<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; సమీక్ష</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=30&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>ఎల్లలు దాటిన తెలుగు కవిత్వ పరిమళం</title>
		<link>http://vaakili.com/patrika/?p=14530</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14530#comments</comments>
		<pubDate>Sat, 01 Jul 2017 02:11:46 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[మానస చామర్తి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14530</guid>
		<description><![CDATA[<p></p> <p>నేను ఇన్ఫో్‌సిస్‌లో పని చేస్తున్న రోజుల్లో, వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండటంతో సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన కొందరితో, తరచుగా వారి వారి భాషలకు చెందిన ప్రాచీన, సమకాలీన కవిత్వాల గురించి మాట్లాడేదాన్ని. హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషలకు చెందిన వాళ్ళతో వీలు చిక్కినప్పుడల్లా సాహిత్యచర్చలు సాగేవి. అలా మాటల్లో నాకూ కొంత కవిత్వం రాయడం పట్ల ఆసక్తి ఉందనీ, రాసేందుకు, విరివిగా చదివేందుకు ప్రయత్నిస్తుంటాననీ చెప్పినప్పుడు, మన భాషలోని కొన్ని మంచి కవితలను వాళ్ళకు వినిపించమని కోరేవారు. &#8216;వస్తువు ఏమిటి&#8217;, &#8216;వర్ణనలు ఏ రకంగా సాగాయి&#8217;, &#8216;ప్రేరణ ఏమై ఉంటుంది?&#8217; అన్న ప్రశ్నలతో మొదలైన మా సంభాషణ, నేను కవిత మొత్తాన్నీ పూర్వాపరాలతో సహా వివరించడంతో ముగిసిపోయేది. అది వ్యక్తిగతంగా నాకెంతో ఉత్సాహాన్నీ, ఆసక్తినీ కలిగించే చర్చ అనడంలో నాకే సందేహమూ లేదు కానీ, చెప్పడం పూర్తయ్యాక ఉత్తమ కవిత్వం సాహితీ ప్రియుల్లో సహజంగా కలిగించే సున్నితమైన సంవేదన, సంతృప్తీ నా శ్రోతల్లో, స్నేహితుల్లో కనపడకపోవడం మాత్రం నన్ను ఆలోచనల్లోకి నెట్టేది. దరిమిలా, ఒకానొక ప్రశ్నోత్తర సభలో జావెద్ అక్తర్ అనువాదం చెయ్యడమంటే, పరిమళద్రవ్యాన్ని ఒక సీసా నుండి మరొక సీసాకి బదిలీ చెయ్యడం లాంటిదని అనడం గుర్తొచ్చేది.</p> <p>జావెద్ మాటలకేమో గానీ, కవితల గురించి నేను మాట్లాడినప్పుడు, నా మిత్రుల్లో నేనూహించిన స్పందన రాకపోవడానికి, ప్రథానంగా కొన్ని కారణాలు కనపడతాయి. మన కవిత్వంలో, ప్రత్యేకించి సమకాలీన కవిత్వంలో, కథన రీతులు తక్కువ. మనం ఎక్కువ శాతం ఒక అనుభవాన్ని కవిత్వంలా మార్చడమే చూస్తున్నాం. లేదా ఒక సమస్యను బలమైన ప్రతీకలతో పది మంది ముందూ నిలిపే ప్రయత్నాలు చూస్తున్నాం (అంటే కవిత్వాన్ని మించి, ఒక సమస్యనో దాని పరిష్కారాన్నో ప్రజలకు బలంగానూ, సులభంగానూ చేరవేయడానికి కవిత్వాన్ని మాధ్యమంగా వాడుకుంటున్నాం, కాబట్టి, ఇక్కడ కేంద్రీకరణ వీటి మీదే ఉంటే అవకాశాలు ఎక్కువ). అలాగే, మన [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/06/woh_front.jpg"><img class="alignleft size-full wp-image-14536" title="woh_front" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/06/woh_front.jpg" alt="" width="324" height="499" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">నే</span>ను ఇన్ఫో్‌సిస్‌లో పని చేస్తున్న రోజుల్లో, వృత్తిరీత్యా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉండటంతో సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన కొందరితో, తరచుగా వారి వారి భాషలకు చెందిన ప్రాచీన, సమకాలీన కవిత్వాల గురించి మాట్లాడేదాన్ని. హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషలకు చెందిన వాళ్ళతో వీలు చిక్కినప్పుడల్లా సాహిత్యచర్చలు సాగేవి. అలా మాటల్లో నాకూ కొంత కవిత్వం రాయడం పట్ల ఆసక్తి ఉందనీ, రాసేందుకు, విరివిగా చదివేందుకు ప్రయత్నిస్తుంటాననీ చెప్పినప్పుడు, మన భాషలోని కొన్ని మంచి కవితలను వాళ్ళకు వినిపించమని కోరేవారు. &#8216;వస్తువు ఏమిటి&#8217;, &#8216;వర్ణనలు ఏ రకంగా సాగాయి&#8217;, &#8216;ప్రేరణ ఏమై ఉంటుంది?&#8217; అన్న ప్రశ్నలతో మొదలైన మా సంభాషణ, నేను కవిత మొత్తాన్నీ పూర్వాపరాలతో సహా వివరించడంతో ముగిసిపోయేది. అది వ్యక్తిగతంగా నాకెంతో ఉత్సాహాన్నీ, ఆసక్తినీ కలిగించే చర్చ అనడంలో నాకే సందేహమూ లేదు కానీ, చెప్పడం పూర్తయ్యాక ఉత్తమ కవిత్వం సాహితీ ప్రియుల్లో సహజంగా కలిగించే సున్నితమైన సంవేదన, సంతృప్తీ నా శ్రోతల్లో, స్నేహితుల్లో కనపడకపోవడం మాత్రం నన్ను ఆలోచనల్లోకి నెట్టేది. దరిమిలా, ఒకానొక ప్రశ్నోత్తర సభలో జావెద్ అక్తర్ అనువాదం చెయ్యడమంటే, పరిమళద్రవ్యాన్ని ఒక సీసా నుండి మరొక సీసాకి బదిలీ చెయ్యడం లాంటిదని అనడం గుర్తొచ్చేది.</p>
<p>జావెద్ మాటలకేమో గానీ, కవితల గురించి నేను మాట్లాడినప్పుడు, నా మిత్రుల్లో నేనూహించిన స్పందన రాకపోవడానికి, ప్రథానంగా కొన్ని కారణాలు కనపడతాయి. మన కవిత్వంలో, ప్రత్యేకించి సమకాలీన కవిత్వంలో, కథన రీతులు తక్కువ. మనం ఎక్కువ శాతం ఒక అనుభవాన్ని కవిత్వంలా మార్చడమే చూస్తున్నాం. లేదా ఒక సమస్యను బలమైన ప్రతీకలతో పది మంది ముందూ నిలిపే ప్రయత్నాలు చూస్తున్నాం (అంటే కవిత్వాన్ని మించి, ఒక సమస్యనో దాని పరిష్కారాన్నో ప్రజలకు బలంగానూ, సులభంగానూ చేరవేయడానికి కవిత్వాన్ని మాధ్యమంగా వాడుకుంటున్నాం, కాబట్టి, ఇక్కడ కేంద్రీకరణ వీటి మీదే ఉంటే అవకాశాలు ఎక్కువ). అలాగే, మన వర్ణనల్లో కొత్త చూపు కంటే కొత్త మాటకు ప్రాథాన్యత ఎక్కువ. కాబట్టి, కవిత్వాన్ని కవిత్వంలా కాకుండా, మామూలు పదాల్లో విప్పి చెప్పినప్పుడు, అందులో మనకు ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ కలిగించే ప్రాథమిక లక్షణాన్ని కోల్పోతున్నాం, రసజ్ఞతను మేల్కొల్పలేకపోతున్నాం. వీటన్నింటితో పాటు, అనువాదకురాలిగా నా ప్రతిభ, పాఠశాల పరీక్షల నెపం మీద నేను పొందిన ఆంగ్ల పరిజ్ఞానం మీదే అధిక శాతం ఆధారపడి ఉండటం కూడా ఒక ముఖ్యమైన కారణం. నేను నేర్చుకున్న ఇంగ్లీషు చదువు, నా నిత్యావసరాలకు సరిపోతుంది; ఉద్యోగరీత్యా చూసినా, సంభాషణాసందర్భాలన్నీ ముందుగానే తెలుస్తాయి కనుక, ప్రపంచం నలుమూలల్లోని మనుషులతోనూ ఏ ఇబ్బందీ లేకుండా మాట్లాడేందుకూ సరిపోతుంది; చర్చల ఉద్దేశ్యం, పరిమితి, పరిథి అన్నీ రెండు వైపుల వారికీ అవగాహన ఉన్న కొన్ని సాంకేతికసమస్యలతోనే ముడిపడి ఉంటాయి కనుక, భాషకు సంబంధించిన ఏ ఇబ్బందీ ఎదురవ్వదు. కానీ, సాహిత్యపరంగా చూస్తే నా ఆంగ్లజ్ఞానం పరిమితమైనది. కవిత్వాన్ని అనువాదం చేసేందుకు మాటలకు అర్థాలు మాత్రమే తెలిస్తే చాలని నేను అనుకోను. ప్రథానంగా పదాల మీద, ఆ పదాలు వెలువరించే శబ్ద సౌందర్యం మీద నడిచే ఈ కథన రహిత కవిత్వాన్ని అనువాదం చెయ్యడానికి, మాటల అల్లికలో పొందికనూ, పొదుపునూ పాటిస్తూనే, చమత్కారాన్ని, కవిత్వాన్ని భద్రంగా మోస్తూ, మూలంలోని సంగీతం బట్వాడా అయ్యేలా చేసేందుకు, సాహిత్యపరంగా ఆ భాష తీరుతెన్నుల పట్ల అవగాహన కలిగిన అనువాదకులు కావాలి.</p>
<p>ఆ రోజుల్లోనే, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడిన ఒకానొక తెలుగు కవితకు, శ్రీనౌడూరి మూర్తి గారు చేసిన ఆంగ్లఅనువాదం మిత్రులకు చూపించడమూ, చదివిన వెంటనే నా మళయాళం మిత్రులు కొందరు ఆ కవిత మాధవి కుట్టీ (కమలాదాస్)కవిత్వాన్ని గుర్తు చేస్తోందని అనడమూ జరిగాయి. అప్పటికి ఆ పేరైనా విని ఉండని నా ఆశ్చర్యాన్ని గమనించి, వాళ్ళు మాధవికుట్టీ కవితలనే కాక, అద్భుతమైన మళయాళం కవితలెన్నింటికో ఆంగ్ల అనువాదాలను క్రమం తప్పకుండా పొందుపరుస్తోన్న <a href="https://poetrans.wordpress.com/category/abhirami/" target="_blank">మరొక సైట్ లింక్</a> కూడా నాకు అందజేశారు. ఆ అనువాదాల ద్వారా నేను తెలుసుకున్న ఆమె స్త్రీవాదం, సాంప్రదాయానికి ఎదురీదగల ఆమె శక్తీ, ఆ ప్రాంతపు సాంప్రదాయాలు, ఈ కాలపు మళయాళం పిల్లలు ఇంత హేలగా అద్భుతమైన కవిత్వాన్ని రాయడమూ &#8211; అన్నీ, వింతగానూ కొత్తగానూ తోచేవి. నచ్చేవి. ఒక భాషలోని సాహిత్యమంతా అంత అలవోకగా నాదాకా చేరినందుకు సంభ్రమంగా కూడా ఉండేది. అనువాదం దానికదే ఒక కళ అన్న స్పృహ నాలో మొదలైందప్పుడే. ఒక భాషను కొత్త జ్ఞానరాశులతో సుసంపన్నం చేయడానికి, అనువాదకులు కవులతో సరిసమానమైన(ఒక్కోసారి ఎక్కువగా కూడా) శ్రమను, వేదనను, మథనాన్ని అనుభవిస్తూనే రచన వెలువరిస్తారు అన్న ఎరుక కలిగి, వారి పట్ల గౌరవమూ రెట్టింపైంది. మూర్తి గారి &#8220;<a href="https://teluguanuvaadaalu.com/" target="_blank">అనువాదలహరి</a>&#8221; బ్లాగు ప్రతి రోజూ చదవడం అలవాటుగా మారడమూ అప్పటి సంగతే. ఈ బ్లాగులో, గత కొన్నేళ్ళుగా మన తెలుగు భాషకు చెందిన కవితలెన్నింటినో ఆంగ్లంలోకి అనువాదం చేసి, ఇప్పుడు వాటిలో నుండి ఎంపిక చేసిన కవితలతో, మూర్తి గారు <a href="http://www.amazon.in/Wakes-Horizon-Selection-Translated-Telugu/dp/0997736305" target="_blank">Wakes On The Horizon</a> అన్న సంకలనం ప్రచురించడమే, ఆ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఈ పుస్తకం మీద నా ఆలోచనలను ఇలా ఈ వ్యాస రూపంలో పంచుకునేందుకు అవకాశమిచ్చింది.</p>
<blockquote><p>&#8220;ఇదుగో, సాయంత్రం చేసి వచ్చింది వాన<br />
పెంకి పిల్లడికి అల్లరి వెధవ తోడయినట్లు,<br />
గాలిని వెంటబెట్టుకుని మరీ.<br />
చీకటి నీరుగారిపోయి చేతులకి చెమ్మగా తగులుతోంది.<br />
కిటికీ “Fadeout” లోంచి చూస్తుంటే, గోదావరి<br />
కాన్వాసుమీద ఒలికిపోయిన జేగురు రంగులా ఉంది.<br />
కాళ్ళమీద ఏదో ప్రాకుతున్న స్పర్శలా,<br />
వంతెన మీద నుండి గూడ్సు రైలు పోతోంది.<br />
నెయ్యివేస్తే భగ్గుమన్న నిప్పులా- తెరచాపలు ఎగురుతున్నాయి.<br />
లంకలనుండి ఇసుక ఒడ్డుకు తెస్తున్న పడవలు,<br />
మరుగుతున్న ఉక్కుమీది తెట్టులా, ఒడ్డుకుచేరుకుంటున్నాయి.&#8221;</p></blockquote>
<p>ఇది మూర్తి గారి తొలి కవితా సంపుటి, సౌభాగ్య గారితో కలిసి 99 లోనే వినూత్నంగా ప్రచురించిన &#8220;నువ్వూ -నేనూ, గానమూ-గళమూ&#8221; లోనిది. దాదాపు 43 ఆంగ్ల కవితలతో, &#8220;Incidental Muses &#8221; అన్న కవితా సంపుటినీ మూర్తి గారు ప్రచురించారు. 2006 మొదలుకుని, ఈనాటి దాకా, ఒక వైపు దేశదేశాల కవితలను తెలుగులోకి అనువాదం చేస్తూనే, మరో వంక మన తెలుగు కవితలను ఆంగ్లంలోకి కూడా అందుబాటులోకి తెస్తూ వచ్చారు.</p>
<p>ఇవన్నీ చెప్పడమెందుకంటే, ఈ అనువాదకులు స్వయంగా కవి. విస్తృతంగా చదివిన పాఠకులు. ఏ పదం పరసువేది మాదిరి వచనాన్ని కవిత్వంలా మార్చి వెలుగులీనేలా చెయ్యగలదో తెలిసిన వ్యక్తి. ఏ కవిత సామాన్యమైన ప్రతీకలతో, ముతక వాసన కొడుతోందో అనాయాసంగా పసిగట్టగల మనిషి. ఈ సునిశితమైన గమనింపులతో పాటు, వారికి స్వతఃసిద్ధంగా ఉన్న కథనశక్తీ, కవితాత్మకత, అనువాదాలు చెయ్యడంలో సహజదక్షతగా పరిణమించాయని నా అనుకోలు. బహుశా ఈ కారణానికే ఈ సంకలనంలో ఎంచుకున్న కవితల్లో విస్తృతమైన వైవిధ్యం కనపడుతుంది. సామాన్యంగా, కవితా సంకలనాలకు ఉండేట్టు, ఈ సంకలనానికి ప్రత్యేకమైన లక్ష్యమంటూ ఏమీ లేదు. సామాజిక సమస్యలనో, ఉద్యమాలనో, లేదా ప్రత్యేకించి ఒక వస్తువనో &#8211; ఏ విధమైన పరిమితులనూ ఇది విధించుకోలేదు. మంచి కవిత్వమవ్వడమొక్కటే ఇక్కడ ఎంపికకు ప్రామాణికంగా తీసుకోబడింది. అలా ఒకటీ, రెండూ కావు, 89 విభిన్నమైన గళాల నుండి వెలువడ్డ 199 కవితా స్వరాలను ఒక్కచోట కూర్చి పరిచయం చేసిన పుస్తకమిది. ఇందులో తెలుగులో ప్రస్తుతం విరివిగా రాస్తోన్న కవులున్నారు. ఈ పుస్తకంలో ప్రచురింపబడ్డదొక్కటే కవితగా రాసిన వారూ ఉన్నారు. ఆయా కవుల నేపథ్యాలు వేరు, వారి వయసులు వేరు, కవితా వస్తువుల పట్లా, కవిత్వం పట్లా వాళ్ళ వైఖరులు వేరు, కనుకే శైలిపరమైన మార్పులు కూడా మనకు ఈ అనువాదాల్లో తెలుస్తూ ఉంటాయి. సామాజిక మధ్యమాలూ , పత్రికల్లో ప్రచురణలూ, ప్రచారాలూ ఇప్పటి స్థాయిలో లేనందువల్ల కవులుగా రావలసినంత పేరు రాని ముందు తరం కవులూ కొందరున్నారు. ఈ పుస్తకంలో వదిలిన జాడల ననుసరించి, ఆ కవుల ప్రస్థానాన్ని గమనించేందుకు ఆఖరు పేజీల్లో అవకాశమిచ్చారు మూర్తిగారు.</p>
<p>మనం ఎందరెందరివో అనువాదాలు చదువుతూ ఉంటాం. కానీ, ఆలోచించి చూడండి, కవిత ఎప్పుడూ మూలకవి పేరు మీదుగానే గుర్తుంచుకోబడుతుంది. (చలం గీతాంజలి లాంటి అరుదైన మినహాయింపులను పక్కన పెడితే). మనం ఏ భాషలో చదివినా, ఫ్రాస్ట్ కవితలనే అంటాం, కీట్స్ కవితలంటాం, రిల్కే కవితలంటాం, సుబ్రహ్మణ భారతి కవితలంటాం, వాల్మీకి రామాయణమంటాం ..ఇలా, మూలం వ్రాసిన కవి ముద్ర అంత తేలిగ్గా చెరపగలిగినది కాదు. ఇది అనువాదకులు ఎదుర్కొనే మొదటి సవాలు. ఇది గాక, రెండు భాషలు క్షుణ్ణంగా తెలిసి, పదాలనూ, అవి వాచ్యంగానో సూచ్యంగానో చెప్పే వివరాలనూ, అన్నింటికీ మించి కవి అంతరంగాన్నీ పట్టుకుంటూ, మూలంలోని వేగాన్నీ, లయనూ జారనీయకుండా కవితను పూర్తి చేసి మెప్పించడం రెండవ సవాలు. బహుళ ప్రాచుర్యం పొందిన కవితలను, అదే స్థాయిలో, అనువదించబడ్డ భాషలోని పాఠకులకు చేరవేయలేకపోవడం, కవిత్వంలోని మార్మికత వల్ల సైద్ధాంతికంగా కవితను అర్థం చేసుకోవడంలో పొరబాటు పడి మరొకలా అనువదించడమూ, తదితర చిన్నాచితకా సమస్యలూ మామూలే.</p>
<p>ప్రతి భాషలోనూ ఆ భాషకు మాత్రమే సొంతమైన విరుపులు, పిలుపులూ కొన్ని ఉంటాయి. అవి ఆ ప్రాంతీయుల మాటల్లో, ఆ ప్రాంతీయ భాషలో, యాసలో వెలిగినట్టు, అనువాదంలో మెరవవు. ఉదాహరణకి ఈ పుస్తకంలో పొందుపరచిన ఒకానొక నందకిశోర్ కవితకి మూలం చూడండి.</p>
<blockquote>
<p style="text-align: left;">&#8220;ఇగ ముసుర్లు పడ్తుంటె సూడాలె&#8230;<br />
నీ యవ్వ!<br />
నిలుసున్న పండుకున్న<br />
ఉరుస్తుంటే తడుసుడేనాయె&#8221;.</p>
</blockquote>
<p>దానికి మూర్తి గారి అనువాదం ఇదీ:</p>
<blockquote><p>&#8220;One should only witness skies emptying!<br />
Tut!<br />
No matter whether you stand or sleep,<br />
You cannot avoid getting wet.&#8221;</p></blockquote>
<p>అచ్చమైన తెలగాణా మాండలీకంలో రాయబడ్డ ఈ కవిత అనువాదంలో, భావం చేరుతోంది కానీ, కవి గొంతులోని విసురు, కేవలం ఆ ధ్వని ద్వారా మాత్రమే సాధించగల ఉద్వేగం, మాయమైపోతోంది. ఇదే యాసతో అనువాదంలో ఉన్న ఇబ్బంది. అలాగే, కొన్ని జాతీయాలను మనం అనువాదం చేసినా మూలంలో ఉన్న సొంపు అనువాదంలో కనపడదు. అనువాదంలో ఆ జాతీయాల తాలూకు క్లుప్తతను సాధించడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. ఏ పదం వాడినా కొన్ని సార్లు మూలంలో కొట్టొచ్చినట్టు కనపడే సౌందర్యం అనువాదంలో అంది రాదు. ఒక పదానికి నాలుగు పదాలు వాడాల్సి రావడమూ తప్పకపోవచ్చు కొన్నిసార్లు, అలా, భావం కోసం లయను త్యాగం చెయ్యడం సైతం తప్పనిసరి కావచ్చు. ఇవన్నీ సర్వసాధారణమైన సమస్యలు, ఈ పుస్తకంలో కూడా ఉన్న సమస్యలు. ఈ కారణాలకు సంబంధించిన విమర్శలను ఏ అనువాద పుస్తకమూ బహుశా దాటలేకపోవచ్చు. తమ కవితలను తామే అనువాదం చేసుకున్న బెంగాలీ కవులైన జీబనానంద దాస్ (బనలతాసేన్ కవిత), టాగోర్ (గీతాంజలి, ద గార్డెనెర్) కూడా ఈ విమర్శలకు అతీతులు కారు. ఈ పరిమితుల పట్ల సమగ్రావగాహన ఉన్నది కనుకే, టాగోర్ లాంటి కవి, <a href="http://www.spiritualbee.com/media/tagore-love-poems.pdf" target="_blank">The Gardener</a> అన్న తన అనువాద కవిత్వ సంపుటికి రాసుకున్న ముందు మాటలో, ఆ అనువాదాలు అన్ని చోట్లా మూలానికి యథాతథానువాదాలు కావనీ, కొన్ని చోట్ల సంక్షిప్తపరచాననీ, కొన్ని సార్లు సవివరంగా రాసాననీ ఒప్పుకుంటారు. ఇది అనివార్యమైన పరిస్థితి.</p>
<p>వీటన్నింటినీ సాధ్యమైనంతగా దాటుకుంటూ వచ్చిన ఈ &#8220;<a href="http://www.amazon.in/Wakes-Horizon-Selection-Translated-Telugu/dp/0997736305" target="_blank">Wakes on the Horizon</a>&#8221; పుస్తకంలో నేను పైన చెప్పినట్టు, ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని ఆదూరి సత్యవతీదేవి వారి వంటి కవితలు ఉన్నాయి.చాలా కవితల్లో గురితప్పని బాణాల్లా వాక్యాల్లో వచ్చి కుదురుకున్న పదాలు అనువాదకులు మూలకవిత్వంతో మమేకమైన తీరుకి నిరూపణగా నిలుస్తాయి. ముఖ్యంగా, &#8220;Your Chariot (Viswanatha Satyanarayana; page:15)&#8221;, &#8220;One Midnight at SanFrancisco (Afsar; page-15)&#8221;, &#8220;The Liberated Lymph (Manasa Chamarti, page:252) &#8221; వంటి కవితలని గమనించినప్పుడు, శిల్పాన్ని అన్ని కవితల్లోనూ మూలానికి నిబద్ధంగా ఉండేలా మలచడమూ తెలుస్తుంది.</p>
<p>ఎలనాగ గారు &#8220;పొరుగు వెన్నెల&#8221; పేరుతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల కవిత్వాలను తెలుగులోకి అనువాదం చేశారు. ముకుంద రామారావు గారు దేశదేశాల కవిత్వాన్నీ మనముందుంచారు. &#8216;పొరుగు నుండి తెలుగులోకి&#8217; అంటూ ఒక ఉదాత్తమైన లక్ష్యంతో ఎమెస్కో వారు వాడ్రేవు చినవీరభదుడితో మత్సువో బషో హైకూలను అనువాదం చేయించి మన దోసిట పెట్టారు. ఇవన్నీ ఏ రకమైన సాహిత్య ప్రయోజనాలతో మన ముందుకొచ్చాయో, ఈ Wakes on the Horizon అదే సదుద్దేశ్యంతో మన ముందుకొచ్చింది. మన జాతీయాలు, సామెతలు, విరుపులు,పిలుపులు, బాంధవ్యాలు, వ్యవస్థా వ్యాకరణమూ &#8211; ఇవన్నీ కవిత్వంలో ఒదిగే చిత్రమైన తీరుని, మన పొరుగు వారికీ, మన స్నేహితులకీ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవిత్వం మీద ఆసక్తి ఉన్న మన సాహితీ మిత్రులందరికీ, &#8220;మా గొంతు ఇదీ&#8221; అని చెప్పుకు చూపించుకునేందుకు అవకాశమిచ్చిన పుస్తకమిది. నానాటికీ కుంచించుకుపోతున్న ప్రపంచపటం మీద, ఈ తూరుపు వాకిట చేతులెత్తి ఎత్తుకు చూపించి మరీ, ఇతర భాషలతో స్నేహపూరితమైన స్పర్ధకీ, చర్చకీ సిద్ధమని చాటేందుకు తావిచ్చిన పుస్తకం. ఇతర భాషలను చదవడానికి మనకుండే కారణాలూ, ఇతరులు మన భాషను గుర్తించి చదివి చర్చించాలనుకోవడానికి మనకున్న కారణాలూ &#8211; ఎన్ని రకాలుగా భిన్నమో, ఎన్ని ఆసక్తికరమైన కారణాలకు భిన్నమో మనం పునరాలోచించుకునేలా చేసిన ఈ పుస్తకం, సాహిత్య అనువాదాల అవసరం గురించీ, వాటి అధ్యయనం గురించి, ఆ దిశగా మనకున్న అవకాశాల గురించీ ఎన్నో ప్రశ్నలను మన ముందుంచుతుంది.</p>
<p style="text-align: center;">***</p>
</div>
<p>పుస్తకం వివరాలు:</p>
<p>Wakes on the Horizon: A Selection of Poems Translated from Telugu by N. S. Murty</p>
<p>Publisher: Vaakili</p>
<p>For Copies:<br />
1. Vanguri Foundation. (vangurifoundationATgmail.com)<br />
2. <a href="http://www.amazon.in/Wakes-Horizon-Selection-Translated-Telugu/dp/0997736305" target="_blank">Amazon</a></p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14530</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>కథాయణం ప్లస్ నాగరికథ=నాగరికథాయణం</title>
		<link>http://vaakili.com/patrika/?p=14552</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14552#comments</comments>
		<pubDate>Sat, 01 Jul 2017 02:04:56 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[టి. చంద్రశేఖర రెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14552</guid>
		<description><![CDATA[ఈ సమీక్షావ్యాసం అనిల్ ఎస్. రాయల్ గారి కథాసంపుటి, ‘నాగరికథ’ మీద రాసింది.

సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. ఒక కథ స్వేచ్ఛానువాదం. మూల కథ All You Zombies. రచయిత రాబర్ట్ ఎ. హెయిన్లిన్.  మిగిలిన కథలు వివిధ]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఉ</span>పోద్ఘాతం:</p>
<p>ఈ సమీక్షావ్యాసం అనిల్ ఎస్. రాయల్ గారి కథాసంపుటి, ‘నాగరికథ’ మీద రాసింది.</p>
<p>సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. ఒక కథ స్వేచ్ఛానువాదం. మూల కథ All You Zombies. రచయిత రాబర్ట్ ఎ. హెయిన్లిన్.  మిగిలిన కథలు వివిధ తెలుగు పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురించబడ్డాయి.</p>
<p>ఈ కథల రచయితదే ఆగస్ట్ 2015లోనే  ‘కథాయణం’ అనే వ్యాససంపుటి వెలువడింది. ఇందులో వ్యాసాలన్నీ ‘కథలు రాయటంలో మెళకువలు’  వివరిస్తూ రాసినవి. ఈ వ్యాససంపుటికి కొనసాగింపుగా కథన కుతూహలం పేరుతో ఇదే రచయిత రాసిన వ్యాసాలతో మరో శీర్షిక ఒక అంతర్జాలపత్రికలో మొదలైంది. మొదటి భాగంగా కథల్లో క్లుప్తత ఎందుకు?ఎలా సాధించాలి? అన్న ఒక వ్యాసం 17.12.2015 తేదీన వెలుగు చూసింది.</p>
<p>ఈ వ్యాసాల్లో ఉన్న సూచనలను ఇతర రచయితల కథలకు, అన్వయించి చూశాను. రెండిటి మధ్యా  పొంతన చాలావరకూ లేదనిపించింది. దాంతో కథాయణంలోనూ-కథనకుతూహలంలోనూ ఉన్న సూచనల ప్రకారం మిగిలిన రచయితల కథలు ఎందుకు లేవు? వాటి ప్రకారం రాసిన కథలు చదివించలేవని ఆ రచయితలు అలా రాయలేదా? లేక వాటి ప్రకారం కథలు రాయటం కష్టమైన పనా? అన్న అనుమానం వచ్చింది. ఆ పెనుభూతాన్ని తరమడం కోసం; ఈ వ్యాసాలను రాసిన రచయిత తాను ఇచ్చిన సూచనల్ని తాను రాసిన కథల్లో ఎంతవరకు, ఎలా పాటించారో తెలుసుకోవాలనిపించింది. అదే ఈ వ్యాసరచనకు ప్రేరణ.</p>
<p>కథాయణాన్ని నాగరికథలో కథలకీ-నాగరికథలో కథలని కథాయణంలో వ్యాసాలకీ  అన్వయించి రాయడం వల్ల ఈ వ్యాసం- ఒక రకంగా చూస్తే ఒక పుస్తకం మీద కాదు-రెండు పుస్తకాల మీద సమీక్ష.</p>
<p>వ్యాసంలో ఎర్రరంగులో ఉన్న వాక్యాలన్నీ కథాయణంలో వ్యాసరచయిత ఇచ్చిన సూచనలు. నలుపురంగులో ఉన్న వ్యాసభాగాలన్నీ సూచనల ఆధారంగా నాగరికథ కథలపై నేను చేసిన పరిశీలనలు.</p>
<p align="center"><strong>కథ</strong><strong> </strong><strong>శీర్షిక</strong><strong> </strong><strong>మీద</strong><strong> </strong><strong>కథాయణంలో</strong><strong> </strong><strong>ఇచ్చిన</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>నాగరికథలో</strong><strong> </strong><strong>అవి</strong><strong> </strong><strong>అమలయిన</strong><strong> </strong><strong>విధానం</strong></p>
<p><span style="color: #ff0000;">1. కథల విషయంలో శీర్షిక వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది.</span></p>
<p>నాగరికథ-కథ ఒక నాగరికత ఎలా అంతమైందో శాస్త్రీయంగా తెల్సుకోటానికి చేసిన ఒక ఊహ. ఈ కథ పేరును  నాగరికత అనో, అదే పదాన్ని నాగరి’కత’ గా చిన్న మార్పుతో రాసో, ‘కత’ ఇతివృత్తం నాగరికత అని అన్యాపదేశంగా తెలియచేయొచ్చు. అయితే కత కన్నా కథ ఎక్కువ వాడకంలో ఉన్న పదం. అందుకని, నాగరి’కత’ లో ‘కత’ ని, ‘కథ’ గా రాస్తే  ‘నాగరికథ’ అయింది. కథకి విభిన్నమైన టైటిల్ అమరింది.</p>
<p><span style="color: #ff0000;">2. శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది.</span></p>
<p>శీర్షిక రెండు విరుద్ధ పదాల మేళవింపు అయితే వెంటనే ఆకట్టుకుంటుంది.  వడ్డెర చండీదాస్ గారి నవల ‘హిమజ్వాల’ వెంటనే గుర్తొచ్చే ఒక ఉదాహరణ. ఈ సంపుటిలో ఒక కథకి పెట్టిన ప్రియశత్రువు అనే పేరు సైతం అలాంటి  మేళవింపు. కథలో ప్రధాన పాత్ర పేరు ‘ప్రియ’. శీర్షికలో ఆ పేరు ఇమడటంతో  కథాంశం ప్రతిఫలించింది.</p>
<p><span style="color: #ff0000;">3. కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే మంచిది.</span></p>
<p>మరో ప్రపంచం కథ,  పారలల్ యూనివర్సెస్ గురించి. తెలుగులో ఆ కథకి పెట్టిన పేరు ఆ ఇతివృత్తాన్ని  సూచించింది. అలానే మిగిలిన రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, మరపురాని కథ-కథల  పేర్లు కూడా.</p>
<p><span style="color: #ff0000;">4. శీర్షిక చూడగానే, అర్థమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి.</span></p>
<p>కుంతీకుమారి కథ, మహాభారతంలో కుంతీదేవిలానే కుమారిగానే తల్లిగా మారిన ఒక స్త్రీ కథ.  కనుక ఈ కథకి  ‘కుంతీదేవి’ అని పేరు పెట్టొచ్చు. అప్పుడు, కథ పెళ్లికి ముందే తల్లి అయిన ఒక స్త్రీ గురించి అనుకొని పాఠకులు ప్రక్కన పడేసేయొచ్చు. కుంతీకుమారి అని కథకి పేరు పెడితే, కుంతికి పుట్టిన కుమారి కథలో పాత్ర అనుకొని; మహాభారతంలో కుంతికి పుట్టింది కర్ణుడు-కుంతికి కొడుకు కాకుండా కూతురు పుట్టటమేమిటి? అన్న ఆలోచనతో కథలోకి పాఠకుడు ఆకర్షించబడొచ్చు. మహాభారతంలో కుంతీదేవి పెళ్లి కాకముందే తల్లి అయింది. కుంతీకుమారి కథలో, ప్రధానపాత్ర తల్లి అయినా కుమారిగానే మిగిలిపోయింది. ఆ దృష్ట్యా కథకి పెట్టిన పేరు, కథాంశాన్ని స్పృశించింది.</p>
<p><span style="color: #ff0000;">5. చాలా మంది ఔత్సాహిక కథకులు చేసే పొరపాటు:  కథలో ప్రధాన పాత్ర పేరునే కథ పేరుగా ఎంచుకోవటం.</span></p>
<p>నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఒక్క కల్కి కథకే, కథలో ప్రధానపాత్ర పేరు కథ పేరుగా ఉంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కథారచయిత తనకు తానే తన కథాయణంలో వివరణ ఇచ్చారు.</p>
<p><span style="color: #ff0000;">6. చప్పగా, సర్వ సాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం. ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంత వరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు.  </span></p>
<p>నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఏ కథకీ సామెతలు పేర్లుగా లేవు. నాకు తెలిసి కథలకి పెట్టిన పేర్లు  ప్రసిధ్ధకథల పేర్లు, ఇతర ప్రసిద్ధ సాహితీ ప్రక్రియల పేర్లు కూడా కావు.</p>
<p><span style="color: #ff0000;">7. కథ పేరు ఎంత పెద్దదిగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం.</span></p>
<p>నాగరికథ-లో ఉన్న కథల్లో; అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలు, రెండు పదాలు ఉన్న పేరు-‘మరపురాని కథ’.  మిగిలిన తొమ్మిది కథల్లో, ఆరు కథలకు ఒక పదమే పేరు. మిగిలిన మూడిటికీ ఒక పదబంధం శీర్షిక.</p>
<p><span style="color: #ff0000;">కొసమెరుపు:</span></p>
<p>8. నాగరికథ కథాసంకలనంలో ఉన్న పది కథల్లో అయిదు కథల పేర్లు అంతకుముందే కొన్ని సినిమాలకు పేర్లుగా వాడబడ్డాయి. రహస్యం (1967), మరపురాని కథ (1967)), మరో ప్రపంచం (1970), శిక్ష (1985), కల్కి (1997) ఆ కథలు ప్రచురించబడటానికి ముందే విడుదలైన తెలుగు చలనచిత్రాల పేర్లు. ఇది యాదృచ్ఛికం కావచ్చు-కాని గమనార్హం. కుంతీపుత్రుడు అనే తెలుగు సినిమా 1993 లో విడుదలైంది.  కథల సంపుటిలో ఒక కథకి పెట్టిన కుంతీకుమారి పేరు అలానే ధ్వనించే పదబంధం. ప్రళయం కథ 2013 లో ప్రచురించబడింది. అదే పేరుతో 2015 లో ఒక తెలుగు సినిమా విడుదలైంది. చిత్రంగా రీబూట్ కంప్యూటర్ కే కాదు చలనచిత్రరంగానికి కూడా చెందిన ప్రక్రియ.</p>
<p align="center"><strong>కథ</strong><strong> </strong><strong>ఎత్తుగడ</strong><strong> </strong><strong>పై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1. అత్యవసరమైతే తప్ప కథని వర్ణనలతో మొదలు పెట్టను. అత్యవసరమైనా కూడా కథని సర్వసాధారణమైన సన్నివేశంతో మొదలు పెట్టను.</span></p>
<p>కథల సంపుటిలో శిక్ష కథ  ఒకటే వర్ణనతో మొదలైంది. దానికి కారణం కథాయణంలో కథారచయిత తనకు తానే వివరించారు.  నాగరికథ, మరో ప్రపంచం, కల్కి,  ప్రియశత్రువు కథలు ఒక సంభాషణతో ఆరంభమయ్యాయి. ప్రళయం కథ ఒక గమనికతో, మరపురాని కథ ఒక భౌతిక చర్యతో మొదలయింది. రీబూట్, రహస్యం కథలు ఒక స్టేట్ మెంట్ తో ప్రారంభించబడ్డాయి. కుంతీకుమారి అనువాదకథ. దాని ఎత్తుగడ మీద అనువాదకుడికి స్వేచ్ఛ లేదు.</p>
<p><span style="color: #ff0000;">2. మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వీలైతే మూడు నాలుగు లైన్లకు మించకుండా. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది.  ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి చదవబోయే కథపై ఉత్సుకత కలిగించాలి.</span></p>
<p>ఒక్క నాగరికథ కథ మాత్రమే ఏడు లైన్లతో మొదలయింది. మరో ప్రపంచం, రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, కుంతీ కుమారి కథలు రెండు లైన్లతోనూ; కల్కి, ప్రియశత్రువు, మరపురాని కథ ఒక లైనుతోనూ మొదలయ్యాయి. ఎత్తుగడతో ఉత్సుకత ఎలా కలిగించవచ్చో అన్నదానికి, నాగరికథ కథ మొదలే ఒక ఉదాహరణ. కల్కి కథ అయితే మరీ క్లుప్తంగా రెండు పదాల్తోనే పాఠకుడ్ని కథలోకి లాక్కు వెళుతుంది. ఆ రెండు పదాలూ “ఇద్దర్ని చంపాలి.”</p>
<p align="center"><strong>కథ</strong><strong> </strong><strong>ముగింపుపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1.A. ఎత్తుగడ భాగంలో, ‘కథని ఎలా మొదలెట్టినా ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అన్న సూచన ఉంది. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి అని చెప్పబడింది. </span></p>
<p><span style="color: #ff0000;">1.B. అవి అరటిపండు వొలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెతుక్కోవటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి. </span></p>
<p>ఉదాహరణకు-నాగరికథ కథ తీసుకుందాం. దీనిలో ఇతివృత్తం టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణం చేయడం గురించి. హైస్కూలు విద్యార్థులకు ఓ అణుశాస్త్రవేత్త ఆ విషయంపై ఇస్తున్న గెస్ట్ లెక్చర్ తో కథ మొదలవుతుంది.  ఒక తాత గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కాలంలో వెనక్కెళ్లి ఆయన్ను చంపెయ్యడం గురించి  కథ మొదటి పేరాలో ప్రస్తావన ఉంటుంది. కాలయంత్రం ద్వారా కాలప్రయాణం  గురించి  పాఠం చెపుతున్న అణుశాస్త్రవేత్తకి వాళ్ల తాతగారి గురించి సెల్ ఫోన్ ద్వారా ఒక వార్త వస్తుంది. క్లాసు అర్ధాంతరంగా ఆగిపోతుంది. తాతయ్య దగ్గరకి హడావిడిగా మనవడి ప్రయాణం మొదలవుతుంది. దీంతో పాఠకుడిలో టైమ్ మెషీన్ గురించీ, అందులో వెనక్కి వెళ్లడం గురించీ, దాంతో పాటు తాతయ్య గురించి వచ్చిన వార్త ఏమిటనే దాని మీదా ప్రశ్నలు మొదలవుతాయి.</p>
<p>ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకుడు తప్పనిసరిగా మిగిలిన కథలోకి వెళతాడు. కథనంలో టైమ్ మెషీన్ ఉందా? లేదా? ఉంటే ఎలా తయారయింది? దాన్ని ఎవరు తయారు చేశారు? అందులో కాలంలో ఎవరైనా వెనక్కి ప్రయాణం చేశారా? వెళ్లింది ఎలా? వెళ్లింది ఎవరు? ఆ ప్రయాణఫలితం ఏంటి? అనే దాని మీద తగినంత సమాచారం ఒక దాని తర్వాత ఒకటి కథకుడు అందిస్తాడు.</p>
<p>ఈ ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు కథలో నేరుగా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి అవసరమైన ఆధారాలు కథలో ఉంటాయి. ప్రత్యక్షపద్ధతిలో తెలిసినవాటిని మనవడు నమ్మడు. కాని నమ్మక తప్పదు. పరోక్షంగా తెలిసిన వాటిని మనవడు నమ్ముతాడో లేదో రచయిత స్పష్టంగా చెప్పడు.  నమ్మాలో వద్దో విశ్లేషించి తెలుసుకోవాల్సింది మనవడూ, అతడితో పాటు మనమూ.</p>
<p><span style="color: #ff0000;">2. A. కథలకి రెండు రకాల ముగింపులుంటాయి. ప్రధానపాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ కథలకి వర్తిస్తుంది. </span></p>
<p><span style="color: #ff0000;">2.B. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధానపాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనావిధానంలో కలిగే పరిణతి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం&#8230;ఇలాంటి విషయంతో ముగుస్తాయి.   </span></p>
<p>నాగరికథ కథ పై రెండు వర్గాల్లో ఏ విభాగానికి చెందినది అనేది అప్రస్తుతం అనుకుంటే; ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో; లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం ఏమిటో; కథ ముగింపు చెప్పాలి.</p>
<p>ఈ కథలో ప్రధాన పాత్ర అణుశాస్త్రవేత్త. అతడిని వేధించే సమస్యా, పాఠకుడిని వేధించే ప్రశ్నల సారాంశం ఒకటే. సూచన 2-A ప్రకారం, ఆ పాత్ర తన సమస్యని పరిష్కరించుకోవటానికి ఆధారం, సూచన 1-B ప్రకారం ఇవ్వాల్సిన  సమాచారం. దాన్ని కథకుడు తాత ద్వారా, మనవడికి అందిస్తాడు. దాన్ని విశ్లేషించి మనవడు ఒక నిర్ధారణకి వస్తాడు. కాని, అదేంటో రచయిత పాఠకులకి చెప్పడు. దాన్ని కథ ముగింపిడికిట్లో పెట్టి, తెరిచి ఏముందో చూసే బాధ్యత పాఠకులకే వదిలేస్తాడు. అది సవ్యమా, సంభావ్యమా అన్నది ప్రశ్న. దానికిక్కడ జవాబు చెప్పటం భావ్యం కాదు.</p>
<p><span style="color: #ff0000;">3. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలో వదిలేస్తే కుదరదు.  కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి.  మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు.</span></p>
<p>నాగరికథ కథలో రచయిత కాడిని పాఠకులతో పాటు తాను కూడా మోసి కంచికి కూతవేటు దూరం దాకా  వచ్చాడు. ఊరు బయట తాను కాడిని వదిలేసి పాఠకులకి మిగిలిన ప్రయాణం ఎలా చెయ్యాలో, గమ్యస్థానం ఎలా చేరాలో చెప్పాడు. తమంతట తాము గమ్యం చేరిన తృప్తి కలగాలంటే ఆ కాస్త దూరం ప్రయాణించాల్సింది పాఠకులే.</p>
<p>కథ చివర్లో ప్రధానపాత్ర ఆలోచనాధోరణిలో ఏం మార్పు వచ్చిందో, ఇక్కడే చెప్పేస్తే, కథ ఇంకా చదవని పాఠకులకి కథ చదువుతున్నపుడు కలిగే ఉత్సుకత మిగలదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. కథకి ముగింపు ఇవ్వడం కోసం, రచయిత ప్రధాన పాత్ర స్వభావాన్ని పూర్తిగా మార్చేయనైతే మార్చేయలేదు.</p>
<p><span style="color: #ff0000;">4. ముగింపు ఎలా ఉండబోతోందో కథనిండా క్లూస్ వదులుతూనే, మరో వైపు పాఠకుడిని మాయచేసి పెడదారి పట్టిస్తూ, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే అసలు ఊహాతీతమైన  ముగింపు.</span></p>
<p>నాగరికథ కథలో మనవడికి కలిగిన అనుమానాల ద్వారా పాఠకులకు అలాంటి క్లూస్ అందాయి. అవి మనవడ్నే కాదు, పాఠకుల్ని కూడా పెడదారి పట్టిస్తాయి. చివర్లో కథ ముగింపు అసలు దారివైపు మళ్లుతుంది. అక్కడ ఏం ఎదురవుతుంది అనేది పాఠకులు ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.</p>
<p><span style="color: #ff0000;">తుది మాట:</span></p>
<p>మిగిలిన తొమ్మిది కథల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడాల్సింది పాఠకులే.</p>
<p align="center"><strong>కథన</strong><strong> </strong><strong>ధోరణులు</strong><strong>-</strong><strong>దృక్కోణం</strong><strong>-1 </strong><strong>లో</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p>              కథాయణం వ్యాససంకలనంలో దృక్కోణం-1, దృక్కోణం-2 అనే రెండు అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాల్లో కథని ఎన్ని ధోరణుల్లో చెప్పొచ్చు అనేది వివరించబడింది. అందులో మొదటి ధోరణి ‘ఉత్తమ పురుష’.</p>
<p>ఉత్తమపురుష కథనంలో కథకుడే స్వయంగా ఒక పాత్ర ధరించి ‘నేను’ రూపంలో కథ చెబుతాడు/చెబుతుంది. పాత్రలు అంతకన్నా ఎక్కువైతే ‘మేము’ కథ చెబుతారు. రచయిత స్వంత రచనలైన తొమ్మిది కథల్లో; రీబూట్, శిక్ష, మరపురాని కథ; కథలు తప్ప మిగిలిన ఆరు కథలూ ‘ఉత్తమపురుష’ లో చెప్పినవి.</p>
<p>వ్యాసంలో ‘ఉత్తమపురుష’ కథనం ఎలా సాగాలి అన్న విషయం మీద కొన్ని సూచనలు ఉన్నాయి.</p>
<p><span style="color: #ff0000;">1. ఉత్తమపురుషలో కథ చెప్పేప్పుడు ‘నేను’ అనబడే కథకుడు, తన గురించి తాను వర్ణించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ఆకార విశేషాల, వేషభాషల వివరణ కథనానికి అత్యంత అవసరమైతే తప్ప చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పరోక్షవర్ణనకి దిగటం మెరుగు (వేరే పాత్ర ద్వారా సంభాషణలో చెప్పించటం, అద్దంలో పరికించి చూసుకోవటం, వగైరా). </span></p>
<p>ఏడు కథల్లో, ‘ప్రియశత్రువు’ తప్ప; ఏ కథలోనూ ‘నేను’ గురించి వర్ణన లేదు. ‘ప్రియశత్రువు’ కథలో, తన కథ పాఠకులకు చెప్పే ‘నేను’ ప్రధాన పాత్ర.  ఆమె ఎలా ఉంటుంది? అనేది ఆ కథకు ఆయువుపట్టు.  ఆ దృష్ట్యా ఆ కథకి ఆ పాత్ర రూపురేఖల వర్ణన అత్యవసరమైంది. అయితే రచయిత ఆ పని నేరుగా చేయలేదు. పరోక్షమార్గంలో-డాక్టర్ లక్ష్మణ్ ద్వారా ప్రధాన పాత్ర కి అద్దం చూపించి ఆమె రూపురేఖలని వర్ణించాడు.</p>
<p>రహస్యం కథలో ప్రొఫెసర్ గురించి అన్ని వ్యక్తిగత/వృత్తిగత విషయాల్నీ (పేజీలు 70, 71) ‘నేను’-అనే ప్రధానపాత్ర పాఠకులకి తెలియపరుస్తుంది. అవి అతడికి సాధారణంగా తెలిసి ఉండకూడని విషయాలు. అతడికి ఎలా తెలుసు? అని పాఠకుడు ప్రశ్నించేలా చేసే విషయాలు. అందుకని, కథలో నేను ‘ఇదంతా నాకెలా తెలుసు?’ అని ప్రశ్నించుకుంటాడు. ‘నేనో ఇంటిలిజెన్స్ ఏజంట్ ని కాబట్టి.’ అని తనకి తానే జవాబిచ్చుకుంటాడు. అది అతడికే కాదు, ఆ అనుమానం వచ్చిన పాఠకులకు సైతం జవాబు.</p>
<p><span style="color: #ff0000;">2. ప్రధానపాత్రకి తెలిసిన విషయాలు, కథకి కీలకమైనవి, సస్పెన్స్ పోషించటానికో లేక ముగింపు దాకా పాఠకుల్ని మభ్యపెట్టటానికో ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టకూడదు.</span></p>
<p>కథ చెబుతున్న ‘నేను’ అనబడే వ్యక్తి పురుషుడా, మహిళా, చిన్నపిల్లవాడా, ముదుసలా&#8230; ఇటువంటి వివరాలు వీలైనంత త్వరగా పాఠకులకి చేరవేయాలి (ఆ వివరం దాచటం కథకి కీలకమైతే తప్ప).</p>
<p>నాగరికథ లో ‘నేను’ అనబడే అణుశాస్త్రవేత్త పురుషుడనేది ‘మనవడా’ అనే తాత పిలుపుతో తెలుస్తుంది. మరో ప్రపంచంలో ‘నేను’ పురుషుడా, స్త్రీ యా అనేది ‘నేను నాస్తికుడిని కాను’ అనటంతో,  కల్కి లో ‘భారతీయుడివి కాబట్టి’ అనటంతో, రహస్యంలో ‘అపరిచితుడికి’ అనుకోవటంతో, ప్రళయంలో ‘నేనొక్కడినే బతికున్నానా’ అనే స్వగతంతో, ప్రియశత్రువు లో ‘మిస్ ప్రియా’ అనే పిలుపుతో, కుంతీ కుమారిలో ‘సరిగా నా ఎత్తుంటాడు’ అనటంతో తెలుస్తుంది.</p>
<p>మరో ప్రపంచం కథలో, ‘నేను’ ఎవరనేది ఆలస్యంగా చెప్పబడ్డా, కథకి గీసిన బొమ్మ ఆ ‘నేను’ మగా ఆడా అనేది ముందే చెప్పేసింది. కల్కి, రహస్యం, ప్రళయం కథల విషయంలో కూడా అదే జరిగింది.</p>
<p>ప్రియశత్రువు కథకి గీసిన బొమ్మలో, ఇద్దరు స్త్రీల/ఒక పురుషుడి బొమ్మలు ఉన్నాయి. అందుకని ‘నేను’ ఎవరనేది చెప్పటంలో ఆలస్యాన్ని బొమ్మ సర్దుబాటు చేయలేకపోయింది.</p>
<p>రహస్యం, ప్రళయం కథల్లో ‘నేను’ ఎవరో చెప్పటంలో జరిగిన ఆలస్యానికి;   ఒక ‘ఇంటిలిజెన్స్ ఏజంట్’, ఒక ‘దొంగ’ మగ కాకుండా ఆడ అయి ఉంటారా? అన్న ప్రశ్న ఒక సమాధానం కావచ్చు. అది సహేతుకం కాదు.</p>
<p>B) ఉత్తమపురుష కథనంలో ‘మేము’ తరహా కథనం గురించి వ్యాసరచయిత చెప్పింది నిజమే! ఆ ధోరణిలో వచ్చిన తెలుగు కథ ఏదీ నేను కూడా చదవలేదు. సాహితీమిత్రులెవరైనా ‘మేము’ పరంగా రాయబడ్డ  కథ ఏదైనా తెలుగులో ఉంటే దాని వివరాలు తెలియపరిస్తే ఆ కథనం తో సాగిన కథలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు.</p>
<p align="center"><strong>కథన</strong><strong> </strong><strong>ధోరణులు</strong><strong>-</strong><strong>దృక్కోణం</strong><strong>-2 </strong><strong>లో</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p>              రెండో రకం కథనం మధ్యమపురుష.  ఉత్తమపురుష కథనంలో కథ ‘నేను’ పరంగా చెప్పబడితే; మధ్యమ పురుష కథనంలో కథ ‘నువ్వు’ పరంగా చెప్పబడుతుంది. వ్యాసంలో చెప్పినట్లు ఈ పద్ధతిలో రాసిన కథలు ఎక్కువగా మనకు ఎదురుపడవు. నాకు తెలిసి ఆ పద్ధతిలో చెప్పబడ్డ కథ వి. ప్రతిమ గారు రాసిన ‘విత్తనం’.</p>
<p>మిగిలిన మూడో రకం కథనం-ప్రథమపురుష. అందులో 1. పరిమిత ప్రథమపురుష 2. సర్వజ్ఞ ప్రథమపురుష 3. బాహ్య ప్రథమపురుష అని మూడు ధోరణులున్నాయి.</p>
<p>నాగరికథ కథాసంకలనంలో ఉన్న-రీబూట్, శిక్ష, మరపురాని కథ; ఈ మూడు ధోరణులనీ ఉపయోగించి రాసినవి. దాంతో తాను రాసిన తొమ్మిది కథల్లోనే,  ‘మధ్యమపురుష’ తప్ప మిగిలిన అన్ని ధోరణుల్లో రచయిత తన కథల్ని చెప్పినట్లైంది.</p>
<p><span style="color: #ff0000;">పరిమిత ప్రథమ పురుష:</span></p>
<p><span style="color: #ff0000;">1. ఈ ధోరణిలో ఒక పాత్ర (సాధారణంగా ప్రధాన పాత్ర) కోణానికి పరిమితమై కథ నడుస్తుంది.  </span></p>
<p>ఈ ధోరణిలో చెప్పబడ్డ కథ ‘రీబూట్’ లో ప్రధాన పాత్ర విక్రమాదిత్య. కథని జాగ్రత్తగా చదివితే కథ మొత్తం ఈ పాత్ర ఆధారంగా నడవటం గమనించవచ్చు.</p>
<p><span style="color: #ff0000;">2. ఈ తరహా కథనంలో -ప్రధానపాత్ర బుర్రలో బంధించబడకపోవటం వలన, ఆ పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు కూడా, పరిమిత స్థాయిలో కథకుడికి తెలుస్తూ ఉంటాయి. ఆ వివరాలు అవసరమైనప్పుడు బయటపెడుతూ, అవసరం లేదనుకున్నప్పుడు తొక్కిపడుతూ కథనంలో ఉత్కంఠ నింపుతాడు రచయిత. </span></p>
<p>రీబూట్ కథలోకి ఐజక్ పాత్ర ప్రవేశించటానికి ముందు 54, 55 పేజీల్లో ఉన్న సమాచారమూ, కేథరిన్ పాత్ర ప్రవేశం జరిగిన తర్వాత ఆమెతో విక్రమాదిత్య 55 నుంచి 60 వ పేజీ వరకూ ప్రస్తావించిన వివరాలూ; కథకుడు విక్రమాదిత్య పాత్ర ద్వారా అవసరాన్ని బట్టి బయట పెట్టినవే.</p>
<p><span style="color: #ff0000;">సర్వజ్ఞ ప్రథమ పురుష:</span></p>
<p><span style="color: #ff0000;">3. ఈ విధానంలో-కథకుడు ఓ సర్వజ్ఞుడిలా వ్యవహరిస్తాడు. తన కథాపరిధిలో, తాను సృష్టించిన ఊహాలోకంలో, ఎక్కడ ఏమి జరుగుతుందో అన్నీ అతడికి తెలుస్తాయి.</span></p>
<p>శిక్ష-కథ, సర్వజ్ఞ ప్రథమపురుష విధానంలో రాసిన కథ. కథాస్థలం-బండరెడ్డి పోలీసుజీపులో నుంచి గమ్యం చేర్చే వాహనంలోకి ఎక్కించబడేంత వరకూ. కథలో సమాంతరంగా చిత్రించబడ్డ ఊహాలోకం పరిధి, శివారు గ్రామం నుంచి బండరెడ్డి చేరాల్సిన చోటు లోపలి వరకూ. అందులో ఏం జరుగుతోందీ రచయితకి తెలుస్తోంది. అవన్నీ కథకుడు కళ్లకు కట్టినట్లు వర్ణించగలగటానికి కారణం అదే.</p>
<p><span style="color: #ff0000;">4. ఈ తరహా కథనంలో ఏ పాత్ర మదిలో ఏముందో కూడా కథకుడికి తెలుస్తుంది. ఇక్కడ అతడు ఏ పాత్ర పక్షమూ వహించడు. కథ ఏదో ఒక పాత్ర కోణంనుండి మాత్రమే చెప్పడు. అతడికి అందరూ సమానమే.</span></p>
<p>అందువల్లే కథలో; రకరకాల వ్యక్తులు, ప్రేమజంటతో సహా కథకుడికి ఎదురవుతారు. వాళ్ల మనసులో ఏముందో కూడా  తెలుస్తుంది. అందుకే వాళ్లెలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది చెప్పగలుగుతాడు.</p>
<p><span style="color: #ff0000;">5. ఈ ధోరణిలో చెప్పిన కథల్లో కథకుడికి, పరిమితులు, హద్దులు ఉండవు. అతడు అన్ని ప్రదేశాల్లోనూ, అందరి మనసుల్లోనూ ఏక కాలంలో ఉండగలిగే సర్వేశ్వరుడి వంటివాడు.</span></p>
<p>కథకుడికి పరిమితులూ, హద్దులూ లేని మాట కూడా వాస్తవమే.  అందుకే కథలో డ్రైవరూ, మేజరూ ఏం మాట్లాడుకుంటున్నదీ, చనిపోయిన శ్రీను గురించి బండరెడ్డి ఏం ఆలోచిస్తున్నదీ, శ్రీను ఉరి తీసుకున్న  సంఘటనపై ఎలా ఆందోళన జరిగిందీ, అది ఎలా సమసిపోయిందీ, సంబంధిత మంత్రి ఏమనుకుంటోందీ, సీనియరు మోస్ట్ చకోర పక్షి మనసులో ఏముందీ అన్నీ కథకుడు గ్రహించగలడు. కూలంకషంగా పాఠకుడికి వినిపించగలడు.</p>
