<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; వ్యాసాలు</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=545&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>యుక్త వాక్యం &#8211; చివరి భాగం</title>
		<link>http://vaakili.com/patrika/?p=16220</link>
		<comments>http://vaakili.com/patrika/?p=16220#comments</comments>
		<pubDate>Sat, 24 Feb 2018 17:40:39 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=16220</guid>
		<description><![CDATA[<p>*మినీ బస్సుల ద్వారా గుర్తించిన మార్గాలనుండి రవాణా సేవలు అందిస్తాము.<br /> *మార్గాలను మినీ బస్సుల ద్వారా గుర్తించారా?! కాదే. ఇక్కడ ‘మినీ బస్సుల’ను ‘రవాణా సేవలు’కు వర్తింపజేయాలి. కాని, ‘గుర్తించిన’కు వర్తింపజేశారు. కాబట్టి, ‘గుర్తించిన మార్గాల నుండి మినీ బస్సుల ద్వారా రవాణా సేవలు అందిస్తాము’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.</p> <p>*నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సీఈవో గా తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే నియమించుకున్నాడు.<br /> *ఈ వాక్యం చెప్తున్నదేమంటే, ఒక వ్యక్తి నయీం చానెల్ కు సీఈవోగా &#8211; అంటే సీఈవో హోదాలో &#8211; ఉండి నయీంను వ్యతికేకించాడనీ, తర్వాత అతడినే నయీం నియమించుకున్నడని. కాని, వాక్యరచయిత మనసులో ఉన్నది వేరే. తనను మొదట వ్యతిరేకించిన వ్యక్తినే తర్వాత సీఈవోగా నియమించుకున్నాడు, అన్నది చెప్పదల్చుకున్న భావం. ఏ గందరగోళానికీ తావివ్వకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని, ‘నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే దానికి సీఈవోగా నియమించుకున్నాడు’ అని మార్చాలి. </p> <p>*పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్ ఎన్నో హత్యలు చేశాడు.<br /> *ఈ వాక్యంలో వ్యాకరణపరంగా పెద్ద దోషం లేనప్పటికీ, అర్థప్రసరణ అనే కోణం లోంచి చూసినప్పుడు, వాక్యనిర్మాణం కొంత అన్వయ రాహిత్యానికి దారి తీసినట్టు కనిపిస్తుంది. ఇంగ్లిష్ లో కూడా కొందరు ఈ విధంగానే రాస్తున్నారు, The slain gangster had committed many murders &#8211; అని. కాని, మొదటి నాలుగు పదాలను (పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్) కలిపి ఒకటిగానే పరిగణించాల్సి వుంటుంది కనుక, హతుడయ్యాక హత్యలు చేసే అవకాశమే ఉండదు కదా అనిపిస్తుంది. కాబట్టి, ఏ అయోమయమూ లేకుండా ఉండాలంటే (ఫలానా) గ్యాంగ్ స్టర్ పోలీసుల చేతిలో హతుడు కాకముందు ఎన్నో హత్యలు చేశాడు అని రాయాలి. లేదా వాక్యాన్ని ఇట్లా రెండుగా విరగ్గొట్టి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>*మినీ బస్సుల ద్వారా గుర్తించిన మార్గాలనుండి రవాణా సేవలు అందిస్తాము.<br />
