటారు. అటువంటి వాళ్లకు ఓ నమస్కారం.</p>
<p>కవిత్వంలో భావం చాలా గొప్పదైనప్పుడు పదాలు ప్రాధాన్యం కోల్పోతాయన్నది పరిశీలన తర్వాత యేర్పడ్డ భావన. ఒక సార్వజనీనమైన ప్రపంచస్థాయి కవితా భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు ప్రత్యేకమైన పదాలను గుప్పించకపోయినా అంతిమ ప్రభావంలో అంత తేడా రాదు. కాని దీన్ని ఒప్పుకుంటూనే పదాల క్రమం మాత్రం ఏ సందర్భంలో కూడా ప్రాధాన్యాన్ని అసలే కోల్పోదు అని చెప్పాల్సి వుంటుంది. కేవలం కవిత్వంలోనే కాదు, వచన రచనల్లో కూడా ఈ పదాల క్రమం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఈ పదాల సరైన క్రమం రచనకు నిర్దిష్టతను ఆపాదిస్తుంది.</p>
<p>ఒక వాక్యంలో కేవలం ఒక అక్షరానికి కొమ్మును తగిలించటంతోనే ఆ వాక్యం లోని అర్థం పూర్తిగా మారిపోయే సందర్భాలూ వుంటాయి. ఉదాహరణకు “ఆ యింటికి ఒక్కడూ పోడు” అన్నప్పుడు ఒక్కడు కూడా (Not even one person) వెళ్లడు అని భావం. కాని ఆ యింటికి ఒక్కడు పోడు అన్నప్పుడు ఇతరులు పోతారు కాని ఒక్క వ్యక్తి మాత్రం వెళ్లడు అని అర్థం. ‘క్క’ ను ఒత్తి పలుకుతూ ‘ఒక్కడు పోడు’ అనే వాక్యాన్ని ‘ఒక్కడు కూడా పోడు’ అనే అర్థం వచ్చేలా చెయ్యొచ్చును. దీన్నే కాకువు అంటారు. కాని రాయటం ద్వారా అట్లాంటి అర్థాన్ని స్ఫురింపజేయలేము.</p>
<p>సంభాషణకి, భావనకి, ప్రణాళికకి &#8211; ఇట్లా దాదాపు ప్రతి పదానికీ ‘కి’ అనే అక్షరాన్ని తగిలించడం, అదేవిధంగా మనసుని, పడవని, గడపని, అంటూ ‘ని’ అన్న అక్షరాన్ని తగిలించటం సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితంనుండే ఎక్కువగా గమనిస్తున్నాం మనం. సాధారణంగా అకారాంత, ఉకారాంత పదాలకు కు, ను (ఉదా: సంభాషణకు, భావనకు, మనసును, పొడవును), ఇకారాంత పదాలకు ని, కి (ఉదా: ఆర్తిని, మనిషిని, మనవికి, ధరణికి) వాడాలనేది నియమంగా ఉండేది. కాని ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ కొత్త రకంగా రాయడం పట్ల ఈ వ్యాసకర్త అసంతృప్తిని వెలిబుచ్చటానికి, వ్యాకరణపరమైన అపసవ్యత కంటె ఉచ్చారణలో ధ్వనించే ఎబ్బెట్టుతనమే ఎక్కువ బలమైన కారణం. ఒక పదాన్ని పలుకుతున్నప్పుడు లేక వింటున్నప్పుడు అది శ్రవణ సుభగంగా, హాయిగా లేకపోతే, ఆ పదం వ్యాకరణపరంగా ఎంత దోషరహితమైనదైనా దాన్ని తలమీద పెట్టుకుని ఆదరించవలసిన అవసరం లేదనిపిస్తుంది. ఉదాహరణకు, ఛందోబద్ధమైన పద్యాల్లో అప్డు అనే పదాన్ని వాడుతారు పద్య కవులు (‘అప్పుడు’కు రూపాంతరంగా). ఇదేం పదంరా బాబూ అనుకుంటూ ప్రామాణిక నిఘంటువుల్లో వెదికితే, వాటిలో అది కాలరెత్తుకుని దర్జాగా దర్శనమిస్తుంది. శాస్త్రం అనుమతించినంత మాత్రాన అటువంటి వికృతమైన పదాలను &#8211; నిఘంటువుల్లో ఉన్నా సరే &#8211; ఎట్లా వాడుతాం?!</p>
<p>ఇంత చిన్నచిన్న విషయాలకు ప్రాధాన్యమివ్వవలసిన అవసరముందా? ఆ విధంగా రాయకపోతే వచ్చే పెద్ద నష్టమేమిటి? అనే ప్రశ్నలు ఉదయించవచ్చు. దీనికి సమాధానమేమంటే, నిజంగానే అంత పెద్ద నష్టమేమీ ఉండకపోవచ్చు కాని, భాష బాగా తెలిసినవాళ్లు లోలోపలే చిన్నగా నవ్వుకోవటం జరగవచ్చు!అది చాలదా? ఈ వ్యాసంలో చెప్పిన జాగ్రత్తలన్నిటినీ పాటిస్తే కవిత్వంలో కానీయండి వచన రచనల్లో కానీయండి స్పష్టత, సవ్యత, సూటితనం చోటు చేసుకోవటానికి అవకాశముంటుంది.</p>
<p>భాషాసవ్యతను సాధించడానికి ఒక పరిమితి అంటూ లేదేమో. ఆ దిశలో ఎంతగా ప్రయత్నం చేసినా ఏదో ఒక పదం తాలూకు కచ్చితత్వం గురించి అనుమానం వస్తూనే ఉంటుంది. నిఘంటువుల సహాయం, భాష బాగా తెలిసినవాళ్ల సహాయం తీసుకోవడమే దీనికి సరైన మార్గం. ఇక వ్యాకరణం కూడా సముద్రమంత విస్తారమైనది. ప్రసిద్ధులైన మహామహా పండితులకే భాషాదోషాలు తప్పని సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా భాషాసవ్యత పట్ల ఆసక్తినీ శ్రద్ధనూ చూపడం వల్ల రచనారంగంలో ఉన్నవారికి మేలే జరుగుతుంది తప్ప హాని జరగదు.</p>
<p>(అయిపోయింది)</p>
<p style="text-align: center;">***</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6047</wfw:commentRss>
		<slash:comments>24</slash:comments>
		</item>
		<item>
		<title>భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 5</title>
		<link>http://vaakili.com/patrika/?p=5875</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5875#comments</comments>
		<pubDate>Wed, 02 Jul 2014 19:17:47 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[మన తెలుగు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5875</guid>
		<description><![CDATA[<p>రమేష్ కుమార్, సురేష్ రెడ్డి. పేర్లను కొందరు ఇలా రాసుకోవటం అరుదేం కాదు. కాని అవి తప్పులు. ఎందుకంటే ఆ పేర్లలోని ఉత్తర పదాలు ‘ఈశుడు’కు చెందినవి.<br /> రమ + ఈశుడు = రమేశుడు. సుర + ఈశుడు = సురేశుడు. కనుక రమేశ్, సురేశ్ అని రాయటమే సవ్యమైనది. అదేవిధంగా కొందరు లతా మంగేష్కర్ అని తప్పుగా రాస్తారు. లతా మంగేశ్కర్ అనేదే రైటు. చలామణిలో ఉన్నంత మాత్రాన పదాలు తప్పులు కాకుండా పోవు! ‘చెలామణి’ అటువంటిదే! చలామణీ, చలావణీ కూడా సరైనవే అని ప్రామాణిక నిఘంటువుల్లో చెప్పబడింది. చెండాలము, చెంద్రుడు, చెరించు అని కూడా రాస్తారు చాలా మంది. ఇవన్నీ తప్పులే. ‘చె’ కు బదులు ‘చ’ ఉంటేనే సవ్యంగా ఉన్నట్టు అని గ్రహించాలి. అంకురము అనే పదంలాగే అంకూరము అన్నది కూడా ఉంది. కాని అంకూరార్పణము అనకూడదు. అంకురార్పణము అనే అనాలి. నిజానికి అంకురార్పణముకు బదులు ‘అంకురారోహణము’ సరైనదని ఈ మధ్యనే భాష గురించిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. సౌరభము లాగానే సౌరభ్యము అనే పదం కూడా ఉంది. రెండింటికీ అర్థం ఒక్కటే, వాసన. అలాగే సౌగంధము, సౌగంధ్యము రెండూ రైటే. “హనుమంతుడు లంకలోని సీతాదేవికి శ్రీ రాముని అంగుళీయాన్ని నిదర్శనంగా చూపించాడు” అనే వాక్యంలో అంగుళీయము తప్పు. అంగుళీయకము సరైన పదం.</p> <p>కొంత మంది అంచలంచలుగా అని రాస్తారు. కాని అది తప్పు. అంచె లేక అంచియ అంటే వరుస. కనుక ‘అంచెలంచెలుగా’ అనాలి. “ఎన్నో తరాల పాటు మా పూర్వీకులు కరణీకం చేసారు” అనే వాక్యంలో కరణీకం తప్పు కరణికము అనేదే సరైన పదం. భూమి తాలూకు యజమానిని కామందు అనటం వాడుకలో ఉన్న విషయం. కాని ఖామందు అన్నదే సరైన పదం. ఇది హిందుస్తానీ భాషనుండి వచ్చిన పదం కనుక, ‘భూఖామందు’ వైరి సమాసం అవుతుంది. భూకామందు అని వాడితే అది రెండు విధాలుగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg"><img class="alignleft  wp-image-5113" title="manatelugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg" alt="" width="393" height="282" /></a>రమేష్ కుమార్, సురేష్ రెడ్డి. పేర్లను కొందరు ఇలా రాసుకోవటం అరుదేం కాదు. కాని అవి తప్పులు. ఎందుకంటే ఆ పేర్లలోని ఉత్తర పదాలు ‘ఈశుడు’కు చెందినవి.<br />
రమ + ఈశుడు = రమేశుడు. సుర + ఈశుడు = సురేశుడు. కనుక రమేశ్, సురేశ్ అని రాయటమే సవ్యమైనది. అదేవిధంగా కొందరు లతా మంగేష్కర్ అని తప్పుగా రాస్తారు. లతా మంగేశ్కర్ అనేదే రైటు. చలామణిలో ఉన్నంత మాత్రాన పదాలు తప్పులు కాకుండా పోవు! ‘చెలామణి’ అటువంటిదే! చలామణీ, చలావణీ కూడా సరైనవే అని ప్రామాణిక నిఘంటువుల్లో చెప్పబడింది. చెండాలము, చెంద్రుడు, చెరించు అని కూడా రాస్తారు చాలా మంది. ఇవన్నీ తప్పులే. ‘చె’ కు బదులు ‘చ’ ఉంటేనే సవ్యంగా ఉన్నట్టు అని గ్రహించాలి. అంకురము అనే పదంలాగే అంకూరము అన్నది కూడా ఉంది. కాని అంకూరార్పణము అనకూడదు. అంకురార్పణము అనే అనాలి. నిజానికి అంకురార్పణముకు బదులు ‘అంకురారోహణము’ సరైనదని ఈ మధ్యనే భాష గురించిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. సౌరభము లాగానే సౌరభ్యము అనే పదం కూడా ఉంది. రెండింటికీ అర్థం ఒక్కటే, వాసన. అలాగే సౌగంధము, సౌగంధ్యము రెండూ రైటే. “హనుమంతుడు లంకలోని సీతాదేవికి శ్రీ రాముని అంగుళీయాన్ని నిదర్శనంగా చూపించాడు” అనే వాక్యంలో అంగుళీయము తప్పు. అంగుళీయకము సరైన పదం.</p>
<p>కొంత మంది అంచలంచలుగా అని రాస్తారు. కాని అది తప్పు. అంచె లేక అంచియ అంటే వరుస. కనుక ‘అంచెలంచెలుగా’ అనాలి. “ఎన్నో తరాల పాటు మా పూర్వీకులు కరణీకం చేసారు” అనే వాక్యంలో కరణీకం తప్పు కరణికము అనేదే సరైన పదం. భూమి తాలూకు యజమానిని కామందు అనటం వాడుకలో ఉన్న విషయం. కాని ఖామందు అన్నదే సరైన పదం. ఇది హిందుస్తానీ భాషనుండి వచ్చిన పదం కనుక, ‘భూఖామందు’ వైరి సమాసం అవుతుంది. భూకామందు అని వాడితే అది రెండు విధాలుగా తప్పు అవుతుందన్న మాట.</p>