<p><span style="color: #ff0000;">6. ఈ విధానంలో కథ రాసినప్పుడు ఒక పాత్ర కోణం నుండి మరో పాత్ర కోణానికి మారే క్రమంలో జాగరూకత వహించక పోతే, Head Hopping అనే తలతిరుగుడు సమస్య వచ్చి పడుతుంది.</span></p>
<p>సూచనలో చెప్పిన జాగ్రత్త పాటించటానికే, కథలో ఒక బండరెడ్డిని మినహాయించి మిగిలిన ఏ పాత్ర గురించీ రచయిత ఎక్కువగా చిత్రీకరించడు. కథాక్రమంలో వాళ్లు కనపడ్డపుడు వాళ్ల గురించి భౌతికంగా, మానసికంగా తనకి ఏం తెలిసిందో, తెలుస్తున్నదో అంతవరకే చెప్పి వదిలేస్తాడు. అలాంటి పాత్రలకి కథలో పునఃప్రవేశం కల్పించే ప్రయత్నం సుతరామూ చేయడు. దానికి నిదర్శనం ప్రేమికుల జంటా, పోలీసుజీపు ప్రస్తావన వచ్చినప్పుడు కనపడ్డ జీపు డ్రైవరూ, కానిస్టేబులూ; కథలో తర్వాత కలికానిక్కూడా కనపడకపోవటం.</p>
<p><span style="color: #ff0000;">బాహ్య ప్రథమ పురుష:</span></p>
<p><span style="color: #ff0000;">7. ఈ పద్ధతిలోనూ కథకుడు సర్వజ్ఞుడే. అతడికి తెలియని విషయాలుండవు. కాకపోతే, వాటిని మన కళ్లకి కట్టే క్రమంలో అత్యంత సంయమనం పాటిస్తాడు. ఏ పాత్ర పట్లా పక్షపాతం చూపించడు. ఎవరి మనసుల్లోకీ తొంగిచూడడు. అందరికీ సమాన దూరంలో నిలబడి చూసింది చూసినట్లు మనకి చెప్పుకుపోతాడు. పాత్రల చర్యలకి, ప్రతిచర్యలకి ఉద్దేశాలు ఆపాదించడు. విలువలు కట్టడు. తీర్పులీయడు. జరిగిందిది. దీన్నెలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం-అంటూ పాత్రల చేతల్ని అంచనా వేసే భారం పాఠకుల పైకే నెట్టేస్తాడు.</span></p>
<p>మరపురాని కథ- బాహ్య ప్రథమపురుష విధానంలో రాయబడ్డ కథ. కథలో ఉన్నవి ముచ్చటగా మూడే మూడు పాత్రలు. వృద్ధుడూ, అతని భార్యా, యువకుడు. గోవా వనిత, యువకుడి భార్య గురించి సంబంధిత పాత్రలూ స్మరిస్తాయి. కాని, వాళ్లు కథలో ప్రత్యక్షమవ్వరు. వృద్ధుడి భార్య పాత్ర; కథ మొదట్లో కనపడి, ఆమె ఇంటికి యువకుడి రాకడతో నిష్క్రమించి, అతడు వెళ్లే సమయానికి పునఃప్రవేశం చేస్తుంది. ఆమె పోకడకీ, రాకడకీ మధ్య; వృద్ధుడికీ, యువకుడికీ మధ్య జరిగిన సంభాషణే కథకి ఆయువు పట్టు.  ముందుగా వృద్ధుడు ఏ గతసంఘటన తనను నిర్విరామంగా వేటాడుతున్నదీ యువకుడికి వివరిస్తాడు. ఆ తర్వాత యువకుడు తనని వెంటాడుతున్న సంఘటన గురించి చెప్పి దాంతో వృద్ధుడికేం సంబంధమో చెప్తాడు. ఈ క్రమంలో కథకుడు, జరిగిన దానికి ప్రత్యక్షసాక్షి అయినట్లు కథనం సాగిస్తూ, అంతవరకే పరిమితమవుతాడు. వృద్ధుడి మానసిక స్థితి పట్లా, యువకుడి సానుభూతి పట్లా మనకు ఒక అవగాహన కలిగించి, వాళ్ల పట్ల మనకు ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం అందించి, ఏం జరుగుతుందో జరగనీ అని నేపథ్యం నుంచి మనవైపు చూస్తుంటాడు. ఇలా అర్థం చేసుకో, అలా అపార్థం చేసుకోకు లాంటి సూచనలు మనకి అందించడు.  బాహ్య ప్రథమపురుష విధానంలో జరగాల్సింది అదే. కథకుడు జరిపిందీ అదే.</p>
<p><span style="color: #ff0000;">8. కథకుడు పాత్రల బుర్రల్లోకి ఎడాపెడా దూరేయకుండా వెలుపలే నిలబడి కథ చెబుతున్నాడు కాబట్టి ఇక్కడ Head Hopping సమస్య ఉండదు.</span></p>
<p>మరపురాని కథ-కథలో ఉన్నవి పైన చెప్పినట్లు మూడే పాత్రలు. వాటి ప్రవర్తన వాటి మనస్తత్వానికి అనుగుణంగా ఉంటుంది. రచయిత ప్రమేయం ఎక్కడా కనపడదు. అందుకే  Head Hopping సమస్యే ఉత్పన్నం కాదు.</p>
<p><span style="color: #ff0000;">9. రచయిత పాత్రల ఆలోచనల్ని ప్రత్యక్షంగా వెలిబుచ్చకుండా, వాటి చేతలు, శరీర భాష, సంభాషణ ద్వారా ఆయా పాత్రల చిత్రీకరణ చేస్తాడు. సన్నివేశాల రూపకల్పన, సంఘటనలు, వాటి వర్ణన ఇక్కడ కీలకమైనవి. అందువల్ల ఈ విధానంలో కథ చెప్పేటప్పుడు నాటకీయతకి పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. ఈ రకమైన కథని చెప్పటం కాదు, చూపటం ముఖ్యం.</span></p>
<p>మరపురాని కథ- కథ మొత్తంలో వృద్ధుడి వర్ణనకీ, యువకుడి పాత్రపోషణకీ వెరశి ఇద్దరి హావభావ వ్యక్తీకరణకి ఖచ్చితంగా అదే క్రమంలో కథకుడు వాడిన విశేషణాలని పరిశీలించండి. ఏడో పేరాలో చెప్పిన సంఘటనాక్రమాన్ని పాత్రపరంగా ఈ విశేషణాలకి అన్వయిస్తూ ముందుకు జరగండి.</p>
<p>మిగతా నేరేషన్ అంతా చదవకుండానే; కథ మొదలైనపుడు వాళ్ళిద్దరూ  ఏ మానసిక స్థితిలో ఉన్నారు, ఏ స్థితినుంచి ఏ స్థితికి స్విచ్ ఓవర్ అయ్యారు, తమ తమ నేరేషన్ ముగిసేసరికి ఏ దశలో ఉన్నారు అనేది కళ్లకు కట్టినట్లు మనముందు ప్రత్యక్షమవుతుంది. అలాగే  పాత్రల మధ్య సంభాషణ కొనసాగిన విధానం, ఎదుటిపాత్ర ప్రతిస్పందన కూడా కనపడతాయి. 127, 128 వ పేజీలో వృద్ధుడి నేరేషన్, 129 పేజీలో యువకుడి నేరేషన్ నిశిత దృష్టితో  చదవండి. జరిగిన సంఘటనల వర్ణనలో, ఎంత నాటకీయత (మెలో డ్రామా అనాలేమో) పాత్రల ద్వారా, కథకుడు చొప్పించాడో తెలుస్తుంది.  ఇవన్నీ సమపాళ్లలో సమకూడటం వల్ల  కథకుడు ఓ కథని మనకు చెప్పినట్లనిపించదు. ఒక సంఘటనని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.</p>
<p><span style="color: #ff0000;"><strong>కొసమెరుపు</strong><strong>: </strong></span><strong></strong></p>
<p>మరపురాని కథ, కథ నిర్మాణానికి వృద్ధుడి జీవితంలోనూ, యువకుడి గతంలోనూ జరిగిన సంఘటనలే పునాది. ఆ సంఘటనల్లో ఉన్న ఈ క్రింది సామ్యతలు, కథాంశం బలంగా ఉండటానికి కారణాలను చెప్పకనే చెపుతాయి.</p>
<p><span style="color: #000000;">             </span><span style="color: #ff0000;"><span style="color: #000000;"> 1.  ఒక ప్రాణాపాయస్థితిలో ఉండి తమ సహాయం కోసం ఎదురు చూసిన వ్యక్తి వృద్ధుడి గతంలోనూ, యువకుడి గడచిన జీవితంలోనూ ఉన్నారు. 2. సంబంధిత సంఘటనలు వాళ్లిద్దరినీ వెంటాడి వేటాడుతాయి. 3.  రెండు సంఘటనల్లోనూ సహాయం కోసం మొదట ఎదురుచూసింది స్త్రీలే. తర్వాత పురుషుడి రూపంలో వృద్ధుడు.  4. అవసరంలో ఉన్న వ్యక్తిని చూస్తున్నపుడు వృద్ధుడి మనసులోనూ, యువకుడి మనసులోనూ ఉంది; జీవిత భాగస్వామే!  5. రెండు సంఘటనలూ ఒక ఆక్సిడెంట్ తాలూకు ఫలితాలే. ఈ సామ్యతలవల్లనే వృద్ధుడి అవసరమేంటో యువకుడు సరిగ్గా గ్రహించగలిగాడు. తదనుగుణంగా ప్రవర్తించగలిగాడు.  </span>   </span></p>
<p align="center"><strong>సంభాషణలపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>అవి</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకూ</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1. A) సంభాషణలతో పాటుగా, ఆయా పాత్రలు ఏం చేస్తున్నాయి, వాటి ముఖాల్లో ఏమేం భావాలు పలుకుతున్నాయి, చుట్టూ ఏం నడుస్తుంది వంటి వివరాలు కూడా రాస్తే ఆ పాత్రలు మరబొమ్మల్లా కాకుండా మనుషుల్లా ప్రవర్తించినట్లనిపిస్తుంది. సందర్భానుసారంగా పాత్రల శరీరభాష, ముఖకవళికలు సూచించే వాక్యాలు వాడటం వల్ల; సన్నివేశానికి అభినయం జతపడి కథనం వేగవంతమైన భావన కలగచేస్తుంది.</span></p>
<p>ప్రియశత్రువు కథలో 111, 112 పేజీల్లో నేను, డాక్టర్ లక్ష్మణ్ మధ్య జరిగిన సంభాషణ గమనించండి.  కథలో- ‘నేను’ కి  వైద్యం చేసిన డాక్టర్ లక్ష్మణ్. ఆమె ఉన్న గదిలోకి వచ్చినప్పటినుంచీ ఎలా మాట్లాడాడు, మాట్లాడుతూ ఏం చేశాడు, ‘నేను’ రియాక్షన్స్ ఏంటి? కలగలిపి కథలో చెప్పబడ్డాయి. ఆ కారణంగానే ఆ సంభాషణ రెండు పాత్రల మధ్య కాకుండా, ఇద్దరు వ్యక్తుల మధ్య నిజంగా జరిగినట్లు అనిపిస్తుంది.</p>
<p><span style="color: #ff0000;">1. B) సంభాషణలన్నిట్నీ ‘అతను చెప్పాడు’, ‘ఆమె అన్నది’ వంటి tags తో ముక్తాయించటం బాగోదు.</span></p>
<p>ప్రియశత్రువు కథలో-తప్పకుండా-అనే పదంతో మొదలై, ర్యాంప్ వాక్స్ దశలోనే ఉన్నాను-తో ముగిసే మాటలవరకూ (పేజీలు 111,112); ఎలాంటి భౌతికచర్యలూ కథనంలో కనపడవు.</p>
<p>మరో విశేషం ఏంటంటే డాక్టర్ తన గదిలోకి వచ్చి చేసిన పనులు (పేజీ 111), ప్రతిరోజూ అతను ఆ గదిలోకి వచ్చినప్పుడు క్రమం తప్పక అలానే చేస్తాడు అనిపించేలా ఉండటం. దాంతో, డాక్టర్ ఒక నియమబద్ధమైనప్రవర్తనకి అలవాటు పడ్డ వ్యక్తి అనే అభిప్రాయం పాఠకుడికి తప్పనిసరిగా కలుగుతుంది. (ఈ రకంగా సూచించటం అనేది, అసలు సూత్రంలో చెప్పబడని అంతస్సూత్రం)</p>
<p><span style="color: #ff0000;">2. A) ఒకే పాత్రతో ఎక్కువసేపు మాట్లాడించకూడదు. మీ పాత్రలు ఒక్కో విడతలో పేరాలకి పేరాలు (ఇంకా ఘోరంగా, పేజీలకి పేజీలు) మాట్లాడేస్తూ పోతే పాఠకులు విసిగెత్తిపోతారు. అలాగే మీ పాత్రలు కూడా అదే పనిగా మాట్లాడుతూ పోకూడదు. రెండో పాత్ర కూడా నోరు విప్పుతుండాలి. లేదా, కనీసం తలాడించటమో, ప్రశ్నలేయటమో, ఊ కొట్టటమోనన్నా చేయాలి. ఒకే పాత్రతో ఎక్కువసేపు మాట్లాడించి తీరాల్సిన అవసరం పడితే ఆ సంభాషణని భాగాలుగా విడగొట్టి మధ్యమధ్యలో అభినయం, ఇతర వర్ణనలు జత చేయాలి.</span></p>
<p>ప్రియశత్రువు కథలో 116 వ పేజీ నుంచి 120 వ పేజీ దాకా జరిగింది; డాక్టర్-అతడి పేషంట్ మధ్యా జరిగిన సంభాషణ. ఈ సంభాషణ ద్వారా డాక్టర్, తన పేషంట్ ఏ సమస్యతో బాధపడుతుందో ఆమెకి వివరించాడు. ఆ వివరణ అంతా ఏకపక్షంగా సాగితే చదవటం పాఠకుడికి విసుగు కలుగుతుంది. అందుకనే  పేషంట్ ప్రశ్నలనీ, ఆమె ప్రతిచర్యలనీ మధ్యలో చొప్పించి డాక్టర్ ఇచ్చిన మొత్తం వివరణని రచయిత పఠనీయంగా మార్చాడు.</p>
<p><span style="color: #ff0000;">B)  ఇక, ప్రతి పాత్రా చెప్పే సంభాషణకీ ఒక పేరాగ్రాఫ్ కేటాయించాలి.</span></p>
<p>ప్రియశత్రువు కథలో డాక్టరుకూ, పేషంటుకూ మధ్య జరిగిన సంభాషణలో ఇద్దరి మాటలకూ కథ పొడుగూతా విడి పేరాగ్రాఫ్ లు ఉన్నాయి. ఇదే పద్ధతి మిగిలిన కథల్లో సైతం ఉంది.</p>
<p><span style="color: #ff0000;">3. A) పదేళ్ల పిల్లవాడు మాట్లాడే మాటలు, అరవయ్యేళ్ల వృద్ధుడు మాట్లాడే మాటలు ఒకేలా ఉండవనీ; ప్రపంచమ్మీద వాళ్లకుండే అవగాహనలోనే కాదు, వాళ్లిద్దరి vocabulary లో కూడా చాలా తేడా ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.</span></p>
<p>నాగరికథ కథలో, తాను ఎలా టైమ్ ట్రావెల్ చేశాడో, ఒక నాగరికతకి ఏమైందో, తాత మనవడికి వివరిస్తాడు. తాత అంటేనే వృద్ధుడు. మనవడంటే ఆయనకన్నా యువకుడు. తాత పురావస్తు శాఖలో ఇంజనీర్. మనవడు అణుశాస్త్రవేత్త. కథలో తాతయ్య, మనవడితో మాట్లాడుతూ వాడిన పదాలు చూడండి. అవన్నీ వారిద్దరి అనుబంధానికి అనుగుణంగా ఉంటాయి. (ఆ పదాలు  italics లో, underline చేసి ఉన్నాయి).  బ్రాకెట్లలో ఉన్నవి పేజీ నంబర్లు.</p>
<p>1. దేరార్ నో కోయిన్సిడెన్సెస్ <em><span style="text-decoration: underline;">మనవడా</span></em> (14) 2. నేను పోయాక నీకా రహస్యం తెలిసే ఏర్పాటు <em><span style="text-decoration: underline;">చేశాలేరా</span></em>&#8230;(15) 3. పేపర్లలోనూ పుస్తకాల్లోనూ చదివేది నిజం <em><span style="text-decoration: underline;">కాదురా</span></em> (16) 4. <em><span style="text-decoration: underline;">అవునోయ్</span></em><em><span style="text-decoration: underline;">.</span></em> పిరమిడ్స్ ని ఏలియన్స్ కట్టుండొచ్చు కదా (16) 5. మన నమ్మకాలకి విరుద్ధం అనిపించినంత మాత్రాన అన్ని ఐడియాలనీ కొట్టి <em><span style="text-decoration: underline;">పారేయకూడదోయ్</span></em>(16).</p>
<p>ఇదే తాత మరో చోట తన ‘పురావస్తుశాఖ ఇంజనీర్’ హోదా లోకి ప్రవేశిస్తాడు. తనకున్న పరిజ్ఞానంతో ఒక విషయాన్ని మనవడికి వివరిస్తాడు. అప్పుడు దానికి తగ్గ పదాలు ఉపయోగించి, సంభాషణ ధోరణి మారుస్తాడు. దాంతో, ఆ పాత్రకి ఉన్న మరో కోణం మన ముందు ఆవిష్కృతమవుతుంది. ఈ ఉదాహరణ చూడండి.</p>
<p>“యస్. భారీ నక్షత్రాలు పేలిపోవడాన్ని సూపర్ నోవా అంటారు. సూపర్ నోవా కేంద్ర స్థానంలో సూక్ష్మ పరిమాణంలో ఉండే పదార్థాన్ని డార్క్ మ్యాటర్ అంటారు. ఆ డార్క్ మ్యాటర్ చుట్టూ ఆవరించి ఉండేదే సింగ్యులారిటీ.  సింగ్యులారిటీ గాఢత కొంత తగ్గించి బ్లాక్ హోల్ బదులు మైక్రో స్కోపిక్ వర్మ్ హోల్-అంటే అతి సూక్ష్మమైన కాలబిలం-ఒకటి సృష్టిస్తే దాని ద్వారా కాలంలో ముందుకీ వెనక్కీ ప్రయాణించొచ్చు. ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం చెప్పే విషయం ఇది.”&#8230; పేజీ 18.</p>
<p><span style="color: #ff0000;">B) మీ పాత్ర నేపథ్యం, దాని వృత్తి ఇత్యాదివన్నీ పరిగణనలోకి తీసుకొని దానికో స్పష్టమైన స్వరం అమర్చాలి.</span></p>
<p>ప్రళయం కథలో శ్రీ చండీ అమ్మ వారి ఆలయంలో ఒక రాత్రి ఏం జరిగిందో పూజారి, దొంగకి వివరిస్తాడు.  ఈ సంభాషణలో పూజారి గారు వాడిన భాషా, ఆయనకే స్వంతమైన కొన్ని ఊతపదాలూ ఏంటో చూడండి.</p>
<p>“ఇంకా తెలీదా <em><span style="text-decoration: underline;">నాయనా</span></em>? ఆరో గదిలో బంగారుబొమ్మ రూపంలో <em><span style="text-decoration: underline;">అమ్మవారు</span></em><em></em><em><span style="text-decoration: underline;">వెలిశారు</span></em><em><span style="text-decoration: underline;">.</span></em>” ఆయన వింతగా చూస్తూ చెప్పారు&#8230;పేజీ 101</p>
<p>“ఎవడో <em><span style="text-decoration: underline;">దొంగవెధవ</span></em><em></em><em><span style="text-decoration: underline;">నాయనా</span></em>. రాత్రి నేలమాళిగలో చొరబడి గది తలుపులు తెరిచాడు <em><span style="text-decoration: underline;">త్రాష్టుడు</span></em>. వాడి <em><span style="text-decoration: underline;">శ్రాద్ధం</span></em><em></em><em><span style="text-decoration: underline;">పెట్ట</span></em>. తెల్లారి సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూస్తే <em><span style="text-decoration: underline;">అమ్మవారి</span></em> విగ్రహం కనపడింది. <em><span style="text-decoration: underline;">అపచారం</span></em><em></em><em><span style="text-decoration: underline;">ఉపశమించటానికి</span></em><em></em><em><span style="text-decoration: underline;">శాంతి</span></em><em></em><em><span style="text-decoration: underline;">జరిపిస్తున్నాం</span></em><em><span style="text-decoration: underline;">. </span></em>“ &#8230;పేజీ 101.</p>
<p><span style="color: #ff0000;">4. మాటకి మాటే ఎప్పుడూ ప్రతిస్పందన కానవసరం లేదు. కొన్నిసార్లు మౌనం వంద మాటల పెట్టవుతుంది. పాత్రలు మాటల ద్వారానే కాదు, అప్పుడప్పుడూ మాట్లాడకుండా ఉండటం ద్వారా కూడా అర్థవంతంగా సంభాషించగలవని గుర్తు పెట్టుకోండి. </span></p>
<p>కుంతీకుమారి కథలో 137 వ పేజీలో కుంతీకుమారి తనకున్న అంగవైపరీత్యమేమిటో బార్ టెండర్ కి వివరిస్తుంది. ఆ వైనం విన్న బార్ టెండర్ తన విస్మయాన్నీ, దిగ్భ్రాంతినీ మాటల్లో వివరించలేడు. అందుకే దాన్ని  రచయిత చుక్కలతోనూ, ప్రశ్నార్థకాల్తోనూ, చివరికి అయ్యో అన్న ఒక్క పదంతోనూ వివరిస్తాడు.</p>
<p><span style="color: #ff0000;">5. A) సంభాషణలకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం-ఇండెంటేషన్. సరైన ప్రదేశాల్లో విరామ చిహ్నాలు వాడాలి. హైఫన్, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, మూడు చుక్కలు (&#8230;) వగైరా వాడకంలో ప్రామాణికత పాటించాలి.  </span></p>
<p><span style="color: #ff0000;">5. B) సంభాషణలు రాసేటప్పుడు సాధారణంగా అందరూ పాటించే పద్ధతి ఒకటుంది: సంభాషణల్ని (“) మధ్యలో ఉంచి, సంభాషణలో మరో సంభాషణ దొర్లితే దాన్ని సింగిల్ కొటేషన్స్ (‘) మధ్యలో ఉంచటం. </span></p>
<p>మరపురాని కథ-కథ 124వ పేజీలో: “సరిగా చెప్పావు. ‘బతుకుతుంటారు’ అని కాదు. అనుక్షణమూ&#8230;” దగ్గర్నుంచి ఆయన ముఖం వేదనా భరితమయింది-దాకా అన్న వాక్యాలు చూడండి.  వృద్ధుడి మాటలు ఇన్వర్టెడ్ కామాల్లో ఉన్నాయి. వృద్ధుడు కోట్ చేసిన యువకుడి మాటలు సింగిల్ కోట్స్ లో ఉన్నాయి.</p>
<p>ప్రియశత్రువు కథ 111 వ పేజీలో: “మీరేం చేస్తారు? మీ జీవనాధారం ఏమిటి?“ అన్న వాక్యాలు చూడండి. డాక్టర్ లక్ష్మణ్, ‘నేను’ ని అడిగిన ప్రశ్నలకి ప్రశ్నార్థకాలు తప్పనిసరిగా వాడబడ్డాయి.</p>
<p>రీబూట్ కథ 53 వ పేజీలో: బయట-కనుచూపు మేరంతా బూడిద వర్ణం అనే వాక్యం చూడండి. బయట అని, కథకుడు బయటికి చూడటానికి సమయం ఇచ్చేందుకు హైఫన్ ఉంది.</p>
<p>నాగరికథ కథ 13 వ పేజీలో: అప్పుడు మళ్లీ మీరు కాలప్రయాణం చేసి, మీ తాత గార్ని చంపేసే అవకాశం ఉంది. అంటే&#8230; అనే వాక్యం చూడండి. వాక్యం అసంపూర్ణంగా ఉంది. అందుకనే &#8230; ఉన్నాయి.</p>
<p><span style="color: #ff0000;">కథాయణంలో చెప్పని సూచన 1:</span></p>
<p>ఇండెంటేషన్ లో రెండు అంతకి మించి చిహ్నాలు కలిపి వాడొచ్చని కథాయణంలో ఎక్కడా చెప్పలేదు. కాని, నాగరికథ కథల సంపుటిలో ఉన్న కథల్లో ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం రెండూ కలిపి, లేదా మిగిలిన వాటితో కలిపి వాడిన సందర్భాలు కొన్ని కనబడతాయి.</p>
<p>ఉదాహరణకి నాగరికథ కథలో 21 వ పేజీ లో చివరి వాక్యం. అంటే&#8230;!? ఆశ్చర్యం, అనుమానం రెండూ కలిసున్నాయి కనక ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం రెండూ ఉన్నాయి. వాక్యం పూర్తి కానందుకు తోడుగా మూడు చుక్కలు&#8230;ఉంచబడ్డాయి.</p>
<p>ఆశ్చర్యం ద్విగుణీకృతమయిందని చెప్పడానికి మరో ప్రపంచం కథలో 29 వ పేజీలో  “తేడా అల్లా అందులో టాస్ ఫలితం బొమ్మ కాకుండా అచ్చు వస్తుంది.” అన్నపదాల తర్వాత రెండు ఆశ్చర్యార్థకాలు !! కనబడతాయి.</p>
<p>అనుమానం, రెట్టింపు అయిందనడానికి, మరోప్రపంచం కథలో 30 వ పేజీలో “ఫిక్షన్ కాదు. సిసలు సైన్సే. తేడా అల్లా అందులో టాస్ ఫలితం బొమ్మ కాకుండా అచ్చు వస్తుంది.” తర్వాత రెండు ప్రశ్నార్థకాలు ?? ఉంచబడ్డాయి.</p>
<p>ఆశ్చర్యం రెండొంతులూ, అనుమానం ఒక వంతూ అవడంతో; రెండు ఆశ్చర్యార్థకాలు, ఒక ప్రశ్నార్థకం !?! కల్కి కథలో 37 వ పేజీలో “అతను చనిపోయి రెండు శతాబ్దాలు దాటింది.” అన్న వాక్యం తర్వాత కనపడతాయి.</p>
<p>అనుమానం రెండొంతులూ, ఆశ్చర్యం ఒక వంతూ అయిన సందర్భాలు కథల్లో కనపళ్లేదు.</p>
<p align="center"><strong>ఇండెంటేషన్</strong><strong>-</strong><strong>నాగరికథ</strong><strong> </strong><strong>కథాసంకలనం</strong><strong> </strong><strong>ప్రచురణలో</strong><strong> </strong><strong>అమలు</strong><strong> </strong><strong>కాని</strong><strong> </strong><strong>కొన్ని</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong></strong></p>
<p>              1. Ellipsis, Marks of Omission (&#8230;): నిబంధన ప్రకారం, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాక్యం ముందు ఉండకూడదు. కాని, 14 వ పేజీలో “&#8230;ఇది తెగేది కాదు.” అని ఉంది. ఈ పదాలు అంతకు ముందు పేజీలో ఉన్న అంటే&#8230;” అన్న పదానికి పొడిగింపు. అక్కడ &#8230; చుక్కలు ఉన్నాయి. కనుక అవి ఇక్కడ ఉండకూడదు.</p>
<p>2. నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఈ చుక్కలని, ఒక సంపూర్ణ వాక్యం చివర వాడినపుడు నాలుగో చుక్క కూడా ఉంచాలి. నాగరికథ కథా సంకలనంలో చాలా చోట్ల అలా నాలుగో చుక్క కనపడటం లేదు. ఉదాహరణ: 24 వ పేజీలో ఉన్న వాక్యం-అది కలే, ప్రస్తుతం నేనున్నది వెలుపలే&#8230;</p>
<p>3. ఈ మూడు చుక్కలనీ సంభాషణ మధ్య విరామాన్ని సూచించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. కాని అలా వాడటం నాగరికథ కథా సంకలనంలో చాలా చోట్ల కనపడుతుంది. ఉదాహరణ: 31 వ పేజీలో ఉన్న వాక్యం-ఆ లోకంలో వాళ్లిద్దరూ ఒకరికొకరు ఏమయ్యుంటారు&#8230;ప్రేమికులా?</p>
<p>4.  చాలా చోట్ల ఆశ్చర్యార్థకం అవసరమైనా కూడా లేదు. “రెండో నెలలో పాపని ఎవరో కాజేశారు.” అన్నదానికి జవాబుగా ఉన్న “అయ్యో,” తర్వాత.</p>
<p>5.  సంభాషణలలో చాలా చోట్ల, ఇన్వర్టెడ్ కామాలలో వాక్యం పూర్తయినా, కామా ఉంది. ఎందుకో తెలీదు. కల్కి కథ 36 వ పేజీ. “నిజమే,” తల పంకించాను.</p>
<p align="center"><strong>పాత్రలపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>, </strong><strong>అవి</strong><strong> </strong><strong>ఎంతవరకు</strong><strong>, </strong><strong>ఎలా</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1. కథల్లో మితిమీరిన సంఖ్యలో పాత్రలుండవు. ఒకటి లేదా రెండు ముఖ్యమైన పాత్రలు, వాటి చుట్టూ కాసిని సహాయ పాత్రలతోనే కథలన్నీ నడుస్తుంటాయి. చాలా కథల్లో ఏకైక ప్రధాన పాత్ర ఉంటుంది.</span></p>
<p>నాగరికథ-లో ఉన్న పది కథల్లో ఉన్న పాత్రలు 29. అందులో ప్రధాన పాత్రలు 19. సహాయపాత్రలు 5.  ఇక్కడ సహాయపాత్రలంటే కథలోకి భౌతికంగా ప్రవేశించినవి. పాత్రల సంభాషణల్లోనో, జ్ఞాపకాల్లోనో ప్రస్తావించబడినవి కావు.  ఉదాహరణకి నాగరికథలో తాతయ్య ఫ్రెండు, మరపురాని కథలో గోవా సుందరి, శిక్ష కథలో శ్రీను లాంటివి.</p>
<p><span style="color: #ff0000;">2. రూపురేఖా విలాసాల వివరణ అన్నీ పాత్రలకీ తప్పనిసరి కాదు. కథకి కీలకమైతే తప్ప.</span></p>
<p>కల్కి కథలో వైపర్ గుర్తు పట్టటానికి వీలుగా కల్కి రూపం, ప్రియశత్రువు కథలో, ‘నేను’ రూపం మాత్రమే ఆయా కథల్లో స్పష్టంగా వివరించబడ్డాయి. ప్రొఫెసర్, డాక్టర్ లక్ష్మణ్, వృద్ధుడి పాత్రల రూపురేఖలు రేఖామాత్రంగానే వర్ణించబడ్డాయి. గమనార్హమైన విషయం ఏంటంటే (A) రూపురేఖల వివరాలు ఇవ్వబడ్డ పాత్రలన్నీ ముఖ్య/ప్రధాన పాత్రలే కావటం (B) ఒక్క సహాయ పాత్ర రూపు రేఖలు కూడా వర్ణించబడకపోవటం.</p>
<p><span style="color: #ff0000;">3. చాలా సందర్భాల్లో ప్రధానపాత్ర పేరు, వయసు, జెండర్-ఈ మూడు వివరాల్తోనే కథ నడిపేయొచ్చు.</span></p>
<p>కథాయణంలో ఉన్న 24 ప్రధాన పాత్రల్లో/సహాయపాత్రల్లో,  ఏడు పాత్రలకు మాత్రమే పేర్లు ఉన్నాయి. అవి విక్రమాదిత్య, కేథరిన్, ఐజక్, బండరెడ్డి, ప్రియశత్రువు కథలో ‘నేను’, డాక్టర్ లక్ష్మణ్, కుంతీకుమారి.</p>
<p>వయసు చెప్పబడింది వైపర్, విక్రమాదిత్య, కేథరిన్, ప్రొఫెసర్, బండ రెడ్డి, ప్రియశత్రువు కథలో ‘నేను’, డాక్టర్ లక్ష్మణ్, వృద్ధుడు, యువకుడు, కుంతీకుమారికి మాత్రమే.</p>
<p>మరో ప్రపంచంలో డాక్టర్, రహస్యం కథలో ఇంటలిజెన్స్ ఏజెంట్, ప్రళయం కథలో దొంగకీ తప్ప, అన్నిటికీ జెండర్ చెప్పబడింది. దీని వల్ల ప్రధాన పాత్రలు ఏ జెండరో కూడా చెప్పకుండా కథని నడపొచ్చు అని  రుజువవుతోంది.</p>
<p><span style="color: #ff0000;">4. పాత్ర ఆకారం, ఆహార్యం గురించిన వివరాలు ఆ పాత్ర సాంఘిక స్థాయినో, అలవాట్లనో, మరే ఇతరగుణాన్నో వెల్లడించాలి. అంతే తప్ప కేవలం ఆ పాత్ర భౌతిక లక్షణాలు వివరించటానికి వాక్యాలు వృధా చేయరాదు.</span></p>
<p>పది కథల్లో ఉంది 19 ప్రధాన పాత్రలు. ఇంతకు ముందే అనుకున్నట్లు భౌతిక లక్షణాలు పూర్తిగానో, పాక్షికంగానో వివరించబడింది అయిదు పాత్రలకే. ఈ పాత్రల్లో కొన్నిటి ఇతర లక్షణాలు, అలవాట్లు ప్రత్యేకంగా కాకుండా; కథనంలో అంతర్భాగంగా కథాసంకలనంలో కనపడతాయి. ఉదాహరణకి నాగరికథ కథలో తాతయ్యకున్న లక్షణాలు; ఏ ప్రశ్నకీ సూటిగా సమాధానం ఇవ్వకపోవటం-పుస్తకాలు చదవడం,  అణుశాస్త్రవేత్తకి  ఉన్న అలవాట్లు గెస్ట్ లెక్చర్లివ్వటం-తాతతో సంభాషించటం లాంటివి.</p>