*మార్గాలను మినీ బస్సుల ద్వారా గుర్తించారా?! కాదే. ఇక్కడ ‘మినీ బస్సుల’ను ‘రవాణా సేవలు’కు వర్తింపజేయాలి. కాని, ‘గుర్తించిన’కు వర్తింపజేశారు. కాబట్టి, ‘గుర్తించిన మార్గాల నుండి మినీ బస్సుల ద్వారా రవాణా సేవలు అందిస్తాము’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.</p>
<p>*నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సీఈవో గా తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే నియమించుకున్నాడు.<br />
*ఈ వాక్యం చెప్తున్నదేమంటే, ఒక వ్యక్తి నయీం చానెల్ కు సీఈవోగా &#8211; అంటే సీఈవో హోదాలో &#8211; ఉండి నయీంను వ్యతికేకించాడనీ, తర్వాత అతడినే నయీం నియమించుకున్నడని. కాని, వాక్యరచయిత మనసులో ఉన్నది వేరే. తనను మొదట వ్యతిరేకించిన వ్యక్తినే తర్వాత సీఈవోగా నియమించుకున్నాడు, అన్నది చెప్పదల్చుకున్న భావం. ఏ గందరగోళానికీ తావివ్వకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని, ‘నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే దానికి సీఈవోగా నియమించుకున్నాడు’ అని మార్చాలి. </p>
<p>*పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్ ఎన్నో హత్యలు చేశాడు.<br />
*ఈ వాక్యంలో వ్యాకరణపరంగా పెద్ద దోషం లేనప్పటికీ, అర్థప్రసరణ అనే కోణం లోంచి చూసినప్పుడు, వాక్యనిర్మాణం కొంత అన్వయ రాహిత్యానికి దారి తీసినట్టు కనిపిస్తుంది. ఇంగ్లిష్ లో కూడా కొందరు ఈ విధంగానే రాస్తున్నారు, The slain gangster had committed many murders &#8211; అని. కాని, మొదటి నాలుగు పదాలను (పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్) కలిపి ఒకటిగానే పరిగణించాల్సి వుంటుంది కనుక, హతుడయ్యాక హత్యలు చేసే అవకాశమే ఉండదు కదా అనిపిస్తుంది. కాబట్టి, ఏ అయోమయమూ లేకుండా ఉండాలంటే (ఫలానా) గ్యాంగ్ స్టర్ పోలీసుల చేతిలో హతుడు కాకముందు ఎన్నో హత్యలు చేశాడు అని రాయాలి. లేదా వాక్యాన్ని ఇట్లా రెండుగా విరగ్గొట్టి తికమకను నివారించవచ్చు: (ఫలానా) గ్యాంగ్ స్టర్ ఎన్నో హత్యలు చేశాడు. అతడు పోలీసుల చేతిలో హతుడయ్యాడు.</p>
<p>*ఈ ఫోటోలను రహస్యంగా నయీం అంగరక్షకులుగా వ్యవహరించే అమ్మాయిలే తీసేవారు.<br />
*ఈ వాక్యంలోమొదటి మూడు పదాలు (ఈ ఫోటోలను రహస్యంగా) ‘వ్యవహరించే’కు వర్తిస్తాయి. కాని, అవి ‘తీసేవారు’కు వర్తించాలి. కాబట్టి, ఆ మొదటి మూడు పదాలను అక్కణ్నుంచి తీసి, ‘తీసేవారు’కు ముందు పెట్టాలి. నయీం అంగరక్షకులుగా అని కాక నయీంకు అంగరక్షకులుగా అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది.   అంతిమంగా వాక్యం ఇలా ఉండాలి: నయీంకు అంగరక్షకులుగా వ్యవహరించే అమ్మాయిలే ఈఫోటోలను రహస్యంగా తీసేవారు.</p>
<p>*ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నయీంకు సహకరించిన రాజకీయ నేతలకు నోటీసులను జారీ చేయనున్నారు.<br />