<p>“ఏమోయ్, అంతా కులాసాయేనా?” అంటూ పలకరించటం సాధారణంగా మనం గమనించే విషయం. కాని ఖులాసా అన్న పదమే రైటు. ఈ పదం కూడా హిందుస్తానీ భాషనుండి తెలుగులోకి వచ్చింది. అయితే కులాసా అనే పదం కూడా తెలుగు భాషలో స్థిరపడిపోయింది. పూర్వం మన ఇళ్లల్లో రాగి చెంబులు, ఇత్తడి చెంబులు ఉండేవి. వాటిలో కొన్నింటిని ‘గుండు చెంబులు’గా చెప్పుకునే వారు. కాని అసలు గుండు చెంబు అనేది లేదు. సన్నని మెడను కలిగిన చెంబును ‘గిండి చెంబు’ అనీ, వెడల్పైన మూతిగల చెంబును లేక పాత్రను గుండిగ అనీ చెప్పటం సరైనది. “ఈ రోజుల్లో అంతా గూండా రాజ్యమైపోయింది. బస్తీని గూండాలు రాజ్యమేలుతున్నారు” ఇలాంటి వాక్యాలను చాలా మంది వాడుతారు. కాని గుండాలు అన్న పదమే సరైనది. గుండా అంటే ధీరుడు, శూరుడు, సాహసికుడు. “గురివింద గింజ తన నలుపునెరుగదు” అనే సామెత బాగా వాడుకలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాని, గురివింద అనే పదం తప్పు. గురిగింజ లేక గురివెంద అన్నవి సరైన పదాలు.</p>
<p>అణగు అంటే తగ్గు, నశించు అనే విషయం తెలియనివాళ్లు అరుదు. అనగు అనే మరో పదం ఉంది. అనగు అంటే వ్యాపించు అని అర్థం. నివృత్తి , నిర్వృతి అనేవి కూడా భిన్నమైన అర్థాన్ని కలిగిన పదాలే. నివృత్తి అంటే ఆగుదల, మోక్షము. నిర్వృతి అంటే ఊరట, ఉపశమనము. అదేవిధంగా అనేకము, అనీకము అని రెండు పదాలున్నవి. ఇవి కూడా భిన్నమైన అర్థాలను కలిగినవే. అనేకము = పెక్కు, చాలా. అనీకము = సేన, దండు. “ఈ విజయాన్ని సాధించటానికి నేను అహర్నిశలు పాటు పడ్డాను” అని ఒకాయన వాక్రుచ్చినాడనుకోండి. అది తప్పు పదమని గ్రహించాలి మనం. అహర్నిశము లేక అహర్నిశములు అనేవి సవ్యమైన పదాలు. అదేవిధంగా ‘అహోరాత్రులు’కు బదులు అహోరాత్రము అనేదే సరైన పదం. “అకస్మాత్తుగా ఆగంతకుడు లోపలికి రాగానే ఆమె భయంతో కంపించిపోయింది”- ఇట్లాంటి వాక్యాలను మనం కథల్లో, అపరాధ పరిశోధక నవలల్లో చదువుతుంటాం. కాని ఆగంతకుడు అన్నపదం తప్పు. ఆగంతుకుడు సరైన పదం. ఆగంతుకము = అనుకోకుండా వచ్చునది. సన్యాసిలాగ బతికేవాణ్ని సర్వసంగ పరిత్యాగి అనాలి, సర్వసంఘ పరిత్యాగి అని కాదు. సంగము = కూడిక, లేక చేరిక.</p>
<p>“రాత్రి కర్ణాటక సంగీత కచేరీ వినటానికి వెళ్లాము. కచేరీ బాగానే ఉంది కాని, పాడేటాయనకు పక్కన ఉన్న అమ్మాయి తంబూరను సరిగ్గా సుతి చేయలేదు” ఇట్లాంటి వాక్యాలను అప్పుడప్పుడు వింటుంటాం మనం. కొందరు ‘తంబురా’ అని కూడా అంటారు. కాని ఆ రెండు పదాలూ తప్పే. తంబుర లేక తంబుఱ (తంత్రి + బుఱ్ఱ) అనేవి సరైన పదాలు. తుల్యము, తౌల్యము &#8211; ఈ రెండు పదాల మధ్య భేదాన్ని గుర్తించరు కొంత మంది. “మనం తీసుకునే ఆహారంలో సమతుల్యం ఉండాలి” అనకూడదు “సమతౌల్యం ఉండాలి” అనాలి. “మన ఆహారం సమతుల్యంగా ఉండాలి” అనవచ్చు. సమతుల్యం విశేషణం (Adjective). సమతౌల్యం నామవాచకం (Noun). కొత్తిమిరి విత్తులను (కొత్తిమిర కాదు) ధనియాలు అనడం తప్పు. దనియాలు అనేది సరైన పదం.</p>
<p>“తిలాపాపం తలా పిడికెడు” అని ఒక సామెత ఉంది. ఇందులో తిలాపాపం అనే పదబంధం సరైనదేనా? లేక ‘తిలపాపం’ సరైనదా? భాషాజ్ఞానం బాగా ఉన్నవాళ్లే ఈ అనుమానాన్ని తీర్చగలరు. అదేవిధంగా ఆరాధనభావం అనాలా, లేక ఆరాధనాభావం అనాలా? అసలు రెండు పదాలతో ఒక సమాసాన్ని ఏర్పరచేటప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరానికి ఎప్పుడు దీర్ఘం వస్తుంది, ఎప్పుడు రాదు? ఈ సందేహానికి వివరణ మామూలు వ్యాకరణ గ్రంథాల్లో సాధారణంగా దొరకదు. పండితులైన పాఠకులు ఎవరైనా ఈ విషయం గురించిన వివరణ ఇస్తే మనం నేర్చుకోవచ్చును. కనుక అభిప్రాయాలను, సమాధానాలను ఆహ్వానిస్తున్నాం. ఆధునిక వచన కవిత్వంలో నాగేటి చాలు అనే పదం కనిపించటం అరుదేం కాదు. అది భాషాదోషం అనుకుంటాం. కాని, నాగలి వలెనే నాగెలి, నాగేలు అన్న పదాలు కూడా మనభాషలో ఉన్నాయి!. కనుక ‘నాగేటి చాలు’ కరెక్టే.</p>
<p>ఒక గొప్ప వక్త గురించి చెబుతూ “అతడు అనర్ఘళంగా ఉపన్యసిస్తాడు” అనే వ్యాఖ్య చేసామనుకోండి. అందులో అనర్ఘళం అనే పదం తప్పు. అనర్గళం అన్నది సరైన పదం. కాబట్టి ‘అనర్ఘలం’లో రెండు తప్పులు ఉన్నట్టు గ్రహించాలి. నిరర్గళం కూడా అనర్గళంకు సమానమైన పదం. ఈ రెండు పదాలు అడ్డంకి లేనిది అనే అర్థాన్నిస్తాయి. అర్గళము = గడియ మ్రాను (తలుపుకు అడ్డంగా ఉంచే కర్ర). వ్యాఖ్యకు వ్యాఖ్యానముకు మధ్య స్వల్ప భేదం ఉంది. వ్యాఖ్య = అర్థ వివరణ (Comment). వ్యాఖ్యానము = అర్థ వివరణము చేయుట (Commentary). నిస్త్రాణ, నిస్త్రాణము అన్న పదాల మధ్య కూడా భేదం ఉంది. త్రాణ = శక్తి, బలము. త్రాణము = రక్షణ. కనుక శక్తి లేకపోవడాన్ని నిస్త్రాణ అనీ, రక్షణ లేమిని నిస్త్రాణము అనీ అనడం సరైనది. పక్షిని అండజము అంటారని చాలా మందికి తెలుసు. కాని నీడజము అంటే కూడా పక్షే అని తెలుసినవాళ్లు ఎక్కువ మంది ఉండకపోవచ్చు. నీడము = గూడు. గూడులో పుట్టినది కావడం వల్ల నీడజము అయింది పక్షి. నీడోద్భవము అంటే కూడా పక్షే. “ఫలానా ప్రజా నాయకుని పార్థివ శరీరాన్ని ప్రజల సందర్శనార్థం ఫలానా గ్రౌండులో ఉంచారు” అని వార్తల్లో చెప్పటం, పత్రికల్లో రాయటం గమనిస్తుంటాం మనం. ఇందులో పార్థివకు పృథ్వీ సంబంధమైన అనే అర్థం ఉంది. అంటే ‘భౌతిక’కు దాదాపు సమానమైన పదమన్న మాట.</p>
<p>“ప్రయాణీకులకు విజ్ఞప్తి” అంటూ బస్ స్టాండుల్లో, రేల్వే స్టేషన్లలో రాసి ఉండటం మనం గమనించ వచ్చు. ప్రయాణం చేసేవాళ్లను ప్రయాణికులు అనాలి, ప్రయాణీకులు అనకూడదు. అదేవిధంగా యాత్రికులుకు బదులు యాత్రీకులు అని రాయడం సబబు కాదు. ఊళ్లలో ఎవరి పశువులైనా ఇతరుల పొలాల్లోకి పోయి పంట మొక్కల్ని మేస్తే, గ్రామ పంచాయతి (పంచాయితి కాదు) వాళ్లు వాటిని పట్టుకుని ఒక శాల వంటిదానిలో కట్టేస్తారు. ఆ పశువుల యజమానులు అపరాధ రుసుము కట్టితేనే వాటిని విడుదల చేస్తారు. ఆ శాలను బందెల దొడ్డి అనాలి. బంజరు దొడ్డి అన్నది సరైన పదం కాదు. బందె = పశువుల చెఱ.</p>
<p>ఒక స్త్రీ పాపను ప్రసవిస్తే కొన్ని రోజుల వరకు ఆమెను ‘బాలింత’గా ప్రస్తావించటం మామూలు విషయమే. కాని ‘బాలింత’ తప్పు. బాలెంత సరైన పదం. అదేవిధంగా బాలింతరాలు కాక బాలెంతరాలు అన్నది సవ్యమైన పదం. “మా ఇంట్లో బొజ్జింకల బాధ మరీ ఎక్కువైపోయింది. వాటితో వేగలేక చస్తున్నాం” అంటుంటారు కొందరు. మరికొంత మంది బొద్దెంకలు అని కూడా వాక్రుచ్చుతారు. కాని ఈ రెండు పదాలూ తప్పే. బొద్దింక లేక బొద్దీక అనేది రైటు. బొటన వేలును కొందరు బ్రొటన వేలు అనడం కూడా తప్పే. వ్యభిచారము అనే పదానికి గల పర్యాయ పదాల్లో ‘నల్ల మేక తప్పు’ అనేది ఒకటి. అయితే బ్రహ్మ రథము లాగ ఇది కూడా చాలా అసంబద్ధం అనిపించక మానదు. నల్లమేక తప్పు అనే పదబంధం ఎలా వచ్చిందో, అందులోని పదాలకూ అర్థానికీ మధ్య ఏదైన పొంతన ఉంటే అదేమిటో తెలియదు. పాఠకుల్లో ఎవరికైనా తెలిస్తే వివరణను మాకు తెలియపరచ వలసిందిగా కోరుతున్నాం.</p>
<p>“వచ్చే మాసంనుండి మీకు శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది. కనుక మీరు ఉచ్ఛ స్థితిలో ఉండబోతున్నారు” అని ఏ సిద్ధాంతో లేక జ్యోతిష్కుడో చెప్పవచ్చును. కాని ఉచ్ఛస్థితి తప్పు ‘ఉచ్చస్థితి’ సరైనది. ఉచ్చము = ఉన్నతము, పొడవు. విలంబము, విలంభము అనేవి విభిన్న అర్థాలున్న రెండు వేర్వేరు పదాలు. విలంబము అంటే ఆలస్యము. విలంభము అంటే త్యాగము. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలోని ఖయాళ్లలో విలంబిత్, ద్రుత్ అని రెండు భాగాలు ఉంటాయి. విలంబితము = మెల్లగా సాగునది. ద్రుతము (దృతము కాదు) = వడి గలది. అదేవిధంగా వియ్యము, వియ్యపురాలు అనే పదాలున్నవి. వాటికి సమానార్థకాలైన వీయము, వీయపురాలు కూడా సరైన పదాలే.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5875</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 4</title>
		<link>http://vaakili.com/patrika/?p=5757</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5757#comments</comments>
		<pubDate>Mon, 02 Jun 2014 21:48:41 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[మన తెలుగు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5757</guid>
