<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; కొత్త పుస్తకం కబుర్లు</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=97&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>ప్రేమ కూడా రాజకీయమేనా?</title>
		<link>http://vaakili.com/patrika/?p=16030</link>
		<comments>http://vaakili.com/patrika/?p=16030#comments</comments>
		<pubDate>Sat, 03 Feb 2018 20:10:00 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[పి. సత్యవతి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=16030</guid>
		<description><![CDATA[<p></p> <p>రెండవ దశ స్త్రీవాద ఉద్యమ ప్రభంజన వేళ షులామిత్‌ ఫైర్‌స్టోన్‌ రాసిన ‘ద డయాలెక్టిక్‌ ఆఫ్‌ సెక్స్‌’ అనే సంచలనాత్మక గ్రంథంలోని ‘ప్రేమ’ అనే అధ్యాయానికి అనువాదం ఈ చిన్ని పొత్తం. 1970లో వెలువడిన ఈ పుస్తకంలోని ఈ అధ్యాయం ఇప్పుడెందుకు చదవాలి మనం? అనే ప్రశ్నకు నా దగ్గర రెండు జవాబులున్నాయి. స్త్రీల చైతన్యాన్ని గురించి ఆలోచించే వాళ్ళందరూ ఆ చైతన్యం ఎలా మొలకెత్తి ఊపందుకున్నదీ, ఎంతవరకు ప్రయాణించిందీ తెలుసుకునే సందర్భంగా ఆయా దశల్లో వెలువడి, ఆలోచనలకు పదును పెట్టిన పుస్తకాలను చదవాలి. అవి ఇప్పుడు ప్రాసంగికమా కాదా అనేది పక్కనపెట్టి, ఆ ఆరోహణ క్రమాన్ని అధ్యయనం చేసి ఇప్పటి పరిస్థితుల్లో ఆయా రచనలను ఎట్లా అర్థం చేసుకోవాలో ఆలోచించాలి. రెండవది ఈ అధ్యాయంలో ఆమె చెప్పిన విషయాలు పూర్తిగా కొట్టిపారేసేటంతగా పరిస్థితులు మారకపోవడం. స్త్రీ పురుషులెవరికైనా ప్రేమంటే ప్రేమే కదా? అనుకోడానికి ఎలా వీలు కాదో షులామిత్‌ విశ్లేషిస్తుంది. స్త్రీ పురుషులిద్దరూ సమానులే అనుకున్నప్పుడు, పురుషులు కొంచెం ఎక్కువ ఎందుకు సమానులయ్యారో రెండవ దశ స్త్రీవాదులందరూ విశ్లేషించారు. ఈమె రాడికల్‌ ఫెమినిస్ట్‌ కనుక ఇంకొంచెం తీవ్రంగా విశ్లేషించింది.</p> <p>స్త్రీని కుటుంబ బంధనాల్లో ఇరికించి ఆమెను కట్టడి చేసేది కేవలం సంతానాన్ని కని పెంచడం అనే విషయమే కాదనీ, అంతకన్నా ముఖ్యమైనదీ ఆ చక్రానికి ఇరుసు వంటిదీ ప్రేమ అనీ, ఆ ప్రేమ అనేది ఎలా రాజకీయం అయిందో వివరిస్తుంది రచయిత్రి. ప్రేమ అనేది భూమిలో నుంచి ఎగదన్నుకు వచ్చే జలధారలా హృదయం నుంచి చిమ్ముకు వస్తుందనుకుంటాం. కానీ దాని వెనక కూడా రాజకీయం ముడిపడి ఉందనుకుంటే జడుసుకుంటాం. ఆ జడుసుకోక తప్పని విషయాలేమిటో, అవి కొన్ని ఇప్పటికి కూడా మారకుండా ఎట్లా, ఎవరు నిలబెడుతున్నారో అర్థమవుతుంది. మొదట్నుంచీ స్త్రీకి కొన్ని ఆదర్శాలు నిర్దేశించబడ్డాయి. ఆమెను ప్రేమమయిగా, త్యాగమయిగా, మాతృమూర్తిగా అభివర్ణిస్తూ వచ్చారు. ఆమె కూడా ఆ వర్ణనకి అనుగుణంగా రూపం [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2018/02/prema_raajakeeyaalu.jpg" alt="" title="prema_raajakeeyaalu" width="591" height="585" class="aligncenter size-full wp-image-16034" /></p>
<p>రెండవ దశ స్త్రీవాద ఉద్యమ ప్రభంజన వేళ షులామిత్‌ ఫైర్‌స్టోన్‌ రాసిన ‘ద డయాలెక్టిక్‌ ఆఫ్‌ సెక్స్‌’ అనే సంచలనాత్మక గ్రంథంలోని ‘ప్రేమ’ అనే అధ్యాయానికి అనువాదం ఈ చిన్ని పొత్తం. 1970లో వెలువడిన ఈ పుస్తకంలోని ఈ అధ్యాయం ఇప్పుడెందుకు చదవాలి మనం? అనే ప్రశ్నకు నా దగ్గర రెండు జవాబులున్నాయి. స్త్రీల చైతన్యాన్ని గురించి ఆలోచించే వాళ్ళందరూ ఆ చైతన్యం ఎలా మొలకెత్తి ఊపందుకున్నదీ, ఎంతవరకు ప్రయాణించిందీ తెలుసుకునే సందర్భంగా ఆయా దశల్లో వెలువడి, ఆలోచనలకు పదును పెట్టిన పుస్తకాలను చదవాలి. అవి ఇప్పుడు ప్రాసంగికమా కాదా అనేది పక్కనపెట్టి, ఆ ఆరోహణ క్రమాన్ని అధ్యయనం చేసి ఇప్పటి పరిస్థితుల్లో ఆయా రచనలను ఎట్లా అర్థం చేసుకోవాలో ఆలోచించాలి. రెండవది ఈ అధ్యాయంలో ఆమె చెప్పిన విషయాలు పూర్తిగా కొట్టిపారేసేటంతగా పరిస్థితులు మారకపోవడం. స్త్రీ పురుషులెవరికైనా ప్రేమంటే ప్రేమే కదా? అనుకోడానికి ఎలా వీలు కాదో షులామిత్‌ విశ్లేషిస్తుంది. స్త్రీ పురుషులిద్దరూ సమానులే అనుకున్నప్పుడు, పురుషులు కొంచెం ఎక్కువ ఎందుకు సమానులయ్యారో రెండవ దశ స్త్రీవాదులందరూ విశ్లేషించారు. ఈమె రాడికల్‌ ఫెమినిస్ట్‌ కనుక ఇంకొంచెం తీవ్రంగా విశ్లేషించింది.</p>
<p>స్త్రీని కుటుంబ బంధనాల్లో ఇరికించి ఆమెను కట్టడి చేసేది కేవలం సంతానాన్ని కని పెంచడం అనే విషయమే కాదనీ, అంతకన్నా ముఖ్యమైనదీ ఆ చక్రానికి ఇరుసు వంటిదీ ప్రేమ అనీ, ఆ ప్రేమ అనేది ఎలా రాజకీయం అయిందో వివరిస్తుంది రచయిత్రి. ప్రేమ అనేది భూమిలో నుంచి ఎగదన్నుకు వచ్చే జలధారలా హృదయం నుంచి చిమ్ముకు వస్తుందనుకుంటాం. కానీ దాని వెనక కూడా రాజకీయం ముడిపడి ఉందనుకుంటే జడుసుకుంటాం. ఆ జడుసుకోక తప్పని విషయాలేమిటో, అవి కొన్ని ఇప్పటికి కూడా మారకుండా ఎట్లా, ఎవరు నిలబెడుతున్నారో అర్థమవుతుంది. మొదట్నుంచీ స్త్రీకి కొన్ని ఆదర్శాలు నిర్దేశించబడ్డాయి. ఆమెను ప్రేమమయిగా, త్యాగమయిగా, మాతృమూర్తిగా అభివర్ణిస్తూ వచ్చారు. ఆమె కూడా ఆ వర్ణనకి అనుగుణంగా రూపం దాలుస్తూ వచ్చింది. అట్లా లేని స్త్రీని ఇవ్వాళ్టివరకూ జనసామాన్యం ‘నువ్వు ఆడదానివేనా?’ అనడం వింటూనే ఉంటాం. ఆ మూసలో ఒదిగిపోయి మంచి పేరు తెచ్చుకోడానికి ఆమె చేసే కృషి కొనసాగుతూనే ఉంది. అదట్లా ఉంచి, స్త్రీ పురుషుడిని ప్రేమించే విధంలోనూ, పురుషుడు స్త్రీని ప్రేమించే విధంలోనూ ఉన్న అంతరాన్ని షులామిత్‌ అద్భుతంగా ఆవిష్కరించింది. పురుషుడు అన్నింట్లోనూ తన ఆధిక్యాన్ని వ్యక్తపరుస్తాడు. స్త్రీ తన అభద్రతను, తనను గుర్తించాలనే ఆరాటాన్నీ ప్రేమ రూపంలో ప్రదర్శిస్తుంది. అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇద్దరు సమానస్థాయి వ్యక్తుల మధ్య ఈ ఆరాటానికి, ఆధిక్య భావప్రకటనకీ తావుండదు. కానీ ఆ సమానత్వ సంస్కృతి లేనిదే స్వచ్ఛమైన ప్రేమకి ఆస్కారం ఉండదు. ఇది షులామిత్‌ విశ్లేషణలో ఒక అంశం. ప్రేమలు ఎట్లా ఉండకూడదో అర్థమవుతుంది షులామిత్‌ రాసిన ప్రేమ అనే అధ్యాయం చదివినప్పుడు. దీనిని పద్మావతి ఆసక్తికరంగా చేసిన ఈ అనువాదం ఆలోచింపజేస్తుంది.</p>
<p>‘స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు స్వతంత్ర వ్యక్తులుగా గుర్తించాలి. ఇందువలన పరస్పర సహకారం, స్నేహం పెరుగుతాయి. అలాగే, కాంక్ష, ప్రేమా, కలలు, సాహసాలు వాటి అర్థాలను కోల్పోవు. అలాగే మానవజాతిలోని సగానికున్న బానిసత్వాన్ని, తద్వారా నెలకొన్న ద్వంద్వనీతినీ నిర్మూలించినప్పుడు మానవజంటల నిజమైన రూపాన్ని మనం దర్శించగలం. సూటిౖయెన సహజమైన సంబంధం కావాలి’ అని ఏడు దశాబ్దాల క్రితమే అంటుంది సిమోన్‌ ద బావా.</p>
<p>ఇటువంటి మానవ సంబంధమే ప్రేమ. మన సంస్కృతిలో అది ఉందా? లేకపోతే ఎన్నాళ్లు ఎదురుచూడాలి?</p>
<p><em>(‘ద డయాలెక్టిక్‌ ఆఫ్‌ సెక్స్‌’ పుస్తకంలోని ‘ప్రేమ’ అనే చాప్టర్‌ను బోడపాటి పద్మావతి గారు తెలుగులోకి ‘ప్రేమ రాజకీయాలు’ పేరుతో అనువాదం చేసారు. ఈ పుస్తకానికి పి.సత్యవతి గారు రాసిన ముందుమాట ఇది.)</em><br />
&nbsp;<br />
ప్రతులకు:<br />
ధీర పబ్లికేషన్స్ &#8211; 9985427121</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=16030</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>ఎంతెంత దూరం?</title>
		<link>http://vaakili.com/patrika/?p=15854</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15854#comments</comments>
		<pubDate>Sun, 31 Dec 2017 18:55:31 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[స్వాతికుమారి బండ్లమూడి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15854</guid>
		<description><![CDATA[దొరికిన చుక్కలన్నీ కలుపుకు పోతున్నా పూర్తికాని ముగ్గులా, అనుగ్రహించబడిన గాయాలన్నిటితోనూ అల్లిక వీలుకాని కవితలా, ఈ ప్రయాణం ఎప్పుడూ ఒక పలవరింతే. పలవరించే గొంతుక మాత్రం పలుకుపలుకుకీ బెంగటిల్లి పసిదై పోతుంది. జీవితకాలపు అనుభవాల అట్టడుగునించీ, వంటబట్టించుకున్న మాయమర్మపు లౌక్యపు మాటల చీలికల్లోంచి, ఒక యవ్వనపుజీరగా ఎగిసెగిసిపడుతుంది. మొహమాటాన్ని, మర్యాదల్నీ ధిక్కరించి, పలుకే బంగారమైన ప్రేయసిని పంతంగా ప్రేమిస్తూనే ఉంటుంది.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/12/intivaipu_cover.jpg"><img class="alignleft size-medium wp-image-15865" title="intivaipu_cover" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/12/intivaipu_cover-191x300.jpg" alt="" width="191" height="300" /></a></p>
<p>ఆటల్లో పడి ఎటెటో తిరిగి ఇంటిధ్యాస మర్చిపోయిన పిల్లాడికి, ఉన్నపళాన అమ్మగుర్తుకొచ్చి స్నేహితుల్ని, కర్రా బిళ్ళని, మర్రి ఊడల్ని వదిలేసి ఇంటికి పరిగెత్తుతాడు. అప్పుడు వాడికి ఇల్లంటే అమ్మ.</p>
<p>తర్వాత్తర్వాత రెక్కలు మొలిపించుకుని, వేర్లని పెరుక్కుని బహుదూరంగా వలసపోయాక, ప్రతిరోజు వలసపోతూ ఉండటమే బతికే పద్ధతిగా మారిపోయాక;</p>
<p>ఇల్లంటే తను వదులుకుని వచ్చిన దేశం, ఊరు, బాల్యం.<br />
ఇల్లంటే తన సామాజిక, సాంస్కృతిక, వ్యక్తిత్వ మూలం.</p>
<p>ఇల్లు ఒక ప్రతీక; పుట్టుకకి, ఎదుగుదలకి; ఎదిగిపోయాక తిరిగొస్తే మళ్ళీ పసిపిల్లాణ్ణి చేసి ఒద్దిక నేర్పడానికి.</p>
<p>&#8220;నగ్రీ నగ్రీ ఫిరా ముసాఫిర్ ఘర్ కా రాస్తా భూల్ గయా<br />
&#8230;&#8230;<br />
హమే తో సబ్ కుచ్ యాద్ రహా పర్ హమ్ కో జమానా భూల్ గయా&#8221; - గులాం అలీ</p>
<p>మరిచిపోయిన దారిని ఒంటరిగా వెతుక్కోక తప్పదు. తనని మరిచిపోయిన వాళ్ళకి తనెవరో గుర్తు చెయ్యకా తప్పదు. మైలురాళ్ళని కౌంట్ డౌన్ చేసుకుంటూ ప్రతి మజిలీలో ఒక పద్యాన్ని నాటుకుంటూ &#8217;ఎక్లచలోరే&#8217; అని సాగిపోయే కవి ప్రతీ అడుగులోనూ ఒక కాందిశీకుడే. ప్రతీ మలుపులోనూ గుక్కెడు జ్ఞాపకాల కోసం దోసిలి పట్టే దాహార్తుడే.</p>
<p>దొరికిన చుక్కలన్నీ కలుపుకు పోతున్నా పూర్తికాని ముగ్గులా, అనుగ్రహించబడిన గాయాలన్నిటితోనూ అల్లిక వీలుకాని కవితలా, ఈ ప్రయాణం ఎప్పుడూ ఒక పలవరింతే. పలవరించే గొంతుక మాత్రం పలుకుపలుకుకీ బెంగటిల్లి పసిదై పోతుంది. జీవితకాలపు అనుభవాల అట్టడుగునించీ, వంటబట్టించుకున్న మాయమర్మపు లౌక్యపు మాటల చీలికల్లోంచి, ఒక యవ్వనపుజీరగా ఎగిసెగిసిపడుతుంది. మొహమాటాన్ని, మర్యాదల్నీ ధిక్కరించి, పలుకే బంగారమైన ప్రేయసిని పంతంగా ప్రేమిస్తూనే ఉంటుంది.</p>
<p>హఫీజ్ భగవంతుడితో ఇలా అంటాడు-</p>
<p>&#8220;పక్షులకి మొదట్లో ఎగరడం తెలీదు.<br />
నువ్వు వాటిదగ్గర కూర్చుని పాటలు పాడావు.<br />
నువ్వెళ్ళిపోయాక,<br />
నీకోసమైన వాటి తపన<br />
రెక్కలుగా మొలిచి<br />
నింగిని తొలుచుకుపోయింది.&#8221;</p>
<p>బహుశా ఆర్తిని రెక్కలుగా చాపుకున్నఅ పక్షుల్లాంటివే ఇంటివైపుగా మళ్ళిన ఈ కవితలన్నీ.</p>
<p>గాలిలో వాటి గిరికీల గీతల వెంటపడి నడిచిపోయే అస్థిర బైరాగిలాంటివాడే ఈ కవి.</p>
<p>***</p>
<p>పుస్తకం వివరాలు:</p>
<p>ఇంటివైపు</p>
<p>కవి: అఫ్సర్</p>
<p>పబ్లిషర్: వాకిలి</p>
<p>వెల: Rs. 180/- ($ 9.95)</p>
<p>ప్రతులకు:<br />
<a href="https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/products/inti-vaipu" target="_blank">Navodaya Book House</a><br />
amazon.com<br />
kinige.com</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15854</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>అనుపమ స్వప్నయానం</title>