*ఇది కూడా పై వాక్యం లాగానే ఉంది. రాజకీయ నేతలు ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నయీంకు సహకరించారా? కాదు కదా. అనుమతి లభించగానే నోటీసులు జారీ చేయడమన్నది ఈ వాక్యంలోని అసలైన ఉద్దేశం. ‘లభించగానే’ తర్వాత కామా ఉంటే అయోమయానికి అంతగా అవకాశముండేది కాదు. కనుక, ‘నయీంకు సహకరించిన రాజకీయ నేతలకు, ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నోటీసులను జారీ చేయనున్నారు’ అనే వాక్యమే సరైనదిగా ఉంటుంది. కానీ ఈ వాక్యంలో కూడా ‘నేతలకు’ తర్వాత కామా పెట్టకపోతే ‘రాజకీయ నేతలకు ప్రభుత్వం నుంచి అనుమతి’ అన్నది గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, అక్కడ కామా ఉండటం చాలా అవసరం.</p>
<p>*పౌర్ణిమ నాడూ, కొత్త చంద్రుడు ఉదయించే రోజూ ఈ రకమైన మానసిక వ్యాధుల రోగులు తమవద్దకు ఎక్కువగా వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.<br />
*ఇది ఒక ఆంగ్లవాక్యానికి చేసిన అనువాదమని గుర్తించడం కష్టమైన పని కాదు. ఈ వాక్యంలోని భాషాపరమైన అపసవ్యత New moon day ను కొత్త చంద్రుడు ఉదయించే రోజు అని తప్పుగా అనువదించడం వల్లనే ఏర్పడింది. ఇంగ్లిష్ లో పౌర్ణిమని Full moon day  అనీ, అమావాస్యను New moon day అనీ అంటారు (No moon day, Nil moon day అనరు). కాని, New moon day ను ‘కొత్త చంద్రుడు ఉదయించే రోజు’ అంటూ ముక్కస్య ముక్కగా అనువదించడంతోనే పప్పులో కాలు వేయటం జరిగిందిక్కడ. కాబట్టి, పౌర్ణిమ నాడూ అమావాస్య నాడూ&#8230;.. అని రాయాలి. కొందరు పౌర్ణిమకి బదులు పౌర్ణమి అని రాస్తారు. కాని, అది తప్పు. పౌర్ణిమ లేక పూర్ణిమ సరైన పదాలు.</p>
<p>*ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.<br />
*ఈ వాక్యంలోని భాషాదోషం ప్రాథమిక స్థాయికి చెందింది. ఇక్కడ ‘భాగస్వామ్యం కావాలి’కి బదులు ‘భాగస్వామి కావాలి’ అని ఉండాలి. లేదా, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి అనొచ్చు.</p>
<p>*మరింత ముందున్న సమాజ్ వాది పార్టీ సంక్షోభం.<br />
*ఈ వాక్యం అసంపూర్ణంగా ఉంది. శీర్షికగా లేక ఉపశీర్షికగా రాసినప్పుడు దానికేం అభ్యంతరం లేదు. కాని, ‘సంక్షోభం’కు ‘మరింత ముందున్న’ వర్తిస్తుందిక్కడ. ఫలితంగా వాక్యంలో అపసవ్యత ఏర్పడింది. ఎందుకంటే, అంతకు ముందు ఏదైనా కొంత గురించి చెప్పకుండా మరింత అనే పదాన్ని వాడలేము. ‘మరింత ముదరనున్న &#8230;..’ అని రాస్తే అయోమయం ఉండదు. కాని, ముదరడం ఇక్కడ చెప్పదల్చుకున్న విషయం కాదు. ‘ముందుంది’ అన్నదే ప్రధానమైతే ‘మరింత’ను తీసేసి, సమాజ్ వాది పార్టీ ముందున్న సంక్షోభం అనవచ్చు.   </p>
<p>*ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి.<br />