<p><span style="color: #ff0000;">5. ఒక పాత్ర భౌతిక వివరాలు చెప్పటం తప్పనిసరైన సందర్భాల్లో కథకుడు ప్రత్యక్ష చిత్రణ కన్నా పరోక్ష చిత్రణ మీద ఆధారపడటం మెరుగు. అంటే ఆ పాత్ర ఎలా ఉందో వ్యాఖ్యానించటం కాకుండా, ఆ పాత్ర గురించి ఇతర పాత్రలు ఏమనుకుంటున్నాయో చెప్పించటం, వగైరా అన్న మాట.</span></p>
<p>నాగరికథ కథ చెప్పబడింది ఉత్తమపురుషలో మనవడి దృక్కోణం నుంచి. దానివల్ల, మనవడు తనకు తెలిసిన విషయాలు మాత్రమే తాను చెప్పొచ్చు. అందుకనే ‘బి.ఎ.ఆర్. సి. లో అణుశాస్త్రవేత్తగా తీరికలేని ఉద్యోగంలో ఉన్నా, ఏదోలా వీలు చేసుకుని నెలకోసారన్నా హైస్కూల్ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్లివ్వటం నాకలవాటు.’ అని తన గురించి తాను చెప్పాడు.  కాని, తాతయ్య పాత్ర; కథలో ‘నేను’ కాదు. అందువల్ల తన భౌతిక వివరాలు తాను చెప్పుకోకూడదు. అందుకని ఆయన గురించి భౌతిక వివరాలు: పురావస్తుశాఖలో ఇంజనీరు, చిలిపి నవ్వే సమాధానం, బోసినోటితో నవ్వటం, ఏ ప్రశ్నకీ సూటిగా సమాధానం ఇవ్వకపోవటం ఆయన స్టైల్ అని తెలియపర్చటం, ఇవన్నీ మనవడి ద్వారానే అంటే ఒక పరోక్ష చిత్రణ ద్వారా మాత్రమే పాఠకుడికి తెలియపర్చబడ్డాయి.</p>
<p><span style="color: #ff0000;">6. పాత్రల ఆలోచనాధోరణి వాటి అనుభూతుల్ని, ఉద్వేగాల్ని పాఠకుల కళ్లకి కడుతుంది. వాటి చర్యల వెనకున్న ఉద్దేశాల్ని విశదీకరిస్తుంది. ఆ చర్యల్ని పాఠకులు మరింత సానుభూతితో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల పాత్రల అంతరంగావిష్కరణ కొన్ని సందర్భాల్లో కీలకమవుతుంది. అయితే కథకుడిగా మీరు ఏ స్థాయిలో పాత్రల మనసుల్లోకి చొరబడగలరు అనేది ఆ కథ చెప్పటానికి మీరెంచుకున్న దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి, బాహ్య ప్రథమ పురుష లో కథ చెప్పదల్చుకుంటే అంతరంగావిష్కరణ జోలికి వెళ్లకుండా పాత్ర చిత్రణ చేయాల్సుంటుంది.</span></p>
<p>ఈ సూచన అర్థం- ఒక పాత్ర తన మనసులో ఏమనుకుంటున్నదీ ఇంకో పాత్ర, చెప్పటం ఆ కథ చెప్పిన విధానం మీద ఆధారపడి ఉంటుందని.</p>
<p>నాగరికథ, మరోప్రపంచం, కల్కి, రహస్యం, ప్రళయం, ప్రియశత్రువు, కుంతీకుమారి కథలు; చెప్పింది ఉత్తమపురుష కథావిధానంలో. అందువల్ల ఒక పాత్ర మనసులో ఏముందో ఇంకో పాత్ర ఊహించుకోవచ్చు.</p>
<p>కనక  తాతయ్య మనసులో ఏముందో మనవడు (15వ పేజీ చివరిపేరా),  స్కూటీ సుందరి మనసులో ఏముందో పేషంటు (31వ పేజీ చివరి పేరా), కల్కి మనసులో ఏముందో వైపరు (49వ పేజీ మూడో పేరా), దొంగ స్వగతం ద్వారా కథకుడు (96వ పేజీలో కిందనుంచి రెండో పేరా), ‘నేను’ స్వగతాల ద్వారా కథకుడు (121వ పేజీ), కుంతీ కుమారి మనసులో ఏముందో బార్ టెండర్ (133వ పేజీలో రెండో పేరా) ఊహించుకోగలిగారు. ఆ వీలు ఉన్నా రహస్యం కథకి దాన్ని రచయిత వాడుకోలేదు. అదే వీలు సర్వజ్ఞ ప్రథమపురుష కథనానికి కూడా ఉంది. అందుకే బండరెడ్డి ఆలోచనలన్నీ కథకుడు చెప్పగలిగాడు. ఈ అవకాశం పరిమిత ప్రథమపురుష,  బాహ్య ప్రథమపురుష కథనాల్లో లేదు. అందుకే ఆ ధోరణుల్లో చెప్పబడిన రీబూట్, మరపురాని కథల్లో అంతరంగావిష్కరణ జరగలేదు.</p>
<p><span style="color: #ff0000;">7. పాత్రల గురించి కథకుడు చెప్పేది, తమ గురించి తాము పాత్రలు చెప్పుకునేది, ‘చూపేది’ మాత్రమే కాక, ఆయా పాత్రల గురించి కథలోని ఇతర పాత్రలు ఏమనుకుంటున్నాయనేది కూడా పాఠకులకి చాలా విషయాలు తెలియబరుస్తుంది. మీ ప్రధాన పాత్రంటే ఇతర పాత్రలకి గౌరవమా, భయమా, చిన్నచూపా; ఆ పాత్ర గురించి మిగతా పాత్రలు ఏం మాట్లాడుకుంటాయి; ఆ పాత్ర ప్రభావం ఇతర పాత్రల మీద ఎలా ఉంది; వగైరా వివరాలు చెప్పటం వల్ల పాఠకుడు కథలోని పాత్రల మధ్య బంధాలు, సమస్యలు, ఘర్షణ సరిగా అర్థం చేసుకుంటాడు.</span></p>
<p>ఈ సూచన అర్థం-ఒక పాత్ర మీద పాఠకుడికి ఏర్పడే అభిప్రాయం; ఆ పాత్ర గురించి మిగిలిన పాత్రలు ఏమనుకుంటున్నాయనే దాని మీద ఆధారపడుంటుందని; దాని ద్వారా పాత్రల స్వరూపస్వభావాలపట్ల పాఠకుడికి స్పష్టత ఏర్పడుతుందని. దీనికి నిదర్శనాలు: తాతయ్య మాటల మీద మనవడికి కలిగిన అపనమ్మకం (18 వ పేజీ 7 వ పేరా),  పేషంటుకి కుర్రాడి మీద సానుభూతి (29వ పేజీ రెండవ, మూడవ పూర్తి పేరా), కల్కికి వైపర్ మీద నమ్మకం (49వ పేజీ మూడో పేరా), విక్రమాదిత్యకి కేథరిన్ మీద గౌరవం (55వ పేజీ 8వ పేరా), ఇంటలిజెన్స్ ఏజంట్ కి ప్రొఫెసర్ మీద గౌరవం (70వ పేజీ 3వ పూర్తి పేరా), పోలీసు జీపు డ్రైవర్ మీద చులకన భావం (82వ పేజీలో 3వ పేరా), ప్రియశత్రువు లో ‘నేను’ కి ఆదిత్య దౌష్ట్యం (113వ పేజీ క్రిందనుంచి 3వ పేరా), వృద్ధుడికి  యువకుడిపై గౌరవం (124వ పేజీ 2వ పేరా),  బార్ టెండర్ కి  కుంతీ కుమారి మీద అయిష్టం (133వ పేజీ-మొదటి పేరా).</p>
<p align="center"><strong>కథన</strong><strong> </strong><strong>కుతూహలంలో</strong><strong> </strong><strong>క్లుప్తతపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>, </strong><strong>అవి</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">(1) కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే-పొడుగాటి వాక్యాలు చదివి అర్థం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు చదివి అర్థం చేసుకోవటం తేలిక కాబట్టి. అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి. అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు అనవసరమైన కొవ్వుని కరిగించేసి కథ సొగసు పెంచుతాయి కాబట్టి.</span></p>
<p>మొత్తం కథాసంపుటిలో అవసరానికి మించి పొడుగ్గా ఉన్న వాక్యాలు అతి తక్కువ. అలాంటి పొడుగాటి వాక్యం ఒకటి నాగరికథ కథ-15 వ పేజీ లో ఉంది. అది గీజా నాళికలు, అనే పదంతో ఆరంభమై; భావిస్తున్నారు అనే పదంతో అంతమవుతుంది. ఇది మొత్తం నాలుగు లైన్లు. ఈ వాక్యం, మనవడు ఒక పత్రికలో చదివిన వార్తలో భాగం. పత్రికలో వార్తలు అలాగే ఉంటాయి కనక కథారచయిత ఉద్దేశపూర్వకంగా దాన్ని చిన్నచిన్న ముక్కలుగా విడగొట్టలేదనిపించింది.  కల్కి కథలో-41 వ పేజీ లో మాతృదేశానికి అన్న పదంతో మొదలై, అగ్రగామిగా నిలిపాయి అన్న పదంతో ఆఖరైన వాక్యం మరో పొడుగాటిది. వాక్యప్రవాహవేగం ఏ మాత్రం తగ్గకుండా ఈ వాక్యాన్ని చిన్నచిన్న వాక్యాలుగా విడగొట్టటానికి ప్రయత్నించి చూశాను. కుదర్లేదు.</p>
<p>ఇంకా చిన్న చిన్న వాక్యాలుగా రాసే అవకాశం ఉన్నా, రాయబడని అతి కొద్ది వాక్యాల్లో ఒకటి కుంతీకుమారి కథ పేజీ 143 లో కనపడుతుంది. అదీ రెండు లైన్లే. కథల్లో మిగిలినవన్నీ చిన్న చిన్న వాక్యాలే.</p>
<p><span style="color: #ff0000;">(2) కథలో క్లుప్తత సాధించాలంటే కథకుడికి మొదటిగా కావాల్సింది చెప్పదలుచుకున్న దానిపై స్పష్టత. ఏం చెప్పాలో తెలీనప్పుడు ఎలా చెప్పాలో తెలిసే వీలు లేదు. అప్పుడే పదాడంబరం రంగప్రవేశం చేసి కథ పొడుగు పెంచుతుంది.</span></p>
<p>కథాయణంలో ఉన్న కథల్లో పదాడంబరం రంగప్రవేశం చేసి కథ పొడుగు పెంచిన సందర్భాలు నాకు కనపళ్లేదు.</p>
<p><span style="color: #ff0000;">(3) ఇక రెండోది. చెబుతున్న విషయమ్మీదనే దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి. ఇది కొరవడితే కథలోకి అనవసరమైన పాత్రలు, వాటి మధ్య సందర్భశుద్ధి లేని సంభాషణలు వగైరా ప్రవేశిస్తాయి.</span></p>
<p>అన్ని రకాల పాత్రలూ కలిపి మొత్తం 10 కథల్లో ఉన్న పాత్రలే 29. ఇక అనవసరమైన పాత్రలంటూ ఇవని చెప్పే అవకాశం లేదు. సందర్భశుద్ధి లేని సంభాషణల కోసం వెతికాను. దొరకలేదు.</p>
<p><span style="color: #ff0000;">(4) ఈ రెండిటి తర్వాత ముఖ్యమైనది-తక్కువ పదాల్లో ఎక్కువ భావం పలికించగలగటం.</span></p>
<p>దీనికి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఒకటి: ప్రళయం కథ- పేజీ 100 లో ఉన్న “తీతువు కూతలు గుండెలదరగొట్టేవేళ హేతువు తోక ముడిచి పారిపోతుందేమో” అనే వాక్యం.</p>
<p><span style="color: #ff0000;">(5) కథాగమనానికి దోహదపడని వర్ణనలకి దూరంగా ఉండటం.</span></p>
<p>వర్ణనలు చాలా తక్కువ. మినహాయింపు శిక్ష కథ. ఇందులో రకరకాల వర్ణనలు కనపడతాయి. మిగిలిన కథల్లో ఉన్న వర్ణనలు నాలుగు. ఉదాహరణలు: (1-2) కల్కి కథ-పేజీ 44, 45 ల్లో. ఈ రెండు వర్ణనలూ ఒకే వ్యక్తికి చెందినవి. మొదటి వర్ణన ఉన్నది, వైపర్ మొదటిసారి కల్కిని చూసినపుడు-రెండో వర్ణన ఉన్నది, కల్కి వేలికి ఉన్న ఉంగరం  మరింత పరీక్షగా చూసినప్పుడు. సందర్భం వేరు. వర్ణన కూడా వేరు. (3) ప్రియశత్రువు కథ-పేజీ 111 లో డాక్టర్ వర్ణన. కథలో ‘నేను’, డాక్టర్ నాకు బాగా నచ్చాడు అనుకుంటుంది. అతడి పేరు మీద ఫేస్ బుక్ ఖాతా తెరవాలనుకుంటుంది. ఆమెది అందమైన వాళ్లని ఇష్టపడే మనస్తత్వం. అందుకే డాక్టర్ ఎలా ఉన్నాడో వర్ణించటం అవసరం. అదీ సరిపడేంతవరకే. (4) ప్రియశత్రువు కథ-పేజీ 112 లో ప్రియ రూపురేఖల వర్ణన. కథకి కీలకాంశం అదే.</p>
<p><span style="color: #ff0000;">(6) పాత్రల సంఖ్యని పరిమితం చేయటం.</span></p>
<p>మొత్తం 10 కథల్లో ఉన్న పాత్రలు 29. అంటే కథకి సగటున మూడు. వాటిలో పదకొండింటికి మాత్రమే పేర్లున్నాయి. కథల్లో ప్రధాన స్త్రీ పాత్రలు కూడా రెండే రెండు.</p>
<p><span style="color: #ff0000;">(7) పునరుక్తులు పరిహరించటం.</span></p>
<p>కథల్లో నాలుగు చోట్ల మాత్రమే పునరుక్తులున్నాయి. మరో ప్రపంచం కథలో 27 వ పేజీలో ఈ లోకంలో మనకి అసంభవమైనవిగా అన్న పదంతో మొదలైన వాక్యం అదే పేజీలో ఉన్న చివరి పేరాలో మళ్లీ కనపడుతుంది. అలాంటివే మరో మూడు వాక్యాలు ఇదే కథలో 27, 28 పేజీల్లో సైతం కనపడతాయి. అయితే ఈ సందర్భాల్లో మొదట కనపడే ప్రతి వాక్యం, ఆ తర్వాత ప్రధానపాత్ర గుర్తుకు తెచ్చుకునే మొత్తం సంభాషణలో ఒక భాగం. అలాగే రీబూట్ కథలో 53 వ పేజీలో మొదటి వాక్యం ఇతివృత్తానికి సూచనగా కథ ప్రారంభంలో కనపడగా, 64వ పేజీలో ఆ సంఘటన కథలో నిజంగా జరిగినప్పుడు ఇంకోసారి ప్రత్యక్షమవుతుంది. రహస్యం కథ మొదట్లో 68 వ పేజీలో కథ ఎత్తుగడలో భాగంగా మొదలైన వాక్యం  79 పేజీలో ముగింపులో కనపడతుంది. అందువలన వీటిని పూర్తిగా పునరుక్తులు అనలేం.</p>
<p align="center"><strong> </strong></p>
<p align="center"><strong>మరికొన్ని</strong><strong> </strong><strong>విషయాలు</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;"><strong>కథల</strong><strong> </strong><strong>పరిమాణం</strong><strong>:</strong></span><strong></strong></p>
<p><strong>              </strong>ఈ మధ్య నేను చదివిన ఒక మెగా కథల సంపుటిలో ఒక కథ అచ్చులో సుమారుగా నాలుగు పేజీలు ఉంటే, ఇంకో కథ 48 పేజీలు ఉంది. మొత్తం సంపుటిలో ఉన్న 336 కథలని పరిశీలిస్తే  నాలుగు నుంచి 14 పేజీలు ఉన్న కథలు 213 ఉన్నాయి. కథల సంఖ్య, అవి ఆక్రమించిన పేజీల సంఖ్య ఆధారంగా ఒక్కో కథ సుమారుగా 11 పేజీలు ఉంది. ఈ కథలన్నీ సౌకర్యవంతంగా చదివే పరిమాణంలో ఉన్నాయని నాకనిపించింది. ఇదే దృష్టితో చూస్తే చిత్రంగా, నాగరికథ కథల సంపుటిలో 10 కథలూ 114 పేజీలతో పైన  చెప్పిన సగటు పరిమాణంలోనే ఉన్నాయి.</p>
<p><span style="color: #ff0000;">కథ విభజన:</span></p>
<p>పైన నేను చెప్పిన మెగా కథాసంకలనంలో ఒక 24 పేజీల కథ మొత్తం ఒకటే భాగంగా చెప్పబడింది. ఇంకో 26 పేజీల కథ 23 భాగాలుగా విడగొట్టబడింది. మొదటిది అనావృష్టి. రెండోది అతివృష్టి. కథలోకి ఒక పాత్ర ప్రవేశించినపుడు లేదా నిష్క్రమించినపుడు, సంఘటనాసమయం, స్థలం లేదా సందర్భం మారినప్పుడు కొత్త భాగం మొదలైన మిగిలిన కథల్తో పోలిస్తే, ఈ రెండు కథలూ, ఇలాంటివే మరికొన్ని కథలూ చదవటానికి ఇబ్బంది పెట్టాయి. ఈ రకమైన ఇబ్బంది నాగరికథ కథల సంపుటిలో ఉన్న కథల్లో ఎదురు కాలేదు. కారణం? ఏ కథలోని ఏ భాగం మధ్యలోనూ పాత్రల సంఖ్యా, సంఘటనాస్థలీ, కథాసమయమూ మారలేదు.</p>
<p>ఉదాహరణకు నాగరికథ కథనే తీసుకుంటే, కథలో మొత్తం 5 భాగాలున్నాయి.  మొదటి భాగంలో  సంఘటనా సమయం=వర్తమానం, సంఘటనాస్థలి=క్లాస్ రూమ్. రెండో భాగంలో  సందర్భం=విమానంలో ఉన్నపుడు ప్రస్తుతంలోంచి గతంలోకి ప్రధాన పాత్ర ప్రయాణం. మూడో భాగంలో సంఘటనా సమయం=వర్తమానం, స్థలం=తాతయ్య ఇల్లు. నాలుగో భాగంలో సంఘటనా సమయం=ప్రస్తుతంనుంచి గతంలోకి, తాతయ్యతో సంభాషణల స్మరణ. ఐదో భాగంలో సంఘటనా సమయం=గతంలోంచి వర్తమానంలోకి.</p>
<p align="center"><strong>కథ</strong><strong>-</strong><strong>ప్రయోజనం</strong><strong></strong></p>
<p>              చదివించగలగటం కథ ప్రాథమిక లక్షణం. ఆ లక్షణం పూర్తిగా లోపించిన లేదా ఆ ప్రామాణికతని అసమగ్రంగా సంతృప్తి పరచిన కథలు, ఇతివృత్తంగా ఏ సమస్యని స్వీకరించినా పాఠకుడితో చదివించలేవు. కథ-ప్రయోజనం అనే కొలమానంతో కొలిస్తే, అసలు చదివించలేకపోవటంవల్ల ప్రయోజనపరంగా వాటి లక్ష్యాన్ని  సిద్ధింపచేయలేవు.<strong></strong></p>
<p align="center"><strong>ముగింపు</strong><strong></strong></p>
<p>              సంపుటిలో ఉన్న పది కథల్లో ఒకటి అనువాద కథ. మిగిలిన వాటిలో, శిక్ష కథలో ఒక వర్తమానసమస్య ఇతివృత్తం. సమస్య తీవ్రతని  ఈ కథ ద్వారా పాఠకుల దృష్టికి తెచ్చి, రచయిత కథని ముగించాడు.  ఆ కథలో సమస్య వైయక్తికమైనది కాదు. వర్తమానసమాజానికంతటికీ సంబంధించినది.  ఈ కథలో ప్రస్తావించిన సమస్యకు పరిష్కారాన్ని సూచించే బాధ్యతని రచయిత తీసుకోలేదు. మిగిలిన ఎనిమిది కథలూ ప్రాథమికంగా వైజ్ఞానిక కల్పనలు. ప్రతి కథకీ ఒక శాస్త్రీయకోణం పునాది. మిగిలిన కథ- ఆ పునాదిపై తన కల్పన జోడించి రచయిత నిర్మించిన రమ్యహర్మ్యం.</p>
<p>కథాయణంలో కానీ, కథనకుతూహలంలో తాను చేసిన సూచనలు వ్యాసరచయిత; తన కథారచనలో పాటించాడు. కథలకీ, కథాయణానికీ మధ్య సమగ్ర సమన్వయం సాధించాడు.  ఆ దృష్ట్యా చూస్తే తాను చేసిన సూచనలు పాటించలేనివి, పాటించగూడనివి కావని నిరూపించాడు. అందుకే ఆ కథలు నేను ఒకటికి రెండు సార్లు చదవగలిగాను.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14552</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>ఉత్కంఠభరితమైన కథ &#8211; రాజ్ఞి</title>
		<link>http://vaakili.com/patrika/?p=13250</link>
		<comments>http://vaakili.com/patrika/?p=13250#comments</comments>
		<pubDate>Wed, 01 Feb 2017 00:36:37 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[రేఖా జ్యోతి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=13250</guid>
		<description><![CDATA[<p></p> <p></p> <p>ఒక మంచి పుస్తకం చదవగానే సన్నిహితులకు  చెప్పేస్తాం, మరీ నచ్చేస్తే కొన్ని వాక్యాలు రాసుకొని దాచుకుంటాం. అంతకు మించి ఒక పుస్తకాన్ని ప్రేమించినప్పుడు, పూర్తిగా ఆ భావాన్నంతా అనుభవించినప్పుడు, చదువరి రచయిత కూడా అయినప్పుడు, అందునా అది మరొకభాషలో ఉన్నప్పుడు, లోపలి సాహిత్యాభిలాష మనసును &#8216;అనువాదం&#8217; వైపు ప్రేరేపిస్తుంది. ఆ పుస్తకం మీది ప్రేమనంతా సంపూర్ణంగా వ్యక్తపరిచే అందమైన ప్రక్రియే &#8216;అనువాదం&#8217;.  దీనికి ముందు తన పచ్చని తోరణాల వంటి రచనలతో  &#8216;వాకిలి&#8217; పత్రికకు   శోభను తీసుకువచ్చిన డాక్టర్ మైథిలి అబ్బరాజు గారి &#8216;రాజ్ఞి&#8216; &#8211; SHE - ( who must be obeyed ) &#8211; అనువాద నవల &#8211; మే నెల 2015నుంచీ మొదలయ్యి  పదిహేడు భాగాలతోఅత్యంత ఉత్కంఠగా సాగింది.  ఎక్కడా కూడా అనువాదం చదువుతున్న భావన కనిపించదు, ప్రస్తావిస్తున్న దాని యొక్క  పరిమళం తప్ప.</p> <p>ఈ పుస్తకం ఆగ్లం లో రైడర్ హగ్గర్డ్ కలం నుండి 1886 లో ‘ది గ్రాఫిక్’ అనే మ్యాగజైన్ లో సీరియల్ గా వచ్చింది . ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ అత్యంత ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల జాబితాలో ఉంది. ఇంత గొప్ప నేపథ్యం ఉన్న నవలను ఇంకా అందంగా దాని ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా అనువదించారు మైథిలి గారు.</p> <p>ఆఫ్రికా తీరంలో ప్రాణశక్తిని ఆవాహన చేసుకొని మృత్యువును జయించిన  ఒక &#8216;రాణి&#8217; చేతిలో తన భర్తను కోల్పోయిన అమెనార్టస్ అనే స్త్రీ,  &#8217;ఆ రాణిని అంతమొందించడమూ లేక ఆమె శాశ్వత జీవితపు  రహస్యాన్ని చేధించడమూ&#8217; అనే సంకల్పాన్ని తన వంశం ముందుంచి మరణిస్తుంది. ఆమె కొడుకుతో మొదలై ఆ వంశం లోని అరవై ఐదు తరాల వారు ఆ దిశగా ప్రయత్నించి ఎవరికివారు సేకరించిన ఆనవాళ్ళను &#8211; తరువాతి తరంవారికి అందిస్తూ వస్తారు. అరవై ఆరో  తరానికి చెందిన &#8217;లియో&#8217; అచ్చు అమెనార్టస్ భర్త కాలిక్రేటస్ పోలికలతో ఉంటాడు. ఇతను తన సంరక్షకుడైన హాలీ తో కలిసి &#8216;రాణి&#8217; ని శోధించేందుకు సిద్ధపడతాడు. ఆ క్రమంలో అదే రాణికి బానిసలుగా ఉన్న అమహగ్గర్ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/05/she-june.jpg" width="0"></p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/03/sheapril1.jpg"><img class="aligncenter size-full wp-image-10638" title="sheapril1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/03/sheapril1.jpg" alt="" width="700" height="325" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఒ</span>క మంచి పుస్తకం చదవగానే సన్నిహితులకు  చెప్పేస్తాం, మరీ నచ్చేస్తే కొన్ని వాక్యాలు రాసుకొని దాచుకుంటాం. అంతకు మించి ఒక పుస్తకాన్ని ప్రేమించినప్పుడు, పూర్తిగా ఆ భావాన్నంతా అనుభవించినప్పుడు, చదువరి రచయిత కూడా అయినప్పుడు, అందునా అది మరొకభాషలో ఉన్నప్పుడు, లోపలి సాహిత్యాభిలాష మనసును &#8216;అనువాదం&#8217; వైపు ప్రేరేపిస్తుంది. ఆ పుస్తకం మీది ప్రేమనంతా సంపూర్ణంగా వ్యక్తపరిచే అందమైన ప్రక్రియే &#8216;అనువాదం&#8217;.  దీనికి ముందు తన పచ్చని తోరణాల వంటి రచనలతో  &#8216;వాకిలి&#8217; పత్రికకు   శోభను తీసుకువచ్చిన డాక్టర్ మైథిలి అబ్బరాజు గారి &#8216;<a href="http://vaakili.com/patrika/?p=12918">రాజ్ఞి</a>&#8216; &#8211; SHE - ( who must be obeyed ) &#8211; అనువాద నవల &#8211; <a href="http://vaakili.com/patrika/?p=8189">మే నెల 2015</a>నుంచీ మొదలయ్యి  <a href="http://vaakili.com/patrika/?cat=479">పదిహేడు భాగాలతో</a>అత్యంత ఉత్కంఠగా సాగింది.  ఎక్కడా కూడా అనువాదం చదువుతున్న భావన కనిపించదు, ప్రస్తావిస్తున్న దాని యొక్క  పరిమళం తప్ప.</p>
<p>ఈ పుస్తకం ఆగ్లం లో రైడర్ హగ్గర్డ్ కలం నుండి 1886 లో ‘ది గ్రాఫిక్’ అనే మ్యాగజైన్ లో సీరియల్ గా వచ్చింది . ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ అత్యంత ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల జాబితాలో ఉంది. ఇంత గొప్ప నేపథ్యం ఉన్న నవలను ఇంకా అందంగా దాని ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా అనువదించారు మైథిలి గారు.</p>
<p>ఆఫ్రికా తీరంలో ప్రాణశక్తిని ఆవాహన చేసుకొని మృత్యువును జయించిన  ఒక &#8216;రాణి&#8217; చేతిలో తన భర్తను కోల్పోయిన అమెనార్టస్ అనే స్త్రీ,  &#8217;ఆ రాణిని అంతమొందించడమూ లేక ఆమె శాశ్వత జీవితపు  రహస్యాన్ని చేధించడమూ&#8217; అనే సంకల్పాన్ని తన వంశం ముందుంచి మరణిస్తుంది. ఆమె కొడుకుతో మొదలై ఆ వంశం లోని అరవై ఐదు తరాల వారు ఆ దిశగా ప్రయత్నించి ఎవరికివారు సేకరించిన ఆనవాళ్ళను &#8211; తరువాతి తరంవారికి అందిస్తూ వస్తారు. అరవై ఆరో  తరానికి చెందిన &#8217;లియో&#8217; అచ్చు అమెనార్టస్ భర్త కాలిక్రేటస్ పోలికలతో ఉంటాడు. ఇతను తన సంరక్షకుడైన హాలీ తో కలిసి &#8216;రాణి&#8217; ని శోధించేందుకు సిద్ధపడతాడు. ఆ క్రమంలో అదే రాణికి బానిసలుగా ఉన్న అమహగ్గర్  జాతి స్త్రీ ఉస్తేన్,  లియో ని మొదటిచూపులోనే ప్రేమించడమూ, లియో కూడా ఆమె మీద ప్రేమ పెంచుకోవడం జరుగుతుంది.  మృత్యువుకి అంచున ఉన్న లియో ని ఆఖరి నిమిషంలో &#8217;రాజ్ఞి&#8217; కాపాడుతుంది. తన కోసమే కాలిక్రేటస్ మళ్ళీ పుట్టి వచ్చాడని నమ్ముతుంది.  పూర్వం తన ప్రేమకు అడ్డుగా నిలిచిన అమెనార్టస్ ని చంపలేకపోయిన రాజ్ఞి &#8211; ఈసారి రెండువేల యేళ్ళ తరువాత తాను ప్రేమించిన వాడికోసం &#8216;ఉస్తేన్&#8217; ను  లియో కళ్ళ ముందే చంపేస్తుంది. తర్వాత లియోని తన సౌందర్యంతో ముగ్ధుణ్ణి చేస్తుంది. తాను ఈ సుదీర్ఘమైన కాలమంతా కాలిక్రేటస్ పునరాగమనం కోసం ఎంతలా ఎదురుచూసినదీ,  కాలిక్రేటస్ ని వధించినందుకు తను ఎంతగా పశ్చాత్తాపపడినదీ  వివరిస్తుంది. నిదర్శనాలు చూపిస్తుంది. లియో ఒక సందిగ్ధావస్థలో  ఉండగానే అతణ్ణి  కూడా మృత్యుంజయుణ్ణి చేసేందుకు, జీవజ్వాల వద్దకు తీసుకెళుతుంది &#8217;రాజ్ఞి&#8217;.  అందరి ఆలోచనలకు అతీతంగా  మొదటిసారి ప్రాణశక్తిని ఇచ్చిన జీవజ్వాల…  రెండవసారి అదే జ్వాల ముందు నిలుచున్నప్పుడు ప్రాణశక్తిని వెనక్కి తీసుకుంటుందని తెలియక, ఆ జ్వాల ముందు నిలుచున్న  &#8217;రాజ్ఞి&#8217;  మరణిస్తుంది.  పూర్తిగా  రెండువేల యేళ్ళ వార్ధక్యం కొన్ని క్షణాల్లో ఆవరించి మరణిస్తుంది.  అనంతమైన ఆమె నిరీక్షణ తరువాత కలుసుకున్న లియోతో  &#8230;. &#8220;ప్రియా, కాలిక్రేటస్ – మర్చిపోకు నన్ను- నా దుస్థితికి కరుణ చూపు – నేను వస్తాను – మళ్ళీ – ఇంకా ఎక్కువ అందంగా …నిజం. వ- స్తా- ను”  అనే ఆఖరి మాటలతో  ఆయేషా - &#8217;రాజ్ఞి&#8217; మరణిస్తుంది. శాశ్వత జీవితాన్ని ప్రసాదించే ఆ జీవజ్వాలలోకి  వెళ్లే ఉద్దేశ్యం  తమకు లేదని లియో, హాలీ వెనుదిరుగుతారు. వారు రెండు సంవత్సరాల పాటు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఇంగ్లండ్ చేరుకోవడంతో  ఈ కథ ముగుస్తుంది. కొనసాగింపు ఉంది అని సూచిస్తూ&#8230; మళ్ళీ ఆయేషా లియో కోసం పుడుతుందేమో అనే  సూచన చేస్తూ కథ ముగుస్తుంది.<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/Mythili.jpg"><img class="alignright  wp-image-7376" title="Mythili" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/Mythili.jpg" alt="" width="182" height="242" /></a></p>
<p>మైథిలి గారు మొదటి భాగంలో ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తూ &#8216;<em>భారతీయులకి</em> <em>మటుకే</em> <em>ప్రత్యేకంగా</em> <em>అర్థమయే</em> <em>స్త్రీ</em> <em>శక్తిని</em>, <em>అంతటిది</em> <em>అయి</em> <em>ఉండీ</em> <em>ప్రేమ</em> <em>కోసం</em> <em>తపించిపోవటాన్ని</em> She <em>ఆవిష్కరిస్తుంది</em>.&#8217; <em>అంటూ</em>  <em>కథలోకి</em>  <em>తీసుకెళ్తారు</em>. <em>నవలలోని</em> <em>పాత్రలు</em> <em>అన్నీ</em> <em>తమ</em> <em>తమ</em> <em>విలక్షణమైన</em> <em>స్వభావాలతో</em> <em>మసలుతూ</em> <em>ఉంటాయి</em>. <em>ఈ</em> <em>నవల</em> <em>మొత్తాన్ని</em> <em>తన</em> <em>గొంతుకతో</em> <em>చెప్పుకొని</em> <em>పోయే</em> <em>కీలకమైన</em> <em>పాత్ర</em>  &#8217;హొరేస్ హాలీ &#8216; ఒంటరి జీవన<em>నేపథ్యం</em>  <em>మొత్తం</em> <em>ఒక్క</em> <em>పారాగ్రాఫ్</em> <em>లో</em>  <em>బరువైన</em> <em>పదాలలో</em>  <em>ఉంటుంది</em>. &#8220; నా ఒంటరితనం లోంచి నల్లటి తృప్తినొకదాన్ని అనుభవిస్తున్నాను…నాకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నా తమ్ముడూ అక్కా చెల్లెలూ ఎవరూ..ఎవరూ లేరు. అంతటి ఒంటరితనమూ ఒక ఘనతేగా మరి ?&#8221; అని. ఈ కథ లో ఒక నిబద్ధతతో కూడుకున్న పాత్ర హాలీది, తన వికారమైన రూపానికి అతకని ఎనలేని జ్ఞానం గలవాడూ, పలు భాషలు తెలిసినవాడూ కూడా. ఎక్కడా జంకనితనమూ, సమయస్పూర్తితో కథ మొత్తంలో లియోని వెన్నంటి ఉంటాడు.</p>