		<link>http://vaakili.com/patrika/?p=15522</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15522#comments</comments>
		<pubDate>Thu, 30 Nov 2017 22:08:23 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[రోహిత్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15522</guid>
		<description><![CDATA[<p></p> <p>సీసాలో ఓ ఉత్తరముంచి సముద్రంలోకి విసిరేయటం లాంటిది కవిత్వమంటే. </p> <p>ఆ సీసా అలల పై తేలుతూ ఏ తీరం చేరుతుందో.చరిత్రలో ఎప్పుడూ ఎవరో ఒకరు కవిత్వం రాస్తూనే ఉంటారు. ఓ మారుమూల గ్రామంలో లాంతరు వెలుగులోనో, అనేక అంతస్తుల భవనంలో ఓ ఇరుకు గదిలోనో, ఏడు సముద్రాలకవతల అంతరించిపోయిన తెగ తాలుకు చివరి మనిషో &#8211; నిరంతరం ఎవరోఒకరి చేత కవిత్వం రాయబడుతూనే ఉంటుంది. కవి తనకు మాత్రమే సొంతమైన ఒక నిశ్శబ్ధంలో రాసే కవిత్వం చరిత్రగమనంలో ఓ కాలానికే ఉపమానం అవుతుంది. ఓ కాలంలోని మనుషులు రక్తమాంసాలతో అనుభవించిన జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఓ కాలపు అస్థిత్వాన్ని నిర్వచిస్తుంది.</p> <p>కవిత్వం (creative work ఏదైనా) రాయటం పగటికల కనటంలాంటిదని ఫ్రాయిడ్ అంటాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటూ తన సొంత ప్రపంచాన్ని నిర్మించుకునే పిల్లాడు కొనసాగింపుగా పెద్దయ్యాక తన ఏకాంతంలో కథలూ కవితలూ రాస్తుంటాడని అంటాడు. ఈ రెండు పనులూ ఒక రకంగా, ఊర్మిలా అన్నట్టు &#8220;కన్నులు తెరిచి కన్న స్వప్నం&#8221; లాంటివి. ఈ సందర్భంగా కవిత్వమనే కలను చేయుపట్టుకొని నడిపించే (Writing is nothing more than a guided dream &#8211; J.L. Borges) తన స్థితికి తాను ఇచ్చుకున్న పేరు &#8211; ఊర్మిల. రామయనంలో పద్నాలుగు సంవత్సరాలు నిద్రలో బ్రతికిన ఊర్మిల కలలలో ఎంత దూరం ప్రయాణించిందో &#8211; ఎన్ని రామాయణాలు చూసిందో, ఎంతమంది లక్ష్మణులను పెళ్ళడిందో- అంతటి జీవితాన్ని కలగన్న ఊర్మిలకు మెలుకువకూడా ఓ మరణంలాంటిదే. మేలుకున్న ఊర్మిలకు తన స్వప్న జ్ఞపకాలుగా మిగిలేది పిడికెడు బూడిద మాత్రమే.</p> <p>(తెల్లారితే షార్జహద్ బ్రతికిపోతుంది, మేలుకుంటే ఊర్మిల మరణిస్తుంది)</p> <p>లక్ష్మనుడి కోసం పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోయి కలగన్న ఊర్మిల వేరు, కలలో సముద్రాలు దాటిన ఊర్మిల వేరు. ఈ కవిత్వం రాసిన ఊర్మిల వేరు, ఈ కవిత్వంలోని ఊర్మిల వేరు (&#8220;The I in a poem, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/angara_swapnam_oormila.jpg" alt="" title="angara_swapnam_oormila" width="417" height="520" class="aligncenter size-full wp-image-15628" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">సీ</span>సాలో ఓ ఉత్తరముంచి సముద్రంలోకి విసిరేయటం లాంటిది కవిత్వమంటే. </p>
<p>ఆ సీసా అలల పై తేలుతూ ఏ తీరం చేరుతుందో.చరిత్రలో ఎప్పుడూ ఎవరో ఒకరు కవిత్వం రాస్తూనే ఉంటారు. ఓ మారుమూల గ్రామంలో లాంతరు వెలుగులోనో, అనేక అంతస్తుల భవనంలో ఓ ఇరుకు గదిలోనో, ఏడు సముద్రాలకవతల అంతరించిపోయిన తెగ తాలుకు చివరి మనిషో &#8211; నిరంతరం ఎవరోఒకరి చేత కవిత్వం రాయబడుతూనే ఉంటుంది. కవి తనకు మాత్రమే సొంతమైన ఒక నిశ్శబ్ధంలో రాసే కవిత్వం చరిత్రగమనంలో ఓ కాలానికే ఉపమానం అవుతుంది. ఓ కాలంలోని మనుషులు రక్తమాంసాలతో అనుభవించిన జీవితానికి ప్రతీకగా నిలుస్తుంది. ఓ కాలపు అస్థిత్వాన్ని నిర్వచిస్తుంది.</p>
<p>కవిత్వం (creative work ఏదైనా) రాయటం పగటికల కనటంలాంటిదని ఫ్రాయిడ్ అంటాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటూ తన సొంత ప్రపంచాన్ని నిర్మించుకునే పిల్లాడు కొనసాగింపుగా పెద్దయ్యాక తన ఏకాంతంలో కథలూ కవితలూ రాస్తుంటాడని అంటాడు. ఈ రెండు పనులూ ఒక రకంగా, ఊర్మిలా అన్నట్టు &#8220;కన్నులు తెరిచి కన్న స్వప్నం&#8221; లాంటివి. ఈ సందర్భంగా కవిత్వమనే కలను చేయుపట్టుకొని నడిపించే (Writing is nothing more than a guided dream &#8211; J.L. Borges) తన స్థితికి తాను ఇచ్చుకున్న పేరు &#8211; ఊర్మిల. రామయనంలో పద్నాలుగు సంవత్సరాలు నిద్రలో బ్రతికిన ఊర్మిల కలలలో ఎంత దూరం ప్రయాణించిందో &#8211; ఎన్ని రామాయణాలు చూసిందో, ఎంతమంది లక్ష్మణులను పెళ్ళడిందో- అంతటి జీవితాన్ని కలగన్న ఊర్మిలకు మెలుకువకూడా ఓ మరణంలాంటిదే. మేలుకున్న ఊర్మిలకు తన స్వప్న జ్ఞపకాలుగా మిగిలేది పిడికెడు బూడిద మాత్రమే.</p>
<p>(తెల్లారితే షార్జహద్ బ్రతికిపోతుంది, మేలుకుంటే ఊర్మిల మరణిస్తుంది)</p>
<p>లక్ష్మనుడి కోసం పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోయి కలగన్న ఊర్మిల వేరు, కలలో సముద్రాలు దాటిన ఊర్మిల వేరు. ఈ కవిత్వం రాసిన ఊర్మిల వేరు, ఈ కవిత్వంలోని ఊర్మిల వేరు (<em>&#8220;The I in a poem, I want to insist, is the consciousness from which the poem comes, but it&#8217;s not the I to whom I subscribe when I sign an affidavit, when I set forth facts in order to get a driver&#8217;s license or a passport&#8221; &#8211; Adrienne Rich, &#8220;The Genesis of Yom Kippur 1984&#8243;</em> ) ఏకరీతిగా సాగే జీవితంలోకి నెట్టబడిన స్త్రీ ఊపిరి పీల్చుకోటానికి ఉపరితలంలోకి వచ్చినప్పుడు రాయబడిన కవిత్వం ఇది. స్థన-కాల పరిమితులకు కట్టుబడాల్సిన స్త్రీ పగటికల ఈ కవిత్వం. &#8220;అగాధం అంచున వేలాడుతూ&#8221; ప్రాణాతీతమైన తొందరతో రాసిన కవిత్వం ఇది.</p>
<p>అందుకే ఈ కవిత్వంలో ఇద్దరు స్త్రీలు కనిపిస్తారు. భౌతిక వాస్తవానికి రాజీ పడిన స్త్రీ, స్వప్న ప్రపంచంలో ఎవరికీ జవాబుపడని స్త్రీ. ఒక స్త్రీ మరొక స్త్రీని ఎప్పుడూ గమనించుకుంటూ ఉంటుంది. ఒక స్త్రీ కి మరొక స్త్రీ సాక్ష్యం. ఒక స్త్రీ మరొక స్త్రీని కలుసుకోటానికి నిరంతరం తాపత్రయపడుతూ ఉంటుంది. తన రోజూవారి జీవితానికి దూరంగా, స్థలకాల పరిమితులకు అవతల ఓ కలలాంటి ప్రదేశంలో ఒక స్త్రీ మరొక స్త్రీని కలుసుకుంటుంది.</p>
<p>ఊర్మిల చూసిన ప్రతొక్క వస్తువుకీ ఓ అభౌతిక అర్థాన్ని ఇచ్చుకుంటుంది. ఆరకంగా తన ప్రపంచాన్ని తనకనుగునంగా నిర్వచించుకుంటుంది. తన హృదయం పిచ్చిదాని పిడికిలో రాయి, &#8220;జీవితం&#8221; &#8220;ఆకలిగొన్న దాహం&#8221;, తనకు &#8220;గాలిలో తిరగాడే దువ్వెనలు సంకేతాన్ని మోసుకొ&#8221;స్తాయి, తటాలున పడిన చినుకు &#8220;జ్ఞాపక తెరలుతీసే&#8221; మంత్రం అలా తన చుట్టూ ప్రపంచమన్న నాలుగు డైమెన్షన్ల వాస్తవాన్ని భాషా అనే అసంఖ్యాక డైమెషన్ల ప్రపంచంలోకి విడుదల చేస్తుంది. పెట్టుబడీదారి వ్యవస్థలో, పురుషస్వామ్య సమాజం తనకిచ్చిన భాష తనను తన ఆలోచనల్లో కూడా ఎక్కువ దూరం పోనివ్వదని తన భాషని తానే సృష్టించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. &#8220;సుదీర్ఘ కాలరేఖపై/ ఒంటరి పయనం/ చుట్టూరా/ కనుచూపు మేర/ ఎండి మోడైన కొమ్మలు రెమ్మలు&#8221; అంటూ తన చుట్టూ అల్లుకున్న ప్రపంచం స్వభావాన్ని generalise చేస్తుంది.</p>
<p>కానీ భౌతిక ప్రపంచం మనిషిని ఎలా నిర్వచిస్తుందో, ఉపమానాల ప్రపంచం ఊర్మిలనీ నిర్వచిస్తుంది. ఒక సందర్భంలో ఎన్నో నిజాల్లో బ్రతికే తాను, ఒక నిజానికే ఎన్నో నిర్వచనాలను వెతికే తాను &#8211; తనకుతాను అసంఖ్యాక అస్థిత్వాలను ఆమోదించుకుంటుంది. ఒకే అస్థిత్వానికీ బంధీ అవ్వటాన్ని నిరాకరిస్తుంది. &#8220;విరుచుకుపడ్డ మంచు బిందువు&#8221; తానే, &#8220;కత్తులు పొదిగిన కూలిన వంతెనా&#8221; తానే. &#8220;కడదాకా గమ్యం చేరని బాటసారీ&#8221; తానే, తలకిందులైన ప్రేతం&#8221; తానే. ఓ దేహంలేని తనంలో తననుతాను నిర్వచించుకుంటుంది &#8211; &#8220;దేహాన్ని వదిలి/ అద్దం ముందుకెళ్ళి నిల్చుంటుంది&#8221;.</p>
<p>ఈ రకంగా తనకు తానూ, తన చుట్టూ ప్రపంచానికీ అర్థాన్ని ఇచ్చుకుంటూ, ఓ భాషని సృష్టించుకుంటూ, నిరంతరం తననుతాను నిర్వచించుకుంటూ ఉంటుంది.</p>
<p>స్త్రీలు తాము స్వేచ్చగా ఆలోచించగలిగే భాష సృష్టించుకున్నప్పుడే &#8211; ఈ పురుషస్వామ్య సమాజాన్ని ఎదిరించి మాట్లాడగలుగుతారు.</p>
<p><em>&#8220;What does it mean when the tools of a racist patriarchy are used to examine the fruits of that same patriarchy? It means that the most narrow perimeters of change are possible and allowed.&#8221; &#8211; Audre Lorde, The Master&#8217;s Tools Will Never Dismantle the Master&#8217;s House.</em></p>
<p>అందుకే స్త్రీ తమకు మాత్రమే సొంతమైన భాషని సృష్టించుకోవాలి. పురుషుని దృష్టిసోకని ఓ భాష, నవ్వుకోటానికి, ఏడ్చుకోటానికీ స్వేచ్చాయుత భాష. &#8220;Poetry is not a luxury&#8221; అనే వ్యాసంగంలో లార్డే అంటుంది:</p>
<p><em>&#8220;For within living structures defined by profit, by linear power, by institutional dehumanisation, our feelings were not meant to survive. Kept around as unavoidable adjuncts or pleasant pastimes, feelings were expected to kneel to thought as women were expected to kneel to men. But women have survived. As poets. And there are no pains. We have felt them all already. We have hidden that fact in the same place where we have hidden our power. They surface in our dreams and it is our dreams that point the way to freedom. Those dreams are made realisable through our poems that give us the strength and courage to see, to feel, to speak and to dare.&#8221;</em></p>
<p>తీరం చేరిన సీసాలోని కవిత్వం ఏ అనామకుడి కాలు తగులుతుందో. ఆ అనామకుడు మరొక ప్రపంచం నుండి వచ్చిన ఆ కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో. ఆ అనామకుడిలో ఈ కవిత్వం ఏ భాషని నిద్రలేపుతుందో.</p>
<p style="text-align: center;">***</p>
</div>
<p>పుస్తకం వివరాలు:<br />
పుస్తకం: అంగారస్వప్నం<br />
రచయిత: ఊర్మిళ<br />
ప్రచురణ: ప్రేమలేఖ<br />
వెల: Rs. 200<br />
ప్రతులకు: నామాడి శ్రీధర్, 3-129, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా, AP 533214</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15522</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>నర్సింగాపురం పిలగాని కతలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=15382</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15382#comments</comments>
		<pubDate>Tue, 31 Oct 2017 21:14:54 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[నామాడి శ్రీధర్‌]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15382</guid>