*‘అన్యాక్రాంతం’ విశేష్యమైతే (నామవాచకమైతే) ఈ వాక్యం సరిగ్గానే ఉందని ఒప్పుకోవచ్చు. కాని, అది నామవాచకం కాదు, విశేషణం (Adjective). ఆక్రాంతము పదం విశేషణము అని శబ్ద రత్నాకరము స్పష్టంగా చెప్తోంది. మరప్పుడు అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి అన్నది ఎట్లా పొసగుతుంది? ‘మనమందరం మనసులలో స్వచ్ఛను నింపుకోవాలి’ అన్నట్టుంటుంది ఆ వాక్యం. కాని, స్వచ్ఛతను నింపుకోవాలి అని రాయాలి కదా. స్వచ్ఛత విశేష్యం, స్వచ్ఛ విశేషణం. There is beauty in her face అనాలి తప్ప There is beautiful in her face అంటామా?! కాబట్టి, పై వాక్యాన్ని ‘ఆలయ భూములు అన్యాక్రాంతం అవడాన్ని అడ్డుకోవాలి’ అని రాస్తేనే కరెక్టు. ఈ వాక్యంలో ‘అవడం’ క్రియాత్మక నామవాచకం కనుక, అపసవ్యత చోటు చేసుకునే అవకాశం లేదు.</p>
<p>*ఉగ్ర కుట్ర, ఉగ్ర దాడి, ఉగ్ర పోరు.<br />
*ఈ పదబంధాలు తెలుగు లిపిలో మనకు తరచుగా కనిపిస్తుంటాయి. ఉగ్ర(ము) అన్నది తత్సమం (సంస్కృతసమ శబ్దం). కుట్ర, దాడి, పోరు అచ్చతెలుగు పదాలు. సంస్కృతసమం కాని పదాలను  సంస్కృతసమ శబ్దాలతో కలిపి పదబంధాలను/సమాసాలను ఏర్పరచినప్పుడు వైరి (దుష్ట) సమాసాలు తయారై, వాటిలో తప్పక ఎబ్బెట్టుతనం చోటు చేసుకుంటుంది. భాషపట్ల, శబ్దంపట్ల మమకారం లేనివాళ్లకు ఏ ఎబ్బెట్టుతనమూ కనిపించదేమో! అసలు సమాసాలే వద్దు అనుకుంటున్న ఈ రోజుల్లో వైరి సమాసం అంటూ ఈ గోలేమిటండీ, అని కొందరు విసుక్కోవచ్చు. కాని, వాక్యం అందరికీ వినసొంపుగా ఉండాలంటే, వైరిసమాసాలను మానుకోవడం అవసరం. ఉగ్రకుట్ర అనే బదులు ఉగ్రవాదుల కుట్ర అనొచ్చు కదా. అదే విధంగా ఉగ్రవాదుల దాడి, ఉగ్రవాదుల పోరు అని రాయవచ్చు. ఎంతమాత్రం పొసగని కొన్ని దుష్ట సమాసాలను చదివినప్పుడు, విన్నప్పుడు కొత్తకోటు మీదికి పైజామా తొడుక్కున్నట్టుంటుంది అని ఇంతకు ముందొక వ్యాసంలో రాశాను నేను. మరి ఉగ్రవాదుల దాడి అంటే అట్లా అనిపించదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అనిపించదు అన్నది నా సమాధానం. అప్పుడది కొత్తకోటునూ, పైజామానూ హ్యాంగర్లకు తగిలించి పక్కపక్కన పెట్టినట్టుంటుంది, సమాసం చేసినప్పుడు మాత్రం తొడుక్కున్నట్టగా ఉంటుంది &#8211; అంటూ అదనపు వివరణను కూడా ఇవ్వొచ్చు! ఎందుకంటే ఉగ్రదాడి సమాసమవుతుంది కాని, ఉగ్రవాదుల దాడి సమాసం కాదు. సమాసం కానప్పుడు భాషాపరమైన అపసవ్యత చోటు చేసుకోదు. ఇక భూపంపిణీ అని రాసేబదులు భూమి పంపిణీ అని రాయొచ్చు. అట్లాగే భూసర్వేకు బదులు భూమి సర్వే అనీ, భూకబ్జాకు బదులు భూమి కబ్జా, అనీ, భూజగడంకు బదులు భూమి జగడం అనీ రాయొచ్చు.</p>
<p>*ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ వంద శాతం నెరవేర్చుతాం.<br />
*ఈ వాక్యంలో ‘వాగ్దానాలన్నీ’ అంటేనే మొత్తం వాగ్దానాలు అని అర్థం కనుక, మళ్లీ వంద శాతం అనే అవసరం లేదు. కాబట్టి, ‘ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను వంద శాతం నెరవేర్చుతాం’ అన్నది సరైన వాక్యం. లేదా, ‘ఎన్నికలకు ముందు చేసిన అన్ని వాగ్దానాలనూ నెరవేర్చుతాం’ అని రాస్తే ఇంకా బాగుండదా?</p>