		<description><![CDATA[<p><br /> ఒక మాస్టారు విద్యార్థితో “ఒరేయ్, సరైన ఉచ్ఛారణ నేర్చుకోరా” అన్నాడనుకోండి. అప్పుడు ఆ మాస్టారుకే సరైన ఉచ్చారణ తెలియదనుకోవాలి. ఉచ్చారణను ఉచ్ఛారణ అని తప్పుగా ఉచ్చరించటం చాలా మంది విద్యాధికులు చేసే పొరపాటు (పొరబాటు కాదు). ఆంగ్లంలో కూడా ఈ ఉచ్చారణ అన్న పదానికి సంబంధించిన సరైన ఉచ్చారణ తెలియక చాలా మంది పప్పులో కాలు వేస్తుంటారు. ఉచ్చరించటంను ఆంగ్లంలో ప్రొనౌన్స్ (Pronounce) అంటాము. కాని ఉచ్చారణను మాత్రం ప్రొనౌన్సియేషన్ (Pronounciation) అనకూడదు, ప్రొనన్సియేషన్ (Pronunciation) అనాలి.</p> <p>కొన్ని పదాలను కొందరు సరిగ్గానే రాస్తారు కాని వాటిని ఉచ్చరించటం లోనే పొరపాటు చేస్తారు. ‘విద్యార్థులు’కు బదులు విధ్యార్థులు అని ఉచ్చరిస్తారు. అదేవిధంగా ‘అధ్యాపకులు’కు బదులు అద్యాపకులు అని పలుకుతారు. టీచర్లకన్న స్టూడెంట్లు గొప్పవాళ్లు కనుక (!), విద్యార్థులకు రెండవ అక్షరానికి వత్తు తగిలించి, అధ్యాపకులకు ఉన్న వత్తును తొలగించటం జరుగుతుందని, పైగా స్టూడెంట్లు విద్య చేత ‘ఆర్తి’ చెందినవారు (బాధ పెట్టబడిన వారు) కనుక విధ్యార్తులు అని కూడా పలుకుతారని సినారె గారు ఒక సాహిత్య సభలో చమత్కరించటం నాకింకా జ్ఞాపకమే.</p> <p>కోమా(Coma) ను కొంతమంది అపస్మారం అనటానికి బదులు అపస్మారకం అంటారు. అది తప్పు. అనవసర ఖర్చును దుబారా ఖర్చు అంటాము కదా. ఈ దుబారా అనే పదం బహుశా ఉర్దూ/ఫారసీ నుండి వచ్చిన అన్యదేశ్యం. ఆ భాషల్లో దుబారా అంటే రెండవ సారి. అయితే దూబఱ అన్నది కూడా సరైన పదమే. ఫలానా కళ్యాణ మంటపము అని బోర్డు మీద రాసి ఉన్నదనుకోండి. అప్పుడు మండపముకు బదులు మంటపము అని తప్పుగా రాసారనుకోవాలి. ప్రమాణిక నిఘంటువుల్లో మండపము అనే పదమే ఉంది. కాని కొన్ని ఇతర నిఘంటువుల్లో మంటపము కూడా ఉంది. ‘కళ్యాణ మంటపములో’ కళ్యాణ కూడా తప్పే. అదేవిధంగా అపేక్ష , ఆపేక్ష అన్న పదాలు. ప్రమాణిక నిఘంటువుల్లో ‘అపేక్ష’ మాత్రమే ఉంది. పశువులను మేపేవాడిని పశువుల [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg"><img class="alignleft  wp-image-5113" title="manatelugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg" alt="" width="393" height="282" /></a><br />
ఒక మాస్టారు విద్యార్థితో “ఒరేయ్, సరైన ఉచ్ఛారణ నేర్చుకోరా” అన్నాడనుకోండి. అప్పుడు ఆ మాస్టారుకే సరైన ఉచ్చారణ తెలియదనుకోవాలి. ఉచ్చారణను ఉచ్ఛారణ అని తప్పుగా ఉచ్చరించటం చాలా మంది విద్యాధికులు చేసే పొరపాటు (పొరబాటు కాదు). ఆంగ్లంలో కూడా ఈ ఉచ్చారణ అన్న పదానికి సంబంధించిన సరైన ఉచ్చారణ తెలియక చాలా మంది పప్పులో కాలు వేస్తుంటారు. ఉచ్చరించటంను ఆంగ్లంలో ప్రొనౌన్స్ (Pronounce) అంటాము. కాని ఉచ్చారణను మాత్రం ప్రొనౌన్సియేషన్ (Pronounciation) అనకూడదు, ప్రొనన్సియేషన్ (Pronunciation) అనాలి.</p>
<p>కొన్ని పదాలను కొందరు సరిగ్గానే రాస్తారు కాని వాటిని ఉచ్చరించటం లోనే పొరపాటు చేస్తారు. ‘విద్యార్థులు’కు బదులు విధ్యార్థులు అని ఉచ్చరిస్తారు. అదేవిధంగా ‘అధ్యాపకులు’కు బదులు అద్యాపకులు అని పలుకుతారు. టీచర్లకన్న స్టూడెంట్లు గొప్పవాళ్లు కనుక (!), విద్యార్థులకు రెండవ అక్షరానికి వత్తు తగిలించి, అధ్యాపకులకు ఉన్న వత్తును తొలగించటం జరుగుతుందని, పైగా స్టూడెంట్లు విద్య చేత ‘ఆర్తి’ చెందినవారు (బాధ పెట్టబడిన వారు) కనుక విధ్యార్తులు అని కూడా పలుకుతారని సినారె గారు ఒక సాహిత్య సభలో చమత్కరించటం నాకింకా జ్ఞాపకమే.</p>
<p>కోమా(Coma) ను కొంతమంది అపస్మారం అనటానికి బదులు అపస్మారకం అంటారు. అది తప్పు. అనవసర ఖర్చును దుబారా ఖర్చు అంటాము కదా. ఈ దుబారా అనే పదం బహుశా ఉర్దూ/ఫారసీ నుండి వచ్చిన అన్యదేశ్యం. ఆ భాషల్లో దుబారా అంటే రెండవ సారి. అయితే దూబఱ అన్నది కూడా సరైన పదమే. ఫలానా కళ్యాణ మంటపము అని బోర్డు మీద రాసి ఉన్నదనుకోండి. అప్పుడు మండపముకు బదులు మంటపము అని తప్పుగా రాసారనుకోవాలి. ప్రమాణిక నిఘంటువుల్లో మండపము అనే పదమే ఉంది. కాని కొన్ని ఇతర నిఘంటువుల్లో మంటపము కూడా ఉంది. ‘కళ్యాణ మంటపములో’ కళ్యాణ కూడా తప్పే. అదేవిధంగా అపేక్ష , ఆపేక్ష అన్న పదాలు. ప్రమాణిక నిఘంటువుల్లో ‘అపేక్ష’ మాత్రమే ఉంది. పశువులను మేపేవాడిని పశువుల కాపరి అంటాం కదా. ‘పసుల కాపరి’ అన్నా కరెక్టే. ఎందుకంటే పశువులుకు సమానమైన పదం పసులు.</p>
<p>‘స’ కు బదులు ‘శ’ రాయటం కూడా మనం గమనించవచ్చు. రాశాను, చేశాను, చూశాను, వేశాను &#8211; ఇలాంటి పదాల్లో ‘శా’ అక్షరం ఒప్పుగా చలామణి అవుతున్నప్పటికీ, రాసాను, చేసాను, చూసాను, మొదలైనవే కరెక్టు. ఎందుకంటే ఈ పదాల అసమాపక క్రియలను రాసినప్పుడు రాసి, చూసి, చేసి, అనే అంటాం కాని రాశి, చేశి…. అనం. ఒకవేళ అన్నా అవి తప్పులే. “నరశింహం కుర్చీలో ఆశీనుడై ఉన్నాడు”- ఇట్లాంటి వాక్యాలతో కథను మొదలుపెట్టే కథా రచయితలూ ఉంటారు. కాని ప్రారంభ వాక్యంలోనే రెండు తప్పులున్నాయని ఎడిటర్ గారు ఆ కథాప్రతిని చించి, చి.కా.బు.కు దాఖలు చేస్తారు (చికాబు అంటే చిత్తు కాగితాల బుట్ట అని తెలియని పాఠకులు ఉండరు బహుశా). అలాగే వీశెడు అనే పదాన్ని ఒక కొలమాన ప్రమాణానికి సమానార్థకంగా వాడుతారు. కాని వీసెడు అన్నదే సవ్యమైన పదం. వీసె, వీసియ, వీసము ఇవన్నీ సరైన పదాలే. వీశె, వీశ అన్నవి తప్పులు. “మరేనండీ, మీకు శాలరీ వచ్చింది కదా. నాకోసం ఓ శారీ కొనరూ?” అని తన భర్తను అడుగుతుంది ఓ ఇల్లాలు. మరొకావిడ “ఏమండీ బియ్యం నిండుకున్నాయి. ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కొట్టులోంచి కొన్ని శాంపిళ్ల బియ్యం తీసుకు రండి. వండుకుని చూద్దాం” అంటుంది. Salary, Sari, Sample లను సాలరీ, సారీ, సాంపిల్ అని ఉచ్చరించాలి.</p>
<p>“రాత్రి సినిమాకు వెళ్లావట కదా. ఎలా ఉందేమిటి సినిమా?” అని ఒక మిత్రుడు అడిగితే “వరష్టుగా ఉంది” అని జవాబివ్వటం మనం గమనించవచ్చు. అలాగే “పోలీసులు ఆ దొంగల్ని అరెష్టు చేసారు” అని ఉచ్చరిస్తారు కొంత మంది. ఇవి ఉచ్చారణలోని దోషాలు అనేదాంట్లో సందేహం ఉండకూడదు. వర్స్ట్ , అరెస్ట్ అని ఉచ్చరించటం సరైనది. ఇవి ఆంగ్ల పదాలైనా వీటిని మనం తరచుగా వాడుతాము కనుక ఈ పదాల సరైన ఉచ్చారణ కూడా తెలిసి ఉండాలి మనకు.</p>
<p>నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు నా స్నేహితుడొకడు, శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో జమున (సత్యభామ) టెంపర్ అనే ఆంగ్ల పదాన్ని మాట్లాడిందని చెప్పటంతో ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. చాలా సంవత్సరాల తర్వాత ఆ సినిమాను చూసిన నేను, నా స్నేహితుడు పొరపాటు పడ్డాడని గ్రహించాను. ఆ సినిమాలో సత్యభామ (జమున) “ఎంత తెంపరితనమే నీకు?” అనే డైలాగును అంటుంది. మనవాడు తెంపరిని టెంపర్ గా తప్పుగా అర్థం చేసుకున్నాడు. తెంపరి అంటే సాహసికురాలు. తెంపు + అరి = తెంపరి. తెంపరితనము అంటే సాహసము. ఇదేవిధంగా స్వల్ప భేదంతో దాదాపు ఒకేలా ఉండే పదాలు కొన్ని ఉంటాయి. నీటు అన్నది నీట్ (Neat) అనే ఆంగ్ల పదాన్ని తలపిస్తుంది. కాని అది తెలుగు పదమే. నీటు = అందము, మురిపము. నీటుగాడు = శృంగారాన్ని ఒలకబోసే అందగాడు. తందర అనే మరొక తెలుగు పదం ఉంది. ఇది ‘తొందర’ లాగ వినిపించే పదం. తందర = కునికిపాటు. తంద్ర అని కూడా అనవచ్చు.</p>
<p>గుంఫనము, గుంభనము వేర్వేరు పదాలు. “ఆయన గారి కవిత్వంలో పదగుంఫనం అతిగా ఉంటుంది” అన్నప్పుడు గుంఫనము = మాటలను కూర్చుట లేక గుప్పించుట. “వాళ్ల ఇంట్లోని గొడవల గురించి కూపీ లాగాలని ఎంతో ప్రయత్నించాను. కాని వాళ్లందరూఎంతో గుంభనంగా ఉన్నారు” అన్నప్పుడు గుంభనము = తేటతెల్లముగా లేకపోవుట. ప్రణతి, ప్రణుతి కూడా వేర్వేరు పదాలు. ప్రణతి = నమస్కారము. ప్రణుతి = వాసి, ప్రసిద్ధి. బావి, భావి అనేవి వేరువేరు పదాలు అని తెలిసినా రాసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే పొరపాటు చేసినవాళ్లం అవుతాము. బావి = కూపము (Well). భావి = భవిష్యత్తు. షష్టి , షష్ఠి గురించి ముందే చెప్పుకున్నాం. షష్టి = అరవై. షష్ఠి = ఆరవ. “తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పుళిహోర, దద్దోజనం రెండూ తీసుకున్నాము” అని ఎవరైనా చెబితే, రెండు పదాలనూ తప్పుగా వాడినారని వెంటనే గమనించాలి. పులిహోర లేక పులియోర అనేవి సరైన పదాలు. పుళిహోర తప్పు. కొందరు పులిహార అంటారు. అది కూడా తప్పే. ఇక దధి + ఉదనము = దధ్యోదనము అవుతుంది. దద్ధోజనము తప్పు.</p>