		<description><![CDATA[ఇసుకలోంచి కాశెపుల్లను లాగినట్టుగా బాల్యంలోంచి అతని జ్ఞాపకాలను బొట్టుబొట్టుగా వర్తమానంలోకి చేదుతాడు. నా భాష పోయింది, నా యాస పోయింది, నన్ను పల్లెటూరి వాడిగా పరిచయం చేసుకునే ఏ లక్షణమూ లేదని బాధపడతాడు. కొన్ని వస్తువులకు కూడ ప్రాణం ఉంటుందనీ, వాటిని మినహాయించి ‘సాయమాను’నూ, ఇంటినీ ఊహించలేనను కుంటాడు. కడకి మనిషి ప్రేమస్వరూపుడు కావడం ఎంత కష్టభూయిష్టమో చెబుతాడు. ఇక్కడ ఓ సారూప్యం గుర్తుకొస్తుంది. 1840 నాటి రష్యన్‌ నవల ఎమ్‌.లేర్మొంతొవ్‌ ‘మన కాలం వీరుడు’లో కథానాయకుడు పెచోరిన్‌ డైరీలో ఇలా రాసుకున్నాడు: ‘‘నిజంగా చెడు అంత ఆకర్షణీయంగా ఉంటుందా?’’ మన పౌరజీవనంలోని వాస్తవమే 170 ఏళ్ళు పైబడిన తర్వాత కూడ దాదాపు అటువంటి వాక్యంగా పునరావృతమవుతుంది.]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/pooduri_rajireddy_book.jpg" alt="" title="pooduri_rajireddy_book" width="380" class="alignleft size-full wp-image-15441" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">‘చిం</span>తకింది మల్లయ్య ముచ్చట’ పూడూరి రాజిరెడ్డి కథల పుస్తకం- గడిచిన పది, పదిహేనేళ్ళ కాలంలో రాసిన పన్నెండు కథల సంకలనం. ‘‘నేను కానిది నేను ఏమీ రాయలేను’’ అని ఇంట్రోలో రచయిత చెప్పిన మాట, సాహిత్య సృష్టి పట్ల ఆయన నిబద్ధతని తెలియజేస్తుంది. ‘‘ఈ కథలన్నీ ఇదివరకు అచ్చు అయినవే. ఈ సంకలనంగా వేస్తున్నప్పుడు మళ్ళీ కొన్నింట్లో మార్పులు, కొన్నింట్లో చేర్పులు చేశాను’’ అనే వివరణ రచనా వ్యాసంగం ఎడల విధేయతని చూపుతుంది. ఈ రెండు సుగుణాలు సృజనకారుడికి ఆవశ్యకమని నేను కూడ విశ్వసిస్తాను. అందుచేతనే ఈ పుస్తకాన్ని ఇష్టంగా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమూలాగ్రం చదివాను.</p>
<p>‘చింతకింది మల్లయ్య ముచ్చట’ అద్భుతమైన కథ. మల్లయ్య ఓ చిన్నకారు రైతు. ‘చింతకింది మల్లిగాడురా పనోడంటే’ అనిపించుకుంటాడు. ‘మాట మీద నిలవడుతడు, వాడురా మనిషి’ అని పేరుతెచ్చుకుంటాడు. అతని కథని రచయిత రాయాలనుకుంటాడు. మల్లయ్య నోటమ్మటే కథని చెప్పించుకుంటాడు. తల్లిలేని, ఆటపాటల్లేని బాల్యం గురించీ; యవ్వనం, భార్య మరణం గురించీ; వ్యవసాయం, పిల్లల చదువుసంధ్యలూ సాధక బాధకాలన్నీ చెబుతాడు. ‘‘నాలుగు బర్లున్నయి. నాలుగు ఆవులున్నాయి. గొర్రె, మాక. బూమి. బాయి. దానికి కరంటు. మా నాయిన నాకు కశ్కెడు బూమి ఇయ్యలె. నేను దాన్ని నాలుగెకురాలు జేసిన. నేను వెట్టిన చింతచెట్లు కాతకచ్చినయి. నేను నీళ్ళు వోసిన మామిడిచెట్ల కాయలు తొక్కులకు వనికత్తున్నయి. పోరగాండ్లకు తినేటన్ని జామకాయలు. రొండు దింటెనే కడుపునిండె అరటిపండ్లు. నాకు ఇంకేం గావాలె?’’ అని ఏకరువు పెడతాడు. మల్లయ్య మాటల మధ్యేమధ్యే కథలోకి రచయిత వచ్చివెళుతుంటాడు. కథనంలో తన వ్యాఖ్యానంతో కదలిక (Movement) తీసుకొస్తాడు. ఈ కథనశైలి (narrative style) ఒక సామాన్యమైన ఇతివృత్తాన్ని ప్రభావవంతమైన కథగా మలిచింది. అందుకు పాత్రోచితమైన భాష కలిసివచ్చింది. రచనలలో మామూలుగా కనిపించే నాటకీయత పట్ల ఈ కథలో రచయిత తన నిరసనని ప్రకటించాడు. జీవితంలోని సరళ, సౌందర్యాలని అసాధారణంతో కప్పిపుచ్చకుండా వాస్తవమూ సంభవమూ మాత్రమే చిత్రించాడు. ఆఖరికి ‘‘జీవితాన్ని జీవితంలా చూడకుండా నాటకీయంగా ఉండాలనుకునే వాళ్ళకు మల్లయ్య జీవితం ప్రత్యేకించి ఏమీ చెప్పదు’’ అని అంటాడు.</p>
<p>‘కాశెపుల్ల – నర్సింగాపురం పిలగాని డైరీ’ జ్ఞాపక కథ. రచయిత తన అమాయకమైన బాల్య స్మ ృతుల ఆధారంగా, ఏదైనా రాయాలనుకుంటాడు. దానికి చిన్నప్పుడు ఆడిన ఆట ‘కాశెపుల్ల’ అని శీర్షిక కూడ పెడతాడు. గొప్పగా రాయాలని ఉంటుంది. కాని ఏం రాస్తే గొప్పది అవుతుందో తెలియదు. అయితే ఈ సందిగ్ధం కొత్తది కాదు. పదేళ్ళ ప్రాయం నాటిది. అయిదో తరగతి దసరా సెలవుల్లో ‘బూరుగుపెల్లి సారు’ పిల్లలందర్నీ డైరీ రాసుకుని రమ్మంటారు. పిలగాడు దినచర్య రాయడం మొదలుపెడతాడు. ఎన్ని రోజులైనా ‘పశువులను కాచినాను’ తప్ప మరింకేమీ రాయలేకపోతాడు. అయితే డైరీ రాత పేరుతో అతని ఆటపాటలు, ఆ పాడిపంటలు, పువ్వులు, బంధువులు, ఇరుగుపొరుగు మనుషులు, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం, బతుకమ్మ పండుగ, దసరా హడావుడి, ‘వనవాసి’ నవలలోని యుగళప్రసాద్‌ని పోలిన మొగుల్‌ సాబ్‌తో పాటు ఇంకా అనేకం మనోహరంగా వర్ణిస్తాడు.</p>
<p>ఇసుకలోంచి కాశెపుల్లను లాగినట్టుగా బాల్యంలోంచి అతని జ్ఞాపకాలను బొట్టుబొట్టుగా వర్తమానంలోకి చేదుతాడు. నా భాష పోయింది, నా యాస పోయింది, నన్ను పల్లెటూరి వాడిగా పరిచయం చేసుకునే ఏ లక్షణమూ లేదని బాధపడతాడు. కొన్ని వస్తువులకు కూడ ప్రాణం ఉంటుందనీ, వాటిని మినహాయించి ‘సాయమాను’నూ, ఇంటినీ ఊహించలేనను కుంటాడు. కడకి మనిషి ప్రేమస్వరూపుడు కావడం ఎంత కష్టభూయిష్టమో చెబుతాడు. ఇక్కడ ఓ సారూప్యం గుర్తుకొస్తుంది. 1840 నాటి రష్యన్‌ నవల ఎమ్‌.లేర్మొంతొవ్‌ ‘మన కాలం వీరుడు’లో కథానాయకుడు పెచోరిన్‌ డైరీలో ఇలా రాసుకున్నాడు: ‘‘నిజంగా చెడు అంత ఆకర్షణీయంగా ఉంటుందా?’’ మన పౌరజీవనంలోని వాస్తవమే 170 ఏళ్ళు పైబడిన తర్వాత కూడ దాదాపు అటువంటి వాక్యంగా పునరావృతమవుతుంది.</p>
<p>‘తమ్ముడి మరణం –1’ ఆర్ద్రమైన కథ. ‘‘అన్నా, నాకు ఆ అమ్మాయి ఎంతమాత్రం నచ్చలేదు. ఒళ్ళంతా ఒక రకమైన దుర్గంధం. ఇక నా వల్లకాదు’’ అని తమ్ముడి నుంచి ఫోన్‌కి మెసేజ్‌ వస్తుంది. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారమూ అందుతుంది. 28 ఏళ్ళ యువకుడు. అతనికి పెళ్ళయి నాలుగు రోజులు కూడా కాదు. అది ఇష్టం లేని పెళ్ళి కాదు. అలాగని ప్రేమ వివాహమూ కాదు. అన్న ఉన్నపళాన ఊరికి బయలుదేరతాడు. ఆత్మహత్యకు కారణం గురించిన అన్వేషణతోనే ప్రయాణం సాగుతుంది. ఒక్కడూ తమ్ముడి జ్ఞాపకాలతో, తనలో తను తర్జనభర్జనలు పడుతో ఇంటికి చేరుతాడు. తమ్ముడి మృతదేహాన్ని చూచి తల్లడిల్లిపోతాడు. ‘చెట్టుకొమ్మ పైకి ఎక్కి, అక్కడ కూర్చుని, ఉరి మెడకు పెట్టుకుని, అంతే&#8230; ఒక్కసారిగా దుంకేశాడు. బతుకులోంచి చావులోకి దుంకేశాడు’ అనుకుంటాడు.</p>
<p>కథ ఆరంభదశలో అన్న స్వగతంగా అంటాడు: ‘‘అమ్మాయి అత్యంత మామూలుగా ఉంటుంది. అంటే చూడగానే బాగుంది అని ఒక్క మాటలో అనాలనిపించదు. అయినా ఎలా తిరస్కరించడం? ఆ అమ్మాయిని మనిషి అర్హత నుంచి ఎలా తగ్గించి మాట్లాడటం?’’ చిట్టచివరికి ‘‘ఏ స్త్రీత్వపు సౌకుమార్యం లేని, ఇకపై అది చిగురించేందుకు ఎంతమాత్రమూ అవకాశం లేని కొర్రాయి అయ్యుండాలామె’’ అని ఆక్షేపిస్తాడు లేదా నిర్ధారణకి వస్తాడు. ఆ దుర్గంధం మానసిక అంతరం. ఆ ప్రేమరాహిత్యపు అగాథమే తమ్ముడిని బలితీసుకుంది. ఇది కేవలం తమ్ముడి ఆత్మహత్య పూర్వాపరాల గురించిన కథ మాత్రమే కాదు. కలత చెందిన తమ్ముడిని కోల్పోయిన అన్న ఆవేదన కూడ ఈ ఏకపాత్ర సంభాషణలో ఆసాంతం అనుసరిస్తుంది.</p>
<p>పారిశుద్ధ్య కార్మికులు సమ్మె తలపెట్టినప్పుడు ఏమవుతుందనే ఆలోచనలోంచి అల్లిన కథ ‘రెండడుగుల నేల’. ‘‘మమ్మల్ని మీతో సమానంగా గౌరవించాలి’’ అన్న వారి అభ్యర్థన ఏనాటికైనా మన హృదయం వినగలుగుతుందా? కోటి రూపాయలు ఇస్తే మాత్రం నేను చేస్తానా ఆ పని? అని narrator తన మీదికే ప్రశ్నని ఎక్కుపెట్టుకుంటాడు. ఆ మధ్య పాకీపనివారి గురించి మేమొక సదస్సుని నిర్వహించాం. మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వారు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. అంతా విన్న తర్వాత ప్రజాప్రతినిధి ఒకరు అసహనంతో విరుచుకుపడ్డాడు. అనాలోచితంగా అన్నాడు కదా: ‘‘మిమ్మల్ని పాకీపని ఎవ్వరు చేయమంటున్నారు? వృత్తి మానేయండి. వ్యాపారం చేసుకోండి. మీ పిల్లల్ని చదివించు కోండి.’’ పాపం, ఆ హితవచనాలకి వారు బిక్కచచ్చిపోయారు. నిజమే పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కరోజు గైర్‌హాజరయితే, ఆ పని యంత్రం చేస్తుందా? అతడు కనీసం రోడ్డు పక్కన అరటి పళ్ళు అమ్మబోతే, ఎవరైనా కొనేందుకు ముందుకొస్తారా? ఆ పిల్లల్ని బడికి పంపితే సాటివారితో కలవనిస్తారా? అందుకనే ఆ అమానవీయ, అపాయకరమైన వృత్తి గురించి బెజవాడ విల్సన్‌ This is slavery based on caste అన్నది.</p>
<p>ఈ పుస్తకంలోని ‘మరణ లేఖలు’, ‘చింతకింది మల్లయ్య ముచ్చట’, ‘చినుకు రాలినది’, ‘కాశెపుల్ల’, ‘తమ్ముడి మరణం–1’ కథలు ప్రత్యేకమైనవి. ‘ఆమె పాదాలు’, ‘కథ కాని కథ’, ‘నాలో(కి) నేను’, ‘<span style="color: #ff00ff;"><a href="http://vaakili.com/patrika/?p=9531" target="_blank"><span style="color: #ff00ff;">మంట</span></a></span>’, ‘శ్రీమతి సర్టిఫికెట్‌’ కథలు ఒక తరహావి. ‘ఆమె పాదాలు’, ఓ తటిల్లత వంటి సౌందర్యవతి కథ. హైకూ చదివిన అనుభూతిని ఇస్తుంది. ‘నాలో(కి) నేను’, ఎన్నటికీ తన కళంక బింబం చూసుకోని వ్యక్తి కథ. సమాజంలోని, ఎదుటి మనిషిలోని తప్పొప్పులను పరికించే ఆసామి ఆ నిరర్థకమైన ఆలోచనలలో పడి కొట్టుకు పోతుంటాడు. ఆఖరికి అనుకుంటాడు: ‘‘అబ్బా! ఎన్నాళ్ళయింది నా ముఖం అద్దంలో చూసుకుని.’’ &#8220;<span style="color: #ff00ff;"><a href="http://patrika.kinige.com/?p=2892" target="_blank"><span style="color: #ff00ff;">రెక్కల పెళ్ళాం</span></a></span>&#8221; కొత్త ఊహలతో గమ్మత్తుగా ఉంది. మొదటి రాత్రి భార్యని భర్త అడుగు తాడు: ‘‘దేవీ! నీకు రెక్కల్లేవా?’’ బదులుగా ఆమె అంటుంది: ‘‘పెద్ద! నీకేమైనా తురాయుందా?’’ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా వ్యవహారాలు, లక్ష్యాలు వేర్వేరనీ; రెక్కలు, తురాయి, కొమ్ములు తదితర ప్రతీకలతో కథ నడుస్తుంది. ‘మంట’ కథ చైతన్య స్రవంతి ధోరణిలో ఆసక్తికరంగా సాగుతుంది.</p>
<p>‘చింతకింది మల్లయ్య ముచ్చట’ సంకలనం మానవ మాత్రుడు కేంద్రంగా అతని విషాదోల్లాసపు జీవన జలధిలో అలలు, అల్పపీడనాలు, మరికొన్ని మహా సుడిగుండాలు అని అవగతమవుతుంది. ప్రవాహపు ఆటుపోట్లతో గవ్వలు, పిల్లనగ్రోవులు, ప్రేమలేఖలు, మృతస్వప్నాలు కూడ ఒడ్డుకి కొట్టుకొచ్చేయనిపిస్తుంది. అయితే అచంచలమైన జీవితేచ్ఛ మాత్రం ఎడతెగని హోరుగా వినవస్తుంది. సమకాలీన కథకులలో పూడూరి రాజిరెడ్డి రచనా ధోరణి (Voice) విలక్షణమయింది. రచయితకి దర్శనంలో భిన్నత్వం ఉంది. కథనంలో ఒక ఉరవడి అలవడింది. ఆత్మగత సంభాషణ, మనో విశ్లేషణలతో రచనా సంవిధానం (texture) కొనసాగింది. కొన్ని కథలలో యథాతథ వ్యక్తీకరణ (automatic writing) కనబడుతుంది. రచయిత ఒక పాత్రగాను పరిచయం అవుతాడు. పాత్ర కాకుండాను వ్యాఖ్యానిస్తాడు. ఈ శైలీ ప్రత్యేకత (mannerism) వల్ల ఎక్కువ కథలకి నూతనత్వం (novelty) సమకూరింది. ఇది ఒక్కోసారి ఉపసంహారం (epilogue) లాగ ఉపయోగపడింది. రచయిత మొగ్గుదల మేరకు రాతలో పెట్టిన పరాయికరణ ప్రభావం (alienation effect) సఫలమయింది. ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ ఒక్కటే తెలంగాణ యాసలో చెప్పింది. తతిమ్మావన్నీ మామూలుగా రాసినవి. ప్రతి పదమూ ఆచితూచి పలికినట్టుంది. సందర్భానుసారంగా కొన్ని ‘అసభ్య’ పదాలను వాడటంలో వెనుకాడలేదు. నిశిత పరిశీలనతో అనేక సూక్ష్మాంశాలను సైతం వదిలిపెట్టలేదు.</p>
<p>మాటలు, వాక్యాలు, పాత్రలు, ఆధిపత్యాలు, అంతరాలు, ఆంతర్యాలు, మానవ ప్రవృత్తుల వృత్తాంతాలన్నీ శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ కథలకి మూలాధారం రచయిత స్వస్థలపు (నర్సింగాపురం, తెలంగాణ) నేలగంధంలోనే ఉంది. ఆ పల్లెటూరి వేపు తిరిగి కలల రెక్కలు అల్లార్చకుండా, ఒకింత కన్నార్పక యోచించకుండా మధ్యంతర ప్రలోభమేదీ ఆయనకి సంకెల వేయలేకపోయింది. ఒక చోట అంటాడు: ‘‘మన కాళ్ళేమో పల్లెలో ఉంటాయి. చేతులేమో పట్నాన్ని కౌగిలించుకుంటాయి.’’ రచయిత అక్షరాలలోనే తన జాలిగుండె కొట్టుకులాడుతుం టుంది. ఈ నెత్తురోడే ప్రపంచం మీద ఏకకాలంలో ధిక్కారంతోను, కారుణ్యంతోను ఉద్వేగం ఉప్పొంగుతుంటుంది. కాశెపుల్ల కథలో narrator తనలో తను అనుకుంటాడు: ‘‘ఎంత కాలుష్యంలోనైనా, పూలచెట్టు తన పరిమళపు అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషికి తన మనిషితనాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదా?’’ ముగింపు మాటగా ఇంతకు మించిన మహత్తరమైన వాక్యాన్ని నేను పట్టివ్వలేను.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>(పూడూరి రాజిరెడ్డి కథల సంపుటి ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ పరిచయ సభలో చేసిన ప్రసంగం)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15382</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>రంగుల్లో తడిసిపోదామిలా&#8230;</title>