<p>*భార్యను ఏలుకునేందుకు నిరాకరిస్తున్న ప్రభాకర్, తల్లిదండ్రులను అరెస్ట్ చేసి శిక్షించాలి.<br />
*ఇక్కడ ప్రభాకర్ నూ, అతని తల్లిదండ్రులనూ (పోలీసులు) అరెస్టు చేయాలనేది అసలైన ఉద్దేశం. కాని, ఈ వాక్యంలో పోలీసులకు బదులు ప్రభాకర్ కర్త అవుతున్నాడు! ఎందుకంటే, తన తల్లిదండ్రులను ప్రభాకర్ అరెస్టు చెయ్యాలి అనే అర్థం వస్తోంది, వాక్యాన్ని చదివితే! కాబట్టి, ఏ విధమైన గందరగోళమూ ఉండొద్దనుకుంటే, ఇట్లా తిరగ రాయాలి ఈ వాక్యాన్ని: భార్యను ఏలుకునేందుకు నిరాకరిస్తున్న ప్రభాకర్ ను, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, శిక్షించాలి. </p>
<p>*పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మాజీ సర్పంచ్ ను కాల్చి చంపారు.<br />
*ఈ వాక్యంలో పోలీస్ ఇన్ఫార్మర్, నెపం &#8211; ఈ రెండు పదాలూ నామవాచకాలే. అయితే వీటి మధ్యన ‘అనే’ లేక ‘అన్న’ లేకపోతే కొంచెం ఏదోలా ఉన్నట్టనిపించడం లేదా? కొన్ని సందర్భాల్లో అటువంటి రెండు నామవాచక పదాల మధ్య అనుసంధానక పదమేదీ లేకపోయినా బాగానే ఉంటుంది. ఉదాహరణకు, మనిషి యొక్క కోరిక అనకుండా మనిషికోరిక అన్నప్పుడు అపసవ్యత కనిపించదు. కాని, ఇన్ఫార్మర్ నెపంతో  అన్నప్పుడు తప్పక అపసవ్యత తోస్తుంది. ‘ఇన్ఫార్మర్ అనే నెపంతో’ అని రాస్తేనే అపసవ్యతను నివారించినవాళ్లమౌతాం. </p>
<p>*విషజ్వర పీడితులను ఆదుకోవాలని ఫిర్యాదు.<br />
*ఆదుకోవాలని విజ్ఞప్తి/విన్నపం చేసుకుంటారు గాని, ఫిర్యాదు చేస్తారా? ఆదుకోనందుకు మాత్రం ఫిర్యాదు చేసే అవకాశముంది. కాబట్టి, ఈ వాక్యాన్ని ‘విషజ్వర పీడితులను ఆదుకోవాలని విజ్ఞప్తి/విన్నపం’ అని కాని, ‘విషజ్వర పీడితులను ఆదుకోనందుకు ఫిర్యాదు’ అని కాని మార్చాలి.</p>
<p>*పార్టీలో బలోపేతం కోసం కృషి.<br />
*‘బలోపేతం’ నామవాచకం కాదు. అది విశేషణం (చూ. శబ్ద రత్నాకరము). ఆమె గానంలో శ్రావ్యత ఎక్కువ అని రాసే బదులు ఆమె గానంలో శ్రావ్య ఎక్కువ అని రాసినట్టు తప్పక అనిపిస్తుంది, ఈ వాక్యాన్ని చదివితే! అయితే బలోపేతం నామవాచకం అని భ్రమపడే వాళ్లకు మాత్రం అట్లా అనిపింకచ పోవచ్చు! కాబట్టి, ‘పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి’, లేక ‘పార్టీలో బలం నిపండం కోసం కృషి’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.    </p>
<p>*లక్షకు 25 నుండి 30 శాతం కమీషన్ వసూలు చేసిన నకిలీ కరెన్సీ గ్యాంగ్.<br />
*శాతం అంటే వందకు. మళ్లీ లక్షకు ఏంటి? ఇక్కడ గందరగోళం ఏర్పడలేదా? లక్షకు 25 వేలనుండి 30  వేల వరకు &#8211; అని రాస్తే ఎంత అయోమయ రహితంగా ఉంటుంది వాక్యం! లేదా, ‘లక్షకు’ తీసేసి, సింపుల్ గా 25 నుండి 30 శాతం కమిషన్ వసూలు చేసిన నకిలీ కరెన్సీ గ్యాంగ్ &#8211; అంటే సరిపోతుంది.</p>