<p>ఒకసారి టీ.వీ.లో ఒక విలేకరి దృష్ట్యంతము అనే పదాన్ని పదేపదే ప్రయోగించాడు. ఆ పదాన్ని ఎన్నిసార్లు మళ్లీమళ్లీ వాడాడంటే సాధారణంగా అందరూ దృష్టాంతము అంటారు కాని, అది తప్పు, దృష్ట్యంతము సరైన పదం &#8211; అని శ్రోతలకు/వీక్షకులకు అన్యాపదేశంగా తెలియజెప్పాలని అతనికి కోరికగా ఉన్నట్టు అనిపించింది. కాని అది దృష్టి + అంతము కాదు. యాదృచ్ఛికంగా ఆ పదంలో దృష్టి అన్న పదాన్ని విడదీసే అవకాశముందని అనిపించినంత మాత్రాన, అట్లా విడదీయటం తప్పు. కాబట్టి దృష్టాంతము అనేదే రైటు. ఇంగ్లిష్ లో Prepone అనే పదాన్ని కూడా ఇలానే తప్పుగా వాడుతారు చాలా మంది. ఆంగ్ల భాషలో Prepone అన్న పదమే లేదు! ‘Postpone’ ఉన్నది. కాని అది ఏకపదం (Single word). యాదృచ్ఛికంగా అందులో Post అన్న పదం ఉన్నందుకు Post mortem, Post modern, Post natal, Post independence లలా దాన్ని భావించకూడదు. మరి Postpone కు విరుద్ధమైన ఆంగ్ల పదమేది? అంటే దానికి సమాధానం Advance. పరీక్షలు కొన్ని రోజులు ముందుకు జరిగాయి అనదల్చుకుంటే అప్పుడు The exams are/were advanced అనాల్సి ఉంటుంది. అదేవిధంగా Urbane కూ Urban కూ మధ్య ఎటువంటి సంబంధం లేదు. అర్బన్ అంటే పట్టణ (సంబంధమైన). అర్బేన్ అంటే ‘మాటతీరులో, వ్యవహారంలో మర్యాదగా ఉండే’ అని అర్థం. ఇవి రెండూ విశేషణాలు (Adjectives). పల్లెటూళ్లలో ఉండే మనుషుల్లో కూడా urbanity కనిపించవచ్చు.</p>
<p>గోమేధికము అనేది నవరత్నాలలో ఒకటి. అయితే కొంత మంది గోమేధుకము అని తప్పుగా రాస్తారు. “ఫలానా విషయం గురించి ప్రజా సంఘాలవాళ్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు” అని వార్తాపత్రికల్లో ప్రచురితమవ్వటం సాధారణంగా జరిగేదే. కాని ఒత్తిడి అనే పదం తెలుగు భాషలో లేదు. ‘ఒత్తడి’ మాత్రమే ఉంది. ఒత్తడి లేక ఒరపిడి లేక ఒరిపిడి &#8211; ఈ పదాలు రాపిడి అనే అర్థాన్నిస్తాయి. వత్తిడి కూడా తప్పే. అయితే ఒత్తిడి అన్న పదం మన భాషలో బాగా పాతుకునిపోయి స్థిరపడింది కనుక, ఇప్పుడు భాషాసవ్యత కోసం ఒత్తిడికి బదులుగా ఒత్తడి అన్న పదాన్ని వాడలేము. ఛందోబద్ధమైన పద్యాలను రాస్తున్నప్పుడు గాని, గ్రాంథిక భాషను రాస్తున్నప్పుడు గాని ఒత్తడి అని ఉపయోగించ వచ్చు. కొన్ని పదాల్లో ఒక అక్షరానికి దీర్ఘాన్ని చేర్చటం ఒక్కోసారి సరైనదైతే ఒక్కొసారి తప్పు అవుతుంది. అధిపతి కరెక్టే కాని, అధిపత్యము తప్పు. ‘ఆధిపత్యము’ రైటు. అదేవిధంగా అభిజాతుడు రైటే కాని, అభిజాత్యము తప్పు. ఆభిజాత్యము అనాలి. అలంకారం, ఆలంకారికం సరైనవి. అలంకారికం తప్పు. కాని ‘ఘి’ కి దీర్ఘాన్ని చేర్చుతూ సాంఘీకము అన్నామనుకోండి. అది తప్పు అవుతుంది. సాంఘికము అనేదే రైటు.</p>
<p>అధిదేవత, అధిదేవుడు, అధిదైవము అంటే పరమాత్మ. కాని ‘రసాధిదేవత’కు బదులు రసాదిదేవత అని రాస్తారు కొంత మంది. ఆది అంటే మొదటి, లేక ఇతర కనుక, రసాదిదేవతలు అన్నప్పుడు తప్పు అర్థం ఉత్పన్నం అవుతుంది. “దేవుని పూజ కోసం సమస్త సామాగ్రి తెచ్చాను” అన్నాడనుకోండి ఓ పురోహితుడు. అప్పుడు ఆయన పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే సామాగ్రి తప్పు. సామగ్రి అన్న పదమే సరైనది. నాగరికులు, నాగరికత అనటానికి బదులు కొందరు నాగరకులు, నాగరకత అనే పదాలను వాడుతారు. ప్రమాణిక నిఘంటువుల ప్రకారం నాగరికులు, నాగరికత అనేవే సరైన పదాలు.</p>
<p>ఊయల అనే పదానికి దగ్గరగా ఉండే పదాలు ఎన్నో ఉన్నాయి. ఉదా: ఊయెల, ఊయాల, ఊయేల &#8211; ఇవన్నీ సరైన పదాలే. ఉయ్యాల, వుయ్యాల అన్న పదాలు నిఘంటువుల్లో లేవు. “మంత్రిగారు ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసారు” అని వార్తాపత్రికల్లో చదువుతాం. ఇక్కడ పంపిణి అనేదే రైటు. పంపిణీ తప్పు. ఇదేవిధంగా శాలువను శాలువా అని, నీటి తీరువను నీటి తీరువా, అని గర్భిణిని గర్భిణీ అంటూ రాయడం భాషాపరంగా ఒప్పుగా ఆమోదించబడదు. కేరళ రాష్ట్రంలో మాట్లాడే భాషను మళయాళము అనాలని ప్రమాణిక నిఘంటువు చెబుతోంది. కాని అర్థాన్ని వివరిస్తూ ‘మలయ’ పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతము అని చెప్పబడింది. ఉదాహరణను ఇవ్వటాన్ని ఉదహరించుట అని కొందరు తప్పుగా రాస్తారు. ఉదాహరించుట అనేదే సరైన పదం.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5757</wfw:commentRss>
		<slash:comments>15</slash:comments>
		</item>
		<item>
		<title>భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 3</title>
		<link>http://vaakili.com/patrika/?p=5608</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5608#comments</comments>
		<pubDate>Wed, 30 Apr 2014 14:26:44 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[మన తెలుగు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5608</guid>
		<description><![CDATA[<p><br /> కొన్నిసార్లు సవర్ణ దీర్ఘ సంధికి బదులు గుణసంధి అయిన పదాలను తప్పుగా వాడటం జరుగుతుంది.<br /> ఉదా: భానోదయము. ఇది తప్పు. భాను + ఉదయము = భానూదయము అవుతుంది. అదేవిధంగా గురు + ఉత్తముడు = గురూత్తముడు (గురోత్తముడు కాదు). కాని చాముండీశ్వరి తప్పు. చాముండేశ్వరి అనేదే సరైన పదం. పార్వతికి ఉన్న పేర్లలో చాముండ ఒకటి (చాముండి కాదు). కనుక చాముండ + ఈశ్వరి = చాముండేశ్వరి అవుతుంది. ఇది గుణసంధి. శనిదేవుణ్ని శనీశ్వరుడు అనటం సరి కాదు. శనైశ్చరుడు అనటమే సరైనది. వ్యాకరణపరంగా శని + ఈశ్వరుడు = శనీశ్వరుడు (సవర్ణదీర్ఘ సంధి) సరైనదే. కాని శనైశ్చరుడు అన్న పదాన్నే సరైనదిగా ఒప్పుకుంటారు. నిమిషమును రకరకాలుగా రాస్తారు, రాయొచ్చు కూడా. నిమిషము అనే కాక, నిమేషము అనీ, నిముసము అనీ రాయవచ్చు. మూడు పదాలూ సరైనవే. కాని నిముషము మాత్రం తప్పు. అయినా కొంత మంది అలా రాయటం మనం గమనించవచ్చు.</p> <p>“ఫలానా ప్రాంతం వారు ఫలానా ప్రాంతం వారి పట్ల వివక్షతను చూపుతున్నారు” అనీ, లేక “ప్రభుత్వం ఫలానా కులాల పట్ల వివక్షత చూపిస్తున్నది” అనీ చాలా సార్లు చదువుతుంటాం మనం. ఒక్కోసారి ఈ పదం కొందరు కవుల కవితల్లో, లేక కొన్ని వ్యాసాల్లో కూడా దర్శనమివ్వటం అరుదైన విషయమేం కాదు. కాని వివక్షత తప్పు. వివక్ష అనేదే రైటు. అదేవిధంగా పరశత్వం, పరవశతలకు బదులు పారవశ్యత అన్న పదాన్ని వాడుతుంటారు కొందరు. అది కూడా తప్పే. సంగీతంలోని సప్తస్వరాలు (స,రి,గ,మ,ప,ద,ని) లో మొదటిదైన ‘స’ ను షడ్జము అనాలి. కాని కొందరు షడ్జమము అని రాస్తారు. షడ్జము అనేదే సరైన పదం. ఒక ఉద్యోగి సెలవు చీటీ రాసి బాసుకు సమర్పించాడు. అందులో సెలవు కోరటానికి కారణం ‘తన మరదలూ షడ్రకుడూ వేరే ఊరునుండి వస్తుండటమే’ అని రాసాడట. తోడల్లుణ్ని షడ్రకుడు అంటూ తప్పుగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg"><img class="alignleft  wp-image-5113" title="manatelugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg" alt="" width="393" height="282" /></a><br />
కొన్నిసార్లు సవర్ణ దీర్ఘ సంధికి బదులు గుణసంధి అయిన పదాలను తప్పుగా వాడటం జరుగుతుంది.<br />
ఉదా: భానోదయము. ఇది తప్పు. భాను + ఉదయము = భానూదయము అవుతుంది. అదేవిధంగా గురు + ఉత్తముడు = గురూత్తముడు (గురోత్తముడు కాదు). కాని చాముండీశ్వరి తప్పు. చాముండేశ్వరి అనేదే సరైన పదం. పార్వతికి ఉన్న పేర్లలో చాముండ ఒకటి (చాముండి కాదు). కనుక చాముండ + ఈశ్వరి = చాముండేశ్వరి అవుతుంది. ఇది గుణసంధి. శనిదేవుణ్ని శనీశ్వరుడు అనటం సరి కాదు. శనైశ్చరుడు అనటమే సరైనది. వ్యాకరణపరంగా శని + ఈశ్వరుడు = శనీశ్వరుడు (సవర్ణదీర్ఘ సంధి) సరైనదే. కాని శనైశ్చరుడు అన్న పదాన్నే సరైనదిగా ఒప్పుకుంటారు. నిమిషమును రకరకాలుగా రాస్తారు, రాయొచ్చు కూడా. నిమిషము అనే కాక, నిమేషము అనీ, నిముసము అనీ రాయవచ్చు. మూడు పదాలూ సరైనవే. కాని నిముషము మాత్రం తప్పు. అయినా కొంత మంది అలా రాయటం మనం గమనించవచ్చు.</p>
<p>“ఫలానా ప్రాంతం వారు ఫలానా ప్రాంతం వారి పట్ల వివక్షతను చూపుతున్నారు” అనీ, లేక “ప్రభుత్వం ఫలానా కులాల పట్ల వివక్షత చూపిస్తున్నది” అనీ చాలా సార్లు చదువుతుంటాం మనం. ఒక్కోసారి ఈ పదం కొందరు కవుల కవితల్లో, లేక కొన్ని వ్యాసాల్లో కూడా దర్శనమివ్వటం అరుదైన విషయమేం కాదు. కాని వివక్షత తప్పు. వివక్ష అనేదే రైటు. అదేవిధంగా పరశత్వం, పరవశతలకు బదులు పారవశ్యత అన్న పదాన్ని వాడుతుంటారు కొందరు. అది కూడా తప్పే. సంగీతంలోని సప్తస్వరాలు (స,రి,గ,మ,ప,ద,ని) లో మొదటిదైన ‘స’ ను షడ్జము అనాలి. కాని కొందరు షడ్జమము అని రాస్తారు. షడ్జము అనేదే సరైన పదం. ఒక ఉద్యోగి సెలవు చీటీ రాసి బాసుకు సమర్పించాడు. అందులో సెలవు కోరటానికి కారణం ‘తన మరదలూ షడ్రకుడూ వేరే ఊరునుండి వస్తుండటమే’ అని రాసాడట. తోడల్లుణ్ని షడ్రకుడు అంటూ తప్పుగా రాసేవాళ్లు/పలికే వాళ్లు తక్కువ మందేం ఉండరు. అయితే దానికి సరైన పదమేది? అనే ప్రశ్నకు జవాబు షడ్ఢకుడు, లేక సడ్డకుడు అని గ్రహించాలి.</p>