		<link>http://vaakili.com/patrika/?p=14736</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14736#comments</comments>
		<pubDate>Tue, 01 Aug 2017 18:38:11 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[ప్రసూన రవీంద్రన్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14736</guid>
		<description><![CDATA[<br /> జీవితమంటేనే రంగుల మయం. ఆ రంగుల్ని గుర్తించి ఒడిసిపట్టుకుని ఆనందాన్నో, విచారాన్నో, తీవ్రమైన వేదననో వ్యక్తపరచగలగడమే కాకుండా, చదువరులకి కూడా తమ జీవితంలో మారుతున్న రంగుల్ని చూసుకోగలిగేలా చెయ్యడం కళాకారుడికే సాధ్యం. ఒక చిత్రకారుడు తన అనుభవాల్నీ, అనుభూతులనీ తనకు నచ్చిన రంగుల్లో ప్రపంచానికి వ్యక్తపరిచినట్టు, కవి అందమైన పదచిత్రాలతో చెబుతాడు. అలా చెప్పాలంటే ఎక్కడో ఓ చోట కాసేపు ఆగాలి. అలా ఆగిన కాస్త సమయంలోనే తనలో విప్పుకుంటున్న పొరల్నీ, కలిగే మార్పుల్నీ చదువరులకి అర్థమయ్యే రీతిలో అందించగలగాలి.</p> <p>ఈ సంకలనంలో తను గమనిస్తున్న రంగుల్ని మన మీదకి వెదజల్లి మనల్ని మేల్కొల్పుతాడు కవి. సమాజం గురించో, మానవ సంబంధాల గురించో లేక తనలోపలి సంఘర్షణల గురించో చెప్పేటప్పుడు ఈ కవి యొక్క అభివ్యక్తి, నాకైతే నిజంగానే చిత్రకారుడికి అవసరమైన రంగుల శాస్త్రాన్ని గుర్తుచేసింది. తాను గుర్తించిన రంగులన్నిటినీ పాఠకులమీదకి చల్లాలని ఈయన చేసిన ప్రయత్నం సఫలమైంది.</p> <p>ప్రతి కవితలోనూ తను చెప్పాలనుకున్న విషయం యొక్క గాఢత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయం గురించి తాను పడుతున్న మానసిక వేదన కవితలో కనిపించి పాఠకుడిని చుట్టుకుంటుంది. ఒకపట్టాన ఆ అనుభూతినుంచి మనం కూడా బయట పడలేం. ఆలోచించకుండా ఉండలేం.</p> <p>‘బాల్కనీలో ఊయల’ కవితలో</p> <p>“అశరీరికి, మనసున్న వారికి<br /> స్థిత ప్రజ్ఞత<br /> కుదరదేమో<br /> ఆ అవసరమూ లేదేమో “ అంటారు.</p> <p>మనసున్నవారికి, ప్రతి దానికీ స్పందించే గుణం ఉన్నవారికి స్థితప్రజ్ఞత అంత సులభంగా ఎలా సాధ్యపడుతుంది?</p> <p>ఇలాంటి వారు స్పందిస్తేనే కదా, నేటి సమాజంలో, మానవ సంబంధాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న లోటు పాట్లనూ, మరిచిపోతున్న మధురమైన విషయాలనూ ఇలా సంకలనపరిచి మనల్ని కాస్త జాగ్రత్తపడమని చెప్పగలిగేది.</p> <p>అనుభూతులూ, స్పందనలూ లేని జీవితం చప్పగానే కదా ఉంటుంది. అందరికీ సాధ్యం కాని విషయమది. అందుకే ‘ఇలా, యెలా‘ కవితలో</p> <p>“పరిమళించడం ఓ అనుభవం!<br /> అనుక్షణం క్షణ క్షణమై [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/vijay_koganti.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/vijay_koganti.jpg" alt="" title="vijay_koganti" width="442" height="728" class="alignleft size-full wp-image-14740" /></a><br />
<span style="font-size: 30px;">జీ</span>వితమంటేనే రంగుల మయం. ఆ రంగుల్ని గుర్తించి ఒడిసిపట్టుకుని ఆనందాన్నో, విచారాన్నో, తీవ్రమైన వేదననో వ్యక్తపరచగలగడమే కాకుండా, చదువరులకి కూడా తమ జీవితంలో మారుతున్న రంగుల్ని చూసుకోగలిగేలా చెయ్యడం కళాకారుడికే సాధ్యం. ఒక చిత్రకారుడు తన అనుభవాల్నీ, అనుభూతులనీ తనకు నచ్చిన రంగుల్లో ప్రపంచానికి వ్యక్తపరిచినట్టు, కవి అందమైన పదచిత్రాలతో చెబుతాడు. అలా చెప్పాలంటే ఎక్కడో ఓ చోట కాసేపు ఆగాలి. అలా ఆగిన కాస్త సమయంలోనే తనలో విప్పుకుంటున్న పొరల్నీ, కలిగే మార్పుల్నీ చదువరులకి అర్థమయ్యే రీతిలో అందించగలగాలి.</p>
<p>ఈ సంకలనంలో తను గమనిస్తున్న రంగుల్ని మన మీదకి వెదజల్లి మనల్ని మేల్కొల్పుతాడు కవి. సమాజం గురించో, మానవ సంబంధాల గురించో లేక తనలోపలి సంఘర్షణల గురించో చెప్పేటప్పుడు ఈ కవి యొక్క అభివ్యక్తి, నాకైతే నిజంగానే చిత్రకారుడికి అవసరమైన రంగుల శాస్త్రాన్ని గుర్తుచేసింది. తాను గుర్తించిన రంగులన్నిటినీ పాఠకులమీదకి చల్లాలని ఈయన చేసిన ప్రయత్నం సఫలమైంది.</p>
<p>ప్రతి కవితలోనూ తను చెప్పాలనుకున్న విషయం యొక్క గాఢత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయం గురించి తాను పడుతున్న మానసిక వేదన కవితలో కనిపించి పాఠకుడిని చుట్టుకుంటుంది. ఒకపట్టాన ఆ అనుభూతినుంచి మనం కూడా బయట పడలేం. ఆలోచించకుండా ఉండలేం.</p>
<p>‘బాల్కనీలో ఊయల’ కవితలో</p>
<blockquote><p>“అశరీరికి, మనసున్న వారికి<br />
స్థిత ప్రజ్ఞత<br />
కుదరదేమో<br />
ఆ అవసరమూ లేదేమో “ అంటారు.</p></blockquote>
<p>మనసున్నవారికి, ప్రతి దానికీ స్పందించే గుణం ఉన్నవారికి స్థితప్రజ్ఞత అంత సులభంగా ఎలా సాధ్యపడుతుంది?</p>
<p>ఇలాంటి వారు స్పందిస్తేనే కదా, నేటి సమాజంలో, మానవ సంబంధాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న లోటు పాట్లనూ, మరిచిపోతున్న మధురమైన విషయాలనూ ఇలా సంకలనపరిచి మనల్ని కాస్త జాగ్రత్తపడమని చెప్పగలిగేది.</p>
<p>అనుభూతులూ, స్పందనలూ లేని జీవితం చప్పగానే కదా ఉంటుంది. అందరికీ సాధ్యం కాని విషయమది. అందుకే ‘ఇలా, యెలా‘ కవితలో</p>
<blockquote><p>“పరిమళించడం ఓ అనుభవం!<br />
అనుక్షణం క్షణ క్షణమై పరవశించడం ఓ వరం!!<br />
మనసుని వెలివేసిన బానిసలమై<br />
శూన్యాడంబరాన్ని చుట్టుకుని<br />
నిత్య ఉదయాస్తమయాల మధ్య<br />
వికశించక వివశించక<br />
జీవన్మరణాలమై,<br />
ఇలా, యెలా !?” జీవించగలుగుతున్నాం అని ప్రశ్నిస్తారు.</p></blockquote>
<p>అనుభవాల్లో అనుభూతులుండటం లేదని గమనిస్తూనే ఉంటాం. ఉద్వేగాల్ని కోల్పోతున్నామని తెలుసుకుంటూనే ఉన్నాం. అలా అన్నీ తెలిసి కూడా ఇలా యేలా ఉండగలుగుతున్నాం? అంటూ ఆధినిక జీవన విధానంలో కొట్టుకుపోతూ, మనసనేది ఒకటుందని కూడా మనుషులు మర్చిపోతున్నారని ఆయన వేదన వ్యక్తం చేస్తారు తన కవితల్లో.</p>
<p>అందుకే ‘ కూలుతున్న ఇల్లు ‘ కవితలో కూడా అంటారు&#8230;</p>
<blockquote><p>“మాయమవుతున్న పిచ్చుకలనీ పట్టించుకోని<br />
మొద్దెక్కిన మనసులు<br />
విడిపోతున్న చేతుల్లో<br />
కత్తుల్ని పూయిస్తున్నాయి” అని.</p></blockquote>
<p>ఆయన కవితల్లో గాఢత మనల్ని ఆయన అనుభవించిన మానసిక వేదనలోకే తిన్నగా తీసుకుపోతుంది.</p>
<p>మనుషుల మధ్య సత్సంబంధాలు కరువై, మెత్తగా పిలిచే, చల్లగా పలకరించే ఆప్యాయతలూ, అనురాగాలూ మాయమై స్థబ్దత పేరుకుపోతున్న బ్రతుకుల్లో తరచుగా పలకరించే వెలితిని గురించి ‘అవునా?’, ‘నీలోనే నీవైనప్పుడు’, ‘ముసురు’ వంటి కవితల్లో అద్భుతంగా వివరిస్తారు.</p>
<p>జీవితమంటే ఆనందంగా ఉండటం అనేదే తెలుసుకోకుండా, తెలుసుకున్నా, ఆ తమ జీవితాలకి తామేవిలువా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా నగర వాసులు తమ క్షణాల్ని తామే కసిగా ఎలా కాల్చుకుంటున్నారో ‘ఓ భిన్న దృశ్యం’ లో గట్టిగా చెబుతారు.</p>
<blockquote><p>‘కాలుష్యపు మత్తులో జోగి<br />
హద్దులు దాటిన నగరపుటంచుల్లో<br />
తాంత్రిక పాతాళ భైరవి సాక్షిగా<br />
మార్జాలగతుల్లో విలాసనృత్యాల్లో<br />
పరదేశీరాగం విశృంఖలత్వాన్ని<br />
స్ఖలిస్తున్న దృశ్యం’</p></blockquote>
<p>అనడంతోనే నగర జీవన విధానంలో జనులు దేనికోసం దేన్ని కోల్పోతున్నారో చూడమని ఆవేదన చెందుతారు.</p>
<p>ఒక్కసారి మనసారా పలకరించి చూడు క్షణాలు పువ్వులా ఎలా విచ్చుకుంటాయో అంటారు ‘పలకరించి చూడు’ లో.<br />
ప్రమిదల్లో తైలాన్ని నింపి వెలిగించినంత మాత్రాన దీపావళి రాదు. మరి ఎలా ఉంటే దాన్ని దీపావళి అందాం? ఎంత బాగా చెప్పారు కదా అనిపించింది ‘దీపావళి’ కవిత చదివితే.</p>
<p>వానజల్లు ప్రేమలో తడిసి, బరువెక్కి, ఆ ప్రేమద్వారా తను పొందిన శక్తినంతా ఈ మట్టి విత్తుల్లోకి నింపి, పచ్చటి పైరుల్ని తయారుచేసినట్టు, మనసుని తాకి, తడిపిన అనుభూతులు కవితలై మొలకెత్తడం ఎంత గొప్పగా ఉంటుందో ‘ఊపిరి పోసుకునేవేళ’ కవితలో చెబుతారు.</p>
<p>మనసైన మనిషితో నడకెంత ఆహ్లాదకరమో ‘కాలంతో పాటు వెళ్ళి వద్దాం, వస్తావా? ‘ కవితలో సున్నితంగా చెబుతారు.</p>
<p>ఆధునిక ప్రపంచపు పోకడ జీవితాలపై ఎటువంటి రాక్షస ప్రభావం చూపిస్తోందో మనందరికీ తెలుసు. మనుషుల్లోంచి జీవాన్ని గడగడా తాగేసి, మనచే సృష్టింపబడిన యంత్రాలే మనల్నెలా అనుభూతుల్లేని రబ్బరు బొమ్మలుగా మార్చేస్తున్నాయో తెలిసీ మనం అటువంటి జీవితానికే దాసోహమంటున్నాం. ఈ రకమైన విధానంతో ప్రపంచం ముందు ముందు ఏమైపోతుందో అన్న వేదన ‘చూడు, చూస్తూనే ఉండు!’ కవితలో కనపడుతుంది.</p>
<p>ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కవిత గురించీ ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఈ సంకలనంలో ప్రతి కవితా గాఢమైన అనుభూతిని మిగిల్చేదే. ప్రతి కవిత యొక్క నిర్మాణమూ ఒక పధ్ధతిలో సాగిపోతుంది. తను చెప్పదలుచుకున్నదేదో పాఠకుడి మనసులో గట్టి ముద్రే వేస్తుంది. సంకలనంలో పదాల పునరుక్తి పెద్దగా ఏమీ కనపడదు. తన అనుభూతుల్నీ, అనుభవాల్నీ ఇలా ముద్రించడం ద్వారా మన మీదకి చాలా రంగులే రువ్వారు విజయ్ గారు. చదవండి మీరూ ఆ రంగుల్లో మరో రంగై తడిసిపోండి.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14736</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఒక ‘నది పలికిన వాక్యం’తో సంభాషణ</title>
		<link>http://vaakili.com/patrika/?p=13275</link>
		<comments>http://vaakili.com/patrika/?p=13275#comments</comments>
		<pubDate>Wed, 01 Feb 2017 00:36:05 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[వెల్దండి శ్రీధర్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=13275</guid>