<p>*సాంకేతిక లోపంతో డౌన్ లోడ్ కాని హాల్ టికెట్లు.<br />
*హాల్ టికెట్లు సాంకేతిక లోపంతో డౌన్ లోడ్ కావలసి ఉండిందా? ఏ లోపమూ లేకుండా డౌన్ లోడ్ కావడమే ఆశిస్తాం కదా. ఈ వాక్యంలో ‘లోపంలో’ తర్వాత కామా ఉన్నా కొంత బాగుండేది. ఎందుకంటే, అప్పుడు అయోమయం కొంచెం తగ్గుతుంది. వాక్యం మరింత సవ్యంగా ఉండాలంటే ‘సాంకేతిక లోపం కారణంగా (లేక మూలంగా, లేక వలన) డౌన్ లోడ్ కాని హాల్ టికెట్లు’ అని రాయాల్సి ఉంటుంది.</p>
<p>*కమ్యూనిస్ట్ శిఖరం (ఫిడెల్ కాస్ట్రో) ఒరిగింది.<br />
*ఒరగడంకూ నేలకొరగడంకూ మధ్య భేదం ఉంది. ‘ఒరుగుట’ పూర్తిగా కింద పడిపోవడాన్ని సూచించదు, కేవలం పక్కకు వంగడాన్ని మాత్రమే తెలుపుతుంది. కాబట్టి, ఇక్కడ ఒరిగిందికి బదులు నేలకొరిగింది అని రాస్తేనే సరిగ్గా ఉంటుంది.</p>
<p>*(ఫిడెల్ కాస్ట్రో) అమెరికా గుండెల్లో సింహస్వప్నమై గర్జించిన యోధుడు.<br />
*ఎవరైనా సింహమై గర్జిస్తారు కాని, సింహస్వప్నమై గర్జించరు. కాబట్టి, ఇక్కడ సింహమై గర్జించిన యోధుడు అంటేనే బాగుంటుంది. లేదా, సింహస్వప్నంగా మారిన యోధుడు/మారి భయపెట్టిన యోధుడు అనొచ్చు.</p>
<p>*నగదు రహితం కోసం కమిటీ.<br />
*ఈ వాక్యంలో కూడా నామవాచకంకు బదులు విశేషణం ఉండటంవల్ల వాక్యంలో అపసవ్యత చోటు చేసుకుంది. ‘రహితం’ విశేషణం, ‘రాహిత్యం’ నామవాచకం. కనుక, నగదు రాహిత్యం కోసం కమిటీ అని రాస్తేనే కరెక్టుగా ఉంటుంది. లేదా, నగదురహిత లావాదేవీల కోసం కమిటీ అనొచ్చు.</p>
<p>*జి.హెచ్.ఎమ్. సి. వసూళ్లు 2500 శాతం పెరిగాయి.<br />
*అర్థశాస్త్రం చదివిన గణకుల భాషను అనుసరిస్తూ 2500 శాతం అని చెప్తే  మామూలు పాఠకులకు ఎలా తెలుస్తుంది? వాళ్లకు సులభంగా అర్థం కావడం కోసం ‘25 రెట్లు పెరిగాయి’ అనొచ్చు కదా. కనీసం బ్రాకెట్లలోనైనా అదనంగా రాయవచ్చు.</p>
<p>*ప్రపంచంలోనే ఎత్తైన భవనం.<br />
*‘నే’ ను సాధారణంగా ‘మాత్రమే’ అనే అర్థంలో వాడుతాము. రైల్లోనే వెళ్తాను అన్నప్పుడు వేరేదాంట్లో వెళ్లను అని అర్థం. పోనీ, ఈ వాక్యంలో ‘నే’ ను ఉంచినా, ఎత్తైనకు ముందు అత్యంత/అన్నిటికన్న అని రాస్తే సవ్యంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం అని కాని, ప్రపంచంలో అన్నిటికన్న ఎత్తైన భవనం అని కాని రాస్తే అపసవ్యతను నివారించినవాళ్లమౌతాము. </p>
<p>*ఈ వార్త వాట్సప్ లో దావానలంలా వ్యాపిస్తోంది.<br />
*వాట్సప్ అంటే What’s up (What is up) అని! కాని ఇక్కడ చెప్పదల్చుకున్నది What’s App గురించి! App అనేది Application కు పొట్టి రూపం. కాబట్టి, వాట్సాప్ అని రాస్తేనే కరెక్టు. </p>
<p>*ఆ రెండు సినిమా కథల మధ్య సారూప్యత ఉంది.<br />
*సారూప్యత, తాదాత్మ్యత నైపుణ్యత మొదలైన పదప్రయోగాలు మనకు చాలానే తారస పడుతుంటాయి. ఇవి కొంత వరకు వివక్షత వంటివే. సారూప్యం, తాదాత్మ్యం, నైపుణ్యం అన్నవే నామవాచకాలైనప్పుడు, వాటికి మళ్లీ ‘త’ అనే ప్రత్యయాన్ని చేర్చి కంగాళీ చేయడమెందుకు? సారూప్యంకు బదులు సరూపత అనీ, నైపుణ్యంకు బదులు నిపుణత అని కూడా రాయొచ్చు. ‘వివక్ష’ నామవాచకం కనుక దానికి ‘త’ చేరిస్తే తప్పవుతుంది.</p>