<p>“ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యకు, వైద్యానికి, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది” అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం మనం. అదేవిధంగా ప్రాముఖ్యత అని కూడా తప్పుగా రాస్తారు. ఈ పదాలకు ప్రధానము, ప్రముఖము అన్నవి మూలపదాలు. వీటికి మొదట్లో ఒకటి, చివరలో ఒకటి ప్రత్యయాలను చేర్చగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనే పదాలు ఏర్పడుతాయి. కాని అలా ఒకే మూలపదానికి రెండు ప్రత్యయాలను చేర్చటం అనమంజసం కనుక, ఒకే ప్రత్యయాన్ని (మొదట్లో కాని, చివరన కాని) చేర్చటమే సవ్యంగా ఉంటుంది. అందుకని ప్రధానత లేక ప్రాధాన్యము, ప్రముఖత లేక ప్రాముఖ్యము అనేవే సరైన పదాలు. ఈ విషయాన్ని చాలా సంవత్సరాల క్రితం ఆచార్య చేకూరి రామారావు గారు తన ‘చేరాతలు’లో సూచించిన తర్వాత నుండే పత్రికల్లో ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనే పదాలు దర్శనమివ్వటం చాలా వరకు తగ్గిపోయింది. అదేవిధంగా ‘తో సహా’ అనేది పూర్వం అచ్చులో అత్యంత తరచుగా కనిపించేది. కాని బాగా తరచి చూస్తే ‘తో’ అంటేనే సహా అనే అర్థం వస్తుంది కదా. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకదాన్నే వాడాలి. ఉదా: ‘పిల్లలతో సహా సినిమాకు వెళ్లాడు’ అనకుండా ‘పిల్లలతో వెళ్లాడు’ అనికాని, ‘పిల్లలు సహా వెళ్లాడు’ అని కాని రాయటం సమంజసంగా, సవ్యంగా ఉంటుంది.</p>
<p>“మా వాడికి లెక్కల్లో వందకు తొంభై శాతం మార్కులు వచ్చాయి” అంటూ గొప్పలు చెప్పుకున్నాడట ఓ తండ్రి గారు. కాని ఈ వాక్యంలో భాషాదోషం ఉంది. అదేవిధంగా “పోలింగులో వందకు అరవై ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి” అని రాస్తారు/చెబుతారు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, శాతము అంటేనే వందకు అని అర్థం. మళ్లీ వందకు అని రాయాల్సిన అవసరమేముంది? తొంభై ఐదు శాతం మార్కులు, అరవై ఆరు శాతం వోట్లు (ఓట్లు-Oats- కావు) అనటమే సరైనది కదా. లేక వందకు తొంభై ఐదు, వందకు అరవై ఆరు అనాలి. దాదాపు అనే పదాన్ని వాక్యంలో సరైన స్థానంలో ఉంచకపోవటం కూడా మనం తరచుగా గమనించే అపసవ్యతే. “దాదాపు నేను ఆరు నెలల పాటు వ్యాధితో బాధ పడ్డాను” అనే వాక్యంలో అసంబద్ధత ఉంది. “నేను దాదాపు ఆరు నెలల పాటు వ్యాధితో బాధ పడ్డాను” అన్న వాక్యంలో పదాలు సరైన స్థానాల్లో ఉన్నాయి. ఈ వాక్యాన్ని ఇలా కూడా తిరగ రాయొచ్చు. “దాదాపు ఆరు నెలల పాటు నేను వ్యాధితో బాధ పడ్డాను.” రెండు వాక్యాలూ భాషాపరంగా, వ్యాకరణపరంగా సరైనవే. “దాదాపు ఆరు నెలల పాటు వ్యాధితో బాధ పడ్డాను నేను” అన్నది మరింత వైవిధ్యం ఉన్న వాక్యం అవుతుంది.</p>
<p>“మా నాన్నగారు తెలుగు పండితుడుగా పని చేసి రిటైరయ్యాడు.” “ఫలానా స్కూల్లో తెలుగు పండితుని పోస్టు ఖాళీగా ఉంది.” ఇలాంటి వాక్యాల్లో కూడా మనం అపసవ్యతను గమనించవచ్చు. “ఫలానా దేశంలోని ఫలానా నగరంలో రెండు వందల తెలుగు కుటుంబాలున్నాయి” అన్నట్టుగానే ఉన్నాయి పైన పేర్కొన్న వాక్యాలు. తెలుగు పండితుడు అంటే తెలుగువాడైన పండితుడు అనే అర్థం కూడా స్ఫురించే అవకాశం ఉంది కనుక, ఏ రకమైన గందరగోళం లేకుండా ఉండాలంటే తెలుగు భాషా పండితుడు అని రాయటం ఉత్తమం. దాన్నే సవ్యమైనదిగా ఒప్పుకుంటారు భాషజ్ఞులు. కవిత్వంలో కొత్తకొత్త ప్రయోగాలు చేసే ఒకాయన పట్ల నిరసనను తెలియచేసారట కొందరు పండితులు. దానికి ఆయన “ఈ శుద్ధ వాదులను నేను ఖాతరు చెయ్యను” అంటూ సమాధానమిచ్చాడట. ఇక్కడ శుద్ధ వాదులు అనే మాట సరైనది కాదు. శుద్ధతా వాదులు అనేదే సవ్యమైన పద ప్రయోగం.</p>
<p>కొన్ని పదాలు తెలుగు భాషలోకి ఎలా వచ్చి చేరుతాయో అర్థం కాదు. నిజమైన భాషావేత్తలు కాక మామూలు రచయితలు, మీడియా వాళ్లు వాటిని వ్యవపారిక భాషలో చొప్పిస్తారు బహుశా. ఉదా: ప్రాయోజకులు, ప్రాసంగికత వంటి పదాలు. ప్రయోజనము నుండి ప్రాయోజకులు వచ్చిఉంటే, అది ఒకటికన్న ఎక్కువ అంచెలలో మార్పులు (అవి కూడా అసంబద్ధమైనవి) చేసిన మాయాజాలపు ఫలితమే. ప్రాయోజకులు అంటే ప్రయోజకులు అనుకోవాలా? తెలియదు. నిజానికి ఈ పదాన్ని Sponsors అనే అర్థంలో వాడుతున్నారు. అప్పుడు మరి ప్రయోజకులు అనేది కూడా ఉద్దేశించిన అర్థాన్ని కచ్చితంగా ఇవ్వదు. ప్రాసంగికత కూడా ఇటువంటి పదమే. ప్రసంగ యోగ్యత అన్నదే సవ్యమైన పదం అనిపిస్తుంది.</p>
<p>మోసం చేసాడన్న ఆరోపణకు సమాధానంగా ఒకాయన కోపంతో ఊగిపోతూ “నేనంటే, మా వంశమంటే ఏమిటనుకున్నారూ? అలా మోసం చేయడం మా వంశ సాంప్రదాయంలోనే లేదు” అన్నాడట. ఇక్కడ సాంప్రదాయం అనే పదం తప్పు. సంప్రదాయం అనేదే రైటు. సినిమా హాల్లో టైటిళ్లు పడేటప్పుడు సాంకేతిక సహాయం అని కనపడుతుంది మనకు. కాని ‘సాంకేతిక’ తప్పు. సంకేతిక అనేదే రైటు. “మన దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గత రెండు సంవత్సరాలుగా బాగా పెరిగిపోయింది” అన్న వార్తను చదువుతాం మనం. కాని తెలుగు భాషలో పర్యాటన అనే పదమే లేదు కనుక, పర్యాటకులు తప్పు. పర్యటన అన్న పదమే ఉంది కాబట్టి పర్యటకులు అనేదే సరైన పదం.</p>
<p>ఇక వైరి సమాసాలను ఉపయోగించకుండా ఉండాలంటే పదాల మూలాలు సరిగ్గా తెలిసి ఉండాలి. ముఖ్యంగా కవిత్వం రాసేవాళ్లకు ఏవి వైరి సమాసాలో తెలియటం చాలా అవసరం. వ్యాకరణ పరమైన సవ్యత కోసమే కాక, వైరి సమాసాలను పలుకుతుంటేనే వాటిలో ధ్వనించే ఎబ్బెట్టుతనాన్ని నివారించటం కోసం ఈ వైరి సమాసాలను (లేక దుష్ట సమాసాలను) మానుకోవాలనిపిస్తుంది. భావాందం అన్న పదంతో పోల్చిచూస్తే భావ సౌందర్యం అన్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుందని ఎవరైనా ఒప్పుకుంటారనుకుంటాను. ఒక సంస్కృత పదాన్ని ఒక అచ్చతెలుగు పదంతో కలుపుతూ వైరి సమాసాన్ని ఏర్పరచినప్పుడు, చాలా సార్లు అది కొత్త కోటు మీదికి జతగా పైజామా (Pajama) ను వేసుకున్నట్టుంటుంది. అయితే ఈ ఆధునిక కాలంలో వచన కవిత్వంలో వైరి సమాసాలు విరివిగా దర్శనమిస్తున్నా సమీక్షకులు, విమర్శకులు వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆ మాటకొస్తే ఛందోబద్ధమైన పద్యాల్లో సైతం వైరి సమాసాలుండటాన్ని నిరసించని విమర్శకులు ఎందరో ఉన్నారు. ఒక సమాసం వైరి సమాసమా కాదా అనే విషయం తెలియాలంటే అందులోని పదాలలో ఏది సంస్కృత (సమ) శబ్దమో, ఏది అచ్చతెలుగు పదమో కచ్చితంగా తెలియాలి. రెండు సంస్కృత (సమ) శబ్దాల మధ్య, లేక రెండు అచ్చ తెలుగు పదాల మధ్య కుదిరే సమాసం సవ్యమైనది. అలా కాక ఒకటి సంస్కృత సమం, మరొకటి అచ్చ తెలుగుది అయితే వైరి సమాసం వస్తుంది. వైరి సమాసాలు భాషాపరమైన దోషాలే. ఉదా: పాలాభిషేకము. “మహా శివరాత్రి సందర్భంగా వేములవాడలో, శ్రీకాళహస్తిలో శివలింగాలకు పాలాభిషేకం చేసారు” అని టీ.వీ. వార్తల్లో కూడా విన్నాం. అయితే ఈ సమాసంలో పాలు అచ్చతెలుగు పదం కాగా, అభిషేకము సంస్కృత సమం. కనుక, ఇది వైరి సమాసం. దీన్ని సరిదిద్దాలంటే క్షీరాభిషేకము అని మార్చాలి. ఎందుకంటే క్షీరము కూడా సంస్కృత సమ శబ్దం. లేదా పాలతో స్నానం చేయించారు అనవచ్చు. అదేవిధంగా భూతగాదా అన్నప్పుడు భూమి సంస్కృతం, తగాదా హిందుస్తానీ భాషనుండి వచ్చిన తెలుగు పదం (అన్యదేశ్యం). ఇక్కడ సరైన సమాసం ‘భూవివాదం’. ‘రసవత్తర పోరు’లో పోరు అచ్చతెలుగు కనుక రసవత్తరమైన పోరు, లేక రసవత్తర సంగ్రామం అనేవి సవ్యమైన ప్రయోగాలు. ఉగ్రనేల అన్నది మరో వైరి సమాసం. ఇక్కడ ఉగ్రమైన నేల, లేక ఉగ్రత గల నేల అనవచ్చు. లేదా ఉగ్రభూమి అనవచ్చు (భూమి సంస్కృత పదం). ఇలాంటి వైరి సమాసాలు ఆధునిక వచన కవిత్వంలో అసంఖ్యాకంగా చోటు చేసుకుంటున్నాయి. భాష బాగా తెలియని కవులకు తాము వాడుతున్నది వైరి సమాసం అన్న విషయమే తెలియదు. భాష బాగా తెలిసినవాళ్లు వైరి సమాసాలను ఇట్టే గుర్తు పట్టగలరు. వైరి సమాసాలను ప్రయోగించకుండా ఉండాలంటే ఆ దిశగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అయితే ‘గర్భగుడి’ అనే వైరిసమాసం భాషాసవ్యత పరంగా తప్పు సమాసమే ఐనా వినడానికి అది ఎంతో శ్రవణసుభగంగా, హాయిగా ఉంటుంది. ‘గర్భ దేవాలయం’ అన్న పదం భాషాసవ్యత పరంగా ఒప్పే అయినా అది వినటానికి ఇంపుగా ఉండదు.</p>
<p><a title="భాషాసవ్యతకు బాటలు వేద్దాం" href="http://vaakili.com/patrika/?p=5173">భాషాసవ్యతకు బాటలు వేద్దాం – మొదటి భాగం</a><br />
<a title="భాషాసవ్యతకు బాటలు వేద్దాం" href="http://vaakili.com/patrika/?p=5517">భాషాసవ్యతకు బాటలు వేద్దాం – రెండవ భాగం</a></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5608</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>భాషాసవ్యతకు బాటలు వేద్దాం &#8211; 2</title>