<p>లియో విన్సే ఈ నవలలో కథానాయకుడు.గ్రీక్ దేవుడు అపోలో విగ్రహంలా ఉంటాడని,  అతన్ని చూసిన ప్రతి అమ్మాయీ ప్రేమలో పడిపోతుండేదనీ హాలీ తన మాటలలో వర్ణిస్తాడు. సాహసానికి వెనుకాడని వాడు , సింహంలా పోరాడేవాడూ , ఉస్తేన్ కి ప్రాణ సఖుడు. కానీ &#8216;ఆయేషా&#8217; (&#8216;రాజ్ఞి’) దృష్టిలో తనకోసం మళ్ళీ జన్మించిన కాలిక్రేటస్. ఉస్తేన్, ఆమహగ్గర్ అనే ఆటవిక జాతి స్త్రీ,  లియోని ప్రేమిస్తుంది, ఇక ఆఖరి క్షణం వరకూ అతన్ని కనిపెట్టుకొని ఉండి అతన్ని విడువని సాహసి. లియో కోసం రాజ్ఞి ని కూడా ధిక్కరించి ఎదురు నిలిచే పాత్ర, చివరికి లియో కోసమే రాజ్ఞి చేతిలో ప్రాణాలు పోగొట్టుకొనే పాత్ర. జాబ్ నమ్మకస్తుడైన పనివాడు అయినప్పటికీ లియోతోనూ, హాలీతోనూ మంచి అనుబంధం కలవాడు.  బిలాలీ,  అమహగ్గర్  జాతి పెద్ద, కృతజ్ఞత కలవాడు. ఈ  నవల ఏ రహస్యాన్ని చేధించడానికైతే మొదలవుతుందో ఆ రహస్యాన్ని ప్రపంచం ముందు నిలిపిన కాలిక్రేటస్, అమెనార్దస్ పాత్రలు చాలా ధృఢమైనవి. భార్యని అమితంగా ప్రేమించి ఎట్టి పరిస్థితుల్లోనూ విడువని భర్తగా కాలిక్రేటస్ పాత్ర, భర్త మరణానికి కారణమైన &#8216;స్త్రీ &#8216; మీద ప్రతీకారం కోసం తరాలను అటుగా నడిపించిన అమెనార్దస్ పాత్ర మైథిలి గారి కలంలో చదివేటప్పుడు స్థిరమైన రూపాలు మన కళ్ళ ముందు నిలబడతాయి.</p>
<p>చాలా చాలా చెప్పుకోవాల్సిన సమయం ఈ సమీక్షలో, అది ఈ రచనలోని లేక అనువాదంలోని మాధుర్యం గురించి! నిజమే, ఆగ్లంలో  చదివి కథని అర్థం చేసుకోగలం కానీ, ఈ తెలుగు అనువాదం చదవకపోతే  ఇక్కడ  ఎన్నోచోట్ల&#8230;   వీలున్న చోటల్లా వికసించిన ఆ వచన కవిత్వాన్ని మిస్ అయిపోతాం. ఆ సౌకుమార్యంతో కూడుకున్న సాయంత్రాలు, సాయంత్రాల్లోకి కమ్ముకున్న నల్లటి ఆకాశాలూ &#8230; ఆ నల్లటి ఆకాశాల్లో అందని నక్షత్రాలు, ఆ అందని నక్షత్రాల కోసం వేల వేల యేళ్ళ తరబడి కాలంతో,  ప్రకృతితో పోరాడే హృదయాలను మాత్రం ఈ అనువాదం చదివితేనే ఆస్వాదించగలం. ఏ పాత్ర మీదా  కోపం రానివ్వరు, అత్యంత హేయమైన చర్యని కూడా మరోవైపునుంచి చూస్తే , &#8216;తప్పించలేము,  వారి వైపు నుంచి చూస్తే ఇది సరైనదే&#8217; అనుకొనేలాగా ఉంటుంది. అలజడి లేని వాక్యాలతోనే ఉత్కంఠభరితమైన కథను అద్భుతంగా ఆవిష్కరించారు మైథిలి గారు.</p>
<p>&#8216;వాకిలి&#8217; పాఠకులు ఒకరు అన్నట్టు &#8220;కలంలో సరళమైన శైలి, సహజమైన ఉరవడి కలవారు. కథనంలో వేగం చూపిస్తూ రాబోయే మలుపుకోసం ఉద్విగ్నతను పెంచడంలో  ఈ రచయిత్రి గొప్ప నైపుణ్యం కలవారు. &#8221;</p>
<p>మచ్చుకు కొన్ని వాక్యాలు యధాతధంగా&#8221;</p>
<blockquote><p>“ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. కిటికీ లోంచి పడుతున్న సూర్యకాంతి వాడి బంగారపు జుట్టుతో ఆడుకుంటూ ఉంది. తల ఒక వైపుకి వాల్చి మమ్మల్ని తేరిపారచూశాడు. లియో ఉన్నట్లుండి చేతులు చాపి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేశాడు”.</p>
<p>&#8220;నువ్వు నాకిష్టం&#8221;  అని చెప్పాడు వాడు… ”నువ్వు బాలేవు, కాని మంచాడివి ”</p>
<p>&#8220;సూర్యుడి ఆగమనాన్ని ప్రకటించి కీర్తించిన దూతలూ వైతాళికులూ చీకట్ల నీడలని వెతికి తరిమికొట్టారు. అప్పుడిక దినరాజు తన సముద్రశయ్యమీంచి లేచి వచ్చాడు, భూమిని తన వైభవోపేతమైన వెచ్చదనంతో వెలిగించాడు. అలల మీద ఊగుతున్న పడవలో కూర్చున్న నేను నీటి సవ్వడిని వింటూ  మేము చేరవస్తూన్న  కొండ  కొమ్ము ని తిలకించాను&#8221;</p></blockquote>
<p>అక్కడి గుహల్లో రాణి చనిపోయినవారి శరీరాలను పదిలం చేయిస్తూ ఉంటుంది.  అలా పదిలం చేసిన ఒకానొక స్త్రీ పాదాన్ని చూసినప్పుడు అత్యంత ఆర్తితో  కూడుకున్న వాక్యాలు మనల్ని కదలనివ్వవు&#8230;</p>
<blockquote><p>&#8220;ఈజిప్షియన్ మమ్మీల లాగా అది కుంచించుకుపోయి లేదు…నున్నగా ఘనీభవించి ఉంది అంతే, కొంత పాలిపోయి.. నిప్పులోంచి  తప్పించి తీసిన జాడలు కనిపిస్తూ. ఎన్ని వేల ఏళ్ళనాటిది… ఏ ప్రాచీన నాగరికతా వైభవం లోంచి నడచివచ్చింది… కేరింతలు కొట్టే శిశువుగా, సిగ్గు చిందే కన్యగా, పరిపూర్ణమైన స్త్రీ గా? ధైర్యంగా ఏ ధూసరిత పథాలలోంచి మృత్యు సమీపానికి చేరింది? అంతకు ముందర ఏ అర్థరాత్రి ఎవరికోసమని రహస్యంగా కదిలివెళ్ళింది? ఆ అడుగు చప్పుడుకి ఏ చెవులు ఎదురు చూశాయి? తన సౌందర్యానికి తలవంచిన ఏ జగజ్జెట్టి మెడ మీద ఆనింది ఈ పాదం..ఏ ఆరాధకుల పెదవులు భక్తితో ఆనినాయి ఇక్కడ?&#8221; అని ప్రవహించే ఆ వర్ణనలో పూర్తి దృశ్యాన్ని స్వయంగా స్పృశించగలుగుతాము.</p>
<p>&#8220;ఆ అనంతమైన వైశాల్యంలో వేలకివేల నక్షత్రాలు మిలమిలమంటున్నాయి – ఆ బ్రహ్మాండమైన సౌందర్యపు ప్రకాశం ముందు మనిషి ఎంత అల్పుడో మళ్ళీ కొత్తగా తెలిసివచ్చింది. ఈ అంతటికీ అధిపతి అయిన భగవంతుడి అడుగుజాడలను అనుసరించటం ఎవరి తరం ! ఆయన ఏ పనిని ఎందుకు తలపెట్టి సాగిస్తాడో ఎవరు ఊహించగలరు!&#8221;</p>
<p>“అలా ఎలా కుదురుతుంది చెప్పు ? నులి వెచ్చ-ని ప్రేమావేశం లోంచి చలి గడ్డకట్టే మృత్యువు కౌగిట్లోకి – అంత సులువుగా జారిపోవటం సాధ్యమా? ”</p></blockquote>
<p>అందమైన తెలుగు పదాలతో, తెలుగు భావాలతో &#8230;  ఆఫ్రికాతీరంలోనూ,  ఈజిప్టు పరిసరాల్లోనూ సాగే ఈ కథని మంచి సాహిత్యం చదవాలనుకొనేవారు ఎవరూ కూడా మిస్ అవ్వకూడదని ఆశిస్తూ .. ఈ సమీక్ష నా చిన్న ప్రయత్నం !</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>రాజ్ఞి మొత్తం నవలని ఇక్కడ చదవొచ్చు: <a href="http://vaakili.com/patrika/?cat=479">http://vaakili.com/patrika/?cat=479</a></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=13250</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి?</title>
		<link>http://vaakili.com/patrika/?p=10534</link>
		<comments>http://vaakili.com/patrika/?p=10534#comments</comments>
		<pubDate>Mon, 29 Feb 2016 22:35:23 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[S.G.Jignasa]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=10534</guid>
		<description><![CDATA[ప్రముఖ రచయిత్రి ఓల్గా గారి ‘విముక్త’ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అవార్డు ప్రకటించిన సందర్భమిది. ఆ కథల రూప-సారాలపై సాహిత్యకారుల, సాహిత్యాభిమానుల మధ్య చర్చలు, వాదవివాదాలు చోటుచేసుకొంటున్న సమయమిది. ఈ కథా సంపుటి ‘నామాట’ లో రచయిత్రి చెప్పినట్లుగా తెలుగు సాహిత్యంలో చాలామంది రచయితలు పురాణ కథలను ‘కొత్త దృక్కోణం’ తో తిరగ రాశారు.]]></description>
			<content:encoded><![CDATA[<p><img class="alignleft size-full wp-image-10541" title="Vimukta" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/03/Vimukta.png" alt="" width="132" height="200" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ప్ర</span>ముఖ రచయిత్రి ఓల్గా గారి ‘విముక్త’ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అవార్డు ప్రకటించిన సందర్భమిది. ఆ కథల రూప-సారాలపై సాహిత్యకారుల, సాహిత్యాభిమానుల మధ్య చర్చలు, వాదవివాదాలు చోటుచేసుకొంటున్న సమయమిది. ఈ కథా సంపుటి ‘నామాట’ లో రచయిత్రి చెప్పినట్లుగా తెలుగు సాహిత్యంలో చాలామంది రచయితలు పురాణ కథలను ‘కొత్త దృక్కోణం’ తో తిరగ రాశారు. ఇలా తిరగ రాయడం లేదా భిన్నంగా వ్యాఖ్యానించడాన్ని ‘కొత్త దృక్కోణం’ అనడంకంటే ఆయా రచయితల ‘స్వీయ దృక్కోణం’ అని పిలవడం సబబుగా వుంటుంది. ఎందుకంటే మనం తరచుగా చూశాం, విన్నాం, గమనించాం, తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం&#8230; అనే సాధారణ మాటల్లో మాట్లాడుకుంటాం. దీని అర్థం కేవలం పంచేంద్రియాల ద్వారా తెలుసుకున్నదని మనం భావిస్తే పొరపాటు అవుతుంది. పంచేంద్రియాల ద్వారా మనకందిన ఇన్ పుట్స్ ను అప్పటికే మనలో రూపుదిద్దుకున్న లేదా రూపుదిద్దుకుంటున్న ఒక దృక్కోణంతో అంతఃచర్య (ఇంటర్ యాక్షన్) జరిపి మన భావాలుగా వెల్లడిస్తాం. అందుకే ఇన్ పుట్స్ ఒకటే అయినప్పటికీ అనుసరించే దృక్కోణాన్ని బట్టి మనిషికి మనిషికి మధ్య భావాలలో వ్యత్యాసం వుంటుంది. పురాణ కథలను తిరగ రాసేటప్పుడు&#8230; ఆమాటకొస్తే మనం వెల్లడించే భావాలన్నింటిలోను, అనుభవ సారంలోను మన స్వీయ దృక్కోణం ప్రతిబింబి౦చక మానదు. మన దృక్కోణం ప్రగతి శీలమైనది, సమాజ పురోభివృద్దికి తోడ్పడేది కావచ్చు లేదా ప్రగతి నిరోధకమైనది, సమాజ పురోభివృద్దికి అడ్డుగా నిలిచేది కావచ్చు.</p>
<p>ఈ కథా సంపుటిలో రామాయణ పురాణగాధలోని స్త్రీ పాత్రలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రచయిత్రి తనదైన శైలిలో తిరగ రాశారు. శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళ పాత్రలు ప్రధాన పాత్రధారి సీతతో చేసిన సంభాషణలు, వెల్లడించిన అనుభవ పాఠాలు, మానసిక భావోద్వేగాలు కథా సంపుటి వస్తువులో సింహా భాగం కాగా&#8230; చివర్లో రాజ్యవ్యవస్థ బంధితునిగా రాముణ్ణి చూపిన చిత్రీకరణ స్వల్ప భాగాన్ని ఆక్రమించింది. ఈ స్త్రీ పాత్రలన్నీ అనుమానానికి, అవమానానికి, అణచివేతకు, నిరాదరణకు, నిందలకు గురైనవి. రామాయణాన్ని రాసిన కాలంనుండి నేటివరకు ఇలాంటి స్త్రీ పాత్రల ప్రతిబింబాలు సాహిత్య సృజనలోనే కాక నిజ జీవితంలోకూడా భిన్న రూపాలలో మనకు కనిపిస్తాయి. ఈ విషయంలో మరో అభిప్రాయానికి ఆస్కారముండదు. అయితే ఆ కల్పిత పురాణ పాత్రలను తిరిగి వ్యాఖ్యానిస్తూ నేటి నిజ జీవిత ప్రతిబింబాలకు రచయిత్రి ఇచ్చే సందేశం లేదా రచయిత్రి స్వయంగా చెప్పిన ‘సహకారం’ ఏమిటనేది ప్రధాన ప్రశ్న, వాదవివాదాలకు కేంద్ర బిందువు.</p>
<p>మొదటి కథ-శూర్పణఖ తో సీత భేటీ అయిన ‘సమాగమనం’. రామలక్ష్మణులు శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను కురూపిగా మార్చడాన్ని సీత ‘ క్రూర పరిహాసంగా’ భావిస్తుంది. ఈ సంఘటన జరిగిన క్షణాన సీత అలా అనుకుందా! లేక కథలోని ప్రస్తుత సందర్భంలో (వాల్మీకి ఆశ్రమవాసంలో) అలా భావించిందా! అనే సందేహాన్ని అటుంచి తన కళ్ళముందు భర్తపట్ల మరో స్త్రీ ప్రేమను వ్యక్తం చేయటాన్ని నేటి సమాజంలోని ఒక సాధారణ స్త్రీ ఎలా స్వీకరిస్తుంది? తోటి స్త్రీకి జరిగిన అవమానం పట్ల విచారం వ్యక్త పర్చవచ్చునేమో! అంతేగానీ సీత దాన్నొక ‘క్రూర పరిహాసంగా’ రామలక్ష్మణులను అభిశంసించడం, శూర్పణఖను తిరిగి కలవాలనే తీవ్ర ఆకాంక్షను కలిగివున్నట్లు చూపడం ద్వారా రచయిత్రి పాఠకులకు చెప్పదల్చుకున్నదేమిటో అయోమయంగావుంది. అలాగే అందాన్ని కోల్పోయిన శూర్పణఖ ‘అగ్ని పర్వతమై’, ‘దుఃఖ సముద్రమై’ ‘ఆ కసి’ నుండి ఏం చేసిందో చూడండి! ప్రకృతి ద్వారా మళ్ళీ సౌందర్యాన్ని ప్రేమించి, రూప అరూపాల సారాంశాన్ని కనుగొని, చివరకు పరిష్కారంగా ఒక మనోహరమైన వనాన్ని స్వహస్తాలతో పెంచింది. అంటే అవమాన భరిత జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొని నిలబడడానికి; జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రోది చేసుకోవడానికి ఆమెకు తోడ్పడిన జీవిత ఘటనలేవీ కథలో కనిపించవు.</p>
<p>కేవలం ‘అనంత ప్రకృతి’ అనే అస్పష్ట భావం మినహా. ఇక శూర్పణఖ ఆ వనంలో సుధీరుడు అనే దృఢకాయుని సహచర్యంలో వుండడం, అతన్ని ఒక విధేయునిగా సీతకు చూపించడం, వారి మధ్య ఇంతవరకు ఏ స్త్రీ-పురుషుల మధ్య చూడని బంధంగా (?), శూర్పణఖ జీవితం సఫలమైనట్లుగా సీత భావించటం&#8230; అదే ఊపులో సాఫల్యానికి అర్థం పురుషుని సహచర్యంలో లేదని, అది తెలిసాకే నాకీ పురుషుని సాహచర్యం కలిగిందని శూర్పణఖ చెప్పడం&#8230; దీన్ని సీత శూర్పణఖ సాధించిన వివేకం, గాంభీర్యం అని గౌరవించడం&#8230; మొదలైన వ్యాఖ్యానాలన్నీ స్త్రీ-పురుష సంబంధాల యెడల రచయిత్రి కున్న అసహజ భావాలను వెల్లడిస్తాయి. ఎందుకంటే శూర్పణఖ వనాన్ని పెంచిన ప్రస్తావన, తోటి పక్షులు పొడిచి, పొడిచి ఈకలు పీకిన ఒక చిన్న పక్షి కలిగించిన స్పందన మినహా పది సంవత్సరాల కఠోర దీక్షలో ఆమెకు ఏం జ్ఞానోదయమయిందో, మానవ జీవిత సంఘర్షణ గురించి మరేం తెలుకుందో పాఠకులకు అంతుపట్టదు సుమా!</p>
<p>సంస్కృత పదబంధాలు శీర్షికలుగానున్న ‘మృణ్మయనాదం’, ‘సైతక కుంభం’ కథల్లో సీతతో అహల్య, రేణుక పాత్రలు సౌశీల్యం, సత్యాన్ని గురించి చేసిన సంభాషణలు కథా వస్తువులు. అహల్య, రేణుకలిద్దరూ ‘స్త్రీ ప్రాతివ్రత్యం’ అనే ఛాందస దృక్పథానికి, పురుషాధిక్య భావజాలానికి బలియైన వంచితులు. ఈ అన్యాయం వీరికి వివాహవ్యవస్థ వలన జరిగిందని; అరణ్యంలో ఎన్నో ప్రాణులకు వివాహబంధం లేదని; అనేక తెగల ప్రజల ఆచారాలు భిన్నంగా ఉన్నాయని; ప్రకృతిని-పశువులను ప్రేమించటం, పూజించటం మానవ కర్తవ్యమని అహల్య నొక్కి చెబుతుంది. వివాహ వ్యవస్థను, ఆ వ్యవస్థకు ఆధారభూతమైన భావాలను రెండింటిని ఒకటిగా భావించడం వలన ఈ గందరగోళం తలెత్తుతుంది. నిజమే! నేటికీ వివాహ వ్యవస్థ, వైవాహిక సంబంధాలు, కుటుంబ రూపాలు పురుషాధిక్య భావజాల పునాదులపై నిర్మితమైవున్నాయి. ఈ పునాదులను పెకలించివేయాలి. పురుషాధిపత్యం, అనుమానం, విచారణాధికారం మొదలైన మానసిక జాడ్యాలను నిర్మూలించాలి. మైల-శౌచం, పవిత్రం-అపవిత్రం, శీలం-పతనం మొదలైన ఛాందస మనోభావాలను స్త్రీ-పురుషులిరువురి దృక్పథం నుండి తొలగించాలి. వీటి స్థానంలో కేవలం జెండర్, చట్ట సమానత్వాన్ని మాత్రమేకాక నిజమైన సామాజిక సమానత్వాన్ని సాధించాలి. ఇరువురి వ్యక్తిత్వం, విలువలు, శక్తి-సామర్థ్యాల యెడల పరస్పర గౌరవం, నమ్మకాల ఆధారంగా స్త్రీ-పురుష సంబంధాలను పునర్న్మించాలి. అందుకు తగిన ప్రజాతంత్ర-సెక్యులర్ వివాహ వ్యవస్థను రూపొందించాలి. స్వార్థ-సంకుచితం కాని సామాజిక విలువల ఆధారంగా ఏర్పడ్డ గౌరవం, నమ్మకం నుండి జనించిన ప్రేమానురాగాలున్నప్పుడు భార్యపై భర్తకుగాని, భర్తపై భార్యకుగాని, అపనమ్మకానికి, అనుమానానికి తావుండదు. కావున స్త్రీ-పురుషుల మధ్య ఈ విధమైన ఉన్నత సంబంధాలను నెలకొల్పటానికి బలమైన సామాజిక-సాంస్కృతిక పోరాటాన్ని సంఘంలో ఇంటా-బయటా ఇరువురూ కలసి చేపట్టాలి. సరిగ్గా ఇది నేటి మానవుల కర్తవ్యం. అలాకాక రచయిత్రి అహల్య పాత్ర ద్వారా వివాహవ్యవస్థనే తృణీకరించి అరణ్యాలకు వెళ్లాలని, పశువులను లేదా ప్రకృతిని పూజించాలని మనకు చెప్పడం సముచితంకాదు. మానవ సమాజం ఆ రకమైన ఆదిమ, అరణ్య సామాజిక దశలను దాటి నేటి నాగరిక దశకు చేరుకుంది. మరింత ఉన్నత దశకు చేరుకునే పోరాటంలో ఉంది. దీనికి భిన్నంగా చెప్పడం తిరోగమనవాదమవుతుంది. అలాగే రేణుక పాత్ర ఒకచోట తండ్రి అధీనం లోనికి పుత్రులు పోతారు కాబట్టి ఆ పిల్లల్ని కనటం ఎందుకు అని నిష్టూర మాడుతుంది. ఇలా మాట్లాడడమంటే వాస్తవ జీవిత సంఘర్షణలను ధైర్యంగా ఎదుర్కొనలేక, వైవాహిక జీవితంలోని బాధ్యతలను నిర్వర్తించే ధైర్యంలేక పలాయనం చిత్తగించటమవుతుంది.</p>
<p>“ఎవరి సత్యం వారిది”&#8230; “సత్యాసత్యాలు నిర్ణయించగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా?”&#8230; “నీ మనసుకు ఏది శాంతినిస్తుందో అది సత్యమనుకో”&#8230; “సత్యం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదనీ, నిరంతరం మారుతూ వుంటుందనీ తెలుసుకోవడమే నేను సంపాదించిన జ్ఞానం”- ఇవన్నీ సత్యానికి సంబందించి అహల్య పాత్ర ద్వారా రచయిత్రి చేసిన తాత్విక నిర్ధారణలు. స్థల, కాలాదులను బట్టి సత్యం మారుతుందనేది నిజమే. అయితే ఒక నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట పరిస్థితిలో సత్యంకూడ నిర్దిష్టంగా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట దృగ్విషయానికి సంబంధి౦చి ఒక సత్యమే స్పష్టంగా ఉంటుంది. బహుళ సత్యాలుండవు, మనిషికో సత్యముండదు. ప్రకృతి, సమాజం, మానవుని ఆలోచన అనే మూడు రంగాలలో పనిచేస్తున్న నియమాలను ఆయా రంగాలకు అన్వయించగలిగే శాస్త్రీయ పద్దతి ద్వారా తెలుసుకోగలం. అనగా పరిశీలన, ప్రయోగం, నిర్ధారణలనుండి, చారిత్రిక అనుభవాలనుండి రాబట్టిన విషయాన్ని తర్కబద్దంగా విశ్లేశించి నియమాన్ని కనుగొనడానికి ఉపయోగించే పద్దతిని శాస్త్రీయ పద్దతి అంటారు. మానవుని జ్ఞానశోధనకు, సత్యాన్వేషణకు ఆధారపడ్డ ఏకైక మార్గమిదే. ఈ పద్దతిలో కనుగొన్న జ్ఞానం లేదా సత్యంలో ఏదైనా పొరపాటున్నా దాన్ని అనంతరక్రమంలో చేసే పరిశీలనలు, ప్రయోగాలు, నిర్ధారణలు, చారిత్రిక అనుభవాలనుండి సరిదిద్దుకోగలం. అలాకాక మానవుని స్వీయాత్మక ఆలోచనలనుండి, అనుభవాలనుండి తెలుసుకున్నది పాక్షిక జ్ఞానం అవుతుంది. చాలా సందర్భాలలో అది లోపభూయిష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి గొప్ప మేధావి లేదా ఆలోచనాపరుడైనప్పటికి ఆమె/అతని జ్ఞానం వైయుక్తికం లేదా స్వీయాత్మకం. దీన్ని సత్యంగా అంగీకరించడమంటే ఒక వ్యక్తి తెలుసుకున్నది మరొక వ్యక్తి తెలుసుకున్న దానికి భిన్నగావుంటూ బహుళ సత్యాలు అనే తప్పుడు భావానికి దారితీస్తుంది. అందుకే రచయిత్రి కూడా ఒకవైపు మనిషికో సత్యముంటుందని చెబుతూనే మరోవైపు “సత్యాసత్యాలను నిర్ణయించగల శక్తి ఎవరికైనా వుందా?” అనే సందేహాన్ని వ్యక్తపర్చింది. వాస్తవ సత్యాన్ని నిర్ధారించే శాస్త్రీయ పద్దతిని ఒక కొలమానంగా అంగీకరించకపోతే ఇలాంటి గందరగోళం తలెత్తుతుంది. విజ్ఞాన శాస్త్రాల విషయంలో బహుళ సత్యాలు, మనిషికో సత్యం అనే అసంబద్ద భావాలకు చోటులేదు. న్యూటన్ భౌతిక నియమాలు, డార్విన్ జీవపరిణామ సిద్దాంతం, ఐన్ స్టీన్ విశ్వ నిర్మాణ పరికల్పనలు&#8230;. విద్యుత్ నియమాలు, అయస్కాంతత్వం, గురుత్వాకర్షణ స్వభావం&#8230;.ఇలా విభిన్న విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను నిర్దిష్ట సత్యాలుగా అందరూ అంగీకరిస్తారు. కానీ వచ్చిన చిక్కంతా మానవ సమాజనికి, మానవ సంబంధాలకు సంబంధించి ఒక నిర్దిష్ట సత్యముంటుందని, ఒకే ప్రామాణిక శాస్త్ర అవగాహన వుంటుందని అందరూ అంగీకరించకపోవడమే. దీన్ని మార్క్స్ పటాపంచలు చేశాడు, మానవ సమాజ అభివృద్ది నియమాలను ఆవిష్కరించాడు. విజ్ఞాన మరియు సామాజిక శాస్త్రాలన్నింటిని సంకలనం చేసి, సమన్వయం గావించి, సాధారణీకరణ చేసి దృగ్విషయాలన్నింటిలో పనిచేసే నియమాలను వెల్లడించాడు. మార్క్స్ పరిశీలనలకు సంబంధించి, వాటి అన్వయానికి సంబంధించి మన అవగాహనలో వ్యత్యాసాలుండవచ్చు. వాటిని చర్చించాలి, స్పష్టపర్చుకోవాలి. అంతేకాని మానవ సంబంధాలకు సంబంధించి ఒకే సత్యమేది లేదని, నీ మనసుకు ఏది శాంతినిస్తుందో అది సత్యమని సూత్రీకరిస్తే మనుషుల ప్రవర్తనకు, విలువల అవగాహనకు ప్రాతిపదిక లేకుండాపోతుంది. సమాజానికి అడవికి తేడా లేకుండా పోతుంది. ఈ కథల్లో సరిగ్గా ఇదే తేలింది. ఇదే దారిలో రచయిత్రి ఒక అడుగు ముందుకేసి అరణ్యజీవితాన్ని, పశువులను ఆదర్శంగా చూపించింది.</p>
<p>అహల్య, రేణుకలతో పాటుగా ‘విముక్త’ కథలోని ఊర్మిళ పాత్ర కూడా జ్ఞాన సంపాదనకు, సత్య శోధనకు మార్గాన్ని తెలుసుకున్నానని సీతతో గట్టిగా చెబుతుంది. “జ్ఞాన సంపాదనకు అనుభవాన్ని మించిన మార్గం మరొకటి లేదమ్మా” అని అహల్య పలికితే, “ఎవరికైనా అనుభవం నుంచే సత్యం బోధపడుతుంది” అని రేణుక ఉద్భోదిస్తుంది. ఊర్మిళ ఏకంగా “పధ్నాలుగేళ్ళు సత్య శోధనలో నేజేసిన గొప్ప తపస్సును నిద్ర అనుకునే వాళ్ళకు నా మాటలు అర్థమవుతాయా?” అని ప్రశ్నిస్తుంది. రచయిత్రి ఉద్దేశ్యంలో సత్యాన్ని తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి వైయుక్తిక అనుభవమే మార్గం. ఆ అనుభవం కూడా ఆ పాత్రలు తమను తాము తెలుసుకోవడం ద్వారాను, తమలోపలున్న అసలైన దాన్ని అన్వేషించడం ద్వారాను పొందినదే. ఈ తరహా అవగాహనను తాత్విక పరిభాషలో ఎంపిరిసిజం అంటారు. వ్యక్తుల స్వీయాత్మక అనుభవాలనే సత్యంగా భావించే ఒకానొక భావవాద ధోరణిది. ఇంతకు మునుపు చెప్పినట్లు శాస్త్రీయ పద్దతిలో కాకుండా ఇతరేతర మార్గాలలో పొందిన జ్ఞానమేదైనా సత్యాన్ని పాక్షికంగా దర్శించడానికి తోడ్పడవచ్చునేమో. అనుభవ జ్ఞానం కూడా అన్ని సందర్భాలలో మనిషికి మార్గదర్శకం చూపలేదు. చాలా వరకు అది సత్య దూరమైనదేకాక మనిషిని తప్పుదోవపట్టిస్తుంది కూడా. వాస్తవానికి మానవ సమాజం సమిష్టిగా చేసిన, చేస్తున్న పోరాటాలనుండి జ్ఞానం వృద్దిచెందుతుంది. తత్భిన్నంగా తమను తాము తెలుసుకోవడం లేదా తమలోపలికి లోతుగా తొంగిచూడడం ద్వారా జ్ఞానం పొందడమనేది కూడా మతసహిత లేదా మతరహిత భావవాద తాత్విక ధోరణి నుండి పుట్టుకొచ్చిన ‘సెల్ఫ్ రియలైజేషన్’ భావన. సాధుసన్యాసుల, బాబాల అధ్యాత్మిక ప్రసంగాలన్నీ ఇదే భావన చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. జీవిత సమస్యలకు ప్రత్యేకించి స్త్రీలపై దాష్టీకాలకు, పురుషాధిక్యతకు చారిత్రక కారణాలను, వారి విముక్తికి మార్గాన్ని స్త్రీలు గత మరియు వర్తమాన సమాజ వాస్తవిక పరిస్థితులనుండి తెలుసుకొని చైతన్యవంతులై సంఘటితం కావాలి. అన్ని రకాల అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే ప్రజల సమిష్టి పోరాటాలలో భాగస్వాములవ్వాలి. తాము ఏ విధంగానూ తక్కువకాదు అని దృఢంగా విశ్వసించాలి. అందుకుగాను కాలంచెల్లిన పాతభావాలనుండి, నిస్సహాయతనుండి బయటపడడానికి ఏదైనా అడ్డుగా వుంటే దాన్ని తొలగించుకోవటానికి తమ లోపలికి తాము చూసుకువాలి. అలాకాక సమాజంనుండి, జీవితంనుండి పారిపోయి అడవిలోనో (శూర్పణఖ, అహల్య, రేణుకలు), అంతఃపుర మహలు తలుపులు బిగించుకొని ఒంటరిగా (ఊర్మిళ) ఎవరికివారే జ్ఞానోదయాన్ని పొందడం సాధ్యమా? ఇది మహా ఋషులు హిమాలయాల్లో ముక్కుమూసుకొని చేసే తపస్సులాంటిది. సమాజంతో సంబంధంలేకుండా లోపలికి తొంగిచూసుకునే ఈ తప్పుడు భావం సాధారణ స్త్రీలలో నిష్క్రియాపరత్వాన్ని పెంపొందిస్తే, సామాజిక పోరాటాలతో సంబంధంలేకుండా పండిత జ్ఞానం పొందిన కొద్దిమంది విద్యాధిక స్త్రీలలో టిపికల్ వ్యక్తిగతవాదాన్ని ప్రేరేపిస్తుంది. ఈ అభివృద్ది నిరోధక భావజాలాన్ని పురాణ పాత్రలచే ఎంత అందంగా చెప్పించినా అంగీకరించలేము. మెత్తంగా ఈ కథా సంపుటిలోని స్త్రీ పాత్రల సంభాషణలన్నీ మానవ జీవితంపై ఆశావహ ధృక్పథంలేని భావజాలాన్ని నూరిపోస్తాయి. ‘మగవాళ్ళందరూ ఒక్కటే సీతా!’ అని ఒకవైపు ఆక్షేపిస్తూనే మరోవైపు చివరి కథ ‘బంధితుడు” లోని మగ పాత్ర రాముడు కూడా నిస్సహాయుడై, గాఢాంధకారంలో మునిగి వుండడం కథాసంపుటికి సంగ్రహ వాక్యంగా చెప్పవచ్చు. ఈలాంటి కథలు ‘స్త్రీలకు బలాన్ని, ధైర్యాన్ని, వివేకాన్ని’ కలిగిస్తాయని చెప్పగలమా?!</p>
<p>చివరగా కథాసంపుటి సంవిధానం గురించి ఒక మాట చెప్పాలి. సాధారణంగా సాహిత్యంలో వివిధ పాత్రలు భిన్న స్వభావాలను, చిత్తప్రవృత్తులను, మానసిక ఉద్వేగాలను కలిగివుండి వాటి సంభాషణల్లో వైవిధ్యం ఉంటుంది. పాత్రల పరస్పర సంభాషణల ద్వారా కథాగమనం జరిగితే కథరక్తి కట్టి పాఠకులు అందులో లీనమవుతారు. దీనికి భిన్నంగా పాత్రలన్నీ ఒకే మూసలో పోసినట్లుగా, సంభాషణలన్నీ ఒకే తీరుగా, రచయిత్రి అన్ని పాత్రలను ఆవహించి పలికించినట్లుగా ఉంది. శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళలు గురు పీఠాన్ని అధిరోహించి సీతను ఒక శిష్యురాలిగా చేసుకొని అధ్యాత్మిక ప్రవచనాలు వినిపించినట్లుగా వుంది. రసాత్మకం కానీ వాక్యం కావ్యార్హతను పొందుతుందా?!</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=10534</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>నా ఎఱుక</title>