<p>*ఆమె హ్రిదయం గుబగుబలాడింది.<br />
*తెలుగు భాషలో హ్రిదయం అనే పదమే లేదు. ‘హృదయం’ ఉంది. అయితే కొందరు దాన్ని హ్రుదయం అని పలుకుతారు. అది తప్పు. హ్రిదయం అని పలకాలి. కాని, ఇది పలకడం కోసం మాత్రమే. రాయడం మాత్రం హృదయం అనే రాయాలి. తమ పేరును క్రిష్ణ కుమార్ అని రాసుకునేవాళ్లు కూడా ఉంటారు కొందరు.</p>
<p>*కూల్చివేతల కారణంగా ఆగిన వృద్ధగుండె.<br />
*ఇక్కడ వృద్ధగుండె వైరి సమాసం. వైరి సమాసాలను ఉచ్చరించినప్పుడు పొసగనితనం సులభంగా తెలుస్తుంది. కాబట్టి, వృద్ధుని/వృద్ధురాలి గుండె అని రాస్తే చిక్కే ఉండదు కదా. హృదయం ‘వృద్ధ’లాగా సంస్కృతసమ శబ్దం కనుక, ఆ రెండు పదాలతో పదబంధాన్ని తయారు చేస్తే ఎటువంటి అపసవ్యతా ఉండదు.   </p>
<p>*కాసేపయ్యక బజారుకు వెళ్లిన పిల్లవాడు తిరిగి వచ్చాడు.<br />
*ఈ రకానికి చెందిన అపసవ్య వాక్యాల గురించి ముందు కూడా చెప్పుకున్నాం. అయినా మళ్లీమళ్లీ చెప్పుకుంటే మంచిదే. పిల్లవాడు కాసేపయ్యాక బజారుకు వెళ్లాడా? కాదే. కాసేపయ్యాక తిరిగి వచ్చాడు అన్నది చెప్పదల్చుకున్న అర్థం. కాబట్టి, బజారుకు వెళ్లిన పిల్లవాడు కాసేపయ్యాక తిరిగి వచ్చాడు అని రాయాలి.</p>
<p>*ఇది ప్రారంభించడానికి ముందు నేనెంతో ఆలోచించాను.<br />
*ఈ రకమైన వాక్యాలు కూడా నేటికాలంలో తరచుగా దర్శనమిస్తున్నాయి. ఈ వాక్యంలో ‘నేను’ కర్త. కాబట్టి, నేను దీన్ని ప్రారంభించడానికి ముందు ఎంతో అలోచించాను అంటే సరిగ్గా ఉంటుంది. </p>
<p>*మెరీనా బీచ్ లో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని విద్యార్థుల ఆందోళన.<br />
*మెరీనా బీచ్ లో జల్లికట్టు జరిగినట్టు/జరుగుతున్నట్టు సూచిస్తోంది ఈ వాక్యం! కాని, అక్కడ జరుగుతున్నది ఆందోళన &#8211; జల్లికట్టు కాదు. కనుక, ఈ వాక్యం ఇలా ఉండాలి: జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని మెరీనా బీచ్ లో విద్యార్థుల ఆందోళన.</p>
<p>*భర్తను ప్రియుడితో హత్య చేసిన భార్య<br />
*ఇక్కడ ‘తో’ అనే ప్రత్యయం అసంబద్ధంగా ఉండటమే మొత్తం తికమకకు దారి తీస్తోంది. ‘ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య’ అంటే సజావుగా ఉంటుంది. లేదా ‘భర్తను ప్రియుడి చేత/ప్రియుడితో హత్య చేయించిన భార్య’ అనొచ్చు.</p>
<p>*మంత్రిగారు తమ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.<br />