		<link>http://vaakili.com/patrika/?p=5517</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5517#comments</comments>
		<pubDate>Mon, 31 Mar 2014 19:54:38 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[మన తెలుగు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5517</guid>
		<description><![CDATA[<p>ఆచారాలను పాటించక తాగుడు వంటి దురలవాట్లకు బానిస అయినవాణ్ని కొందరు భ్రష్ఠుడు అనడం కద్దు. కాని ఆ పదం తప్పు. భ్రష్టుడు అన్నదే సరైన పదం. కాని కుటుంబంలోని పెద్ద కొడుకును జ్యేష్ఠుడు, మేలిమి పొందినవాణ్ని శ్రేష్ఠుడు అనటమే రైటు. జ్యేష్టుడు, శ్రేష్టుడు అనేవి తప్పు పదాలు. “కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్య నిర్మాణంలో నిర్దిష్ఠత ఉంటుంది” అని ఒక సాహిత్యసభలో ఎవరైనా చదివారనుకోండి. ఆ వాక్యంలో భాషాదోషం ఉన్న విషయాన్ని గుర్తు పట్టాలి మనం. నిర్దిష్టతకు బదులు నిర్దిష్ఠత అని రాయటం మరి భాషాదోషమే కదా. కొందరు నిర్దుష్టత అని రాస్తారు. అది కూడా తప్పే అని గ్రహించాలి.</p> <p>‘ఠ’ వత్తుకు బదులు ‘ట’ వత్తును ప్రయోగించడం మరొక రకమైన భాషాదోషం. “మనం మన తెలుగు భాష ప్రతిష్టను కాపాడుదాం” అని రాస్తే మన తెలుగు భాషా ప్రతిష్ఠ ఏమై పోను! ప్రతిష్ట తప్పు, ప్రతిష్ఠ ఒప్పు.“తెలుగు భాషను పటిష్టం చెయ్యాలి” అన్నప్పుడు అలా వాక్రుచ్చినవారి తెలుగు భాష పటిష్ఠంగా లేదని తాత్పర్యం! పటిష్టం తప్పు. గోష్ఠి అంటే చిన్న సభ వంటిది. పండితుల గోష్ఠి ఉంటుంది. (మందు కొట్టేవాళ్లది కూడా ఉంటుంది బహుశా!). అయితే ఈ పదాన్ని గోష్టి అని తప్పుగా రాయటం అరుదేం కాదు. పరమేష్టి , పరాకాష్ట అన్నవి కూడా అటువంటి భాషాదోషాలే. పరమేష్ఠి , పరాకాష్ఠ అన్నవి సరైన పదాలు. “అలా నిష్టూరాలాడుతావేం వదినా” అని ఒక ఇల్లాలు మరొక ఇల్లాలు దగ్గర బాధ పడిపోవటం మనం గమనిస్తుంటాం. ఇక్కడ నిష్టూరము అనే పదం తప్పు. నిష్ఠురము అనేదే రైటు. కొన్ని నిఘంటువుల్లో నిష్టురము అనే పదం కూడా ఇవ్వబడిన మాట వాస్తవమే. నిష్ఠురము అంటే కఠినము లేక పరుషము అని అర్థం. “సమాసభూయిష్టమైన కవిత్వాన్ని ఈ కాలంలో ఇష్టపడరు” అనే వాక్యం దోషభూయిష్ఠమైనది. అంటే భూయిష్టము తప్పన్న మాట. భూయిష్ఠము సరైన పదం. అధిష్టానము, కనిష్ట [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg"><img class="alignleft  wp-image-5113" title="manatelugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg" alt="" width="385" height="277" /></a>ఆచారాలను పాటించక తాగుడు వంటి దురలవాట్లకు బానిస అయినవాణ్ని కొందరు భ్రష్ఠుడు అనడం కద్దు. కాని ఆ పదం తప్పు. భ్రష్టుడు అన్నదే సరైన పదం. కాని కుటుంబంలోని పెద్ద కొడుకును జ్యేష్ఠుడు, మేలిమి పొందినవాణ్ని శ్రేష్ఠుడు అనటమే రైటు. జ్యేష్టుడు, శ్రేష్టుడు అనేవి తప్పు పదాలు. “కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్య నిర్మాణంలో నిర్దిష్ఠత ఉంటుంది” అని ఒక సాహిత్యసభలో ఎవరైనా చదివారనుకోండి. ఆ వాక్యంలో భాషాదోషం ఉన్న విషయాన్ని గుర్తు పట్టాలి మనం. నిర్దిష్టతకు బదులు నిర్దిష్ఠత అని రాయటం మరి భాషాదోషమే కదా. కొందరు నిర్దుష్టత అని రాస్తారు. అది కూడా తప్పే అని గ్రహించాలి.</p>
<p>‘ఠ’ వత్తుకు బదులు ‘ట’ వత్తును ప్రయోగించడం మరొక రకమైన భాషాదోషం. “మనం మన తెలుగు భాష ప్రతిష్టను కాపాడుదాం” అని రాస్తే మన తెలుగు భాషా ప్రతిష్ఠ ఏమై పోను! ప్రతిష్ట తప్పు, ప్రతిష్ఠ ఒప్పు.“తెలుగు భాషను పటిష్టం చెయ్యాలి” అన్నప్పుడు అలా వాక్రుచ్చినవారి తెలుగు భాష పటిష్ఠంగా లేదని తాత్పర్యం! పటిష్టం తప్పు. గోష్ఠి అంటే చిన్న సభ వంటిది. పండితుల గోష్ఠి ఉంటుంది. (మందు కొట్టేవాళ్లది కూడా ఉంటుంది బహుశా!). అయితే ఈ పదాన్ని గోష్టి అని తప్పుగా రాయటం అరుదేం కాదు. పరమేష్టి , పరాకాష్ట అన్నవి కూడా అటువంటి భాషాదోషాలే. పరమేష్ఠి , పరాకాష్ఠ అన్నవి సరైన పదాలు. “అలా నిష్టూరాలాడుతావేం వదినా” అని ఒక ఇల్లాలు మరొక ఇల్లాలు దగ్గర బాధ పడిపోవటం మనం గమనిస్తుంటాం. ఇక్కడ నిష్టూరము అనే పదం తప్పు. నిష్ఠురము అనేదే రైటు. కొన్ని నిఘంటువుల్లో నిష్టురము అనే పదం కూడా ఇవ్వబడిన మాట వాస్తవమే. నిష్ఠురము అంటే కఠినము లేక పరుషము అని అర్థం. “సమాసభూయిష్టమైన కవిత్వాన్ని ఈ కాలంలో ఇష్టపడరు” అనే వాక్యం దోషభూయిష్ఠమైనది. అంటే భూయిష్టము తప్పన్న మాట. భూయిష్ఠము సరైన పదం. అధిష్టానము, కనిష్ట , గరిష్ట , సౌష్టవం ఈ పదాలు కూడా తప్పే. అధిష్ఠానము, కనిష్ఠ , గరిష్ఠ , సౌష్ఠవం ఇవి సరైన పదాలు. ఇక శవాన్ని పడుకోబెట్టే కట్టెల కుప్పకు కాష్టము అనే పదాన్ని వాడుతారు చాలా మంది. కాని నిజానికి కాష్ఠము అనేది రైటు. అయితే కొన్ని నిఘంటువుల్లో కాష్టము అన్న పదం కూడా ఇవ్వబడింది.</p>
<p>‘థ’ కు బదులు ‘ధ’ అని తప్పుగా రాస్తారు కొంత మంది. ఉదాహరణకు కధ, అనాధ అనేవి. కథకు బదులు కత అని రాస్తే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అది కథకు వికృతి. కాని కధను ఒప్పుగా ఒప్పుకోరు మరి. ‘ధ’ కు బదులు ‘థ’ రాయటం కూడా అరుదైన విషయమేం కాదు. వీథి, వ్యథ, శీథువు అనేవి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ వీధి, వ్యధ, శీధువు అన్నవి కరెక్టు పదాలు. నాధుడుకు బదులు నాథుడు రాయటం కూడా ఇటువంటిదే. దీటైన అనే మాటకు బదులు ధీటైన అన్న పదాన్ని ఉపయోగిస్తారు కొందరు. కాని ‘ధీటైన’ తప్పు. దీటైన, దీటుగా అనేవే సరైన మాటలు.</p>
<p>“లబ్దిదారులకు ప్రభుత్వం పట్టాలను ప్రదానం చేసింది” అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం మనం. ఇక్కడ లబ్ధిదారులు అనేదే సరైన పదం. కాబట్టి లబ్దప్రతిష్టులులో రెండు తప్పులున్నాయి. లబ్ధప్రతిష్ఠులు అని సరిగ్గా రాయటం మనం దాదాపు ఎక్కడా చూడం.</p>
<p>ఉజ్వలము, తత్వము, సత్వము అనే పదాలు ఇప్పుడు సరైనవిగా చలామణి అవుతున్నాయి కాని, అవి పూర్తి కచ్చితత్వం ఉన్న పదాలు కావు. నిజానికి గ్రాంథికభాష ప్రకారం చూస్తే ఉజ్జ్వలము, తత్త్వము, సత్త్వము అనేవి సరైనవి. అయినా ఉజ్వలము, తత్వము, సత్వము అని రాస్తే అత్యంత శుద్ధతావాదులైన పండితులు తప్ప ఇతరులు ఆక్షేపణ తెలుపరు.</p>
<p>ఆఫీసుకు వెళ్తున్నాను అనే అర్థంలో కచేరీకి వెళ్తున్నాను అనడం పూర్వకాలంలో అత్యంత సాధారణంగా జరిగేది. కచేరీ అనే పదానికి నిఘంటువులో కొలువుకూటము, ఉద్యోగశాల, దర్బారు, దివాణము అని అర్థాలున్నవి. అయితే కచేరీ అంటే సంగీత సభ కూడా. కచ్చేరీ అన్నా కూడా అదే అర్థం.</p>
<p>దవము అన్నా , దావము అన్నా అడవి కనుక, కార్చిచ్చును దవానలం లేక దావానలం అనవచ్చు. సతతము, సతము అనేవి కొంచెం దందరగోళాన్ని కలుగజేసే పదాలు. సతతము = ఎల్లప్పుడు. సతము = శాశ్వతము. ఈ భేదాన్ని గమనించాలి (బేధము తప్పు భేదము అన్నదే రైటు).</p>
<p>ఉగాది రాగానే కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పటానికి “నవాబ్ధి అరుదెంచింది” అంటూ కవిత్వం రాసి ఆర్భాటం చేయవచ్చు ఎవరైనా. కాని అలా చేస్తే సునామీ ఫలితంగా సముద్రాన్నే మీదకు తెచ్చుకున్నవాళ్లం అవుతాము! ఎందుకంటే అబ్ధి నే పదానికి సముద్రం అని అర్థం. నవాబ్ది అని రాసినా తప్పే. తెలుగు భాషలో అబ్ది అనే పదమే లేదు. అయినా మనం దశాబ్ది, శతాబ్ది అని రాస్తుంటాం. మరి సంవత్సరం అనే అర్థాన్నిచ్చే కచ్చితమైన పదమేది? ఈ ప్రశ్నకు జవాబు అబ్దము. కాబట్టి ఉగాది రోజున నవాబ్దము వస్తుందన్న మాట. అలాగే దశాబ్దము, శతాబ్దము అన్నవి సరైన పదాలు.</p>
<p>సూర్యుడు ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య (ధృవాల మధ్యకాదు) ప్రయాణించే మార్గాన్ని అయనము అంటాము. దక్షిణాయనము అంటే ఈ మార్గంలో సగమైన దక్షిణభాగం. కాని ఉత్తరదిశలో ఉండే సగభాగాన్ని ఉత్తరాయణము అనాలి, ఉత్తరాయనము అనకూడదు. కారణం తెలియదు. అయణము అనే పదం ఉందో లేదో, ఒకవేళ ఉంటే దాని అర్థమేమిటో తెలియదు. అసలు ఆ పదమే నిఘంటువుల్లో లేదు. అయినా ఉత్తరాయణము అనే రాయాలి. శక్తివంతుడు అనే పదం మనకు అచ్చులో తరచుగా కనబడుతుంది. ఉదా: ‘హనుమంతుడు మహా శక్తివంతుడు’, ‘మా సిమెటు చాలా శక్తివంతమైనది’ ఇలాంటి వాక్యాలను చూస్తాము. కాని శక్తివంతుడు అనేది సరైన పదం కాదు. శక్తిమంతుడు అనేదే సరైన పదం. బలశాలి అయినవాణ్ని బలవంతుడు అనే అనాలి. కాని ఐశ్వర్యం ఉన్నవాళ్లు శ్రీమంతులు అవుతారు తప్ప శ్రీవంతులు కారు.</p>