		<link>http://vaakili.com/patrika/?p=8503</link>
		<comments>http://vaakili.com/patrika/?p=8503#comments</comments>
		<pubDate>Mon, 01 Jun 2015 02:12:18 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[రాజశేఖర్ పిడూరి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=8503</guid>
		<description><![CDATA[గ్రాంథిక శైలిలో రాయబడ్డ పుస్తకాన్ని ఆధునిక పాఠకుడు సులభంగా చదువుకోవడానికి వీలుగా మోదుగుల రవికృష్ణగారు ఎంతో శ్రమకోర్చి పరిష్కరించి వేసిన ప్రతి ఇది. ఈ పుస్తకానికి రవికృష్ణగారు రాసిన ముందుమాట చదివితే పుస్తకం లోపలికి ప్రవేశించకుండా ఉండలేం.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/06/Ajjada_Adibhatla_Narayana_Dasu.jpg"><img class="alignleft size-full wp-image-8506" title="Ajjada_Adibhatla_Narayana_Dasu" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2015/06/Ajjada_Adibhatla_Narayana_Dasu.jpg" alt="" width="220" height="303" /></a>ఆదిభట్ల నారాయణ దాసుగారు రాసిన తన జీవిత కథ &#8216;నా ఎఱుక&#8217;</p>
<p>గ్రాంథిక శైలిలో రాయబడ్డ పుస్తకాన్ని ఆధునిక పాఠకుడు సులభంగా చదువుకోవడానికి వీలుగా మోదుగుల రవికృష్ణగారు ఎంతో శ్రమకోర్చి పరిష్కరించి వేసిన ప్రతి ఇది. ఈ పుస్తకానికి రవికృష్ణగారు రాసిన ముందుమాట చదివితే పుస్తకం లోపలికి ప్రవేశించకుండా ఉండలేం.</p>
<p>1864-1945 మధ్యలో జీవించిన దాసుగారు ఆ నాటి వాతావరణాన్నిచక్కగా వర్ణించారు. అంతేగాక తనలో ఉన్న లోపాల్ని నిర్భయంగా వెళ్ళగక్కారు. కాబట్టి శ్రీ శ్రీ ఆద్యుడేం కాదు ఇలాంటి ఒప్పుకోళ్ళకు. ఇలాంటి ఎన్నో భ్రమల్ని బద్దలు కొట్టే గ్రంథం ఇది.<br />
దాసుగారి జననం దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జరిగింది. తనలో ఉన్న సంగీత సాహిత్య ప్రతిభ కాకుండా ఆయన బాల్యం గురించి చెప్పుకునేటప్పుడు కనిపించే ఒక ముఖ్యమైన విశేషం వాళ్ళ నాన్న గారు. ఈయన పరమ పరిశుద్ధుడై ఉండి ఉండాలి అని అనిపించక మానదు &#8211; దాసుగారు ఈయన్ని గురించి రాసిన ఒకటి రెండు సంఘటనలు చదివితే (నిప్పు కణిక కాలి మీద పడినా ఏమీ తొణక్కుండా &#8216;బ్రాహ్మణుడూ అగ్ని ఒకటే&#8217; అనడమూ, బావిలో గంగ పడడానికి మంత్రం పఠించడమూ &#8211; అంతకన్నా ముఖ్యం ఇలాంటి సంఘటనల పట్ల ఎలాంటి ఆర్భాటమూ లేకుండా సాక్షీమాత్రంగా ఉండడమూ).</p>
<p>పదమూడు పద్నాలుగేళ్ళకే సంగీతంలోనూ, సాహిత్యంలోనూ వీణ్ణి కొట్టేవాడు లేడురా అని అందరి చేతా అనిపించుకునేంత ప్రతిభ చూపించేరట దాసుగారు. కన్నమనాయుడు అనే ఆయన హరికథ చెప్తుంటే విని తను కూడా అలా ఆడి పాడి రంజింప చేయాలన్న కోర్కె కలిగి హరికథా ప్రక్రియ మీద పడ్డారు. ఇక ప్రతి ఉన్నతోద్యోగి వద్దా, జమిందారుల వద్దా అష్టావధానమో (గ్రీకు అక్షరాలతో సాముగరిడీలు, ఆల్జీబ్రా ప్రాబ్లమ్ సాల్వ్ చేయుట అనే అంశాలు కూడా దాసుగారు చేసిన అవధానాల్లో ఉన్నై &#8211; అంటే అప్పుడే ఈ ప్రక్రియలో వినూత్న ధోరణులు ప్రవేశ పెట్టారన్నమాట దాసుగారు), హరికథలను అప్పటికప్పుడు రాసి పాడటమో, ఆరేడు గంటల పాటు ఏకబిగిన అందరినీ స్పెల్ బౌండ్ చేస్తూ కథాకాలక్షేపం చేయడమో చేసి కట్నాలు లాగడం (నగదు, ఇతర బహుమతులు) లాంటి సంఘటనలను వర్ణించారు ఈ పుస్తకంలో. దాంతో పాటే చిన్న గురుడికీ (అంటే దేశవాళీ నల్లమందు మత్తు) తర్వాత క్రమంగా పెద్ద గురుడికీ (అంటే సీమ సరుకు) అలవాటు పడ్డారు. నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే అలవాటైన ఈ విపరీతాలకు తోడు వేశ్యాలంపటం. ఇవేవీ దాచకుండా 1940 ల్లోనే ఇంత నిర్భయంగా తన జీవిత చరిత్రని రాసుకోవడం ఒక రకంగా గొప్ప విషయమే. వీటన్నింటినీ యవ్వనపు &#8220;శాఖామృగచేష్టలు&#8221; గా అభివర్ణించుకున్నారు దాసుగారు.</p>
<p>ఆ కాలంలో ఉన్నత వర్గాల (జమిందార్లు, ఉన్నతోద్యోగులు) వద్ద సాంప్రదాయికంగా కళాప్రదర్శన చేసే వారికి లేని సౌలభ్యం దాసుగారి వద్ద ఒకటి (సంగీత సాహిత్యాలలో తనకున్న అత్యుత్తమ ప్రతిభావ్యుత్పత్తులు కాక) ఉండేదని మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదేమిటంటే ఇంగ్లీషులో కూడా కవిత్వం చెప్పగలగడం. తను తెలుగులో, సంస్కృతంలో పాడిన వాటిని తక్షణమే ఇంగ్లీషులోకి కవితాత్మకంగా మార్చగలిగే ప్రతిభ దాసుగారికి ఉండేది. తెలుగు తెలియని మైసూరు మహారాజా గార్ల లాంటి వారి వద్ద తన తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషులోకి వెంటనే అనువదించి చెప్పగలగడం వల్ల మిక్కిలిగా కీర్తి, ధనమూ సంపాదించారు.</p>
<p>అయినా తను చేసేదంతా రంజింప చేయడమేననీ, &#8216;అసలు&#8217; కాదని అంతర్గతంగా దాసుగారికి అనిపించిందేమో! &#8211; ఒకచోట &#8216;రూపమునకెల్కగాని చేయునవి పందికొక్కు చేష్టలన్నట్లు విశ్వాసమునకు తగు వైరాగ్యమబ్బలేదు. తత్త్వజ్ఞానమునేమాత్రమును లేదు&#8217; అని రాసుకున్నారు.</p>
<p>ఇంకా ఒకళ్ళ వద్ద ఉద్యోగం చెయ్యలేని తన ధోరణిని, స్వేచ్ఛాప్రవృత్తిని వివరిస్తూ &#8211; &#8216;విహంగన్యాయమున బ్రతుక నిశ్చయించితిగాని యొరుల నౌకరీసేయునుద్దేశము నాకెన్నటికినీ లేదు. మరియూ కొండలు, నదులు, వనములు, జంతుజాలములు, సూర్యాదిగ్రహములు, ప్రకృతి మహిమయూ చూసి ఆనందించుటయు, జనుల మంచి చెడ్దలు కనిపెట్టి తర్కించుటయు, తరచుగా గురునివశమున యదేచ్ఛాసంచారము సేయుచుంట నా వృత్తి&#8217; అన్నారు.</p>
<p>రంజింప చేసే ప్రతిభే కాకుండా దాసుగారిలో పాండితీప్రకర్షకి కొదవ లేదని తెలుస్తుంది. కా్త్వర్థక ప్రయోగంలో భిన్న కర్తృకం ఉండేటట్లు ఏదో పద్యం చెప్పారట దాసుగారు విజయనగరం రాజా వారి ముందు. (ప్రధాన క్రియ ముందు వాడే అసమాపక క్రియా రూపాలు &#8211; చేసి, చూసి, నిలబడి లాంటివాటిని కా్త్వర్థక క్రియలు అంటారు. ఇవి ప్రయోగించబడిన వాక్యంలో క్రియలన్నింటికీ ఆశ్రయంగా ఉండే కర్త ఒకరే ఉండాలనేది బాల వ్యాకరణంలో ప్రముఖ సూత్రం. నేను పాలు తాగి వాడు నిద్ర పోయాడు లాంటి వాక్యాలు వ్యాకరణ సమ్మతాలు కాదు అని చెప్పేది ఈ సూత్రం).</p>
<p>&#8216;మీరు చేసిన ప్రయోగం తప్పు అని ఒప్పుకోండి లేదా ప్రమాణమైనా చూపండి&#8217; అని రాజావారు అంటే ఆ రాత్రి భారతమంతా వెతికి భిన్న కర్తృక కా్త్వర్థక ప్రయోగానికి – &#8216;రాహుకంఠముదెగి దేహము ధరణిబడియె&#8217; అనే దాన్ని ప్రమాణంగా చూపించారట.<br />
దాసుగారు &#8216;శంభో&#8217; అంటే విజయనగరమంతా ప్రతిధ్వనించడం, కాళ్ళతో చేతులతో తలతో ఐదు భిన్న తాళాలను ఏకకాలంలో వేయగలగడం లాంటి విషయాలు చాలా ప్రసిద్ధాలు కాని కా్త్వర్థక ప్రయోగాల గురించి కూడా పండితుల్ని ఎదుర్కొనే సత్తా, పాండితీవైదగ్ధ్యం ఉందన్న విషయం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. దాసుగారి దగ్గు కూడా లయబద్ధమే అంటున్నారు శంకర శ్రీరామారావు అనే ఆయన తన వ్యాసంలో (అనుబంధంలో ఇచ్చారు).</p>
<p>(కా్త్వర్థకాలు భిన్న కర్తృకాలను సహించవు అనే సూత్రానికి చాలానే మినహాయింపులని చేకూరి రామారావు గారు తన తెలుగు వాక్యం అనే పుస్తకంలో సంశ్లిష్ట వాక్యాలు అనే రెండో అధ్యాయంలో విపులంగా చర్చించి ఇచ్చారు &#8211; గొర్రెలని తినేవాడు పోయి బర్రెలని తినేవాడు వచ్చాడు, ఈ రాష్ట్రంలో కమ్యూనిష్టులు గెలిచి ఆ రాష్ట్రంలో కాంగ్రెసోళ్ళు గెలిచారు లాంటివి. ఆసక్తి కలవారు చేరా పుస్తకం చూడవచ్చు)</p>
<p>ముప్ఫై ఏళ్ళు దాటాక ఇక తన సంసారాన్నీ, దాంతో పాటే సంప్రదాయాన్నీ, తనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఫ్యూడల్ సంస్కృతినీ కాపాడుకోవాల్సిన అగత్యం దాసుగారికి కలిగినట్లు కనపడుతుంది. పోకిరీ వేషాలు (సానులు, మత్తు మందులు వగైరా) కొంత మానినట్లు దాంతో పాటే హిపోక్రిట్ గా మారినట్లు అనిపిస్తుంది. కొంత వయసొచ్చాక ఆయన – &#8216;సంగీత విద్యకలవానికి దుష్ప్రవర్తన సహజం&#8217;, &#8216;సంసార స్త్రీలకు భోగం స్త్రీలకిమల్లే సంగీతం నేర్పకూడదు&#8217; లాంటి భావాలు వెలిబుచ్చారు.</p>
<p>తను శారీరక భోగాలన్నీ బాగా అనుభవించేసి కొంత వేడి తగ్గాక ఛాందస భావాలతో దేశోద్ధరణ చేసే భావజాలం అనిపిస్తుంది ఇదంతా. అట్లానే వితంతు వివాహాల్ని, స్త్రీ విద్యను, కందుకూరి వీరేశలింగం గారి కార్యక్రమాల్ని వ్యతిరేకించారు దాసుగారు.</p>
<p>దాసుగారి కన్నా రెండేళ్ళు ముందు పుట్టి దాసుగారి కన్నా ముప్ఫై ఏళ్ళ ముందే మరణించిన గురజాడకీ ఈయనకీ ఎంత తేడా? అనిపిస్తుంది.</p>
<p>ఎన్ని దురలవాట్లు ఉన్నా, డబ్బు కోసం ఉద్యోగుల వెంటా ప్రభువుల వెంటా పడినా దాసుగారిలో ఉన్న ఒక అమోఘమైన తేజస్సు, శక్తి వల్ల అందరూ ఆయనకి దాసోహం అయ్యారు అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. ఒక మునసబు గారితో దాసుగారి సంభాషణ దీన్ని పట్టిస్తుంది.</p>
<p>ఈ పుస్తకంలో ఆసక్తి కలిగించే పదాలు, ప్రస్తావించబడ్డ విశేషాలు, సంఘటనలు &#8230;.</p>
<p>1. పిడకలు ఎత్తుకునే అమ్మాయికి దాసుగారు &#8216;కరీషకరండవాహిని&#8217; అనే పదం వాడారు (రాజులకి తాంబూలం కట్టి ఇచ్చే అడపకత్తెను తాంబూలకరండవాహిని అన్నట్లుగా). ఏదో పితూరి వచ్చి కరీషకరండవాహినితో కలబడ్డారట దాసుగారొకసారి!</p>
<p>2. గురజాడ తన డైరీలలో ప్రస్తావించిన మద్రాసు ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదం గురించి దాసుగారు కూడా ఒకచోట ప్రస్తావించారు. అట్లానే బెంగుళూరు లాల్ బాగ్ లో పుష్పప్రదర్శనని చూశారట దాసుగారు.</p>
<p>3. కించిద్భోగోభవిష్యతి కథ – నారదుడు ఓ పుర్రెనెత్తుకుని (సముద్రతీరంలో) తన తాత దాని నుదుటన రాసిన కష్టాలు, సుఖాలు చదివి చివర్లో &#8216;చనిపోయిన కొన్నేళ్ళకు అనుకోని అపూర్వమైన అదృష్టం పడుతుంది&#8217; అన్న వాక్యం చదివి ఆశ్చర్యపోయాట్ట. ఇదేంటో తెలుసుకుందామని బ్రహ్మలోకం వెళ్ళి తాతగారిని ప్రశ్నిస్తే &#8220;ఎంత తలక్రిందులుగా తపస్సు చేసినా లభ్యం కాని బ్రహ్మలోక ప్రవేశం ఈ వ్యక్తి పుర్రెకు లభించింది కదా! అదే ఆ అదృష్టం అన్నాట్ట.</p>
<p>4. ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా &#8211; అంటే ఈ జన్మలో నేర్వకుండానే పూర్వజన్మ నించి పట్టుబడ్డ విద్యలట. కుమార సంభవం లో పార్వతి గురించి కాళిదాసు అన్న ఈ మాటను తనకి దాసుగారు అన్వయించుకున్నారు. నిజమే కదా! అని అనిపించక మానదు.</p>
<p>5. ఏతచ్చిత్ర పటం భాతి&#8230;. &#8211; పటంలో ఉన్న పచ్చిక బయలు కళ్ళకు ఎలా తృప్తినిస్తుందో విద్వాంసులు కూడా దర్శనమాత్రం చేత సంతోషాన్ని కలిగిస్తారు.</p>
<p>6. వేసవికాలం గురించి దాసుగారి కవితాత్మక వాక్యం &#8211; &#8216;అగ్ని తూలుతున్నట్లున్న ఎండ&#8217; చదివితే శ్రీశ్రీ వాక్యాలు &#8211; ఎండ తీవ్రంగా ఉపన్యసిస్తోంది, మధ్యాహ్నపు మండుటెండ నోటికొచ్చినట్లు పేలుతోంది&#8217; లాంటివి గుర్తుకొస్తాయి.</p>
<p>7. అచ్చతెలుగు మాటలు వాడటంలో ఘనుడనిపించుకున్న దాసుగారు రిహార్సల్స్ కి &#8216;శుష్కేష్టి&#8217; అన్న సంస్కృత పదం వాడటం ఆశ్చర్యం అనిపిస్తుంది &#8211; &#8216;ఒద్దికలు&#8217; అన్న తెలుగు మాట ఉండగా.</p>
<p>ఈ పుస్తకం వేయడంలో రవికృష్ణ గారి కృషి అభినందనీయం. కొన్ని సందేహాలు, సూచనలు &#8230;.</p>
<p>1. దాసుగారు చేసిన ప్రయాణాలు, కలుసుకున్న ప్రభువులు, పొందిన అనుభవాలు &#8211; వీటి గురించి ఆయన రాసుకున్న ధోరణి చూస్తే ఆయనలో సహజంగా కొంత పెడసరితనం, మొండితనం, తెంపరితనం ఉన్నాయనిపిస్తుంది. ఈ విషయాన్ని చక్కగా ముందుమాట లో నిదానించారు మోదుగుల రవికృష్ణగారు. కాని దాసుగారు తన చెడ్డ అలవాట్లన్నింటిని ముప్ఫై ఏళ్ళకే వదుల్చుకున్నారని తేల్చేశారు. తిరుమల రామచంద్రగారి ఆత్మకథ – &#8216;హంపీ నుంచి హరప్పాదాకా&#8217; లో &#8211; నెల్లూరు మూలపేట వేదపాఠశాలలో చదువుకుంటున్న సమయంలో దాసుగారి హరికథా కాలక్షేపానికి వినాయక హాలుకి వెళ్ళాననీ, ఆరోజు దాసుగారు వేదిక మీదకి వచ్చి &#8216;వ్యత్యస్త పాదారవిందా&#8217; అని అంటూ తూలి విరుచుకు పడిపోయారని టిక్కెట్లు కొని వచ్చిన జనం పెద్ద గోల చేశారని రాసుకొచ్చారు. ఈ సంఘటన తిరుమల రామచంద్రగారి కథనం ప్రకారం 1932-34 మధ్య జరిగింది. అంటే దాసుగారికి దాదాపు డెబ్భై ఏళ్ళన్నమాట. కాబట్టి ముప్ఫై ఏళ్ళకే దురలవాట్లన్నింటిని వదుల్చుకున్నారన్న విషయం సరికాదనిపిస్తుంది.</p>
<p>2. బందరులో దాసుగారికిచ్చిన వీడ్కోలు సభలో ఒకాయన బొంబాయిలోని &#8216;బ్రాడ్లా&#8217; గారి గురించి ప్రస్తావించారు. ఈ బ్రాడ్లా ఎవరనే వివరం అధోజ్ఞాపికలో ఇస్తే బాగుండేది.</p>
<p>3. మత్తుమందులు, శృంగారపిపాసలతో సలసల మరిగిపోతూ తన సంగీత సాహిత్యాలతో ఉర్రూతలూగించగల దాసుగారు పరమ పవిత్రమైన హరికథలు చెప్పడం మనస్సుకి కష్టంగా తోచి ఒక ప్రముఖ వెలయాలు సలహా ఇచ్చిందట &#8211; &#8216;మీకు ఉద్యోగమే ఉచితం, సానిపాప వలె ఆడి జీవించుట కాదు. పరమ పవిత్రులు చేయాల్సిన హరికథావృత్తికి మీ వంటి శృంగార శేఖరులు తగరు&#8217; అని. దానికి ఆదిభట్ల గారి జవాబు &#8220;కొలనునుండి కొండకేగిన కలహంసది తప్పుగాని కాకిది తప్పా?” &#8211; ఈ జవాబు కొంచెం కన్ఫూ్యజింగ్ గా ఉంది. అంటే నిజానికి తాను కలహంసలాగా కనిపించే కాకినని దాసుగారి ఉద్దేశమా? నేను కాకి వంటి వాడినే, నాకు ఈ రంజింపచేసే వృత్తే (కొండ మీద కాకిలాగా తిరగడం) విధాయకం అని దాసుగారు అంటున్నారా? అన్న సందేహం వస్తుంది. అలా చటుక్కున అనేసే వ్యక్తి కాదు అని కూడా అనిపిస్తుంది. దీనికి కొంచెం వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.</p>
<p>సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఆనాటి సమాజపు ధోరణులు తెలుసుకోవాలనుకున్నవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=8503</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రకృతీ, ప్రేమల ఆత్మీయ నెమరువేత: పునశ్చరణం</title>
		<link>http://vaakili.com/patrika/?p=6989</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6989#comments</comments>
		<pubDate>Sun, 30 Nov 2014 19:58:14 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[నారాయణ గరిమెళ్ళ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6989</guid>
		<description><![CDATA[<p>కొన్ని మాధుర్యాలుంటాయి. ఎలా అంటే- అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తడిమి తడిమి అదే పనిగా చూసుకోవటం, పరాయి దేశంలో అనుకోకుండా కలిసిన చిన్ననాటి ఆప్తమితృడిని తరచి తరచి ఆనంద పారవశ్యంలో పరామర్శించడం, ఏళ్ళకు ఏళ్ళు ప్రియురాలికి దూరమైన ప్రేమికుడు ఆమెను కలిసినప్పుడు పదే పదే ఆలింగనం చేసుకోవడం వంటి తన్మయత్వము కల్గించే విషయాలు. ఇంతటి గొప్ప మాధుర్యాన్ని కొందరు ‘మనసుపెట్టి ఇష్టంగా పూర్తి చేసిన పనిలోనూ, హృదయ పూర్వకంగా వ్రాసిన కవితలోను, సర్వస్వమూ లగ్నం చేసి ప్రదర్శించిన కళ వంటి విషయాల లోను, ముఖ్యంగా వాటి పునశ్చరణము (పునర్-సందర్శనం) లో పొందగలరు. అంకిత భావంతో నిర్వహించిన పనులకున్న విశేషణము అంతటిది. తిరిగి సందర్శించినప్పుడు మాధుర్యాన్నిచ్చే ఇలాంటి తన అనుభూతులు, అనుభవాలతో కూడిన 36 కవితల అపురూపమైన సమాహారాన్ని పునశ్చరణం కవితా సంకలనంగా మన ముందుంచారు కవయిత్రి డా. వైదేహి శశిధర్ గారు.</p> <p>అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో తనకోసం చేసిన తాయిలాన్ని అపురూపంగా బడికి తీసుకొచ్చి ఆ కమ్మదనాన్ని తుంచి ఇచ్చి మనతో కూడా పంచుకున్న బాల్యపు మిత్రుడో మిత్రురాలో ఉంటే ఆ స్నేహ బాల్యం ఎంత మధురంగా ఉంటుంది!? అలాంటి స్నేహపు మాధుర్యాన్ని చవి చూడాలనిపిస్తే ఈ ‘పునశ్చరణం’ కవితలలో మునిగి తేలితే అనుభవానికొస్తుంది.</p> <p>మొదట కవితలో ‘కచ్చేరీ’ చేసినప్పటి లేదా చూసినప్పటి పారవశ్యాన్ని, మరొక కవిత ‘సభ ముగిశాక’లో కూడా అంతే భావావేశంతో చెప్పడం అంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే ముగిసిపోయిన సభలో కోలాహలం, ఉత్కంఠ, మమేకం వంటివేవీ ఉండవు. కానీ, దానినీ అవలీలగా తన చక్కటి కవిత్వ సోయగంతో చూపించారు వైదేహి గారు.</p> <p>కోలా హలపు అలల మీద ఆడిటోరియం<br /> అరటిదొన్నెలా తేలుతుంది<br /> &#8230;.<br /> మొగ్గ విచ్చుకున్నంత నిశ్శబ్దంగా<br /> తెరలేస్తుంది<br /> &#8230;.<br /> గాంధర్వలోకపు లోతుల్లోకి<br /> &#8230;విసిరేస్తూ<br /> ఆమె ఆలాపన మొదలవుతుంది</p> <p>అని కచ్చేరీ కవితలో సుతిమెత్తని ఆలాపనతో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><span style="font-size: 30px;"><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/VaidehiSasidhar.jpg"><img class=" wp-image-6995 alignleft" title="VaidehiSasidhar" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/VaidehiSasidhar-300x298.jpg" alt="" width="180" height="179" /></a>కొ</span>న్ని మాధుర్యాలుంటాయి. ఎలా అంటే- అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తడిమి తడిమి అదే పనిగా చూసుకోవటం, పరాయి దేశంలో అనుకోకుండా కలిసిన చిన్ననాటి ఆప్తమితృడిని తరచి తరచి ఆనంద పారవశ్యంలో పరామర్శించడం, ఏళ్ళకు ఏళ్ళు ప్రియురాలికి దూరమైన ప్రేమికుడు ఆమెను కలిసినప్పుడు పదే పదే ఆలింగనం చేసుకోవడం వంటి తన్మయత్వము కల్గించే విషయాలు. ఇంతటి గొప్ప మాధుర్యాన్ని కొందరు ‘మనసుపెట్టి ఇష్టంగా పూర్తి చేసిన పనిలోనూ, హృదయ పూర్వకంగా వ్రాసిన కవితలోను, సర్వస్వమూ లగ్నం చేసి ప్రదర్శించిన కళ వంటి విషయాల లోను, ముఖ్యంగా వాటి పునశ్చరణము (పునర్-సందర్శనం) లో పొందగలరు. అంకిత భావంతో నిర్వహించిన పనులకున్న విశేషణము అంతటిది. తిరిగి సందర్శించినప్పుడు మాధుర్యాన్నిచ్చే ఇలాంటి తన అనుభూతులు, అనుభవాలతో కూడిన 36 కవితల అపురూపమైన సమాహారాన్ని పునశ్చరణం కవితా సంకలనంగా మన ముందుంచారు కవయిత్రి డా. వైదేహి శశిధర్ గారు.</p>
<p>అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో తనకోసం చేసిన తాయిలాన్ని అపురూపంగా బడికి తీసుకొచ్చి ఆ కమ్మదనాన్ని తుంచి ఇచ్చి మనతో కూడా పంచుకున్న బాల్యపు మిత్రుడో మిత్రురాలో ఉంటే ఆ స్నేహ బాల్యం ఎంత మధురంగా ఉంటుంది!? అలాంటి స్నేహపు మాధుర్యాన్ని చవి చూడాలనిపిస్తే ఈ ‘పునశ్చరణం’ కవితలలో మునిగి తేలితే అనుభవానికొస్తుంది.</p>
<p>మొదట కవితలో ‘కచ్చేరీ’ చేసినప్పటి లేదా చూసినప్పటి పారవశ్యాన్ని, మరొక కవిత ‘సభ ముగిశాక’లో కూడా అంతే భావావేశంతో చెప్పడం అంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే ముగిసిపోయిన సభలో కోలాహలం, ఉత్కంఠ, మమేకం వంటివేవీ ఉండవు. కానీ, దానినీ అవలీలగా తన చక్కటి కవిత్వ సోయగంతో చూపించారు వైదేహి గారు.</p>
<blockquote><p>కోలా హలపు అలల మీద ఆడిటోరియం<br />
అరటిదొన్నెలా తేలుతుంది<br />
&#8230;.<br />
మొగ్గ విచ్చుకున్నంత నిశ్శబ్దంగా<br />
తెరలేస్తుంది<br />
&#8230;.<br />
గాంధర్వలోకపు లోతుల్లోకి<br />
&#8230;విసిరేస్తూ<br />
ఆమె ఆలాపన మొదలవుతుంది</p></blockquote>
<p>అని కచ్చేరీ కవితలో సుతిమెత్తని ఆలాపనతో కవిత్వానికి తెర తీశారు. అలలు, అరటిదొన్నె తేలడం, మొగ్గ విచ్చినట్టు తెర లేవడం లాంటి సున్నితమైన పోలికలను కవిత్వములో చేర్చి తనంత ఇష్టంగా మనల్ని కూడా కుర్చోబెట్టి కచ్చేరీ ని ఆస్వాదించే ప్రేక్షకుల్ని చేస్తారు ఈ తొలి కవితలోనే.<br />
సభముగిశాక కవిత ఇలా ప్రారంభమవుతుంది.</p>
<blockquote><p>సంరంభంతో రెపరెపలాడిన<br />
ఉత్సాహపు తోరణాలు<br />
ఉత్సవాల షామియానాలు<br />
చెదిరిన ముంగురులని సర్దుకుంటాయి</p></blockquote>
<p>ఇక్కడ ముంగురులు సర్దుకోవడం అనేది అలసటనుండి సేద తీరబోతున్న సానుకూల చర్యే.</p>
<blockquote><p>రోజంతా సాహితీ గగనంలోకి<img class="alignright  wp-image-6993" title="Punascharanam" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/Punascharanam.jpg" alt="" width="293" height="441" /> ఉవ్వెత్తున ఎగిసిన ఆలోచనలు<br />
గూళ్ళలోకి రెక్కలు ముడుచుకున్న<br />
మెత్తటి పావురాలవుతాయి</p></blockquote>
<p>సభ ముగియటం ‘ఆలోచనలు మెత్తటి పావురాలవడానికి’ కూడా దారి తీస్తుందంటే అది మృదుమధురమే కదా!</p>
<blockquote><p>నిన్నటి దాకా ఎదురు చూసిన ఈరోజు<br />
అప్పుడే జ్ఞాపకాల పుటల్లోకి<br />
అందంగా ఒదిగిపోతుంది</p>
<p>ఉద్విగ్నతతో నిద్రపట్టని రాత్రినై<br />
ముగిసిన సభను<br />
మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ<br />
నేను మాగన్నుగా మిగిలిపోతాను</p></blockquote>
<p>అందంగా ఒదిగిపోయే జ్ఞాపకాలలా మిగిలిపోతాయని ముందే తెలిసిన అలాంటి సభలు ముగియటం కోసమన్నా ప్రారంభమైతే బాగుండు అని మది కోరుకోవటం ఎంతో సహజంమనిపిస్తుంది.</p>
<p>ఇంతే చక్కటి అనుభవాన్ని ఎప్పటి స్నేహితులో తిరిగి కలసినప్పటి సందర్భంలో ‘రీ యూనియన్’ అనే కవిత రూపంలో కూడా చెప్పారు. ఇలా మనకు, తన మరియు మన స్నేహితుల మధ్య గడిపే అమూల్యమైన అవకాశంగా అందిస్తారు.</p>
<p>మొదటి కచ్చేరీ లో ఆలాపనని ఆస్వాదించినంత ఇష్టంతోనే వశీకరణ, అంధగీతం కవితలను అందించారు. ఒక గాయకుడు తన పాట తో &#8216;వశీకరణ&#8217; చేసుకునే అపూర్వ సందర్శనానికి మన ప్రశంసలు అందించే లోపలే, రైలులో సైతం సదా చిరపరిచితమైన &#8216;అంధగీతం&#8217; (అంధుడు ఒక చిన్నపిల్ల ఆసరాగా నడుస్తూ పాడుతూ అడుక్కునేప్పటి గీతం) లో కూడా పొందుపరచి ప్రస్తావించడం, మనల్ని కూడా ఆ సందర్భాలలో భాగం చేసేంతలా హత్తుకుపోతుంది.</p>
<p>వశీకరణ కవితలో:</p>
<blockquote><p>అతను పెదవి విప్పగానే<br />
కవిత్వం అతని కంఠాన్ని<br />
కౌగిలించుకుంటుంది.<br />
&#8230;.<br />
అతని పాట ఏరై పారుతుంది<br />
&#8230;.<br />
ఓ ఒంటిస్తంభపు రాకుమారికి<br />
ఎర్రని వివశత్వపు పారాణి దిద్దుతూ<br />
అతని పాట జీరగా<br />
వంపులు తిరుగుతుంది.</p></blockquote>
<p>ఆఖరికి ఆ పాట ‘ వశీకరణాన్ని గుప్పెట్లో దాచుకుని ముగుస్తుంది ’ . రాకుమారికి పారాణి దిద్దే గాంధర్వలోకాన్ని కవిత్వంలో ఆవిష్కరించినందుకో ఏమో ఆ సమ్మోహపు భావన పాఠకుల్ని కూడా వశీకరణ చేస్తుంది.</p>
<p>పాట మరియు ఆలాపన పట్ల పొందిన ఈ తాదాత్మ్యాన్ని ‘అనాసక్త శ్రోతలని అలరించిన రైలు పెట్టెలో సాగిన అంధగీతంలో కూడా ప్రస్తావించారు. ఆ అంధుని బతుకులోని నైరాశ్యాన్ని తొక్కి పెట్టి అతని పాట ఉబికి వచ్చినా కూడా అది అతనికి పైసలు రాల్చలేకపోయి౦దన్న దిగులు మాత్రం ‘వలయాలు తిరుగుతూ దాటిపోయిన నిసర్గ మాధుర్యం’ లా మన వెంట తిరుగుతుంది.</p>
<p><img class="alignright  wp-image-7000" title="NarayanaGarimella" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/12/NarayanaGarimella-207x300.jpg" alt="" width="145" height="210" /></p>
<div>