		<description><![CDATA[<p></p> <p>గుండె బద్దలు కొట్టుకొని వచ్చిన అక్షరాలకు, రక్తాన్ని అద్దుకొని గర్భం నుండి బయటపడిన అక్షరాలకు తెగువ ఎక్కువ. రాపిడి ఎక్కువ. నీటి తాకిడికి నలిగిపోయి నలిగిపోయి మొరటు రాళ్లు గులక రాళ్లుగా మారిపోయినట్టు విలాసాగరం రవీందర్ అక్షరాలు కూడా ఒక నిప్పును, ఒక దుఃఖపు పుప్పొడిని, చావు చివరి అంచును మోసుకు వస్తాయి. కాలం ఎలా కంపిస్తే అలా ప్రకంపించే కవులు తక్కువ. అందుకు విలాసాగరం రవీందర్ మినహాయింపు. దానికి నిదర్శనం అతడు ఇటీవలే వెలువరించిన ‘నది పలికిన వాక్యం’ కవితా సంపుటి. జీవితపు దిగుడు బావి నుండి ఒక నదిని భుజానికెత్తుకొని వచ్చి మన హృదయపు వాకిట్లో పరవళ్లు తొక్కిస్తాడు. నది ప్రయాణించినంత దూరం తడి వున్నట్టే ఈ పుస్తకం ప్రతి పుట నిండా సమాజ నగ్నత్వం, నీటి నాజూకుతనం, కన్నీటి అలజడి పరుచుకొని వున్నాయి. దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 90వ దశకం నుండి సమాజం సంక్లిష్టంగా మారతూ వస్తోంది. గత మూడు, నాలుగు సంత్సారాల నుండి ప్రపంచం మరింత ముళ్లపంది రూపంలోకి మారిపోయింది. ఇక్కడే రవీందర్ కలం కవిత్వానికి జత కూడింది. అనేక విస్ఫోటనాలను, దుఃఖాన్ని, నిరసనను, సంఘర్షణను, సంక్షోభాన్ని చాలా బలంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించాడు. అయితే కొన్ని అక్షరాలు ఏ రస స్ఫూర్తి లేకుండా ముడి శిలలుగా నిలబడి వుండవచ్చు. కాని ఆ ఒంటి స్తంభపు అక్షరాలు పేదవాడి మొండిదేరిన ఆయుధాలుగానే కనిపిస్తాయి.</p> <p>కవి తాను గాయపడిన ప్రతిసారి కాగితాన్ని గాయపర్చడు. ఎన్నో గాయాలు సమాధి స్థితిలోకి వెళ్లి ఒక ఆవేశం, ఒక గాఢత మనసును ముసురుకున్నప్పుడు అది కవిత్వమై పొంగి పొర్లుతుంది. నీటి నుండి అలలను దూరం చేయలేనట్లే కవి నుండి ఈ స్పందించే గుణాన్ని వేరు చేయలేం. అనేక సంస్పందనల, భావ వీచికల సమాహారం ఈ కవితా సంపుటి. ఆకాశమంత విచ్చుకోవాల్సిన మనిషితనం ఇప్పుడు నేలరాలిన నక్షత్రంలా అనంత వాయువుల్లో కలిసిపోతోంది. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/01/vaakili-nadi-palikina-vaakyam.jpg"><img class="alignleft size-full wp-image-13277" title="vaakili nadi palikina vaakyam" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/01/vaakili-nadi-palikina-vaakyam.jpg" alt="" width="387" height="610" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">గుం</span>డె బద్దలు కొట్టుకొని వచ్చిన అక్షరాలకు, రక్తాన్ని అద్దుకొని గర్భం నుండి బయటపడిన అక్షరాలకు తెగువ ఎక్కువ. రాపిడి ఎక్కువ. నీటి తాకిడికి నలిగిపోయి నలిగిపోయి మొరటు రాళ్లు గులక రాళ్లుగా మారిపోయినట్టు విలాసాగరం రవీందర్ అక్షరాలు కూడా ఒక నిప్పును, ఒక దుఃఖపు పుప్పొడిని, చావు చివరి అంచును మోసుకు వస్తాయి. కాలం ఎలా కంపిస్తే అలా ప్రకంపించే కవులు తక్కువ. అందుకు విలాసాగరం రవీందర్ మినహాయింపు. దానికి నిదర్శనం అతడు ఇటీవలే వెలువరించిన ‘నది పలికిన వాక్యం’ కవితా సంపుటి. జీవితపు దిగుడు బావి నుండి ఒక నదిని భుజానికెత్తుకొని వచ్చి మన హృదయపు వాకిట్లో పరవళ్లు తొక్కిస్తాడు. నది ప్రయాణించినంత దూరం తడి వున్నట్టే ఈ పుస్తకం ప్రతి పుట నిండా సమాజ నగ్నత్వం, నీటి నాజూకుతనం, కన్నీటి అలజడి పరుచుకొని వున్నాయి. దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 90వ దశకం నుండి సమాజం సంక్లిష్టంగా మారతూ వస్తోంది. గత మూడు, నాలుగు సంత్సారాల నుండి ప్రపంచం మరింత ముళ్లపంది రూపంలోకి మారిపోయింది. ఇక్కడే రవీందర్ కలం కవిత్వానికి జత కూడింది. అనేక విస్ఫోటనాలను, దుఃఖాన్ని, నిరసనను, సంఘర్షణను, సంక్షోభాన్ని చాలా బలంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించాడు. అయితే కొన్ని అక్షరాలు ఏ రస స్ఫూర్తి లేకుండా ముడి శిలలుగా నిలబడి వుండవచ్చు. కాని ఆ ఒంటి స్తంభపు అక్షరాలు పేదవాడి మొండిదేరిన ఆయుధాలుగానే కనిపిస్తాయి.</p>
<p>కవి తాను గాయపడిన ప్రతిసారి కాగితాన్ని గాయపర్చడు. ఎన్నో గాయాలు సమాధి స్థితిలోకి వెళ్లి ఒక ఆవేశం, ఒక గాఢత మనసును ముసురుకున్నప్పుడు అది కవిత్వమై పొంగి పొర్లుతుంది. నీటి నుండి అలలను దూరం చేయలేనట్లే కవి నుండి ఈ స్పందించే గుణాన్ని వేరు చేయలేం. అనేక సంస్పందనల, భావ వీచికల సమాహారం ఈ కవితా సంపుటి. ఆకాశమంత విచ్చుకోవాల్సిన మనిషితనం ఇప్పుడు నేలరాలిన నక్షత్రంలా అనంత వాయువుల్లో కలిసిపోతోంది. దేహాన్ని సాంతం మనిషితనం కోసం జల్లెడ పట్టాల్సిన సందర్భం. చివరాఖరికి దాని ఆనవాలు కూడా దొరకక దేహిం ఒక ఒంటరి అస్థిపంజరమై మిగిలిపోతోంది.</p>
<blockquote><p>‘‘గృహాలు గ్రహాల్లా మారాక/మనిషికీ మనిషికీ మధ్యన<br />
మాయా తెరలు వెలిశాక/నువ్వూ నేను<br />
అడుగు దూరంలో వున్నా/గ్రహాంతర వాసులమే కదా’’</p></blockquote>
<p>అంటాడు. వాట్సప్ ల కాలంలో, ఫేస్ బుక్ ల కాలంలో మానవ సంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమయ్యాయో ప్రతిబింబిస్తాయి ఈ కవితా పాదాలు. ఇవాళ ముఖపుస్తకానికి, వాట్సప్ లకు వున్న విలువ మనిషికి లేదు. అతని భావోద్వేగాలకు లేదు. కవిత్వం మనిషిని మనిషిలా నిలబెట్టాలి. గుప్పెడు గుండెకింత తెగింపునివ్వాలి. అప్పుడే అది మనసు మూలాల్లోకి వెళ్లి ఏదో రసాయనిక చర్యకు గురై కొత్త మనిషిని బయటకు తెస్తుంది. మరో రకంగా చెప్పాలంటే మనసుకు పుటం పెట్టాలి. సుతిమెత్తగా హృదయపు గోడలను అక్షరాల సుత్తితో బాదాలి. అప్పుడే మనిషికి, మనసుకు బంగారు వన్నె అంటుకుంటుంది. కొత్త చక్షువులేవో తెరుచుకొని కొత్త బంగారు లోకాలకు దారులు చూపిస్తాయి. ధిక్కారం, కన్నీటి ఉప్పదనం, చెమట బిందువుల పెనుగులాట, మట్టిని మూలధాతువులుగా చేసుకొని రాసిన ఏ కవిత్వమైనా లోకంలో నాలుగు కాలాలు జీవంతో నిలబడుతుంది. ప్రజల మస్తిష్కాల్లోకి ఎక్కుతుంది. అక్కడ అంతకు మునుపులేని వినిర్మాణ ప్రక్రియ ఏదో మొదలవుతుంది.</p>
<blockquote><p>‘‘నువ్వు దాచిన మిలియన్ డాలర్లు<br />
నీ కష్టార్జితమనుకున్నావేమో<br />
అవి ఈ దేశ ప్రజల రక్త మాంసాలు’’</p></blockquote>
<p>దీపపు పురుగు దీపం చుట్టూ తిరిగినట్టు ఏ కాలంలోనైనా మనిషి డబ్బు చుట్టే తిరుగుతాడు. ఒకడు శరీరాన్ని చిత్రహింసలు పెట్టి సంపాదిస్తాడు. మరొకడు మెదడును వడిపెట్టి సంపాదిస్తాడు. అయితే మనసుతో సంపాదించిందే రక్తంలోకి ఇంకుతుంది. దేశంలో ఈ రోజు మోసంతో సంపాదించడం, బ్లాక్ మెయిల్ చేసి సంపాదించడం పెరిగిపోయింది. డబ్బులకే గోడౌన్లు కట్టుకున్నవాడెవ్వడూ నిన్న కొత్త నోట్ల కోసం ఏ బ్యాంకు ముందూ లైన్లో నిలబడలేదు. ఇదంతా పసిగట్టి ఎవరైనా నిలదీస్తే అధికారంలో వున్న వాడు ‘కుక్కబిస్కెట్లు’ వెదజల్లుతాడు. లేదా ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకేదో అంశాన్ని ప్రధాన వార్తల్లోకి తీసుకు వస్తాడు. ఏది ఏమైనా ఆఖరికి దోపిడీకి, అన్యాయానికి గురయ్యేది  మాత్రం సామాన్యుడే.</p>
<p>చెమట సంస్కృతికి పూసిన రెండు అద్భుత పుష్పాలు నేతన్న, రైతన్న. ఒకటి కాయకష్టంతో పరిమళిస్తే, మరొకటి మేధస్సుతో వేయి రేకులై వికసిస్తుంది. అయితే ఈ దేశంలో కులవృత్తులను పూడ్చిపెట్టడం ప్రారంభించి చాలా ఏళ్లయింది. జీవిక కకావికలం అయిపోయి ఇవాల నాగళ్లు ఉరికొయ్యలకు వేలాడుతున్నాయి. చేతిమగ్గాలు, మరమగ్గాలు జవసత్వాలు ఉడిగిపోయి ప్రభుత్వాల ఉదాసీనతను ప్రశ్నిస్తున్నాయి.</p>
<blockquote><p>‘‘అగ్గిపెట్టెలో చీరచేర్చి/అబ్బుర పరిచిన చేతులు<br />
దూలానికి నిలువునా వేలాడి/వాగులో తేలిన దృశ్యాలు<br />
ఇంకా సుడిలా తిరుగుతున్నాయి/పోగుల్లో చిక్కుబడిన దారంలా’’</p></blockquote>
<p>రానున్న రోజుల్లోనైనా కులవృత్తులు బతికి మనుషులను బతికించాలని ఆరాటపడుతాడు కవి. అయితే కులవృత్తులు నాశనం అయితేనే, గ్రామాలు విధ్వంసమయితేనే అభివృద్ధి మొగ్గ తొడుగుతుందనేది కొత్త భావన.</p>
<p>మనిషి సముద్రం లాంటి వాడు. ఎన్నో అలజడులు, ఆటుపోటులు, శిథిలత మన రక్తంలో కూడా ఉప్పొంగి  అణగిపోతాయి. నదిలా నిర్మలంగా ప్రవహించాలని,  సున్నితపు ఊయలలో ఊగిపోవాలని ఎవరికుండదు? కాని జీవితం నిరంతరం సంఘర్షణాయుతం అయినపుడు, కడలి అంచున విరిగిపడే కెరటపు విధ్వంసం అయినపుడు కడుపులో చల్ల కదలకుండా ఎలా కూర్చోగలం? మనిషి లోతు తెలిసిన, సాగరం మర్మం తెలిసిన  విలాసాగరం రవీందర్..</p>
<blockquote><p>‘‘బహుశా<br />
సముద్రమూ మనిషీ<br />
చిన్నప్పుడు కవలపిల్లలేమో’’</p></blockquote>
<p>అంటాడు. సముద్రాన్ని శుద్ధిచేయడం అసాధ్యం. కాని మనిషిని చెమట ద్వారా శుద్ధిచేయవచ్చంటాడు ఒకచోట. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. ఎన్ని రోజులు బతికితే అంత లాభం అంటాడు కాళిదాస మహాకవి. మనమొక సింహింలా మనదైన సామ్రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు మరణం మనల్ని కర్కశంగా తాకుతుంది. మనల్ని సవాలు చేస్తూ మన చుట్టే తిరుగుతూ వికటాట్టహాసం చేస్తుంది. అప్పుడు మన పనులన్నీ కట్టిపెట్టి అల్మారాలో భద్రపరిచి దాని వెంట వెళ్లక తప్పదు. కాని అంతకంటే ముందు మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి.</p>
<blockquote><p>‘‘చివరి చూపులో రాల్చడానికి<br />
కొన్ని కన్నీటి చుక్కలు<br />
నీ చుట్టూ ఉన్నవారి కళ్లలో<br />
వదిలి వెళ్ళాలి.’’</p></blockquote>
<p>కనీసం మన శవాన్ని మోయడానికైనా నలుగురు  మిత్రుల్ని సంపాదించుకోవాలి. మనం దేహయాత్ర చాలిస్తున్నామంటే అన్నీ వదిలేసి కేవలం మన కోసమే వేల మైళ్లు దాటి వచ్చి మనల్ని స్పర్శించే ఒక ఆత్మీయ మనిషిని సంపాదించుకోవాలి. లేదంటే ఈ భూమి మీదికి మనం వచ్చిన సంగతి, వెళ్లిపోయిన సంగతి ఎవరికీ తెలియకుండానే ఒక చరిత్ర ముగిసిపోతుంది. చెట్టుకు మనిషికీ ఉన్న సంబంధమే మనిషికి మనిషికీ ఉండాలంటాడు.</p>
<p>తొలిపోద్దును చేతిలో పట్టుకొని, ఊరి తొవ్వెంట నడుస్తూ చేదబావి దగ్గరి మాటల పందిళ్లను బెకెట్ల కొద్దీ తోడి మన మనసు పొరలను జలపాతంలా తడిపేస్తాడు. అస్తిత్వ ద్వారాలు తెరిచి అందులో తనను తాను చూసుకుంటాడు. శిలువెక్కిన అమ్మ భాష గురించి పలవరిస్తాడు. అడవిగాచిన వెన్నెల్లో తలెత్తి నిల్చున్న గడ్డి పరకలకు కొత్త రెక్కలు తొడుగుతాడు. సామాన్యుడి మరణవేదనకు ఒక అశ్రు నివాళి సమర్పస్తాడు. ‘మనిషికీ మనిషికి మధ్యన వేలాడిన ఖాళీ’ని కవిత్వం చేస్తాడు. మనుషులకంటే యంత్రాలనే ఎక్కువ నమ్మేతనాన్ని ఈసడించుకుంటాడు. కవిత్వ దాహం తీరని వాడు. అక్షరాల చెట్టై ఆయుధాల్ని పూసేవాడు. మనిషి తలరాతల వికృత రూపాల్ని పట్టుకున్న వాడు. మనుషుల్ని కరెన్సీ నోట్లుగా చూసే ఒక అమానవీయతను ఎండ వెలుగులో లోకానికి నగ్నంగా చూపుతాడు. గుట్టలకు చెదలు పట్టిస్తున్న ప్రభుత్వ హీనత్వాన్ని నిప్పుతో కడుగుతాడు.</p>
<blockquote><p>‘‘చీమలకు కూడా పౌరుషముంటుంది కదా!<br />
ఎర్రటి ఎండల మట్టి పిసికి<br />
ఇటుకలను బంగారమోలె మలిచిన చేతులకు<br />
నల్లటి బండలను కూడా ఇర్సుడు<br />
వస్తదని తెలుసుకోండ్రి’’</p></blockquote>
<p>కోటి పిడికిళ్ల ఆవేశాన్ని గర్భీకరించుకున్న పంక్తులివి. నిత్యం స్వేద సముద్రంలో ఈదులాడే సామాన్యుడు ఎదురు తిరిగితే ఒక్కసారి ఎంతటి అధికారమైనా మోకరిల్లాల్సిందే. విలాసాగరం వాక్యాలు నదిలాంటి వాక్యాలు. పంటలాంటి కవిత్వం. మలినమంటని భావాలు. నది నీళ్లు తియ్యదనాన్నే పంచుతాయి. కాని ఈ ‘నది పలికిన వాక్యం’ జీవితంలోని అన్ని రుచులను పాఠకుడి మదికి అందిస్తుంది. నది పలికిన వాక్యాన్ని సముద్రంలా మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. అది తీసుకొచ్చే జీవితపు రంగురాళ్లని ఏరుకొని మన మనోవీథిలో జీవితపు సౌధాన్ని నిర్మించుకుందాం. ఈ కవిత్వపు సోపానాలని ఎక్కి దిగి వస్తూంటే మన మనస్సంద్రంలో ఒక కన్నీటి నావ బిందు రూపం దాల్చి ఒంటరిగా తన ప్రయాణం మొదలుపెడుతుంది. జీవన తీరాలేవో కనుచూపు మేరలో కనిపించి ఒక మట్టి తాత్వికతను అనుభంలోకి తెస్తుంది.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=13275</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>చేనుగట్టు పియానో</title>
		<link>http://vaakili.com/patrika/?p=12624</link>
		<comments>http://vaakili.com/patrika/?p=12624#comments</comments>
		<pubDate>Sat, 05 Nov 2016 15:59:55 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[స్వాతి శ్రీపాద]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=12624</guid>