<p>‘ల’ కు బదులు ‘ళ’ రాస్తారు/పలుకుతారు కొంత మంది. ఉదా: కళ్యాణము. కళ్యాణ మండపము అనే మాటను పుస్తకాల్లో, బోర్డులమీదా, ఆఖరుకు సినిమా టైటిల్స్ లో కూడా చూస్తాము. కళ్యాణ్ అని పేరు కూడా పెట్టుకుంటారు కొందరు. అలానే రాసుకుంటారు కూడా. కాని ప్రమాణిక నిఘంటువుల ప్రకారం తెలుగు భాషలో కళ్యాణము అనే పదం అసలు లేనే లేదు. కల్యాణము అనేదే ఉంది. కాబట్టి కల్యాణ్ అనే పేరే సవ్యమైనది. అలాగే మౌలికమైన అనటానికి బదులు మౌళికమైన అని రాస్తారు/పలుకుతారు. మూలము అంటే వేరు (Root). మూలము నుండి వచ్చిందే మౌలికము.</p>
<p>ఊరట (ఊఱట), ఉపశమనము అనే అర్థాన్నిచ్చే పదం సాంత్వనము. దీన్ని చాలా మంది స్వాంతనము అని తప్పుగా రాస్తారు/పలుకుతారు. రాధికా సాంత్వనము ముద్దు పళని రాసిన గ్రంథం పేరు అని సాహితీపరులకు తెలుసు. “రాజుగారి భండాగారము నిండుకున్నది” అంటూ ఆవేదన చెందేవారు తమ భాషలోని దోషాన్ని ఎప్పుడు గ్రహించి ఆవేదన చెందుతారు? భండారము అనేదే సరైన మాట అని తెలుసుకున్నప్పుడే కదా! భండారంలోని ద్రవ్యం రహస్యం కనుక “నీ బండారం బయట పెడతాను” అనే వాక్య ప్రయోగం వచ్చి ఉంటుంది. అయితే భాండాగారము అన్నది కూడా సరైన పదమే.</p>
<p>బ్రహ్మ గురించిన అపోహలు మనకు రెండు ఉన్నట్టు గ్రహించాలి. అందులో మొదటిది బ్రహ్మాండము అంటే జగత్తు అని భావించటం. ‘పెద్ద’ అని అర్థం వచ్చేలా ఆ పదాన్ని వాడుతున్నాం. కాని బాగా పరిశీలించి చూస్తే దానికి బ్రహ్మగుడ్డు అనే అర్థం వస్తుంది! ప్రమాణిక నిఘంటువుల్లో బ్రహ్మాండము అనే పదమే లేదు. ఒకటి రెండు ఇతర నిఘంటువుల్లో ఉన్న మాట నిజమే. ఇక రెండవది బాగా పొగడటానికి బ్రహ్మరథము అనే పదాన్ని వాడుతాము. ఈ పదానికి ‘మృతి పొందిన సన్యాసులను తీసికొని పోయెడి వాహనము’ అనే అర్థం ఉంది నిఘంటువులో. ఒకవేళ ఇది జాతీయం అందామనుకున్నా ఏ విధంగా చూసినా పొగడటం అనే అర్థసమన్వయం కుదరదు. బ్రాహ్మణ్యము అనే పదం కూడా తప్పే. బ్రహ్మణ్యము అనేదే రైటు.</p>
<p>మేధోవంతులు, మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి అని చదువుతుంటాం చాలా సార్లు అచ్చులో. ముఖ్యంగా వార్తాపత్రికల్లో ఈ మాటలు ఎక్కువగా కనపడతాయి. తెలుగు భాషలో మేధస్సు అనే పదమే లేదు. మేధ అన్నది మాత్రమే ఉంది కాబట్టి, విసర్గ సంధి కుదిరే ప్రశ్నే లేదు. తపస్సు ఉంది కనుక తపః+వనము = తపోవనము, శిరస్సు ఉంది కనుక శిరః + రత్నము = శిరోరత్నము ఇలా విసర్గ సంధులు కుదురుతాయి. మేధోమథనం పదం ఏర్పడటానికి వీల్లేదు. మేధామథనం, మేధాశక్తి , మేధాసంపత్తి ఇలాంటి సమాసాలు మాత్రమే ఏర్పడుతాయి. కనుక ఆ పదాలే కరెక్టు.</p>
<p>ప్రేత భూముల దగ్గర ఫలానా స్మశాన వాటిక అని పెద్దపెద్ద అక్షరాలతో బోర్డుల మీద రాసి ఉండటం మనం గమనించవచ్చు. కాని స్మశానము తప్పు. సరైన పదం ‘శ్మశానము’ అని గ్రహించాలి. శాలీనత అంటే ఒక నిఘంటువులో దిట్టతనము అనీ, మరొక నిఘంటువులో బిడియము అనీ అర్థాలు ఉన్నాయి. రూపంలో దీనికి దగ్గరగా ఉండే శాలిత అనే మరో పదంతో తారుమారు చేయకూడదు దీన్ని. శాలిత అంటే శాలిత్వము. ఊహాశక్తి ఎక్కువగా ఉండటాన్ని ఊహాశాలిత అనవచ్చు. ప్రొమోషన్లను (ప్రమోషన్లను అనకూడదు) పదోన్నతులు అని పత్రికల్లో రాయటం మనం సాధారణంగా గమనించే విషయం. దీని సంధి విచ్ఛేదం పదవి + ఉన్నతి కాదు. పదవి + ఉన్నతి = పదవ్యున్నతి (యణాదేశ సంధి) అవుతుంది. పదము + ఉన్నతి = పదోన్నతి (గుణ సంధి) అవుతుంది నిజమే. కాని, ప్రొమోషన్ అంటే పదములో పెంపుదలా? పదము అంటే స్థానము అని వేరొక అర్థం ఉంది కాబట్టి, స్థానంలో పెరుగుదల అనుకోవాలి. ‘ఫలానా ఉద్యోగానికి అర్హత కోసం వయోపరిమితి….’ అంటూ ప్రకటనల్లో చాలా తరచుగా చూస్తుంటాం మనం. కాని అది భాషాదోషమే. పయః + పరిమితి = వయఃపరిమితి అవుతుంది. అదేవిధంగా తపః + ఫలము = తపఃఫలము (తపోఫలము కాదు). మనః + కమలము = మనఃకమలము (మనోకమలము కాదు).</p>
<p><a title="భాషాసవ్యతకు బాటలు వేద్దాం" href="http://vaakili.com/patrika/?p=5173">భాషాసవ్యతకు బాటలు వేద్దాం &#8211; మొదటి భాగం</a></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5517</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>భాషాసవ్యతకు బాటలు వేద్దాం &#8211; 1</title>
		<link>http://vaakili.com/patrika/?p=5173</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5173#comments</comments>
		<pubDate>Fri, 28 Feb 2014 21:02:18 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[మన తెలుగు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5173</guid>
		<description><![CDATA[<p></p> <p>తెలుగు భాషాప్రయోగంలో అత్యంత ప్రవీణులం, నిష్ణాతులం అయితే తప్ప మనం రాసే, మాట్లాడే భాష పూర్తి దోషరహితంగా ఉండే అవకాశం లేదు. అయితే భాష బాగా తెలిసినవాళ్లు రాసేదాంట్లో, మాట్లాడే దాంట్లో స్ఖాలిత్యాలు (తప్పులు) చాలా తక్కువగా ఉండి, భాష సరిగ్గా రానివాళ్లు రాసేదాంట్లో ఎక్కువ తప్పులుండటం మనం సాధారణంగా గమనించ గలిగే విషయం. పాఠకులు తమ తెలుగు భాషను మెరుగు పరచుకోవటానికి ఉపయుక్తంగా ఉండేలా నెలనెలా కొన్ని ఉదాహరణల సహాయంతో విశదపరచటమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. మనం ఉపయోగించే భాష సాధారణ సందర్భాల్లో శిష్టముగా ఉండటం అవసరం. దీన్నే శిష్ట వ్యావహారికం/శిష్ట వ్యవహారికం అంటున్నాము. అది గ్రాంథికమై ఉండాలన్న నియమం లేదు. అయితే ఏవి భాషాపరమైన దోషాలో తెలిసి ఉండటం మంచిది.</p> <p>హాస్యాన్ని చేర్చి వినోదాన్ని కలిగించాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని చమత్కార భరితమైన వాక్యాలను రాసాను. అవి కేవలం సరదా కోసమే తప్ప ఎవరినీ చిన్నబుచ్చటం కోసం కాదు. దయచేసి పాఠకులు సహృదయతతో అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. మరొక్క విషయం. ఒక ప్రయోగం భాషాసవ్యత దృష్ట్యా తప్పు అని చెప్పినంత మాత్రాన దాన్ని నేటి ఆధునిక యుగంలోని రచనా సందర్భంలో అసలే వాడకూడదని కాదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అటువంటి ఎన్నో పదాలను ఉపయోగించటం పరిపాటిగా వస్తున్న విషయమే. అయితే స్ట్రిక్టుగా (కచ్చితంగా) చూస్తే అది తప్పు అనే విషయం తెలిసి ఉండాలి.</p> <p>ప్రాథమిక స్థాయి దోషాలను మొదట పరీక్షించి, అరుదుగా తటస్థించే తప్పులను తర్వాత పరిశీలిద్దాం.</p> <p>అవసరం లేకపోయినా ఒక అక్షరాన్ని ఒత్తి పలకటం (అక్షరం అడుగు భాగాన ఒక చిన్న నిలువు గీత ఉన్నట్టు వ్యవహరించటం &#8211; దీన్ని జట అంటారు) లేక ఆ విధంగా రాయడం మనం సాధారణంగా గమనించే స్ఖాలిత్యం.</p> <p>“వివిధ మతాల, జాతుల, వర్గాల మధ్య సమైఖ్యతను సాధించటం ఈనాడు మన దేశానికెంతో అవసరం” అనే వాక్యంలో సమైఖ్యత అన్న పదం [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu.jpg"><img class="alignleft size-medium wp-image-5113" title="manatelugu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/manatelugu-300x215.jpg" alt="" width="300" height="215" /></a></p>
<p>తెలుగు భాషాప్రయోగంలో అత్యంత ప్రవీణులం, నిష్ణాతులం అయితే తప్ప మనం రాసే, మాట్లాడే భాష పూర్తి దోషరహితంగా ఉండే అవకాశం లేదు. అయితే భాష బాగా తెలిసినవాళ్లు రాసేదాంట్లో, మాట్లాడే దాంట్లో స్ఖాలిత్యాలు (తప్పులు) చాలా తక్కువగా ఉండి, భాష సరిగ్గా రానివాళ్లు రాసేదాంట్లో ఎక్కువ తప్పులుండటం మనం సాధారణంగా గమనించ గలిగే విషయం. పాఠకులు తమ తెలుగు భాషను మెరుగు పరచుకోవటానికి ఉపయుక్తంగా ఉండేలా నెలనెలా కొన్ని ఉదాహరణల సహాయంతో విశదపరచటమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. మనం ఉపయోగించే భాష సాధారణ సందర్భాల్లో శిష్టముగా ఉండటం అవసరం. దీన్నే శిష్ట వ్యావహారికం/శిష్ట వ్యవహారికం అంటున్నాము. అది గ్రాంథికమై ఉండాలన్న నియమం లేదు. అయితే ఏవి భాషాపరమైన దోషాలో తెలిసి ఉండటం మంచిది.</p>
<p>హాస్యాన్ని చేర్చి వినోదాన్ని కలిగించాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని చమత్కార భరితమైన వాక్యాలను రాసాను. అవి కేవలం సరదా కోసమే తప్ప ఎవరినీ చిన్నబుచ్చటం కోసం కాదు. దయచేసి పాఠకులు సహృదయతతో అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. మరొక్క విషయం. ఒక ప్రయోగం భాషాసవ్యత దృష్ట్యా తప్పు అని చెప్పినంత మాత్రాన దాన్ని నేటి ఆధునిక యుగంలోని రచనా సందర్భంలో అసలే వాడకూడదని కాదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అటువంటి ఎన్నో పదాలను ఉపయోగించటం పరిపాటిగా వస్తున్న విషయమే. అయితే స్ట్రిక్టుగా (కచ్చితంగా) చూస్తే అది తప్పు అనే విషయం తెలిసి ఉండాలి.</p>