<p>తులసి మొక్క, అరటి దొన్నె, వత్తుల డబ్బా, గంధపు చెక్క, వ్యాసపీఠం, చిన్ని కృష్ణుడి కంచు విగ్రహం, తాతగారి ఊసులు మొదలైన సతత హరితారణ్యాల లాంటి అనేక జ్ఞాపకాలను తనకిచ్చి పోయిన తన ‘నాయనమ్మ ‘ సరస్వతమ్మ గారిని గురించి చెప్పినా, అకారణంగా తనను కన్నీటి కెరటాల వెనుక వదలి పోయిన సాటి డాక్టర్ మిత్రురాలు సురేఖ గారు పోయిన లోటు స్మృతి కి తల్లడిల్లి బాధపడినా, పురావస్తు తవ్వకాలలో బయల్పడ్డ అద్భుత శిల్పం లాంటి పాతఫోటో లో పరిమళించిన జ్ఞాపకాలను నెమరు వేసినా అన్నింటిలో ఆత్మీయమైన తన సొంత గొంతు తోనే మనతో హృద్యంగా చెప్పుకున్నారు ఈ కవయిత్రి.</p>
<p>తేనీటి సమయం లాంటి ప్రతిరోజూ తారసిల్లే సమయంలోని ఉత్తేజ, ఉత్సాహపు ఊసుల అపురూపాన్ని, స్ప్రింగ్ ఫెస్ట్ లాంటి ప్రకృతీ పండగలనీ, మన అందరికీ తెలిసిన అనుభవాలపరంగనే చెప్పారు. అందువల్లే, తెలిసినా కూడా ‘ అవును కదా’ అని ఆశ్చర్యము కల్గించే ఇష్టం ఏర్పడుతుంది. ఇలా అన్ని కవితలనూ తాయిలం తుంచి కమ్మదనాన్ని రుచి చూపించిన బాల్యపు స్నేహంలా పునశ్చరణం గావించారు వైదేహి గారు.ప్రకృతిని ఆమె ముట్టుకోని కవిత ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదేమో! పూలను, మొగ్గలను, చెట్లను, ఆకులను, అలలనూ కవితలలో భాగం చేశారు. అంతే సహజ౦గానే ఎండ గురించి, ముసురు వేసి ముసుగు వేయించిన ఆకాశం గురించి, కొలను గట్టు గురించి, పైకి ఘనీభవించి లోపల కొబ్బరి నీళ్లు దాచుకున్న ఫ్రోజెన్-లేక్ గురించి, వెన్నెల వాన గురించి వేరు వేరు కవితలలో ఎంతో ముచ్చటగా, మురిపెంగా చెప్పుకొచ్చారు.</p>
<p>మీ ఇంటి పెరటి పూల వనం నుండి, బడి ఆవరణ లోని స్నేహ వనం గుండా, రాకుమారి విహరించే రాజవనం మీదుగా, సమ్మోహన పరిచే గాంధర్వ వనానికి ఒక హాయైన ప్రయాణం చేస్తూ ,చేసిన తరువాత కూడా ఆస్వాదించాలనుకుంటే పునశ్చరణాన్ని తప్పక చదివి అనుభూతించాలి</p>
<p>&nbsp;</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6989</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>మహాభారతేతిహాస అనుసృజన &#8220;పర్వ&#8221; &#8211; ప్రశ్నార్థకమైన &#8220;ఆర్యధర్మం&#8221; !</title>
		<link>http://vaakili.com/patrika/?p=6865</link>
		<comments>http://vaakili.com/patrika/?p=6865#comments</comments>
		<pubDate>Sun, 30 Nov 2014 19:57:59 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[నాగరాజు రామస్వామి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=6865</guid>
		<description><![CDATA[<p></p> <p>&#8220;పర్వ&#8221;- ప్రఖ్యాత కన్నడ సాహిత్యవేత్త Dr.S.L.బైరప్ప గారి విశిష్ట ఉద్గ్రంథం. మహా భారతేతిహాసం అధునిక నవలగా రూపొందిన రచన. బైరప్ప గారి Magnum Opus! అదే పేరుతో Dr.గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు తెనుగించిన &#8220;పర్వ&#8221; 730 పేజీల బృహదనువాదం. గంగిశెట్టి గారి మాటల్లో &#8216;మిత్ &#8216;నుండి చరిత్ర విడదీయబడి సమగ్రంగా పునర్నింప బడిన అపూర్వ పునఃసృష్టి &#8220;పూర్వ&#8221;. వైదిక యుగ చరమభాగం (12 th B.C.) లో జరిగిందని భావించ బడుతున్న కురుక్షేత్ర మహా సంగ్రామ నేపథ్యం కథావస్తువు. ఇతివృత్తాన్ని దైవీయ భావన నుండి విముక్తం చేసి, ఆనాటి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ధర్మానువర్తులైన వ్యక్తుల పాత్రలను సాధారణీకరించి, 20 వ శతాబ్ది బుద్ధిజీవుల ఆలోచనలకు ఒప్పిదంగా రూపొందించ బడినందుకు, బహుశా, &#8220;పర్వ&#8221; modern classic గా పేరుతెచ్చుకొని ఉంటుంది. దేవలోక ఇంద్రుణ్ణి సాధారణ మానవునిగా నేరుగా హిమాలయ పర్వత పీఠభూములలోకి దింపాడు బైరప్ప. కృష్నున్ని కేవలం చతుర రాజకీయ యుద్ధతంత్ర కోవిదునిగా భావించాడే కాని అవతార పురుషునిగా చిత్రించలేదు. భారత ఇతిహాసంలోని ఉత్కృష్ట వ్యక్తులైన ధర్మజ, అర్జున, భీమ, ద్రౌపది వంటి కాల్పనిక పౌరాణిక పాత్రలను సాధారణ మానవ పాత్రలుగా సామాన్య స్థాయికి చేర్చాడు. అనుపమ త్యాగధనుదనిపించుకున్న వృద్ధ భీష్మునికి ఎలాంటి పౌరాణిక ఔన్నత్యాన్ని అంటగట్టలేదు. ఐతిహాసిక అభిజాత్యమంతా సగటు మానవుని స్వార్థపురిత స్వగత చింతన ( monologue) గా &#8216;పర్వ&#8217; నిండా పరచుకున్నది. &#8216; A great human drama set on sociopolitical ,cultural landscape of anicient India&#8217; !</p> <p>పంచమవేదంగా పరిగణించబడుతున్న మహాభారత మారుమూలలోని చీకటి కోణం &#8216;పర్వ&#8217;లో వాస్తవ ఆధునిక సాహిత్య రీతిలో నిస్సందిగ్ధంగా ఆవిష్కరింప బడింది. ఆనాటి క్షత్రియ ధర్మం కేవలం తమ వంశాన్నికాపాడుకునే అసహాయ ఆఖరు ప్రయత్నపు కొనసాగింపుగా, ఆర్యధర్మం యావత్తు ఆ దిశలో నిబద్దీకరించబడిన ఒక constitutionalised స్వార్థ పద్ధతిగా రూపొందింది. &#8216;ఆర్యధర్మమంటే వేట, తాగడం, జూదం, ఆడవాళ్ల [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/11/slbairappanovel.jpg"><img class="alignright size-full wp-image-6867" title="slbairappanovel" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/11/slbairappanovel.jpg" alt="" width="350" height="272" /></a></p>
<p><span style="font-size: 30px;">&#8220;ప</span>ర్వ&#8221;- ప్రఖ్యాత కన్నడ సాహిత్యవేత్త Dr.S.L.బైరప్ప గారి విశిష్ట ఉద్గ్రంథం. మహా భారతేతిహాసం అధునిక నవలగా రూపొందిన రచన. బైరప్ప గారి Magnum Opus! అదే పేరుతో Dr.గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు తెనుగించిన &#8220;పర్వ&#8221; 730 పేజీల బృహదనువాదం. గంగిశెట్టి గారి మాటల్లో &#8216;మిత్ &#8216;నుండి చరిత్ర విడదీయబడి సమగ్రంగా పునర్నింప బడిన అపూర్వ పునఃసృష్టి &#8220;పూర్వ&#8221;. వైదిక యుగ చరమభాగం (12 th B.C.) లో జరిగిందని భావించ బడుతున్న కురుక్షేత్ర మహా సంగ్రామ నేపథ్యం కథావస్తువు. ఇతివృత్తాన్ని దైవీయ భావన నుండి విముక్తం చేసి, ఆనాటి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ధర్మానువర్తులైన వ్యక్తుల పాత్రలను సాధారణీకరించి, 20 వ శతాబ్ది బుద్ధిజీవుల ఆలోచనలకు ఒప్పిదంగా రూపొందించ బడినందుకు, బహుశా, &#8220;పర్వ&#8221; modern classic గా పేరుతెచ్చుకొని ఉంటుంది. దేవలోక ఇంద్రుణ్ణి సాధారణ మానవునిగా నేరుగా హిమాలయ పర్వత పీఠభూములలోకి దింపాడు బైరప్ప. కృష్నున్ని కేవలం చతుర రాజకీయ యుద్ధతంత్ర కోవిదునిగా భావించాడే కాని అవతార పురుషునిగా చిత్రించలేదు. భారత ఇతిహాసంలోని ఉత్కృష్ట వ్యక్తులైన ధర్మజ, అర్జున, భీమ, ద్రౌపది వంటి కాల్పనిక పౌరాణిక పాత్రలను సాధారణ మానవ పాత్రలుగా సామాన్య స్థాయికి చేర్చాడు. అనుపమ త్యాగధనుదనిపించుకున్న వృద్ధ భీష్మునికి ఎలాంటి పౌరాణిక ఔన్నత్యాన్ని అంటగట్టలేదు. ఐతిహాసిక అభిజాత్యమంతా సగటు మానవుని స్వార్థపురిత స్వగత చింతన ( monologue) గా &#8216;పర్వ&#8217; నిండా పరచుకున్నది. &#8216; A great human drama set on sociopolitical ,cultural landscape of anicient India&#8217; !</p>
<p>పంచమవేదంగా పరిగణించబడుతున్న మహాభారత మారుమూలలోని చీకటి కోణం &#8216;పర్వ&#8217;లో వాస్తవ ఆధునిక సాహిత్య రీతిలో నిస్సందిగ్ధంగా ఆవిష్కరింప బడింది. ఆనాటి క్షత్రియ ధర్మం కేవలం తమ వంశాన్నికాపాడుకునే అసహాయ ఆఖరు ప్రయత్నపు కొనసాగింపుగా, ఆర్యధర్మం యావత్తు ఆ దిశలో నిబద్దీకరించబడిన ఒక constitutionalised స్వార్థ పద్ధతిగా రూపొందింది. &#8216;ఆర్యధర్మమంటే వేట, తాగడం, జూదం, ఆడవాళ్ల సహవాసం, స్వయంవరం పేరుతో రాచకన్యలను అపహరించి పెళ్ళాడడం, కనీసం పదిమంది దాసీల నైనా పెళ్లి కానుకలుగా తెచ్చుకుని సుఖించడం, వాళ్లకు పుట్టిన పిల్లలను సూతులుగా వదిలేయడం&#8217; అని నిరసిస్తుంటుంది కోపోద్రిక్త ద్రౌపది.&#8221;&#8216;పర్వ&#8217; పూర్వ భారత పాత్రల కథ కాదు. మానవ అనుభవానికి చెందిన ఆముఖాల,రూపాల, మానవ సంబంధాల స్వరూప వివేచన&#8221; అంటున్నారు బైరప్ప గారు.</p>
<p>పర్వ లో అలనాటి దేశాచారాల, మూఢ విశ్వాసాల గుట్టు రట్టయింది. మూర్ధ ఘ్రాణ సాంప్రదాయం (తమ సంతానం తమదేనా కాదా అన్న సందేహ నివృత్తి కోసం పిల్లల తలలను ఆఘ్రాణించి నిర్దారించుకోవడం), నియోగం (వంశాభివృధ్ధి కోసం స్త్రీలను పరపురుషుల సాంగత్యానికి పంపడం) ద్వారా &#8216;కానీనులను&#8217; కనడం, అతిథుల ఆనందం కోసం రాత్రిళ్లు దాసీలను అర్పించడం, స్త్రీల రుతుస్రావనష్టాన్ని పాపంగా పరిగణించడం వంటి క్షత్రియ కుహనాచార శాస్త్ర సమ్మత &#8216;ఆర్య ధర్మం&#8217; చెలామణిలో ఉండడం బట్టబయలయింది. అంబ అంబాలికలు మొదలు కుంతీ మాద్రుల దాకా ఈ నియోగధధర్మం కొనసాగింది. నియోగానికి వేదజ్ఞులైన ఋషులు సైతం అర్హులే. కుంతికి పెళ్ళికి ముందు తల్లితండ్రుల ప్రోత్సాహంతో దుర్వాస ఋషి వల్ల ఒక కానీనపుత్రున్నికన్నది.పంచపాండవు లందరూ కానీనులే ( పెళ్ళికి ముందు కన్యలుగా ఉన్నప్పుడు కలిగిన సంతానం ) &#8211; epithets specially applied to Vyaasa and Karna. వంద మంది కౌరవ పుత్రులలో కేవలం పదునాలుగురు మాత్రమే గాంధారి సంతానం. మిగతా ఎనుబదిఆరుగురు దాసీల వలన సంక్రమించిన సంతతే !</p>
<p>యుద్ధంలో పోరాడుతున్న సైనికులను ప్రోత్సహించేందుకు తిండీ మందు తోపాటు పడతులను కూడా పంపిస్తాడు దుర్యోధనుడు. మహాయుద్ధం లో విధవలైన వేలాది యువతులకు నియోగమే శరణ్యమైనట్టు సూచింప బడింది. యుద్ధానంతరం సైనికుల వల్ల పుట్టిన వందలాది బిడ్డల భవిష్యత్తు ఒక జటిల సామాజిక సమస్య ఔతుంది. A wreched aftermath of war! A great human crisis! పరుశురాముని క్షత్రియ రాజుల సంహారానంతరం ఈ వంశోద్ధారణ మొదలై ఈ ఆర్యధర్మం గతానుగతికంగా అనూచాన ఆర్య పరమధర్మంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కుహన నీతిని జీర్ణించుకున్న శాల్యరాజుకు పెళ్ళికి ముందు పిల్లలను కనడం, నియోగం అపచారంఅనిపించలేదు. శల్యుని కుమారుడు రుక్మరథునికి కూతురు బతుకు ఋతుచక్ర కాలంలో బీజావాపం లేకుండా గడవడం భూమిని బంజరుగా ఉంచినంత పాపంగా తోచింది. స్రావం ఆగి స్నానంచేసిన దినం మగడు ఊరిలో లేనందున మగని శిష్యుణ్నే పిలిపించుకున్న గురుపత్నుల కథలు అతనికి గుర్తుకొచ్చాయి. అతని పత్నికి కానీన సంతానం పొందటంలో తప్పులేదనిపించింది. కృష్ణద్వైపాయనుడు (వేదవ్యాసుడు) కానీనుడేనట. వ్యాసుని పినతల్లికి కానీన పుత్రుడున్నాడట. తన పెళ్లికి ముందు పుట్టిన అబ్బాయి తన పుట్టింటిలోనే పెరుగుతున్నసంగతిని భర్తకు గుర్తు చేస్తుంది. భర్త రుక్మరథుడు వినీవిననట్టు మిన్నకుండిపోతాడు. స్వయంవరం నిర్వహించే స్థోమత తమకు లేనందున, రాజకుమారులు తన కూతురును ఎత్తుకెళ్ళి వివాహం మాడే అవకాశం మృజ్ఞమైనందున ,ఆఖరు అస్త్రం &#8216;నియోగాన్ని&#8217; ఆచరించడం ధర్మ విరుద్ధం కాదని ఆమె అంటుంది. తుదకు ధర్మజ్ఞుడూ,నియోగ ధర్మాన్ని ప్రారంభించిన భీష్ముడు మహాభారత యుద్ధ సందర్భంలో ధర్మ సందేహంలో చిక్కుకుంటాడు. కానీనులైన పంచపాండవులు రాజ్యార్హులేనా? కురుక్షేత్ర యుద్ధం ధర్మయుద్ధ మేనా? ఈ సందేహ నివృత్తి కై భీష్ముడు ఆగవేగాలతో కృష్ణద్వైపాయనున్ని ఆశ్రయిస్తాడు. వేదాల పరిష్కర్త, నియోగాన్ని స్వయంగా ఆచరించిన వ్యాసుడు సందిగ్ధం లో అవాక్కవుతాడు. తుదకు యుద్ధానంతరం పాండు పుత్రులందరిని కోల్పోయి, ఉత్తర మృత పిండాన్ని ప్రసవించిన కారణంగా, కుంతి ద్రౌపదిని మళ్ళీ పిల్లలను కని వంశాన్ని నిలబెట్టుమని అర్థిస్తుంది. ససేమిరా అంటూ ద్రౌపది ఉత్తరకు నియోగం చేయాలంటుంది .Last nail on the coffin ! ఇలా &#8216;పర్వ&#8217; లో ఆద్యంతం కొనసాగిన ఈ కానీన హీన సంస్కృతి పాఠకునికి మింగుడు పడదు. లోలోన ఏదో ముల్లు గుచ్చుకుంటూనే వుంటుంది. చదువరికి ఇదొక persistant pain in the neck.</p>
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/11/books.jpeg"><img class="alignleft size-full wp-image-6868" title="books" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/11/books.jpeg" alt="" width="128" height="207" /></a>&#8216;పర్వ&#8217; కు మరో పార్శ్వం ఈనాటికీ కొనసాగుతున్న కుటిలరాజనీతి.శత్రువులను తమవైపు తిప్పుకునే ఎత్తుగడల చతురత, యుద్ధ తంత్రం, యుద్ధం. ఎవరికి వారు ఆ యుద్ధాన్ని ధర్మయుద్ధంగా, యుద్ధంలో పాల్గొనడం ధర్మబద్ధంగా అన్వయించుకుంటారు. విశ్లథ మౌతున్న రాజ్య వ్యవస్థలో ధర్మం వివిధ రూపాలుగా రంగులు మార్చుకుంది. &#8216; పర్వ&#8217; లో వెర్రి తల లేసిన రణనీతి ఆసక్తిదాయకంగా చిత్త్రించ బడింది. యుద్ధానంతరం విజయం పాండవులదైనా విస్తృతమైన నిరాశ, విశ్లథమైన మానవ జీవన విశ్వాసం ఎల్లెడలా నెలకొని ఉంటుంది. A great human tragedy ever!<br />
అభ్యంతరకరమైన ఆనాటి నియోగరీతి, రణనీతి &#8216;పర్వ&#8217; లో ఆద్యంతం సమాంతరంగా ప్రవహించాయి .యుద్ధ అనివార్యతకు హేతువులైన వ్యక్తిగత ఈర్షా ద్వేషాలను, అహంకారాలను, ప్రతిజ్ఞలను, ప్రతీకారాలను, మానవ సంబంధాలను,ఆత్మశోధనలను, ధర్మాధర్మ సంశయాలను, ఐకమత్యం కరువైన ఆనాటి రాజకీయాలను అత్యంత నైపుణ్యంతో సంఘటనల సమాహారంగా, స్మృతుల పరంపరగా, విశిష్ట స్వగతరూప సంవిధాన శిల్పంగా యావత్ భారత గాధను కొత్తకోణం లో ఆవిష్కరించారు బైరప్ప గారు.</p>
<p>రచనలోమానవీయస్పర్శఉంది. హేతువాద గణనీయత ఉంది. సమగ్ర మానవ అవగాహన ఉంది.మానవీయ స్పర్శ మహాసంగ్రామాన్నిఎలా ఆపలేకపోయిందో రచయిత తన కథాకథన కౌశలంతో సమర్థవంతంగా సమర్థించు కున్నారు. &#8221; బైరప్పగారు వ్యాస ఆంధ్రమహాభారత ఇతిహాసాలలోని లోని ఖాళీలను (voids) ఏంతో నైపుణ్యంతో పూరించి రాసిన నవల &#8220;పర్వ&#8221;. A faithful documentation of anicient practices. ఈనాడు మనకు అనైతికంగా తోచే &#8216;నియోగం&#8217;, &#8216;రుతునష్ట పాపం&#8217; వంటి విషయాలు సంస్కృత ఆంధ్ర భారతాలలో ఉన్నవే. నాటి &#8216;భారతానికి&#8217; నేటి &#8216;పర్వ&#8217; సమగ్రపూరణ&#8221; అంటున్నారు అనువాదకులు.</p>
<p>&#8221; &#8216; చైతన్య స్రవంతి &#8216; శిల్పంతో బైరప్పగారు వాక్యాలను అసంపూర్ణంగా ఒకదాన్లో నుండి ఒకటి వచ్చినట్లుగా అదో విలక్షణమైన పధ్ద్ధతి తో నడిపిస్తారు. యథాతథం గా కథనంతా భూతకాల క్రియారూపాలతో చెప్పి,చివరి అధ్యాయాన్ని మాత్రం భవిష్య, తద్ధర్మ రూపాలలో చెబుతారు &#8220;-ఇది బైరప్ప గారి రచనా శిల్పం పై అనువాదకులు గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారి అభిప్రాయం.</p>
<p>విశ్రాంత ఉపకులపతి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కన్నడ &#8216;పర్వ&#8217;ను అదే పేరుతో అత్యంత సమర్థవంతంగా తెనుగించారు. &#8220;ప్రామాణిక పర్యాయాలతో పాటు ఒకటీ అరా రాయలసీమ పలుకుబడులను ప్రయోగించాను.మూలం లో కావాలని వాడబడిన వ్యవహార పదాలను వీలైనంత వరకు ఎబ్బెట్టు కాని రీతిలో తెలుగులోకి పట్టుకు రావడానికి ప్రయత్నించాను&#8221; అంటున్నారు. సరల వ్యవహార భాషలో తెనుగించిన తీరు అభినందనీయం. Lovely write.</p>
<p>ఐతే, &#8220;వేదవ్యాస విరచితమైన కథను వక్రీకరించి రాసిన &#8216;పర్వ&#8217; ఎంత ప్రామాణికం? ఇలాంటి రచనలు మేలు కన్నా కీడునే చేస్తాయి&#8221; &#8211; ఇది కొందరి అభిప్రాయం. రాఘవేందర్ రావు గారి ఆంగ్లానువాదం &#8221; &#8216;Parva&#8217;:A tale of War,Peace,Love,Death,God and Man &#8221; చదివితే మరింత అవగాహన లభించవచ్చు. With all the goods and the bads, the book is lovable.</p>
<p>వివాదాస్పదమైన ఈ అరుదైన అసాధారణ ఉద్గ్రంధాన్ని చదవి నిట్తూర్చి తేరుకున్నాక నాలో మెదలిన ఈ నా కవితా పంక్తులతో ముగిస్తాను.</p>
<blockquote>
<p style="text-align: left;">ఏదో క్రోన్నీటి ఉద్ధ్రత కెరటం<br />
నా సనాతన కోవెల పునాదులలో<br />
ఎవరో కప్పుతున్న కాలమేఘం<br />
నా అనాది ఆకాశ హరివిల్లు మీద<br />
సత్యాసత్యాల సందిగ్ధ కూడలిలో నిలిచి<br />
దిక్కులు చూస్తున్నది నా వ్యగ్ర హృదయం.<br />
తమసు తెరలను చీల్చే పురా ఉగ్ర కిరణం<br />
పునర్భవిస్తే ఎంత బాగుండును.</p>
</blockquote>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=6865</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>బీతేవెన్ ఊహలాంటి జీవితపు అందమైన బహానా.. ఆకుపాట కవిత్వం</title>
		<link>http://vaakili.com/patrika/?p=5869</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5869#comments</comments>
		<pubDate>Wed, 02 Jul 2014 19:17:21 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[సాయి పద్మ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5869</guid>
		<description><![CDATA[<p></p> <p>శ్రీనివాస్ వాసుదేవ్ గారి కవిత్వ సంపుటి, ఆకుపాట చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఒక వర్షగోళం ఆహ్లాదంగా తాకి, నిర్ప్లిప్తంగా ఆవిరయ్యే క్షణంలో, ఒక అందమైన పాట, ఏకాంతం నుండి మార్మిక లోకంలోకి వెళ్ళే ప్రయాణంలో, అందీ అందని అనుభూతికి ఏదో ఫత్వా విధించినట్లు.. అక్షరం తాలూకు నిట్టూర్పు కూడా అందమైనదే సుమా.. అదీ సున్నితత్వ’మో, మార్మికత్వమో, మానవత్వమూ నింపుకున్న కవి కలల గళంలో నుంచి జాలువారితే ..!! మనః తొలకరి ఆకుపాట అనే చెప్పాలి.</p> <p>కవి మాటల్లో చెప్పాలంటే, “అది ఆర్టా, హార్టా అని నిలదీస్తే మాత్రం, వొళ్ళంతా విచ్చుకున్న ఆకాశ గోడలపై, గుండెని ఆరబెట్టినవే నని చెప్పుకుంటాం ..” ఎంత నిజం కదూ.. ఈ కవితల్లో, ఒక జోగిని వ్యధ ఉంది, ఆకాశమంత ఆవేశంతో పాడనివ్వని కోకిలల ఆర్తనాదపు సంగీతమూ ఉంది . ఖ్మెర్ రోజ్ క్రూరత్వంపై ఆర్ధ్ద్రతా ఉంది &#8230;మార్మిక దేహాల మౌన రోదనా ఉంది ..కాలానికి అందని ఒక ఆకుపాట కూడా ఉంది ..!</p> <p>కవిగా శ్రీనివాస్ గారి కవిత్వ విస్తృతి నాకెంతో సంతోషం కలిగించే విషయం &#8230; సరదా పంకిణీ పంక్తులనే కాదు, అమ్మతో శిధిల గుడిమెట్ల సంచికలనీ అంత అలవోకగా అవిష్కరించగలరు . కవిగా, రచయితగా, అధ్యాపకునిగా , విదేశాల్లో చాలాకాలం పని చేయటం , ప్రవాసంలో మనగలిగినా , మరచిపోతున్న ఎన్నో పదాల ప్రయోగం శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం ప్రత్యేకత . ఉదాహరణ – “ రవీ కౌముదుల జుగల్బందీ విన్యాసానికి , నీ జమిలి నేత్రాలు వేదికయ్యాయనుకుంటా ..”</p> <p>“ నీ కోసమేం చెప్పలేకపోతున్నానని మనసు చివుక్కుమన్నపుడల్లా .. గుండె చుట్టూ నీహార నివురు “</p> <p>“ నగ్నత్వం ఎంత బావుంటుందనీ నిజాయితీలా &#8230; నీ కవితల్లా “</p> <p>“ ఆ గతకాలపు కుప్పలోంచి .. ఏ ఫీనిక్స్ లేస్తుందో నీ ప్రేమని చూపిస్తూ</p> <p>‘ కొన్ని క్షణాలకి మాటలుంటేనా అని [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/07/akupaata.jpg"><img class="aligncenter size-full wp-image-5872" title="akupaata" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/07/akupaata.jpg" alt="" width="960" height="708" /></a></p>
<p>శ్రీనివాస్ వాసుదేవ్ గారి కవిత్వ సంపుటి, ఆకుపాట చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఒక వర్షగోళం ఆహ్లాదంగా తాకి, నిర్ప్లిప్తంగా ఆవిరయ్యే క్షణంలో, ఒక అందమైన పాట, ఏకాంతం నుండి మార్మిక లోకంలోకి వెళ్ళే ప్రయాణంలో, అందీ అందని అనుభూతికి ఏదో ఫత్వా విధించినట్లు.. అక్షరం తాలూకు నిట్టూర్పు కూడా అందమైనదే సుమా.. అదీ సున్నితత్వ’మో, మార్మికత్వమో, మానవత్వమూ నింపుకున్న కవి కలల గళంలో నుంచి జాలువారితే ..!! మనః తొలకరి ఆకుపాట అనే చెప్పాలి.</p>
<p>కవి మాటల్లో చెప్పాలంటే, “అది ఆర్టా, హార్టా అని నిలదీస్తే మాత్రం, వొళ్ళంతా విచ్చుకున్న ఆకాశ గోడలపై, గుండెని ఆరబెట్టినవే నని చెప్పుకుంటాం ..” ఎంత నిజం కదూ.. ఈ కవితల్లో, ఒక జోగిని వ్యధ ఉంది, ఆకాశమంత ఆవేశంతో పాడనివ్వని కోకిలల ఆర్తనాదపు సంగీతమూ ఉంది . ఖ్మెర్ రోజ్ క్రూరత్వంపై ఆర్ధ్ద్రతా ఉంది &#8230;మార్మిక దేహాల మౌన రోదనా ఉంది ..కాలానికి అందని ఒక ఆకుపాట కూడా ఉంది ..!</p>
<p>కవిగా శ్రీనివాస్ గారి కవిత్వ విస్తృతి నాకెంతో సంతోషం కలిగించే విషయం &#8230; సరదా పంకిణీ పంక్తులనే కాదు, అమ్మతో శిధిల గుడిమెట్ల సంచికలనీ అంత అలవోకగా అవిష్కరించగలరు . కవిగా, రచయితగా, అధ్యాపకునిగా , విదేశాల్లో చాలాకాలం పని చేయటం , ప్రవాసంలో మనగలిగినా , మరచిపోతున్న ఎన్నో పదాల ప్రయోగం శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం ప్రత్యేకత . ఉదాహరణ – “ రవీ కౌముదుల జుగల్బందీ విన్యాసానికి , నీ జమిలి నేత్రాలు వేదికయ్యాయనుకుంటా ..”</p>
<p>“ నీ కోసమేం చెప్పలేకపోతున్నానని మనసు చివుక్కుమన్నపుడల్లా .. గుండె చుట్టూ నీహార నివురు “</p>
<p>“ నగ్నత్వం ఎంత బావుంటుందనీ నిజాయితీలా &#8230; నీ కవితల్లా “</p>
<p>“ ఆ గతకాలపు కుప్పలోంచి .. ఏ ఫీనిక్స్ లేస్తుందో నీ ప్రేమని చూపిస్తూ</p>
<p>‘ కొన్ని క్షణాలకి మాటలుంటేనా అని అనుకోని క్షణముండదా? &#8230; ?”</p>
<p>“ నేను నీచుట్టూ ఉంటాననే నీ ప్రేమ .. వో అద్భుత సున్నా .. నిహిలిజాన్ని నువ్వూ వొప్పుకుంటావుగా ..”</p>
<p>“ గాజుపూల బోత్తాములతో.. వెన్నెలని తొడుక్కున్న సూర్యుడిలా “ అంటూ ట్రాన్స్ జెండర్ వ్యక్తిని వర్ణించటం ..నాకెంతో ఇష్టమైన పద ప్రయోగం ..!!</p>
<p>మూడు భాషల పదాలు ఈ సంపుటిలో అలవోకగా , వొద్దికగా .. సన్నజాజుల మిస్చీఫ్ అంత మధురంగా వచ్చి వెళ్తుంటాయి, అంతే కాకుండా ..సామాజికంగా కవి అనుభూతించిన కొన్ని, సాంఘిక జాడ్యాల మీద ఎక్కుపెట్టిన ఒక బాణం లాంటి పద్యం .. ది ..షో.. మరో ఇష్తమైన కవిత .. ఛాయా గీత్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ కవిత తెలీని మౌనంలోకి , అంతర్మధనంలోకి మనల్ని బదలాయించటమే మంచి కవిత్వ లక్షణమైతే , ఇది నిస్సందేహంగా మంచి కవిత్వం .</p>
<p>ఎక్కువగా దొర్లే కాఫ్కాలూ, హార్న్ బిల్ , పర్గేషన్ లాంటి పదాలు కొంచం తెలీని ఇబ్బంది పెడతాయి , మామూలు చదువరికి .. ఒక సింఫనీ అర్ధమవటం నిజానికి ఉటోపియా కాదు &#8230; మదిని దాగిన ఉటోపియాలకు వేదిక , కవిత్వం కాక మరొకటి ఉంటుందా ?<br />
ఈ తెలుగు ఇంగ్లీషుల జుగల్బందీ లో .. చీర కుచ్చెళ్లపై అంచులా .. అక్కడక్కడా హిందీ కూడా మెరవటం .. ఒక అందమైన తన్హాయీ కావటం బీతొవెన్ సంగీతానికి సితార నాదం తోడవటం లాంటిదే ..!!</p>
<p>జే వీ పబ్లిషర్స్ ద్వారా ఈ పుస్తకం ప్రచురితం&#8230; ప్రతులకు శ్రీనివాస్ వాసుదేవ్ గారిని గానీ, జ్యోతి వలబోజు గారిని గానీ సంప్రదించాలి ..!!</p>
<p>చివరగా .. కవి మాటల్లో చెప్పాలంటే .. ఏ వాక్యమూ మరణించదు&#8230; ఏ భావమూ అక్షరానికి అందకుండా తటపటాయించదు.. కావలసిందల్లా .. పరిణితి, తనలోని మనిషిని సున్నితంగా ఆవిష్కరించటం .. అంతే ..!!</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5869</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>అత్తర్ల గుబాళింపు &#8216;అధూరె&#8217;</title>
		<link>http://vaakili.com/patrika/?p=5115</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5115#comments</comments>
		<pubDate>Fri, 28 Feb 2014 21:00:23 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[డా. కాసుల లింగారెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5115</guid>