		<description><![CDATA[<p></p> <p>కాదేదీ కవిత కనర్హం అన్నారు కాని నిజానికి కాదేదీ కవికి అసాధ్యం అనాలి. చటుక్కున ఒక తెల్లమేఘపు తునకలా మారి గగన సీమల్లో సాగిపోడమో, ఒక నదిలా ప్రవహి౦చి ఎన్ని హృదయ సీమలనో సారవంతం చెయ్యడమో, ఒక హరిత వనమై సేద దీర్చడమో, ఒక అక్షరమై సాధికారంగా దేన్నయినా చెప్పడమో ఒక కవికే సాధ్యం.</p> <p>ఒకమేఘాన్ని భుజానవేసుకుని వెళ్ళడం, రాత్రి ఏరుకున్న చుక్కలను కొప్పుని౦డా తురుముకుని ఇంద్ర ధనుస్సుల కొ౦గుల్ని బొడ్లో దోపుకుని పొల౦లో అక్షరాల నాటు వెయ్యడం, ఆకాశమూ నెమలీ ఏరువాక పాట అందుకోడమూ.. చేనుగట్టును పియానోగా మార్చుకోడం ప్రసాద మూర్తి ఊహకు పతాకస్థాయి. చేనుగట్టు పియానో మీద అక్షరాలు ప్రసాదమూర్తిగారి ఇచ్చానుసారం పిట్టలై నర్తిస్తాయి.</p> <p>రసానుభూతి అనుభవైక వేద్యం. అనుభవం వ్యక్తిగతం. వ్యక్తిగత అనుభవం సార్వజనీనం చెయ్యడం, వ్యక్తే సమాజమూ సమాజమే వ్యక్తీ అనే అక్షర సత్యాని మరో సారి ప్రవచి౦చడమే. అలాటిదే ఇదీ –<br /> నాటిన ప్రతి అక్షరానికీ<br /> నన్ను ఎరువుగా వాడుకు౦టాను.. ను౦డి<br /> మొలిచిన వాక్యాల చివర<br /> దేశం చిరునవ్వుని చిగురిస్తాను ..అనడం.</p> <p>మరోసారి అనుకోమూ మహాకవి మాటలు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అందుకే వ్యక్తీ చిరునవ్వే దేశం చిరునవ్వు. జీవనమూ కాలమూ అనాది మానవ స్వప్నం పడుగుపేకల్లా అనవరతం సాగుతూనే ఉంటాయి. రుణాల మాఫీలు, పురుగు మందులు, ఉరితాడు ఒక బాధామయ ప్రపంచాన్ని కూడా చల్లని జల్లులా అనిపించడం అంత సులభం కాదు. చివరికి ఒక్కమాటతో రైతు పలవరింతలు అంటూ మాటరాని వారిని చేసారు. ఇది ఒక మచ్చు తునక.</p> <p>పియానో మెట్లమీద ఎగురుతున్నపక్షులు అనేకానేకం. కవికి ఎలాటి ఊగిసలాటలూ లేవు, ఎలాటి నిషేధాలూ లేవు.</p> <p>”ఎవరున్నారు వాళ్లకి?” అని జాలిపడుతూ అసహాయులకు, తలబాదుకు౦టున్న ఆత్మలకు, అనాధ బాలలకూ , అభాగ్య శిశువులకూ, ఖాళీ సాయంత్రాలకూ నెత్తుటి సంతకమై వేలాడే మట్టిమనుషులకు, కన్నీటి కా౦దశీకులకు చివరికి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/chenugattu.jpg"><img class="alignleft size-full wp-image-12627" title="chenugattu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/11/chenugattu.jpg" alt="" width="465" height="707" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">కా</span>దేదీ కవిత కనర్హం అన్నారు కాని నిజానికి కాదేదీ కవికి అసాధ్యం అనాలి. చటుక్కున ఒక తెల్లమేఘపు తునకలా మారి గగన సీమల్లో సాగిపోడమో, ఒక నదిలా ప్రవహి౦చి ఎన్ని హృదయ సీమలనో సారవంతం చెయ్యడమో, ఒక హరిత వనమై సేద దీర్చడమో, ఒక అక్షరమై సాధికారంగా దేన్నయినా చెప్పడమో ఒక కవికే సాధ్యం.</p>
<p>ఒకమేఘాన్ని భుజానవేసుకుని వెళ్ళడం, రాత్రి ఏరుకున్న చుక్కలను కొప్పుని౦డా తురుముకుని ఇంద్ర ధనుస్సుల కొ౦గుల్ని బొడ్లో దోపుకుని పొల౦లో అక్షరాల నాటు వెయ్యడం, ఆకాశమూ నెమలీ ఏరువాక పాట అందుకోడమూ.. చేనుగట్టును పియానోగా మార్చుకోడం ప్రసాద మూర్తి ఊహకు పతాకస్థాయి. చేనుగట్టు పియానో మీద అక్షరాలు ప్రసాదమూర్తిగారి ఇచ్చానుసారం పిట్టలై నర్తిస్తాయి.</p>
<p>రసానుభూతి అనుభవైక వేద్యం. అనుభవం వ్యక్తిగతం. వ్యక్తిగత అనుభవం సార్వజనీనం చెయ్యడం, వ్యక్తే సమాజమూ సమాజమే వ్యక్తీ అనే అక్షర సత్యాని మరో సారి ప్రవచి౦చడమే. అలాటిదే ఇదీ –<br />
నాటిన ప్రతి అక్షరానికీ<br />
నన్ను ఎరువుగా వాడుకు౦టాను.. ను౦డి<br />
మొలిచిన వాక్యాల చివర<br />
దేశం చిరునవ్వుని చిగురిస్తాను ..అనడం.</p>
<p>మరోసారి అనుకోమూ మహాకవి మాటలు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అందుకే వ్యక్తీ చిరునవ్వే దేశం చిరునవ్వు. జీవనమూ కాలమూ అనాది మానవ స్వప్నం పడుగుపేకల్లా అనవరతం సాగుతూనే ఉంటాయి. రుణాల మాఫీలు, పురుగు మందులు, ఉరితాడు ఒక బాధామయ ప్రపంచాన్ని కూడా చల్లని జల్లులా అనిపించడం అంత సులభం కాదు. చివరికి ఒక్కమాటతో రైతు పలవరింతలు అంటూ మాటరాని వారిని చేసారు. ఇది ఒక మచ్చు తునక.</p>
<p>పియానో మెట్లమీద ఎగురుతున్నపక్షులు అనేకానేకం. కవికి ఎలాటి ఊగిసలాటలూ లేవు, ఎలాటి నిషేధాలూ లేవు.</p>
<p>”ఎవరున్నారు వాళ్లకి?” అని జాలిపడుతూ అసహాయులకు, తలబాదుకు౦టున్న ఆత్మలకు, అనాధ బాలలకూ , అభాగ్య శిశువులకూ, ఖాళీ సాయంత్రాలకూ నెత్తుటి సంతకమై వేలాడే మట్టిమనుషులకు, కన్నీటి కా౦దశీకులకు చివరికి పిట్టలకు, సముద్రాలకూ ఇంకెవరున్నారు కవులు తప్ప? అవును కదా ఈ విశ్వంలో సమస్త బాధా తప్త హృదయాలకూ, సర్ప దష్టలకూ ఆలంబన ఒక్క కవే. కవి ఒక ఇంటి పెద్దా అక్కున జేర్చుకునే ఒక అమ్మ, వెన్నుతట్టి ధైర్యాన్నిచ్చే నాన్న, కొండంత అండగా నిలబడే ఒక పెద్ద అన్నయ్య/ అక్కయ్య. కవి ప్రతి వారికీ బంధువే, ఆపద్భా౦ధవుడే.</p>
<p>అందుకే ప్రసాదమూర్తిగారు తొలి కవితలోనే హామీ ఇచ్చేసారు నేనున్నాను మీకంటూ, ఆమాటే ము౦దుమాట లోనూ చెప్పుకున్నారు. ’కవి తన సామాజిక బాధ్యతను కలలో కూడా విస్మరి౦చరాదన్న తన వాదన. సామాజిక అంశాలను ఎంత కళాత్మకంగా కవిత్వీకరి౦చ వచ్చో పియానో మెట్లమీద అక్షరాలతో అందంగా గీసి మనసు మెత్తనఎలా వినిపించి తమ నేర్పరితనం నిరూపించుకున్నారు. కవిత్వం ఒక మాయగా చెప్పుకున్నారు.</p>
<p>కవిత్వం ఒక మాయ వంతెన, మాయ దీపం, మాయ రూపం, మాయ చూపు, మాయ నవ్వు, మాయ కౌగిలి, మాయ ఊయల, మాయ శవపేటిక. కాని కవిత్వపు చూపు సవరించుకుని, స్పష్టంగా ఏంచూడాలో ఎంత చూడాలో ఏది రాయాలో ఎంత రాయాలో ఎలా రాయాలో ప్రసాద మూర్తికి తెలిసినంత మరొకరికి తెలియదు. మనిషి నీడలే ప్రసాదమూర్తి కవిత్వం.</p>
<p>అనుభవాలను వ్యక్తిగతం చేసుకుని వాటిని చిలికి చిలికి మళ్ళీ మదనపడి విశ్వైక భావంతో విశ్వజనీనం చెయ్యగల నేర్పరి కవి. అందుకే ప్రతికవితా ఒక అమూర్త భావనగా వ్యక్తితో ఆరంభమై పోను పోనూ విస్తృతమై వినీల గగనాన్ని మించి విశ్వదర్శనం కలిగిస్తుంది.</p>
<p style="text-align: center;">***</p>
</div>
<p>సంకలనం: చేనుగట్టు పియానో<br />
రచయిత: ప్రసాదమూర్తి<br />
కాపీలకు: pramubandaru at gmail.com</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=12624</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>ఏకాంతంలో సమూహ వేదనల గానం &#8211; రామా చంద్రమౌళి కవిత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=10683</link>
		<comments>http://vaakili.com/patrika/?p=10683#comments</comments>
		<pubDate>Thu, 31 Mar 2016 22:20:12 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[కోడూరి విజయకుమార్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=10683</guid>
		<description><![CDATA[<p></p> <p>‘Writers don’t write from experience, although many are hesitant to admit that they don’t. If you wrote from experience, you’d get maybe one book, maybe three poems. Writers write from empathy’ — Nikki Giovanni</p> <p>రామా చంద్రమౌళి గారు విస్తృతంగా రాస్తోన్న కవి, రచయిత. ఒక వైపు కవిత్వం, మరొక వైపు కథలు, నవలలు, పుస్తక సమీక్షలు &#8211; ఇట్లా సాహిత్యం లోని అన్ని ప్రధాన విభాగాలలోనూ రచనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా, 300 పై చిలుకు కథలు, 9 కవితా సంపుటులు, 18 నవలలు వెలువరించారు. ‘ఒక ఏకాంత సమూహం లోకి’ అన్నది ఆయన తాజా కవితా సంపుటి. ఆయన కవితా సంపుటుల వరుసలో పదవది.</p> <p>ఆశ్చర్యం ఏమిటంటే, దాదాపు 1970 లలో ఆయన రచనా వ్యాసంగం ప్రారంభించి మధ్యలో సుమారు రెండు దశాబ్దాలు సుదీర్ఘ విరామం తీసుకున్నప్పటికీ, ఇన్ని పుస్తకాలు వెలువరించడం! అంతేకాదు SAARC సాహిత్య శిఖరాగ్ర సభలలో తెలుగు నుండి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కవి రామా చంద్రమౌళి గారు.</p> <p>చంద్రమౌళి గారి తాజా కవితా సంపుటి ‘ఒక ఏకాంత సమూహం లోకి’ చదివితే మనకు మరొకసారి అర్థమయే సంగతి ఏమిటంటే, ఆయన తన చుట్టూ వున్న వాళ్ళ జీవితాలని బాగా పట్టించుకుంటారని, అందుకే, ఆయన ఇంత విస్తృతంగా కవిత్వం వెలువరించగలుగుతున్నారని!</p> <p>తన తాజా కవితల సంపుటికి రాసుకున్న ముందు మాటలో తన కవితలు వెలుగు చూసే తీరుని గురించి చంద్రమౌళి గారు ఏమంటున్నారో చూడండి -<br /> ‘శ్రేష్టమైన శిల కనబడగానే, దాంట్లో నాక్కావలసిన శిల్పం దాక్కుని ఉందా అని ప్రశ్నించుకుని, శోధిస్తూ శోధిస్తూ, శిలా హృదయం లోకి యాత్రిస్తూ యాత్రిస్తూ ఎక్కడో గర్భంలో ఒక రహస్యాన్ని దర్శించి, అప్పటిదాకా నాలో నిశబ్దంగా ఒక కవితను కాగితం పైకి వర్షిస్తా. తగిన శిలను గుర్తించిన తరువాత, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><img class="alignleft size-full wp-image-10689" title="oka_ekantha" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/03/oka_ekantha.jpg" alt="" width="276" height="479" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">‘W</span>riters don’t write from experience, although many are hesitant to admit that they don’t. If you wrote from experience, you’d get maybe one book, maybe three poems. Writers write from empathy’ — Nikki Giovanni</p>
<p>రామా చంద్రమౌళి గారు విస్తృతంగా రాస్తోన్న కవి, రచయిత. ఒక వైపు కవిత్వం, మరొక వైపు కథలు, నవలలు, పుస్తక సమీక్షలు &#8211; ఇట్లా సాహిత్యం లోని అన్ని ప్రధాన విభాగాలలోనూ రచనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా, 300 పై చిలుకు కథలు, 9 కవితా సంపుటులు, 18 నవలలు వెలువరించారు. ‘ఒక ఏకాంత సమూహం లోకి’ అన్నది ఆయన తాజా కవితా సంపుటి. ఆయన కవితా సంపుటుల వరుసలో పదవది.</p>
<p>ఆశ్చర్యం ఏమిటంటే, దాదాపు 1970 లలో ఆయన రచనా వ్యాసంగం ప్రారంభించి మధ్యలో సుమారు రెండు దశాబ్దాలు సుదీర్ఘ విరామం తీసుకున్నప్పటికీ, ఇన్ని పుస్తకాలు వెలువరించడం! అంతేకాదు SAARC సాహిత్య శిఖరాగ్ర సభలలో తెలుగు నుండి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కవి రామా చంద్రమౌళి గారు.</p>
<p>చంద్రమౌళి గారి తాజా కవితా సంపుటి ‘ఒక ఏకాంత సమూహం లోకి’ చదివితే మనకు మరొకసారి అర్థమయే సంగతి ఏమిటంటే, ఆయన తన చుట్టూ వున్న వాళ్ళ జీవితాలని బాగా పట్టించుకుంటారని, అందుకే, ఆయన ఇంత విస్తృతంగా కవిత్వం వెలువరించగలుగుతున్నారని!</p>
<p>తన తాజా కవితల సంపుటికి రాసుకున్న ముందు మాటలో తన కవితలు వెలుగు చూసే తీరుని గురించి చంద్రమౌళి గారు ఏమంటున్నారో చూడండి -<br />
‘శ్రేష్టమైన శిల కనబడగానే, దాంట్లో నాక్కావలసిన శిల్పం దాక్కుని ఉందా అని ప్రశ్నించుకుని, శోధిస్తూ శోధిస్తూ, శిలా హృదయం లోకి యాత్రిస్తూ యాత్రిస్తూ ఎక్కడో గర్భంలో ఒక రహస్యాన్ని దర్శించి, అప్పటిదాకా నాలో నిశబ్దంగా ఒక కవితను కాగితం పైకి వర్షిస్తా. తగిన శిలను గుర్తించిన తరువాత, పైనున్న వ్యర్థ శిలా భాగాన్ని నేర్పుగా, నైపుణ్యంతో తొలగిస్తూ కొనసాగడమే శిల్పీకరణ అయితే, తర్వాత శిల్పం దానంతట అదే దేదీప్యమానమై ఆవిష్కృతమవుతుంది’</p>
<p>అందుకే, ఆయన కవితలలో పీడిత ప్రజలు, పీడించే పాలకులు, అధికారులు, సేక్రేటేరియట్లు, పైరవీ కారులు, ఒంటరి స్త్రీలు, సంసారాలలో బాధిత స్త్రీలు ఇలా ఒకరని కాదు, చాలా మంది అగుపిస్తారు. కొన్ని కవితలలో అందరూ ఒకేసారి కవిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కూడా అగుపిస్తారు.</p>
<p>ఇంతాచేసి, ‘ఒంటరితనం కూడా కవిత్వానికి లొంగదు’ (కవిత్వానికి లొంగనిది) అని బాధపడి పోతాడు కవి.</p>
<p>‘ఒక ఏకాంత సమూహం లోకి’ లో మొత్తం 31 కవితలు వున్నాయి. ఇందులో 31 వ కవిత ఒకింత దీర్ఘ కవిత. కవి అండమాన్ యాత్రకు వెళ్ళినప్పటి అనుభవాల కవిత్వం.<br />
చంద్రమౌళి గారి కవిత్వంలో సాధారణంగా కనిపించే అంశాలలో ఒకటి ‘ప్రశ్నించడం &#8211; ప్రశ్నించబడడం’! ఆయన కవితలు, సమాజానికి ఒక మేధావి వేసే ప్రశ్నలు. కొన్ని సార్లు తనకు తాను వేసుకునే ప్రశ్నలు.</p>