<p>ప్రాథమిక స్థాయి దోషాలను మొదట పరీక్షించి, అరుదుగా తటస్థించే తప్పులను తర్వాత పరిశీలిద్దాం.</p>
<p>అవసరం లేకపోయినా ఒక అక్షరాన్ని ఒత్తి పలకటం (అక్షరం అడుగు భాగాన ఒక చిన్న నిలువు గీత ఉన్నట్టు వ్యవహరించటం &#8211; దీన్ని జట అంటారు) లేక ఆ విధంగా రాయడం మనం సాధారణంగా గమనించే స్ఖాలిత్యం.</p>
<p>“వివిధ మతాల, జాతుల, వర్గాల మధ్య సమైఖ్యతను సాధించటం ఈనాడు మన దేశానికెంతో అవసరం” అనే వాక్యంలో సమైఖ్యత అన్న పదం తప్పు. సమైక్యత అనేది సరైన పదం. సమ + ఐక్యత = సమైక్యత (వృద్ధి సంధి). అదే విధంగా ‘మల్లిఖార్జున స్వామి దేవాలయం’ అని రాసివున్న బోర్డులు కనపడతాయి మనకు అక్కడక్కడ. మల్లికార్జునుడు అనేదే సరైన పదం. మల్లిక + అర్జునుడు = మల్లికార్జునుడు (సవర్ణ దీర్ఘ సంధి). “నేను ప్రయోగించే భాష చాలా ఖచ్చితంగా ఉంటుంది సుమండీ” అన్నాడట ఓ పండితుడు. నిజానికి కచ్చితం అనే మాటకు బదులు ఖచ్చితం అని రాయటం వలన తన భాషలో కచ్చితత్వం లోపించిందన్న విషయాన్ని ఎరుగడాయన! ఏదైనా ఒక రంగంలో గొప్పవాడైన వ్యక్తిని సూచించటానికి ఉద్దండుడు అనే పదం ఉంది. కాని ఉద్ధండుడు అని రాస్తారు లేక పలుకుతారు కొంత మంది. గొప్పవాణ్ని సూచిస్తున్నాం కనుక ఒత్తు లేకుండా రాస్తే చప్పగా (సాదాగా) ఉండి అపచారం జరిగిపోతుందని భయం కాబోలు! ఉద్దండము అంటే పొడవైనది లేక ఎక్కువైనది అని అర్థం.</p>
<p>విష్ణువుకు ఉన్న అనేక నామాలలో (పేర్లలో) జనార్దనుడు అనేది ఒకటి. కాని జనార్ధనుడు అని తప్పుగా రాసేవాళ్లు లేకపోలేదు. అదే విధంగా మధుసూదనుడుకు బదులు మధుసూధనుడు అని కొందరు రాయటం, పలకటం అరుదైన విషయమేం కాదు. సూదనము అంటే చంపుట. మధు అనే రాక్షసుణ్ని చంపినవాడు కనుక మధుసూదనుడు అయినాడు శ్రీహరి.</p>
<p>“గులాబీ పువ్వులు గుభాళించినట్టు” అని వచన కవితలో ఒక కవి రాసుకోవచ్చు గాక, అంత మాత్రాన గుభాళించు అనే పద ప్రయోగం తప్పు కాకుండా పోతుందా? గుబాళించుట అంటే వాసన కొట్టుట.</p>
<p>“నావి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావండీ. ఇవి ఆనంద భాష్పాలు” అన్నదట ఒక యిల్లాలు తన భర్తతో. ఆ భర్త ఒకవేళ తెలుగు భాషను అమితంగా ప్రేమించే వాడైతే ఆ పద ప్రయోగాన్ని విని ఎంతగా విచారపడి దుఃఖ బాష్పాలను రాలుస్తాడో కదా! బాష్పాలు అనేదే సరైన పదం. అట్లా దుఃఖం ముంచుకొచ్చినప్పుడు మనను మనం ‘సంభాళించుకోవాలి’ అనకండి. ఎందుకంటే సంబాళించుకొనుట అన్నదే సరైన పదం.</p>
<p>“ఫలానా శ్రీమంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వజ్ర వైఢూర్యాలను కానుకలుగా సమర్పించుకున్నాడు” అని అచ్చులో చదివి అది దోషరహితమైన వాక్యం అనుకోకండి పాఠకులారా! ఎందుకంటే వైఢూర్యము అనటం తప్పు. వైడూర్యము అనేదే సరైన పదం. పురాణంలో శంబూకుడు అనే ఒకాయన తటస్థిస్తాడు మనకు. శంబూకము అంటే ముత్యపు చిప్ప లేక ఆల్చిప్ప. అయితే శంభూకుడు అని ఎవరైనా వాడితే ఆ పదం తప్పు అని గ్రహించాలి.</p>
<p>“నీ కోసం నా ప్రాణాలను ఫణంగా పెడతాను” అని ఎవరైనా అన్నారనుకోండి. చస్తే నమ్మొద్దు. ఎందుకంటే ఆ ఫణం వల్లనే చచ్చిపోతాము మనం! ఫణము అంటే పాము పడగ. పణము = పందెము కనుక ఇదే రైటు. ‘మాంసాహార &amp; శాఖాహార హోటల్’ అనే బోర్డులు మనకు కనిపించటం సర్వసాధారణమైన విషయం. శాఖ అంటే చెట్టు కొమ్మ కనుక, కొమ్మలతో వండిన కూరను తెచ్చిపెడతారేమోనని భయం కలుగవచ్చు తెలుగు భాషా పండితులకు! శాఖాహారము అనేది తప్పు. శాకాహారము అనాలి. శాకము = కూర (ఆంగ్లంలో కరీ).</p>
<p>‘రాయబారము’కు బదులు ‘రాయభారము’ అని తప్పుగా ప్రయోగం చేస్తారు కొందరు. అట్టివారికి సవ్యముగా ‘రాయ’ భారమా?! కొన్ని కుటుంబాల వాళ్లు ‘భ’ గుణింతం ఎక్కువగా వాడుతారు రోజువారీ భాషలో. “భావగారూ, భావి దగ్గర స్నానం చేసి ధోవతి కట్టుకోండి” అంటారు. ఈ వాక్యంలో మూడు భాషాదోషాలు దొర్లినయ్. బావ, బావి, దోవతి అనేవే సరైన పదాలు. భావి అంటే భవిష్యత్తు అనే మరో అర్థం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. భ్రాహ్మ(ణు)లు అనే పదాన్ని వాడటం కూడా తప్పే. బ్రాహ్మణులు అనేదే రైటు. అదే విధంగా భీభత్సము, భీబత్సము, బీబత్సము &#8211; ఈ మూడు పదాలూ తప్పుతో కూడుకున్నవే. బీభత్సము అన్న పదమే సరైనది. “ఆర్థిక స్థోమత లేని బీదవాడు పాపం” అనే వాక్యంలో భాషాదోషం ఉంది. ఎందుకంటే స్థోమత అనే పదం తప్పు. స్తోమత అన్నది సరైన పదం. “ఎందుకలా అదేపనిగా కదుల్తావ్? స్థిమితంగా కూర్చోలేవూ?” అంటూ చిన్న పిల్లవాణ్ని పెద్దాయనెవరైనా మందలిస్తే, స్తిమితం అనే పదాన్ని స్థిమితంగా మార్చి ‘దోషం’ ఆ పెద్దాయనదే అనిపిస్తుంది కదా!</p>
<p>స్తంభము అనే పదాన్ని స్థంభము అని రాస్తారు కొంత మంది. స్తంభము అనేదే రైటు. స్థంభము తప్పు. ‘స్తంభించుట’ స్తంభము నుండి వచ్చిందే. ఇంకొక భాషాదోషాన్ని ప్రస్తావిస్తాను. అదేమిటంటే ప్రస్థావన అనే తప్పు పదాన్ని వాడటం. ప్రస్తావించుట అంటే చెప్పుట. ప్రస్తావము అన్నా కూడా ప్రస్తావన అనే అర్థం. ప్రస్థావన తప్పు. “ఆస్థీ, అంతస్థూ చూసుకోకుండా ఏ సంబంధాన్నీ చేసుకోవద్దు” అన్నామనుకోండి. అప్పుడు మనం సరిగ్గా చూసుకోకుండా రెండు భాషాదోషాలను దొర్లించిన వాళ్లమవుతాము. ఆస్తి, అంతస్తు అనేవే సరైన పదాలు. అదేవిధంగా అస్థిత్వము అన్న పదాన్ని వాడినామనుకోండి. అప్పుడు మనం పప్పులో కాలు వేసినట్టటే. ఎందుకంటే అస్తిత్వము అన్నదే సరైన పదం. అస్థిత్వము తప్పు.</p>
<p>మీరు రాంచి వెళ్లారట కదా. అక్కడి స్థూపాల్ని చూసారా? అని అడిగామనుకోండి. అప్పుడు కూడా రెండు తప్పులు చేసినవాళ్లం అవుతాము. ఒకటి భాషాపరమైనది, మరొకటి సామాన్య విజ్ఞానం (General Knowledge) కు సంబంధించినది. స్తూపము అనేదే సరైన పదం కావటం భాషకు సంబంధించినదైతే, రాంచిలో కాక సాంచిలో స్తూపం ఉండటం G.K. కు సంబంధించినది! కొందరు స్తనాలు అనటానికి బదులు స్థనాలు అంటారు. అది కూడా తప్పే. దీనికి విరుద్ధంగా ‘థ’ వత్తుకు బదులు ‘త’ వత్తు రాస్తారు కొంత మంది. ఉదా: అస్తిక, నేరస్తులు, గ్రామస్తులు. అలా రాయటం తప్పు. అస్థిక, నేరస్థులు, గ్రామస్థులు అని రాయాలి. అయితే రోగగ్రస్థులు అని రాయకూడదు. రోగగ్రస్తులు అనే రాయాలి. ఎందుకంటే గ్రస్తము అనే పదానికి తినబడినది లేక మింగబడినది అని అర్థం.</p>
<p>‘ట’ వత్తుకు బదులు ‘ఠ’ వత్తును రాయటం మరొక రకమైన భాషా స్ఖాలిత్యం. తెలుగు భాష ఎంతో విశిష్ఠమైనది అంటూ పొగిడామా తుస్సుమన్నట్టే! ఎందుకంటే విశిష్ఠము అనేది తప్పు పదం. విశిష్టము అని రాయాలి. అదే విధంగా ఉత్కృష్ఠము తప్పు. ఉత్కృష్టము సరైన పదం. ముష్ఠి , పుష్ఠి అని రాస్తారు చాలా మంది. కాని అవి తప్పులు. ముష్టి , పుష్టి అనేవి సరైన పదాలు. “చిత్రగుప్తుని చిఠ్ఠాలో మన పాపాలన్నీ రాయబడి ఉంటాయి” అని చదువుతాం మనం. అలాగే “ఏంటా వెకిలి చేష్ఠలూ” అంటూ చివాట్లు పెట్టడం కూడా వింటుంటాం. ఇక్కడ చిఠ్ఠాకు బదులు చిట్టా, చేష్ఠకు బదులు చేష్ట సరైన పదాలు అని తెలుసుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నవాణ్ని కోపధారి అనటం వింటుంటాం. కాని అది తప్పు. కోపిష్ఠి అనాలి (కోపిష్టి కాదు). అదేవిధంగా పాపిష్టి , పాపిష్ఠిలలో రెండవది రైటు. నిజానికి పాపిష్ఠి అని కాక పాపిష్ఠుడు అనాలట. కిరీటధారి, మకుటధారి, గిరిధారి, వస్త్రధారి అనవచ్చు కాని కోపధారి అనకూడదు.</p>
<p>తనకు అరవై సంవత్సరాల వయస్సు విండిన సందర్భంగా ఒకాయన అట్టహాసంగా ఉత్సవం జరుపుకోవాలనుకున్నాడు. ఆహ్వాన పత్రికల్లో షష్ఠిపూర్తి ఉత్సవం అని అచ్చయింది. అయితే మరి అతనికి ఆరేళ్ల వయసే ఉన్నట్టు భావించాలా? ఎందుకంటే ఆరవ తిథి (పంచమి తర్వాత వచ్చేది) షష్ఠి . అరవై సంవత్సరాల ఉత్సవాన్ని షష్టిపూర్తి లేక షష్ట్యబ్ద పూర్తి అనాలి. ఇలా కేవలం ఒక వత్తు వచ్చి చేరినందుకే అర్థం పూర్తిగా మారే ప్రమాదాలు తెలుగు భాషలో మరి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ప్రదానం, ప్రధానం. ప్రదాన సభ అంటే ఇచ్చివేసే సభ కాగా (బహుమతి ప్రదానం), ప్రధాన సభ అంటే ముఖ్యమైన సభ అవుతుంది. అదేవిధంగా అర్థము = భావము, అర్ధము = సగము. అర్థ సౌందర్యం అంటే Beauty of meaning. అర్ధ సౌందర్యం అంటే Half beauty. ఇక ధార అంటే వరుస, దార అంటే భార్య. ‘బాలరసాల సాల……’ అనే పద్యంలో పోతన ‘నిజదార సుతోద్ధర పోషణార్థమై’ అన్నాడు. పంచదార అంటే ద్రౌపది (ఐదుగురికి భార్య అయినది) కూడా అవుతుంది.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5173</wfw:commentRss>
		<slash:comments>11</slash:comments>
		</item>
	</channel>
</rss>