		<description><![CDATA[<p>స్త్రీ, దళిత, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు లేని అనేక ప్రతిబంధకాలు ముస్లిం మైనారిటీ వాదానికి ఉన్నాయి. దేశ స్వాతంత్య్రోద్యమ నాయకులుగా చలామణీ అయిన భారత దళారీ పాలకవర్గం వలసవాదుల బాట నడిచి కొంత, కుట్రలకు తలొగ్గి కొంత ద్విజాతి సిద్ధాంతాన్ని తలకెత్తుకొని దేశవిభజనకు చేతులెత్తినరు. విభజన జరుగకూడదని కాదు, అది మతప్రాతిపదికగా జరగడం దారుణం.అప్పుడు చెలరేగిన హింస, మారణహోమం, అమానవీయ ఘటనలు మళ్లీ అదే పాలక వర్గాలకు ఓటు బ్యాంకుగా మారినవి. వలసవాదులనుంచి విస్తరణవాదాన్ని ఒంటవట్టించుకున్న భారత పాలకవర్గాలు అటు కాశ్మీర్‌, ఇటు హైదరాబాద్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును భుక్తం చేస్తూ దురాక్రమణచేసి తమ అఖండభారతంలో కలుపుకోవడం జరిగింది. అట్లా ఇక్కడ మిగిలిపోయిన ముస్లింలను హిందూ మతోన్మాదులు పరాయి దేశస్థులుగానే పరిగణించసాగారు. దాన్ని తిప్పికొట్టాల్సిన ముస్లింలు కూడ కొండొకచో( భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య జరిగే క్రికెట్‌మ్యాచ్‌ల సందర్భంలో)పాకిస్థాన్‌ అనుకూల వైఖరి ప్రదర్శించి మధ్యేమార్గంగా వున్న లౌకికవాదులనుంచి కూడ దూరమైనరు.దీన్ని ఆసరాగా తీసుకున్న పాలకవర్గాలు ఇరువర్గాల్ని రెచ్చగొడ్తూ పబ్బం గడుపుకోవడం జరుగుతూ వుంది(1990లో మర్రి చెన్నారెడ్డిని సీయం కుర్చీ నుంచి దించడానికి ఒక జాతీయపార్టీ నాయకుడు స్థానిక మతతత్వ పార్టీతో మిలాఖతై చేయించిన మతఘర్షణల లాంటివి).</p> <p>అట్లాంటి ఒక ప్లానే కాశ్మీర్‌ యుద్ధం, కొనసాగింపే బంగ్లాదేశ్‌ విభజన, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండ. చాలా చిత్రంగా మతతత్వం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఆర్‌.ఎస్‌.ఎస్‌, దానికనుబంధంగా ఏర్పడ్డ బి.జె.పి.ని గాని, రజాకారు రాకాసి మూకల కొనసాగింపైన యం.ఐ.యం.ని గాని ఘతవహించిన లౌకికఘనతంత్ర రాజ్యం నిషేధించకుండా, కొండొకచో పొత్తులు పెట్టుకుంటూ మతానుబంధంగా రాజకీయపార్టీలు ఏర్పడడానికి లెజిటిమసీని కల్పించినవి. ఇక్కడ హిందూ మతోన్మాదులు కాని, మధ్యేమార్గంగా ఉన్నామని చెప్పుకునే పాలకవర్గ పార్టీలు కాని భారతదేశ ముస్లింలకు ఈ నేలమీద హక్కులున్నాయని కూడ భావించడం లేదు. మీ దేశానికి మీరు పోకుండా వున్నందుకు గాను,మా దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన జాతి మీది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన అస్తిత్వ ఉద్యమాలకు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/Adhoore.jpg"><img class="size-medium wp-image-5196 alignleft" title="Adhoore" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/Adhoore-192x300.jpg" alt="" width="192" height="300" /></a>స్త్రీ, దళిత, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు లేని అనేక ప్రతిబంధకాలు ముస్లిం మైనారిటీ వాదానికి ఉన్నాయి. దేశ స్వాతంత్య్రోద్యమ నాయకులుగా చలామణీ అయిన భారత దళారీ పాలకవర్గం వలసవాదుల బాట నడిచి కొంత, కుట్రలకు తలొగ్గి కొంత ద్విజాతి సిద్ధాంతాన్ని తలకెత్తుకొని దేశవిభజనకు చేతులెత్తినరు. విభజన జరుగకూడదని కాదు, అది మతప్రాతిపదికగా జరగడం దారుణం.అప్పుడు చెలరేగిన హింస, మారణహోమం, అమానవీయ ఘటనలు మళ్లీ అదే పాలక వర్గాలకు ఓటు బ్యాంకుగా మారినవి. వలసవాదులనుంచి విస్తరణవాదాన్ని ఒంటవట్టించుకున్న భారత పాలకవర్గాలు అటు కాశ్మీర్‌, ఇటు హైదరాబాద్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును భుక్తం చేస్తూ దురాక్రమణచేసి తమ అఖండభారతంలో కలుపుకోవడం జరిగింది. అట్లా ఇక్కడ మిగిలిపోయిన ముస్లింలను హిందూ మతోన్మాదులు పరాయి దేశస్థులుగానే పరిగణించసాగారు. దాన్ని తిప్పికొట్టాల్సిన ముస్లింలు కూడ కొండొకచో( భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య జరిగే క్రికెట్‌మ్యాచ్‌ల సందర్భంలో)పాకిస్థాన్‌ అనుకూల వైఖరి ప్రదర్శించి మధ్యేమార్గంగా వున్న లౌకికవాదులనుంచి కూడ దూరమైనరు.దీన్ని ఆసరాగా తీసుకున్న పాలకవర్గాలు ఇరువర్గాల్ని రెచ్చగొడ్తూ పబ్బం గడుపుకోవడం జరుగుతూ వుంది(1990లో మర్రి చెన్నారెడ్డిని సీయం కుర్చీ నుంచి దించడానికి ఒక జాతీయపార్టీ నాయకుడు స్థానిక మతతత్వ పార్టీతో మిలాఖతై చేయించిన మతఘర్షణల లాంటివి).</p>
<p>అట్లాంటి ఒక ప్లానే కాశ్మీర్‌ యుద్ధం, కొనసాగింపే బంగ్లాదేశ్‌ విభజన, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండ. చాలా చిత్రంగా మతతత్వం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఆర్‌.ఎస్‌.ఎస్‌, దానికనుబంధంగా ఏర్పడ్డ బి.జె.పి.ని గాని, రజాకారు రాకాసి మూకల కొనసాగింపైన యం.ఐ.యం.ని గాని ఘతవహించిన లౌకికఘనతంత్ర రాజ్యం నిషేధించకుండా, కొండొకచో పొత్తులు పెట్టుకుంటూ మతానుబంధంగా రాజకీయపార్టీలు ఏర్పడడానికి లెజిటిమసీని కల్పించినవి. ఇక్కడ హిందూ మతోన్మాదులు కాని, మధ్యేమార్గంగా ఉన్నామని చెప్పుకునే పాలకవర్గ పార్టీలు కాని భారతదేశ ముస్లింలకు ఈ నేలమీద హక్కులున్నాయని కూడ భావించడం లేదు. మీ దేశానికి మీరు పోకుండా వున్నందుకు గాను,మా దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన జాతి మీది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన అస్తిత్వ ఉద్యమాలకు ముస్లిం మైనారిటీ అస్తిత్వ ఉద్యమానికి వున్న మౌలికమైన తేడా ఇదే.ముస్లిం మైనారిటీ అస్తిత్వ ఉద్యమం విస్త ృత ప్రజాబాహుళ్యపు ఆమోదం పొందకపోవడానికి ఇదొక కారణం. మెజారిటీ ముస్లిం ప్రజలు మతపెద్దల(ముల్లాల) చేతుల్లో బందీలై, మతమౌఢ్యపు చీకటి కొట్లల్లో మగ్గిపోవడం మరొక కారణం. కాబట్టి భారతదేశపు ముస్లింలు ఏక కాలంలో రెండు యుద్ధాలు చేయాల్సివుంటుంది. ఒకటి హిందూ మతోన్మాదాన్ని ఎదిరిస్తూ, మానవీయమైన సమాన హక్కుగల అస్తిత్వం కోసం పోరాడడం, మతం మత్తుమందును వదిలించుకొని, ముల్లాల బంధాలు ఛేదించుకొని లౌకికవాద దృక్పథాన్ని పెంపొందించుకోవడం, అట్లాంటి శక్తుల్ని పునరేకీకరణ చేయడం.</p>
<p>అట్లాంటి దృక్పథాన్ని స్కైబాబ కలిగివున్నాడని చెప్పడానికి ఆధారమైన కథలు &#8216;అధూరె&#8217; లో వున్నయి. అయితే,అది అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, సమాజంనుంచి,రాజ్యాంగ వ్యవస్థనుంచి కొన్ని పాక్షిక ప్రయోజనాలు పొందడానికిపనికొస్తుంది కాని, అంతిమంగా ఆ జాతి విముక్తికి కావాల్సిన ప్రత్యేక రాజకీయార్థిక దృక్పథాన్ని అందిస్తుందా అన్నదే ప్రశ్న.అస్తిత్వ ఉద్యమాలు అనివార్యంగా విశ్వజనీన విముక్తి ఉద్యమాలల్లో అంతర్భాగంగా పనిచేయాల్సి వుంటుందా అనేది చర్చించాల్సిన విషయమే. అయితే, ముస్లింలవే ముఖ్యంగా ముస్లిం స్త్రీలవే అయిన సమస్యల్ని చర్చకు పెట్టడంలో &#8216;అధూరె&#8217; ద్వారా స్కైబాబ కృతకృత్యుడయ్యిండు. అయితే, &#8216;అధూరె&#8217; ముస్లిం కథలు అన్నడు గాని, ప్రాంతీయ నిర్దిష్టతను ఎందుకు విస్మరించిండో అర్థం కావడం లేదు. సార్వజనీన సమస్యలే అయినా, వాటికి ఒక స్థల,కాల నిర్దిష్టత అవసరమని స్కైకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.అట్లా చూసినప్పుడు &#8216;అధూరె&#8217; తెలంగాణ ముస్లిం కథలు అని వుండాల్సిందేమో?</p>
<p>&#8216;అధూరె&#8217; సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నయి. ఇందులోని పాత్రలైన ముస్లిం స్త్రీలకు దీన్ని అంకితమివ్వడంబట్టి చూస్తే , అవి ఆ స్త్రీలకు సంబంధించిన కథలే అని తెలుస్తుంది. అంటే, తన కుటుంబ సభ్యుల, మిత్రుల వైయక్తిక అనుభవాల్ని స్కై కథలుగా మలిచాడని తెలుస్తుంది. దీన్ని &#8220;objectification of subjective experiences&#8221;గా పరిగణించాల్సివుంటుంది. &#8216;ఛోటీ బహన్‌&#8217; ,&#8217;మొహబ్బత్‌ 1421 హిజ్రి&#8217; అనే రెండు కథలు కూడ ముస్లిం మత సాంప్రదాయమైన బుర్ఖా పద్ధతినినిరసిస్తూ రాసినవే. ఇంటి చాకిరీ చెయ్యనని, బుర్ఖా వేసుకోనని, ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లిదండ్రులతో, సమాజంతో పోరాడుతున్న చెల్లెకు అండగా నిలబడ్డ అన్న , ఆమె పెళ్లి తర్వాత చెల్లెతో పాటు తను కూడ వ్యవస్థ కట్టుబాట్లకులొంగిపోయిన విషాదాన్ని చిత్రించిన కథ &#8216;ఛోటీ బహన్‌&#8217;. సున్నితమైన మానవ సంబంధాల్ని హృద్యంగా చిత్రించిన కథ. నెట్‌లో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డ అబ్బాయికి ఆమె బుర్ఖాతో దిగిన ఫోటో పంపడం &#8216;మొహబ్బత్‌ 1421 హిజ్రి&#8217;లోని కథ. ఒక సాదాసీదా వస్తువుకు ఫ్లాట్‌ పాత్రలతో నడిపిన సాదాసీదా కథనం.<br />
పేదముస్లిం కుటుంబాల్లో( నిజానికి ఏ పేదకుటుంబంలోనైనా) ఆడపిల్లల పెళ్లి ఎంత విషమసమస్యో తెలియజెప్పేవి &#8216;కబూతర్‌&#8217; &#8216;ఖిబ్లా&#8217; కథలు. భర్తను పోగొట్టుకున్న పేద ముస్లిం స్త్రీ ఆడపిల్లల పెళ్లిల్ల కోసం పడే యాతన &#8216;కబూతర్‌&#8217;లో కనిపిస్తది. కథ చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరగడం నాకు గర్తుంది. అయితే, ముగింపు చాలా కృతకంగా తెలుగు సినెమాలో లెక్క వుంది. చెల్లెల్ల పెళ్ళిల్లకు డబ్బులు సంపాదిద్దామని దుబాయ్‌ పోయి మాయమైన పేద ముస్లిం కథ &#8216;ఖిబ్లా&#8217;.</p>
<p>మంచి కథా వస్తువుతో అద్భుతంగా నడిచి గొప్ప ముగింపును చూపిన కథ ఇది. గరీబు ముస్లిం యువకుడి విఫల ప్రేమల సఫల వ్యక్తీకరణ &#8216;మజ్బూర్‌&#8217; , &#8216;ఉర్సు&#8217; కథలు. ఇవి రచయిత వైయక్తిక అనుభవాలని చెప్పడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అయితే, ఉర్సు కథలో ఇద్దరి ముస్లింల మధ్య కాకుండా, హిందూ ముస్లింల ఉమ్మడి సాంస్క ృతిక ప్రతీకగా నిలిచిన ఉర్సును దృష్టిలోవుంచుకొని ఇద్దరిని చెరొకమతానికి చెందినవాళ్ళుగా చిత్రించివుంటే మరింత గొప్పగా వుండేది. ఏ గొప్ప కళ అయినా వాస్తవానికి దగ్గరగా వుండాల్సిందే. కాని యధాతథంగా వుండాల్సిన అవసరం లేదు. సత్యం, సంభావ్యతల ఆధారంగా వాస్తవానికి ఒకింత కల్పన జోడించినప్పుడే అది అద్భుతమైన కళ అవుతుంది. పేదరికం ముస్లిం యువకుల్ని దుబాయి పోవడం ఎట్లా అనివార్యం చేసినవో చెప్పిన కథలు &#8216;భడక్తా చిరాగు&#8217; , &#8216;వతన్‌&#8217;. ఆర్థిక సమస్యలు, భార్యకు దూరంగా<br />
వుండాల్సి రావడం పురుషున్ని పరస్త్రీ వ్యామోహంలో పడేస్తే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తెలిసిసప్పుడు అతను తన తప్పును సరిదిద్దుకోవడం భడక్తా చిరాగు లో కనిస్తుంది. వస్తుపరంగా,శిల్పపరంగా సమతూకంలో వున్న మంచికథ ఇది. తను దుబాయి పోవడాన్ని నిందించిన హిందూ మిత్రుడు అమెరికా పోవడం మీద ఆగ్రహం చెందిన ముస్తిం యువకుడి కథ &#8216;వతన్‌&#8217;. రచయిత దీన్ని మాతృదేశం మీద ప్రేమ కోణంలో వ్యక్తీకరించిండు. కాని, బారతదేశ పౌరులు దుబాయికో లేదా ప్రపంచంలోని ఇతర దేశాలకో బతుకు దెరువు కోసం పోవడానికి, అమెరికాకు పోవడానికి మధ్యవున్న మౌలికమైన తేడాను విస్మరించిండు. ఆర్థిక, సాంస్క ృతిక సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో తృతీయ ప్రపంచ ప్రజల మూలుగపీల్చే అమెరికా చేతిలో ఆయుధమవ్వడానికి బతుకు దేరువుకోసం ఇంకో దేశానికి పోవడానికి వున్న తేడా పెట్టుబడి, దోపిడీకోణంలోంచి చూడాల్సి వుంటుంది.</p>
<p>ముస్లింవాద రాజకీయ కార్యాచరణను, దానికి కావాల్సిన తాత్విక భూమికను వ్యక్తీకరించే కథలు &#8216;వెజిటేరియన్స్‌ ఒన్లీ&#8217; &#8216;దస్తర్‌&#8217;.ఈ రెండు కథలు కూడ సమాజంలో వేళ్ళూనుకుపోయిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద ధిక్కారాన్ని ప్రకటిస్తూ, ఈ దేశంలో ముస్లింలకు అసలైన మిత్రుడు దళితుడే అని చెప్తవి. బహుశ, తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలోకింది కులాలే ఎక్కువగా మతం మార్చుకొని ముస్లింలుగా మారడం వల్ల కావచ్చు. రాజ్యహింసకు సంబంధించిన కథ&#8217;దావా&#8217;</p>
<p>అయితే, ఇందులో స్థల కాల వాతావరణ ఐక్యత లోపించింది. గొడవల్లో ముస్లిం యువకున్ని పోలీసులు నిర్భంధించి స్ఠేషన్‌లో పెట్టడం, అతని కోసం తల్లి రావడం ఇందలి కథ. అయితే, గొడవలు ఎక్కడ,ఎందుకు, ఎలా జరిగాయో తెలుపడు.వామపక్షతీవ్రవాద భావజాలం కలిగివున్నరన్న కారణంగా అనేక మంది యువకులు తెలంగాణలో అదృశ్యమైతున్న వాస్తవం వుంది. కాబట్టి సంఘటనేదో బ్యాక్‌డ్రాప్‌లో చెప్పివుండాల్సింది. సాధారణం బదులు నిర్దిష్టతను వర్ణించాలి. అమూర్తమైన దాన్ని మూర్తంగా చిత్రించాలి. ప్రతీక కోసం కాకి, కుక్కలను వాడుకున్నడు. కథలో తుపాకి గోడకు వేలాడుతున్నదంటే, దాన్నిఖచ్చితంగా పేల్చాలి అన్నట్టున్నది. ప్రయోగం కోసమే చేసిన ప్రయోగం &#8216;జీవం&#8217; కథ. స్కై లాంటి ఉద్యమ కార్యకర్తనుంచి ఇట్లాంటి కథ రావడం వల్ల పెద్ద ప్రయోజనమేమీ వుండదు.</p>
<p>తెలుగు సాహిత్యంలో విప్లవోద్యమంతో సహా, ఉద్యమ సాహిత్యంలో కళాత్మక నిర్మాణం పట్ల తక్కువ శ్రద్ధచూపించారు. ఇప్పుడైతే కళాత్మక విలువల గురించి మాట్లడితేనే నేరంగా పరిగణిస్తున్నారు. ఇట్లాంటి స్థితిలో, &#8220;What wedemand is the unity of politics and art, the unity of content and form, the revolutionary political conent and the highest possible perfection of artistic form. works of art which lack artistic quality have no force, how ever progressive they are politically. Therefore, we appose both the tendency to produce works of art with a wrong political view point and the tendency towards the &#8220;postar and slogan style&#8221; అన్న మావో సేటుంగుమాటల్ని గర్తుచేసుకోవాలి. అట్లా అని చెప్పి ప్రతి కథ మపాసా &#8216;నెక్లెస్‌&#8217; లాగనో, గొగోల్‌ &#8216;క్లోక్‌&#8217; లాగనో, టాల్‌స్టాయ్‌ &#8216;గాడ్‌ సీస్‌ది ట్రూత్‌ బట్‌ వెయిట్స్‌&#8217; లాగనో, ఓహెన్రీ &#8216;లాస్ట్‌ లీఫ్‌&#8217; లాగనో వుండాలని కూడ నేనేం అనడం లేదు.కాని, వస్తువు,ఇతివృత్తం ఎత్తుగడ, ముగింపు, సంఘటన, సంఘర్షణ, నడక, పట్టు, విడుపుల సమతూకం, స్థల కాల వాతావరణాల ఐక్యత మాత్రంకథకు కచ్చితంగా అవసరమౌతుంది. ఇక రెండో విషయం భాష. ఏ మాత్రం పరిచయమున్నా ఈ కథల్లో వాడిన భాషనుబట్టి రచయిత నల్లగొండ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల వాడని ఇట్టే చెప్పొచ్చు. అట్లా ఆ ప్రాంత ముస్లిమేతరుల భాషను అద్భుతంగా వాడుకున్నడు. భాష ఒక కమ్యూనికేట్‌ చేసే సాధనమే. కాని, అది ఆ కర్తవ్యం నేరవేర్చాలి కదా! ఈ మధ్య కాలంలో ఒక పేషంట్‌ నాతో &#8216;సార్‌! పాపకు బెడ్డు పడుతుంది&#8217; అని చెప్పింది. చాలా సేపటి వరకు ఆమె ఏం చెప్తుందో నా కర్థంకాలేదు. ముక్కులోంచి రక్తం పడుతుంది అని ఆమె చెప్పాలనుకుంది. ఈ వక్రీకరణ (బ్లడ్‌కు బదులు బెడ్డు) అంగీకారమేనా? అట్లాంటి భాషనే స్కై ఈ కథల్లో ఉపయోగించిండు. పొయ్‌నయ్‌, లేషిన,నౌక్‌రీ, బాదనిపించింది, సంబందం, విజా, కూసానున్నది ఇట్లాంటివే ఇంకొన్ని. తెలంగాణ తనదే అయిన భాషను స్థిరీకరించుకుంటున్నప్పుడు ఈ ప్రయోగం ఎక్కడ తేలుతేందో?అఫ్సర్‌ ముందుమాటలో అన్నట్టు ఇది &#8216;సాహిత్య భాష వైఫల్యాన్ని చెప్పే ప్రయత్నమా?&#8217;</p>
<p>&#8216;ఎక్కడన్నా విన్నారా, కవులు తమ సొంత పుస్తకాలు కాక, సంకలనాలు వేయడం&#8217; అంటూ కె.శ్రీనివాస్‌ స్కైమీది ప్రేమతో రాస్తున్నాడు గాని, &#8216;గోలకొండ కవుల సంచిక&#8217; వేసిన సురవరం ప్రతాపరెడ్డి తను చనిపోయే వరకు కూడ తనకవిత్వాన్ని వేసుకోలేదని, 2012 లో సంగిశెట్టి పూనుకునే దాకా సురవరం కవిత్వం వెలుగు చూడలేదని శ్రీనివాస్‌కు తెలుసు కదా!</p>
<p>అయితే, షాజహాన అన్నట్టు &#8216;తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాల పై ముస్లిం వెలువరించిన&#8221;అధూరె&#8217; కథలు ముస్లింల పేదరికాన్ని, జీవన సంఘర్షణను చిత్రికపట్టి చూపుతయి. సాంస్క ృతిక అత్తర్ల గుబాళింపును వ్యాపింప చేస్తయి. ముస్లిం మైనారిటీ అస్తిత్వవాదాన్ని మరింత ముందుకు తీసుకపోవడానికి ఉపకరిస్తయి. అట్లా స్కై కృతకృత్యుడైనట్లే. ఆకాశమే హద్దుగా స్కై సాగిపోవచ్చు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5115</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>హృదయ ఘోషకు, సమాజ భాషకూ చక్కని రూపం మౌనశ్రీ మల్లిక్ కవితా దీపం</title>
		<link>http://vaakili.com/patrika/?p=5158</link>
		<comments>http://vaakili.com/patrika/?p=5158#comments</comments>
		<pubDate>Fri, 28 Feb 2014 20:58:25 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[స్వాతీ శ్రీపాద]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=5158</guid>
		<description><![CDATA[<p>యుగాన్ని శాసించేది కాలం కాదు కలం <br /> జగాన్ని నడిపించేది ధనం కాదు కవనం</p> <p>అంటూ దూసుకొచ్చిన కొత్త కవిత్వపు చిరునామా మౌనశ్రీ మల్లిక్.</p> <p>ఆధునిక సంక్షోభాలనూ అతి సుందరమైన కవితలో చెప్పగల నేర్పు మౌనశ్రీది. కాదేదీ కవిత కనర్హం అతనికి. అయితే ప్రతికవితా చక్కని భావుకతా చిత్రం .ఒక గొప్ప రస సిద్ధి. వస్తు వైవిధ్యం, భావ సౌకుమార్యం, భాషా సముదాయం కూడగట్టుకుని కనిపించే అతని కవిత్వం అతిలోక సుందరి. మరణ రంగస్థల ప్రదర్శన అయినా అలిగిన గొంతు అయినా అతని కలానికి ఒక అలవోక గీత మాత్రమేరూపకాన్ని సాధికారికంగా ఉపయోగించే నేర్పరి.</p> <p>యుగయుగాల విశ్వంభర సుడిగాలుల్లో చెలరేగిన<br /> ధూళి కణాన్ని నేనని తెలిసిన తరువాత<br /> నా రెండు వెలుగు లోయలు<br /> విషాద నిశీధితో నిండిపోతున్నాయి.</p> <p>యుగయుగాల విశ్వంభర సుడిగాలులు &#8212;ఏ చరిత్రలవి ? ఏ సమస్యలవి ? వెతికి ప్రతీక లీ సుడిగాలులు ?<br /> సుడి గాలిలో ధూళి కణం కణం –ఇది మానసిక స్థితా? సామాజిక అవస్థా? ఒక లోలోని అభద్రతా భావనా? అనుభవించిన అవమానపు హేలనా?</p> <p>రెండు వెలుగు లోయలు –అతి చక్కని ప్రతీక వెలుగులు చిమ్మే కళ్ళు ఏం చెప్తాయి? వెలుగుల స్థానం ఆక్రమించిన విషాదపు నిశీధి&#8230; ఎంత లోతైన భావన!</p> <p>అంటూ పరిచయ వాక్యాలతో ఆరంభించి, ఎందుకు జన్మి౦చానో తెలిసి కూడా భ్రమలో చిటికిన జీవితానికి పర్యవసానం ఊహకందని విధంగా నిర్వచిస్తాడు. అమ్మ గురించి వర్ణన అత్యద్భుతం. అమ్మంటే మౌనమే కదా.. ఎంత ఆర్ద్రత, మెదడు పొరల్లోంచి తడి జ్ఞాపకాలు బయటకు తోడి చూపి మురిపించి మరిపి౦చిన చాతుర్యం అతని కవిత్వం.</p> <p>మాట్లాడుకున్న మాటల్నే శాశ్వతంగా నిద్రపోడం , ..కాలానికేం తెలుసు అనుబంధాల విలువ ? లోలోని నీ గుర్తులన్నీ కవిత్వమై పవిత్రంగా గుభాలిస్తూనే ఉంటాయి.</p> <p>హృదయాన్ని మెలితిప్పే ఆవేదన అందంగా మలచడం ఇదేనేమో!<br /> “ వేట [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><em>యుగాన్ని శాసించేది కాలం కాదు కలం <a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/garalam.jpg"><img class="alignright size-medium wp-image-5160" title="garalam" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2014/03/garalam-194x300.jpg" alt="" width="194" height="300" /></a></em><br />
<em> జగాన్ని నడిపించేది ధనం కాదు కవనం</em></p>
<p>అంటూ దూసుకొచ్చిన కొత్త కవిత్వపు చిరునామా మౌనశ్రీ మల్లిక్.</p>
<p>ఆధునిక సంక్షోభాలనూ అతి సుందరమైన కవితలో చెప్పగల నేర్పు మౌనశ్రీది. కాదేదీ కవిత కనర్హం అతనికి. అయితే ప్రతికవితా చక్కని భావుకతా చిత్రం .ఒక గొప్ప రస సిద్ధి. వస్తు వైవిధ్యం, భావ సౌకుమార్యం, భాషా సముదాయం కూడగట్టుకుని కనిపించే అతని కవిత్వం అతిలోక సుందరి. మరణ రంగస్థల ప్రదర్శన అయినా అలిగిన గొంతు అయినా అతని కలానికి ఒక అలవోక గీత మాత్రమేరూపకాన్ని సాధికారికంగా ఉపయోగించే నేర్పరి.</p>
<p><em>యుగయుగాల విశ్వంభర సుడిగాలుల్లో చెలరేగిన</em><br />
<em> ధూళి కణాన్ని నేనని తెలిసిన తరువాత</em><br />
<em> నా రెండు వెలుగు లోయలు</em><br />
<em> విషాద నిశీధితో నిండిపోతున్నాయి.</em></p>
<p>యుగయుగాల విశ్వంభర సుడిగాలులు &#8212;ఏ చరిత్రలవి ? ఏ సమస్యలవి ? వెతికి ప్రతీక లీ సుడిగాలులు ?<br />
సుడి గాలిలో ధూళి కణం కణం –ఇది మానసిక స్థితా? సామాజిక అవస్థా? ఒక లోలోని అభద్రతా భావనా? అనుభవించిన అవమానపు హేలనా?</p>
<p>రెండు వెలుగు లోయలు –అతి చక్కని ప్రతీక వెలుగులు చిమ్మే కళ్ళు ఏం చెప్తాయి? వెలుగుల స్థానం ఆక్రమించిన విషాదపు నిశీధి&#8230; ఎంత లోతైన భావన!</p>
<p>అంటూ పరిచయ వాక్యాలతో ఆరంభించి, ఎందుకు జన్మి౦చానో తెలిసి కూడా భ్రమలో చిటికిన జీవితానికి పర్యవసానం ఊహకందని విధంగా నిర్వచిస్తాడు. అమ్మ గురించి వర్ణన అత్యద్భుతం. అమ్మంటే మౌనమే కదా.. ఎంత ఆర్ద్రత, మెదడు పొరల్లోంచి తడి జ్ఞాపకాలు బయటకు తోడి చూపి మురిపించి మరిపి౦చిన చాతుర్యం అతని కవిత్వం.</p>
<p>మాట్లాడుకున్న మాటల్నే శాశ్వతంగా నిద్రపోడం , ..కాలానికేం తెలుసు అనుబంధాల విలువ ? లోలోని నీ గుర్తులన్నీ కవిత్వమై పవిత్రంగా గుభాలిస్తూనే ఉంటాయి.</p>
<p>హృదయాన్ని మెలితిప్పే ఆవేదన అందంగా మలచడం ఇదేనేమో!<br />
“ వేట గాడి కదలికలు “<br />
ఒక కాంట్రాస్ట్ ను విడమరిచి చెప్పడం బావుంది.<br />
వాడు<br />
మేకపిల్లలను చేరదీసేది<br />
కనికరంతో కాదు<br />
కసాయితనంతో &#8230;<br />
చిన్న చిన్న పదాలు అతి సామాన్యమయినవే ,అయితే పదాల మధ్య ,పదాల వెనక భావం అనంతం.<br />
“ నీ స్వరం విన్నప్పుడల్లా<br />
వాడి నోట్లో లాలాజల సునామీలు&#8230;..”<br />
“వాడి చిరునవ్వులోతుల్లో<br />
కపట నీతుల కాల బిలాల లోతులున్నాయి “<br />
“వెలుగు లాటి చీకటిలో<br />
వస్త్ర సన్యాస విన్యాసం “<br />
ఒక జుగుప్సాకర భీకర దృశ్యాన్ని ఇంత అందమైన కవితగా మలచడం ఒక మల్లిక్ కే సాధ్యం.<br />
మరో కవితలో అమ్మగా మారి<br />
“ పొగిలిపొగిలి రోదిస్తున్న<br />
పుడమి తల్లిని ఓ సారి ఒళ్లోకి తీసుకుని<br />
స్తన్యమిచ్చి ఓదార్చాలని ఉ౦ది” అంటాడు.<br />
“ ఒక అమానుష పరిష్వంగం “ కవిత నేటి సమాజ అభద్రతను ఆడపిల్లల దైన్య స్థితిని ఎంత అద్భుత శైలిలో మనసు పి౦డేసేలా రాసాడో చూడండి.<br />
“ ఆ రోజు కూడా సూర్యుడు అస్తమించి<br />
చేతులు దులుపు కుంటాడు<br />
ఆయనకు తెలుసు<br />
ఒక జీవితం<br />
వెలుగులోంచి తిమిరం లోకి వెళ్తుందని “<br />
ఇక్కడి వ్యంగ్యం చేరవలసిన వాళ్ళను చేరితే బాగుండు కదా.<br />
“వేట కొరకై రాటుదేల్తాయి<br />
జ్వలిస్తున్న వాంఛలన్నీ<br />
&#8230;ఒక వీణియ తీవెల్ని<br />
అమానవీయంగా తె౦చే౦దుకు<br />
రంగం సిద్ధమవుతు౦ది&#8230;దానవుల దమన కా౦డ.”</p>
<p>గరళం కవిత సమగ్రంగా అర్ధం చేసుకుంటే జాతిపిత జన్మించిన రోజుకూడా గరళంగా మారుస్తున్న చరిత్ర ప్రతిపుటలో ప్రతిధ్వనిస్తూ ఈ కవితా సంపుటికి ఇది తగిన పేరని అనిపించక మానదు. వస్తు వైవిధ్యం గురించి చెప్పాలంటే ఎల్లలు లేకుండా వ్యక్తీ నుండి ,సమాజం నుండి రాష్ట్రం , దేశం , చివరికి పరదేశీ’ యాత్రికుడి వరకూ సాగింది. ధ్యానం, మలి సంధ్య పాడిన తొలి వేకువ పాట, విశ్వనరుడి స్వప్నం. , చార్మినార్ సాక్షిగా &#8230;కిరణజన్య సంయోగ క్రియ, పుత్ర హరిత రాగం ఇలా కొనసాగుతాయి<br />
చెప్తూ పొతే ప్రతి కవితా ఒక కళాఖండం, ఒక సంవేదన. ఒక స్పందించే హృదయం. అంతకన్నా ఉత్తమం ప్రతి కవితా చదివి ఆస్వాదించడం.<br />
( గరళం కవితా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=5158</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
	</channel>
</rss>