<blockquote><p>‘మనిషి వంగి లొంగి ఒక ప్రశ్నగా మిగుల్తున్న క్షణాన తెలుస్తుంది<br />
జీవిత చరమంలో &#8230; మనిషి జీవితాంతం ప్రశ్నించబడ్తూనే వుంటాడనీ<br />
ప్రశ్నించడమంటే భయపెట్టడమనీ,<br />
ప్రశించబడ్డమంటే భయపడడమనీ &#8230;. చాలా ఆలస్యంగా’<br />
(‘ప్రశ్నించడం &#8230; ప్రశ్నించబడడం’)</p></blockquote>
<p>ఒక్కోసారి చంద్రమౌళి గారి కవిత, అడవి దారులలో ముందుకు వెళుతూ దృష్టికి వచ్చిన అన్నింటినీ రికార్డు చేస్తూ పోయే మూవీ కెమెరా కన్ను లా వుంటుంది. ఈ తాజా కవితా సంపుటిలో అధిక భాగం కవితలు ఒక దృశ్యాన్ని వర్ణిస్తూ కథా కథన శైలిలో సాగడం గమనించ వచ్చును. పెన్సిల్వేనియా &#8211; వుడ్స్ ఎడ్జ్ దగ్గరలోని అడవిని వర్ణిస్తూ సాగిన ‘అరణ్య రహస్యం’ కవిత లోని ఈ ఖండిక చూడండి -</p>
<blockquote><p>‘ చివరి రోజు &#8230;. చివరి నడక &#8230;. చివరి స్పర్శ<br />
చూపులు తాబేలును వెదుకుతాయి &#8230; జింక కోసం తహ తహ<br />
సెలయేటి పాటేది &#8230;.. నీటి బాతు చప్పుడేది<br />
నన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్న నా ఖాళీ కర్ర కుర్చీ ఏది<br />
వెదుకులాట &#8230;. తడుములాట &#8230;. తండ్లాట<br />
అడవిలోకి వెళ్ళిన నాలోకి అడవే ప్రవేశించి &#8230;. ఆక్రమించిన తర్వాత<br />
అడవిని పిడికెడు గుండెల్లో ధరించి వస్తున్న &#8230;. దాచుకుని వస్తున్న నాలో<br />
ఎంత దు:ఖమో &#8230;. ఎంత శూన్యమో &#8230; సముద్రమంత &#8230; ఆకాశమంత’</p></blockquote>
<p>ఈ కవితా సంపుటిలో, ఫేస్బుక్ లాంటి అంతర్జాల సామాజిక మాధ్యమాలలో తరచుగా వుండే వాళ్ళను ఉద్దేశించి చంద్రమౌళి గారు రాసిన ‘పేస్ బుక్ గోకుడు’ అనే శీర్షికన ఒక వ్యంగ్య కవిత కూడా వుంది.</p>
<blockquote><p>‘ఒకటి పేస్ బుక్ మరొకటి వాట్సప్ అని రెండు రోగాలతనికి<br />
ఫ్రీగా వస్తే ఫినాల్ ఐనా తాగుతా &#8230; తత్వానికి బానిస<br />
&#8212;<br />
&#8230;. అతనొక ఇ- క్లాస్ కవి<br />
ఎక్కడేక్కడివో పది వచన వాక్యాలను తుంచి &#8230; విరిచి &#8230; పేర్చి<br />
ఒక వచన కవితను తయారు చేస్తాడు<br />
&#8212;<br />
పేస్ బుక్ లో &#8230; ఫలానా పత్రికలో నా ఫలానా కవిత అని<br />
ఇక మరుక్షణం నుండి ‘లైక్’ ల కోసం నిరీక్షణ<br />
బాత్రూం లోకి వెళ్లి వేన్నీళ్ళను పోసుకుంటూ ఒకటే గోక్కునుడు ఒళ్లంతా’</p></blockquote>
<p>ముప్పయ్యొక్క విభిన్న కవితల సమాహారమైన ఈ ‘ఒక ఏకాంత సమూహం లోకి’ కవితా సంపుటి, రామా చంద్రమౌళి గారి అభిమానులందరూ తప్పక చదవ వలసిన పుస్తకం.</p>
<p style="text-align: center;">***</p>
<p>పుస్తకం వివరాలు:<br />
‘ఒక ఏకాంత సమూహం లోకి’ &#8211; రామా చంద్రమౌళి కవితా సంపుటి<br />
వెల: రూ 80/- ; $5<br />
ప్రతులకు: రామా చంద్రమౌళి H.No 11-24-498, టెలిఫోన్ భవన్ లేన్, పోచమ్మ మైదాన్, వరంగల్ &#8211; 2</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=10683</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
		<item>
		<title>గమనాన్ని గమనించే కథలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=10331</link>
		<comments>http://vaakili.com/patrika/?p=10331#comments</comments>
		<pubDate>Sun, 31 Jan 2016 22:55:42 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[మధురాంతకం నరేంద్ర]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=10331</guid>
		<description><![CDATA[<p></p> <p>తెలుగు వాళ్ల కిప్పుడు రెండు రాష్ట్రాలు యేర్పడ్డాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ల సంఖ్య యెంతో, అంతమంది తెలుగువాళ్లు రెండు రాష్ట్రాల బయట వున్నారు. తొలిరోజుల్లో చాలా చిన్న గొంతుగా ప్రారంభమైన వాళ్ల సాహితీస్వరం క్రమంగా పెరిగి 2000 నాటికి స్పష్టంగా వినబడసాగింది. తమిళనాడులో హోసూరు నుంచి తెలుగు సాహిత్యం వెలువడడం ప్రారంభించాక గానీ, అక్కడి తెలుగువాళ్ల వునికీ, మనికీ, యితరులకు తెలియలేదు. యిప్పుడు రాష్ట్రేతర ఆంధ్రులు తమదైన జీవితాన్ని సాహిత్యీకరించే పనిని నిర్దుష్టంగా చేసుకుపోతున్నారు. సమకాలీన సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ బలంగా వున్న కథానిక వాళ్ల వ్యక్తీకరణకు బాగా దోహదం చేస్తోంది. గత అయిదారేళ్లుగా అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు రాస్తున్న కథలు తెలుగు ప్రవాస జీవితాలను (Diaspora) ప్రతిభావంతంగా పరిచయం చేస్తున్నాయి. అమెరికా ప్రవాస కథానికలకు యీ గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమైన కథకుల్లో తాడికొండ శివకుమార శర్మ గారు వొకరు. గత దశాబ్దకాలంలో ఆయన రాసిన యీ యిరవై కథలను యిప్పుడు ఓ సంపుటి రూపంలో చదివినప్పుడు ఆయన యీ పనిని యెంత సాధికారంగా, ప్రతిభావంతంగా చేశారో అర్థమవుతుంది.</p> <p>అమెరికా దేశం యిప్పటికీ పూర్తిగా పరిణామాన్ని పొందని (Melting pot అంటారు) దేశం. వివిధ దేశాలవాళ్లతో, రకరకాల జాతులవాళ్లతో కలిసి అదొక సంక్లిష్టమైన మానవ సమాజంగా తయారవుతోంది. వుద్యోగాల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లిన భారతీయులు గూడా అక్కడి సమాజంలో భాగమైపోక తప్పదు. వాళ్ల పిల్లలు అమెరికన్లే అవుతారు. భారతీయతని మరవలేని తొలితరం వాళ్లకూ, కొత్త దేశీయత చేత తయారు చేయబడిన మలితరం వాళ్లకూ మధ్య సంఘర్షణ తలెత్తక తప్పదు. యిండియానుంచీ వెళ్లిన తండ్రి తన కూతురు హార్వర్డులో చదవాలనీ, చదరంగంలో గ్రాండ్ మాస్టర్ కావాలనీ కోరుకోవడం సహజం. కానీ అమెరికనయిజయిన ఆ అమ్మాయి యెంట్రెన్సుటెస్టు కోచింగుకు వెళ్లననీ, టెన్నిస్ ఆడడం మానననీ మొరాయిస్తుంది. తన కూతురు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికీ, వయిలెన్ సాధన చేయడానికీ అతను అంగీకరించకపోవడానికి గూడా భారతదేశంలో సంగీతానికున్న [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/01/videshagamane_shivakumarasharma.jpg"><img class="alignleft  wp-image-10340" title="videshagamane_shivakumarasharma" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/01/videshagamane_shivakumarasharma.jpg" alt="" width="340" height="512" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">తె</span>లుగు వాళ్ల కిప్పుడు రెండు రాష్ట్రాలు యేర్పడ్డాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ల సంఖ్య యెంతో, అంతమంది తెలుగువాళ్లు రెండు రాష్ట్రాల బయట వున్నారు. తొలిరోజుల్లో చాలా చిన్న గొంతుగా ప్రారంభమైన వాళ్ల సాహితీస్వరం క్రమంగా పెరిగి 2000 నాటికి స్పష్టంగా వినబడసాగింది. తమిళనాడులో హోసూరు నుంచి తెలుగు సాహిత్యం వెలువడడం ప్రారంభించాక గానీ, అక్కడి తెలుగువాళ్ల వునికీ, మనికీ, యితరులకు తెలియలేదు. యిప్పుడు రాష్ట్రేతర ఆంధ్రులు తమదైన జీవితాన్ని సాహిత్యీకరించే పనిని నిర్దుష్టంగా చేసుకుపోతున్నారు. సమకాలీన సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ బలంగా వున్న కథానిక వాళ్ల వ్యక్తీకరణకు బాగా దోహదం చేస్తోంది. గత అయిదారేళ్లుగా అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు రాస్తున్న కథలు తెలుగు ప్రవాస జీవితాలను (Diaspora) ప్రతిభావంతంగా పరిచయం చేస్తున్నాయి. అమెరికా ప్రవాస కథానికలకు యీ గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమైన కథకుల్లో తాడికొండ శివకుమార శర్మ గారు వొకరు. గత దశాబ్దకాలంలో ఆయన రాసిన యీ యిరవై కథలను యిప్పుడు ఓ సంపుటి రూపంలో చదివినప్పుడు ఆయన యీ పనిని యెంత సాధికారంగా, ప్రతిభావంతంగా చేశారో అర్థమవుతుంది.</p>
<p>అమెరికా దేశం యిప్పటికీ పూర్తిగా పరిణామాన్ని పొందని (Melting pot అంటారు) దేశం. వివిధ దేశాలవాళ్లతో, రకరకాల జాతులవాళ్లతో కలిసి అదొక సంక్లిష్టమైన మానవ సమాజంగా తయారవుతోంది. వుద్యోగాల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లిన భారతీయులు గూడా అక్కడి సమాజంలో భాగమైపోక తప్పదు. వాళ్ల పిల్లలు అమెరికన్లే అవుతారు. భారతీయతని మరవలేని తొలితరం వాళ్లకూ, కొత్త దేశీయత చేత తయారు చేయబడిన మలితరం వాళ్లకూ మధ్య సంఘర్షణ తలెత్తక తప్పదు. యిండియానుంచీ వెళ్లిన తండ్రి తన కూతురు హార్వర్డులో చదవాలనీ, చదరంగంలో గ్రాండ్ మాస్టర్ కావాలనీ కోరుకోవడం సహజం. కానీ అమెరికనయిజయిన ఆ అమ్మాయి యెంట్రెన్సుటెస్టు కోచింగుకు వెళ్లననీ, టెన్నిస్ ఆడడం మానననీ మొరాయిస్తుంది. తన కూతురు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికీ, వయిలెన్ సాధన చేయడానికీ అతను అంగీకరించకపోవడానికి గూడా భారతదేశంలో సంగీతానికున్న నిరాదరణే కారణమని అతను గుర్తించలేడు. కానీ తమ యిష్టాయిష్టాలను తమ పిల్లపైన రుద్దడం అమెరికాలో సాగదు. వాళ్లో ఫోన్ చేస్తే పోలీసులు తల్లిదండ్రులను &#8216;అట్రాసిటీ&#8217; కేసుమీద అరెస్టు చేసి పారేస్తారు. అలిగిన పిల్లలు కోపంతో కాస్సేపు కనిపించకపోతే అమెరికాలోని తల్లిదండ్రులు రకరకాల అనుమానాలతో భయభ్రాంతులవుతారు. చివరకు అక్కడి అమెరికన్ పోలీసు గూడా అలిగి వెళ్లిపోయిన పధ్నాలుగేళ్ల అమ్మాయితో &#8220;నా కిద్దరు పిల్లలు. ఇద్దరూ నీకంటే పెద్దవాళ్లే. ఐ కెన్ టెల్ యు దట్ బిహైండ్ దట్ క్లౌడ్ ఆఫ్ మాడ్నెస్ దేర్ యీజ్ ఎ సన్ కాల్డ్ లవ్. ది క్లౌడ్ ఈజ్ టెంపొరరీ. ఇట్ విల్ క్లియర్. నీ విషయంలో అది ఈ పాటికి క్లియర్ అయిపోయింది. ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ &#8230; టునైట్ &#8211; ఇన్ టెన్ మినిట్స్. ఫస్ట్ ఐ షుడ్ కాల్ దెం. ముందుగా మీ నాన్న నెంబర్ నాకివ్వు&#8230; మీ అమ్మాయి ఒక అంకుల్ని తీసుకు వస్తోందని చెబుతాను&#8221; అంటాడు.</p>
<p>భారతదేశంలో పిల్లలకు తల్లిదండ్రులతోబాటు బంధువులూ, స్నేహితులూ, వుపాధ్యాయులూ వుంటారు. ముఖ్యంగా తాతలూ, అమ్మమ్మలూ, నాన్నమ్మలూ, బాబాయిలూ వుంటారు. యెన్ని రకాల గొడవలున్నా వొక సమాజం గూడా వుంటుంది. వాళ్ల వెనకో వూరు వూరే వుంటుంది. యీ విషయాన్ని గుర్తించిన హిల్లరీ క్లింటన్ లాంటివాళ్లు &#8220;పిల్లల్ని పెంచాలంటే వొక వూరు వూరే కావాలి&#8221; అని చెబుతున్నారు. (ఆమె రాసిన పుస్తకం పేరు It takes a village). యీ విషయాన్ని అమెరికాలో జీవిస్తున్న తెలుగువాళ్లు సైతం ఆలస్యంగా గుర్తించడమే జీవితంలోని వైచిత్రి. యిటువంటి సంక్లిష్టమైన జీవన విధానాన్ని చిత్రించడానికి రచయితకు సునిశితమైన దృష్టితోబాటు నిర్మోహత (detachment) కూడా వుండాలి. అప్పుడే &#8220;ది లోన్ డ్రమ్మర్&#8221; వంటి కథలు రాయగలుగుతారు. జీవితమే మూలసూత్రంగా, వాస్తవికతే ఆలంబనగా రాసే యిటువంటి కథలు చదువుతున్నప్పుడు కెనడా జీవన విధానాల్ని గుర్తించి కథలు రాసిన &#8220;ఆలిస్ మన్రో&#8221; గుర్తుకొస్తారు. ఆమె కథల్లో కూడా సిధ్ధాంతాల కతీతమైన, సమీకరణలకు లొంగని, సంక్లిష్టమైన జీవనగతులు పాఠకుల్ని విస్మయుల్ని చేస్తూ వుంటాయి.</p>
<p>అమెరికాలో స్థిరపడిన తొలితరం భారతీయులు మాత్రం తమదైన సంస్కృతీ సంప్రదాయాలను మరవలేరు. అమెరికాలో చనిపోయిన తన తమ్ముడికి ఉదారంగా విరాళాల నిచ్చిన అమెరికన్ల రుణం తీర్చడంకోసం, వొక అన్న తానూ అమెరికాకు వెళ్లి, అక్కడే డబ్బు సంపాదించి, వాళ్లకు అప్పుతీర్చడానికే జీవితాన్నంతా వెచ్చిస్తాడు (నాకు తెలిసిన టెన్సింగ్ నార్కే). మరో వ్యక్తి తాను చనిపోయినప్పుడు తనని పూడ్చడం కోసం తన స్వగ్రామం నుంచీ 23 కిలోల మట్టిని (యిండియా నుంచి విమానంలో అమెరికాకు వెళ్లేటప్పుడు 23 కిలోల బరువును మాత్రమే అనుమతిస్తారు) తీసుకెళ్తాడు. యింకోవ్యక్తి అమెరికాలో ఐటీ సాఫ్ట్వేర్ వుద్యోగాలు మారిపోయినప్పుడు, తనకు వారసత్వంగా వచ్చిన అర్చక వృత్తిని చేపట్టడానికి సందేహించడు.</p>
<p>వొకప్పుడు ఈ పరిస్థితులకు భిన్నంగా తల్లిదండ్రులు అమెరికనయిజవడమూ, పిల్లల్లో పాతకాలపు బుధ్ధులు మిగిలి వుండడమూ కూడా సంభవించవచ్చు. భర్త చనిపోయిన తర్వాత వొక భార్య తన వయసున్న మరోవ్యక్తితో కలిసి జీవించడం (Living together) మొదలెడుతుంది. అయితే ఆమె పిల్లలు మాత్రం అందుకు వొప్పుకోరు.</p>
<p>తానే వో కథలో చెప్పినట్టుగా శివకుమారశర్మగారు యిప్పటికీ, యెప్పటికీ భారతీయుడే (Still an Indian). విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారతీయ విద్యాధికులు తమ మాతృదేశంలోని జరిగే ప్రతివిషయాన్నీ అప్రమత్తతతో పట్టించుకుంటూనే వుంటారు. తమ దేశంలో మంచిని పెంచడం కోసం, చెడును రూపుమాపడం కోసం తమ శక్తులనంతా వినియోగిస్తారు. శర్మగారి లాంటి రచయితలు తమ జన్మభూమిలో జరుగుతున్న అరాచకాలను తూర్పారబట్టడం కోసం కథలు రాస్తూ వుంటారు. స్వార్థమూ, లంచగొండితనమూ, దేశంలోని రాజకీయాల నెంతగా దిగజార్చాయో చూసి విలవిల లాడిపోతారు (స్వాభిమాన వ్రతం, సున్నాల పక్కన ఒకటి, ఊహాతీతం మొదలైన కథలు). దేశంలోని మంచిని చూసినప్పుడు పరవశమై పోతారు (రేపటి ఆశాకిరణాలు). తమ జీవితపు జ్ఞాపకాలను తలచుకున్నప్పుడు ఆనందంతో పులకించిపోతారు (పంచముఖి, ఆ నవ్వుకోసం). సార్వజనీనమైన సత్యాల అన్వేషణకు గూడా పూనుకుంటారు (రిచర్డ్ బాక్ నవలిక జొనాతన్ లిగింగ్స్టన్ సీగల్ను జ్ఞాపకం చేసే &#8216;శిఖరాగ్రాన,&#8217; &#8216;పంచముఖి,&#8217; &#8216;డెడ్మేన్ పేరడాక్స్&#8217;).</p>
<p>శివకుమార శర్మగారి కథల్ని చదువుతున్నప్పుడు పాఠకుడు మళ్లీ వొకసారి తన జీవితాన్ని గురించీ, తన ప్రపంచాన్ని గురించీ పునర్మూల్యాంకన చేసుకుంటారు. సాగివచ్చిన దూరాన్ని పరిశీలించి తన గమనమెలా సాగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనలోని లోపాల్ని వెదికిచూసి, తనను మరింత మంచి మానవుడిగా తయారు చేసుకోవడానికి సన్నద్ధమవుతాడు. వుత్తమ సాహిత్యాని కింతకంటే మించిన ప్రయోజనమింకేముంటుంది?</p>
<p style="text-align: right;">మధురాంతకం నరేంద్ర<br />
5 అక్టోబరు 2015<br />
తిరుపతి</p>
<p style="text-align: right;"><em>(&#8216;విదేశగమనే&#8217; కథాసంకలనం ముందుమాట నుండి)</em></p>
<p>పుస్తకం ప్రతులకు:<br />
<a href="http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=17329" target="_blank">http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=17329</a><br />
AVK Fundation<br />
Ph: 040-64512224</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=10331</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>మసిబారిన మానవ సంబంధాలను ఎత్తి చూపే మమత కవిత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=8386</link>
		<comments>http://vaakili.com/patrika/?p=8386#comments</comments>
		<pubDate>Mon, 01 Jun 2015 02:13:17 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[కొత్త పుస్తకం కబుర్లు]]></category>
		<category><![CDATA[కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=8386</guid>
		<description><![CDATA[మనసు బాధతో గుక్కపట్టినప్పుడో, జీవితంలో ఓ ఆనందం పూదండలా మెడకు చుట్టుకుని ఆహ్లాదపరచినప్పుడో ఉద్వేగంతో కూడిన భావజాలం కవిత్వమై మమతకు సాంత్వననిస్తూంటుంది. జీవితానికో పరమార్ధముందంటూ గుర్తుపట్టగలగడం తల్లిదండ్రులనుండి ఈ కవయిత్రి సంతరించుకున్న అనిర్వచనీయమైన వో అనుభూతి కావచ్చు. లేదా తాను నడచిన విద్యార్ది జీవితానుభవం కావచ్చు.]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="font-size: 30px;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/06/mamata_book_cover.jpg"><img class="alignleft  wp-image-8423" title="mamata_book_cover" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/06/mamata_book_cover.jpg" alt="" width="342" height="532" /></a>మ</span>నసు బాధతో గుక్కపట్టినప్పుడో, జీవితంలో ఓ ఆనందం పూదండలా మెడకు చుట్టుకుని ఆహ్లాదపరచినప్పుడో ఉద్వేగంతో కూడిన భావజాలం కవిత్వమై మమతకు సాంత్వననిస్తూంటుంది. జీవితానికో పరమార్ధముందంటూ గుర్తుపట్టగలగడం తల్లిదండ్రులనుండి ఈ కవయిత్రి సంతరించుకున్న అనిర్వచనీయమైన వో అనుభూతి కావచ్చు. లేదా తాను నడచిన విద్యార్ది జీవితానుభవం కావచ్చు. ఉద్యమ శ్వాసా కావచ్చు. ఏది ఏమైనా జీవితానికి అర్ధం వో పరమార్ధం ఉందని భావించడం లోనే ఈ కవయిత్రి ఆశావాహకత బట్టబయలవుతూంది. కవిత్వం లో ఉన్న సృజనాత్మక ప్రతిభతో తనను తాను ఓదార్చుకుంటూ వో నిబ్బరమైన ప్రతిభతో అబలత్వాన్ని ఆవలకు నెట్టి సబలత్వాన్ని చేపట్టి జీవితంలోని సంక్లిష్టతను, అస్తవ్యస్తతను తొలగదోస్తూ ముందుకు సాగిన తీరు ఈ కవయిత్రి కవిత్వం లో కనిపిస్తూంటుంది. పిన్న వయసులో గాఢమైన జీవితానుభవాలు, నిత్య సంఘర్షణలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న స్పందనలు, వాస్తవ ఘటనలు మరెన్నో సంఘటనలు జీవిత సమాహారంగా దర్శనమిచ్చిన తీరు కవిత్వం లో గోచరిస్తూంటుంది. జీవితాన్ని విమర్శనా సాహిత్యంగా విడమరచి రూపొందించిన కవయిత్రి మమత.</p>
<p>“కవిత్వం ఎప్పుడూ వేదన సంఘర్షణ లోనుంచే పుడుతుంది”అనే మేధావుల అభిప్రాయాలకు సమాంతరంగా ఈ కవయిత్రి భావజాలం నడవడం ఈమె వ్యక్తిత్వాన్ని పట్టిస్తూంటుంది. సాహిత్య సృజన వో జఠిలమైన సంక్లిష్టమార్గంగా కవయిత్రి భావిస్తూంది. సమాజం ఎప్పుడూ మేడిపండు లాంటిదే.! అనుకున్నంత, కలలు కన్నంత, ఊహించినంత న్యాయసమ్మతమైనది,ధర్మబద్ధమైనది మాత్రం కాదు. అది ఎప్పటికీ వైరుధ్యాల, వైవిధ్యాల పుట్ట. అణచివేత, దోపిడీ, దగా, మతం, రాజకీయం ముసుగుల్లో స్వార్ధం నీడలో , అధికారం ఆర్దికోన్నతుల జాడలో కళ్ళుగప్పి న్యాయసమ్మతమనిపిస్తూసాగిపోతున్న తీరు సమాజానిదే. తలవంచుకుని సర్దుకుపోడం, నాదీ నేనూ అంటూ నాకెందుకులే అంటూ స్వార్ధం పడగనీడన బతకడం, స్వేచ్చారాహిత్యంగా జీవించడానికి అలవాటు పడ్డవారికి సామాజిక విధ్వంసక మూలాలు ఆనందపుహేలనిస్తుంటాయి. అంతా మంచిగానే కనిపిస్తూంటుంది. అక్రమాన్ని, అన్యాయాన్ని, అణచివేతను, స్వేచ్చారాహిత్యాన్ని, సమానత్వాన్ని ఇచ్చిపుచ్చుకునే మర్యాదల వ్యత్యాసాన్ని ‘ఇదేమి’ అని ప్రశ్నించినప్పుడే అసలు సమస్య జీవితం లో తలెత్తుతూంటుంది. ఇలా తలెత్తిన కొన్ని సందర్భాలు ‘మమత’ చేత మంచి కవిత్వాన్నే రాయించాయి.</p>
<p>“రంగులు మాయని సీతాకోక చిలుక” లా జీవితాన్ని తీర్చిదిద్దుకునే ధైర్యాన్ని , నిబ్బరాన్ని, నిష్టను ప్రసాదించ గలిగాయి. అందుకే ‘స్వేచ్చ’ కవితలో “పంజరంలో తిరుగుతూ స్వేచ్చా గీత మెందుకే?” అనే ప్రశ్న వేసుకోగలిగింది. అనుభవాల వడపోతతో మిగుల్చుకున్న జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోగలిగింది గనుకనే</p>
<blockquote><p>“నీ వెనుక ఉన్న జీవితం అంధకారమయినా<br />
ముందున్న భవిత దరిలేని సముద్రమైనా<br />
చీకట్లో దారి చూసుకుంటూ<br />
సముద్రంలో ధృవనక్షత్రాన్ని వీక్షిస్తూ<br />
నీ మాతృదేశాన్ని కనిపెట్టాలి కొత్తగా”</p></blockquote>
<p>అనగలిగింది.</p>
<p>అందుకే పంజరాన్ని సమస్యలకు ప్రతీకగా భావించగలిగింది.</p>
<blockquote><p>“నీలోని సూర్యున్ని ఎప్పటికీ అస్తమించనీయకు<br />
చంద్రుని రాకకై ఎదురు చూడకు”</p></blockquote>
<p>అనగలిగింది.</p>
<p>కష్టాలకు తలవొగ్గి సుఖాలకోసం వెంపర్లాడ వద్దనే భావన “చంద్రుని రాకకై ఎదురు చూడకు “అనే వాక్యం లో కనబడుతుంది. “పంజరం లోని చిలుకా/ ఇక పాడవే ఒక స్వేచ్చా గీతికా“ అంటూ గుండె దిటవుతో ముందుకు సాగింది.<br />
ఎదురు చూపులతో విసిగిపోవడం, పగటి కలల్లో కూరుకు పోవడం, కౄరనిరీక్షణలో శిధిలపడటం, మనసున్న మనుషులు కొంతకాలమే భరించగలరు, సహించగలరు. అమాయకంగా తొలినాళ్ళలో మొహపూరితమైన దేహ భాషను హత్తుకుని పగలబడి నవ్వవచ్చు కాని ఆలోచన ఉన్న వారిని ఒక కాంతి రేఖ బుగ్గను చురుక్కుమనిపించి, పగటి కలల నుండి బయటపడేస్తూంటుంది.ఆత్మాగతమైనఆలోచనలలోకి నెట్టివేస్తుంది.</p>
<p>ఉద్యమ నిబద్ధత తోసమాజాన్ని పరిశీలించేవారు “తియ్యని పాట ఈటెను/ మెరిసే వేయి ఇంద్ర ధనుస్సులుగా “ భావించగలరు. తమ లోతైన ఊహలకు రెక్కలు తొడగగలరు. ఒక పదునైన ఆలోచనను పరిపక్వత దిశగా పయనించడానికి సమాయత్తపరచుకోగలరు. “ ఓవర్షం వెలిసిన సాయంత్రం” లో నాదంటూ ఒక గౌరవనీయ స్థానం కోసం /నాదంటూ ఒక్క నిమిషం కోసం /నాదంటూ ఒక ప్రేమ కోసం /ఈ వెంపర్లాట “ అనుకుంటూ ఊపిరి సలపకుండా కరిగిపోతున్న ఉనికిని కాపాడుకునేందుకు తనను తానూ నిలదీసే వో ప్రయత్నంగా “ నేనే ఎందుకిలా?” అనే ప్రశ్న ఉత్పన్నమౌతూంది. “చూసినా చూడనట్టు” పోతున్న సమాజాన్ని పట్టించుకుని, రెక్కలుడిగిన పిట్టలా కూర్చోకుండా తన హృదయానికి తన చేయి అందించి ముందుకు సాగుతుంది. వంద సంకోచాలకు ఒక్క సమాధానాన్ని వెతుక్కుంటుంది.తానూ తిరిగిన సమాజం నుంచి ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటుంది.</p>
<p>తండ్రి తల్లి జ్ఞాపకాల ఒడిలో తడిసి ముద్దైన తీరు ఆవిష్కరిస్తూ ‘ఎడబాటు’ కవితలో</p>
<blockquote><p>“పొద్దుపొడుపు చుక్క<br />
మసక వెలుతురులో కరిగిపోయిన చోట<br />
తొండమెత్తి<br />
మొదటి కిరణాన్ని రారమ్మని పిలుస్తోంది<br />
ఒక ఆవిరి ఏనుగు”</p></blockquote>
<p>అంటారు.</p>
<p>తనను అమాంతం గాల్లోకి ఎగరేసి పట్టుకుని గుండెకు హత్తుకుంటే, తండ్రి మెడలో ముఖం దాచుకునే ఆప్యాయతను కోరుకుంటుంది. అమ్మ చెప్పినట్టు కంటి చివర తడిలో దొరికిన వెంట్రుకను మనసులో అనుకున్న మంచి కోరికతో గాలిలోకి ఊదిన జ్ఞాపకం వెన్నంటి ఉన్నా, తనలో అణువణువూనిండిన జ్ఞాపకాల అలజడిని మోసుకుని వెంట్రుక వారిని చేరుతుందని, కన్నీటి చుక్కల్ని తనలో ఇముడ్చుకొని ఓ చిట్టి అల తమను తాకుతుందని వో నమ్మకాన్ని ఆరవోస్తుంది కవయిత్రి. నిరాశ్రయం ఎదురైనప్పుడు ఆశ్రయమిచ్చిన జ్ఞాపకాల్లో తడిసిపోవడం మనసుకున్న బలం, బలహీనత కూడా.</p>
<p>ఒక కల వాస్తవ జీవితం లోకి ప్రవేశించి , ప్రవేశించకుండా నీడల్లోకి అదృశ్యమవుతున్న తీరును, కదిలే మేఘాల గుంపులో నర్తింఛి మాయమయే దిగులు నవ్వును, ప్రశ్నల ముళ్ళపొదల్లో వెతుక్కుంటూ అద్భుత పరచే ప్రణయభాష ఆంతర్యాన్ని విప్పి చెప్తుంది –తన కవిత్వంలో మమత. నల్ల చేపపిల్ల కధతో ఒక పోరాట గరిమను, గమ్యం చేరాలనే ఆకాంక్షను, పట్టుదలను, పోరాటాన్నీ, పాఠకులలో ఆలోచనా స్పృహను కలిగించే విధంగా ఆవిష్కరిస్తుంది. ఏది ఏమైనా మమత కవిత్వంలో అపారమైన అనుభవసారముంది. అవలీలగా భావాలను కవిత్వం చేసే నేర్పుంది. కవితను స్వయానా బాధల్లోనో, సుఖశాంతుల్లోనో ఇరుక్కున్నప్పుడే కవిత్వమై ప్రవహించాలనుకోవడం కంటే, కవి వైరుధ్యాల్లోకి , వైవిధ్యాల్లోకి పరకాయ ప్రవేశం చెయ్యడం నేర్చుకోవాలి. సృజనాత్మకంగా బతుకులోని ఖాళీ తనాన్ని పసిగట్టి భర్తీ చేసుకునే ఆలోచనలనివ్వాలి. మమత కవిత్వంలో ఆ కోవకు చెందిన పరిణితి కనిపిస్తుంది. ఈమె కలం ఆగిపోకుండా కదలాలని ఆశిస్తూ అబినందిద్దాం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=8386</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
	</channel>
</rss>