*ప్రభావవంతంగా, బలవంతంగా, ధనవంతుడు, గుణవంతుడు, తేజోవంతమైన, బలవంతమైన &#8211; మొదలైన పదాల్లో వంతంగా/వంతుడు/వంతమైన ఏ పదాలకైతే వచ్చి చేరుతున్నాయో అవి (ప్రభావం, బలం, ధనం, గుణం, తేజస్సు) నామవాచకాలు. కాని, సమర్థం నామవాచకం కాదు. అది విశేషణం. దాని నామవాచక రూపం సామర్థ్యం, లేక సమర్థత. నామవాచకంతో ప్రత్యయం సంయోజనం చెందుతుంది కాని విశేషణంతో చెందదు. కాబట్టి, ‘సమర్థం’కు ‘వంతం’ అతుక్కోదు. ఒకవేళ అతుక్కునేట్టుగా రాస్తే అది భాషాదోషానికి దారి తీస్తుంది. అందుకే సమర్థవంతంగా అని కాక సమర్థంగా అని రాయాలి. అంటే, మంత్రిగారు తమ శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నారు అని రాయటం సరైందన్న మాట. వ్యాకరణ సముద్రపు లోతుల్ని ముట్టినవారు దీనిగురించి మరింత సమగ్రమైన వివరణను ఇవ్వగలుగుతారు. ‘సామర్థ్యవంతంగా’                                                అన్నది ఎందుకు ఉపయోగంలో లేదో చెప్పలేము. ఇక ప్రభావములోని ‘ము’ ను విలుప్తం చేసి ‘వంతం’ను కలిపినట్టే సమర్థతలోని ‘త’ ను విలుప్తం చేసి ‘వంతం’ ను కలుపవచ్చు కదా అనే సందేహం రావడం సహజం. కాని, ఇక్కడ ‘ము’ ప్రథమా విభక్తి ప్రత్యయం ‘త’ విభక్తి ప్రత్యయం కాదు, మామూలు ప్రత్యయం. అయితే, ఇది పూర్తిగా సంతృప్తికరమైన వివరణ కాకపోవచ్చు. సరైన వ్యాకరణ సూత్రాన్ని చెప్పి వివరిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది.  </p>
<p>*అతనిలో ఊహాశాలీనత మెండు.<br />
*శాలిత లేక శాలిత్వమును an affix denoting possession అని వివరించడం జరిగింది బ్రౌణ్య నిఘంటువులో. గుణశాలిత అంటే the possession of virtue. ధీశాలిత్వమును ధీశాలిత అనీ, బుద్ధిశాలిత్వమును బుద్ధిశాలిత అనీ అనవచ్చు. అదే విధంగా ఊహాశాలిత్వమును ఊహాశాలిత అనడం సరైనదే. శాలి కూడా ఒక affix. బలశాలి, ధీశాలి, ధైర్యశాలి అంటే ఆ గుణాలను కలిగినవాడు అని అర్థం. ఇక శాలీనత వేరే పదం. దానికి అర్థం బిడియం, త్రప, వ్రీడ మొదలైనవి. కాబట్టి ఊహాశాలీనత తప్పు. ఊహాశాలిత, శాలీనత సవ్యమైన పదాలు.</p>
<p>*ఎంత ఆలోచించినా అతని మెదడుకు తరుణోపాయం తట్టలేదు.<br />
*ఈ వాక్యంలో తరుణోపాయం తప్పు, తరణోపాయం సరైనది. తరణము అంటే దాటుట. తరణోపాయం అంటే గండం నుండి గట్టెక్కించే ఉపాయమన్న మాట.  తరుణముకు సమయము, వయస్సు అనే అర్థాలున్నాయి. దీన్ని సాకుగా చూపి, సమయానికి తోచిన ఉపాయం అనే అర్థంలో తరుణోపాయం కూడా సరైనదేనని ఎవరైనా వాదించే అవకాశముంది. కాని, తరణోపాయముకు means, expedient అనే అర్థాలు కనపడుతాయి తెలుగు &#8211; ఆంగ్లం  బ్రౌణ్య నిఘంటువులో. మళ్లీ ఇక్కడ ఓ సందేహం కలుగవచ్చు భాషాప్రియులకు. అదేమిటంటే, Brown ను తెలుగులో బ్రౌన్ అని ఉచ్చరిస్తాము, బ్రౌణ్ అని పలకం. మరి బ్రౌన్య నిఘంటువు అనాలి కదా? దీనికి వివరణ ఏమిటో తెలియదు. మొదట్నుంచీ పండితులు అంగీకరిస్తూ వస్తున్న పదం కనుక, గట్టిగా ఆక్షేపణ తెలుపలేము. ఇటువంటి కొన్ని పదబంధాలను ‘అనింద్య గ్రామ్యాలు’గా నిర్ణయించారు పెద్దలు. అంటే, మహాపండితులకు మినహాయింపుల వెసులుబాటు ఉంటుందన్న మాట. గర్భగుడి అన్న పదబంధం నిజానికి వైరిసమాసం అవుతుంది కాబట్టి, భాష/వ్యాకరణం ప్రకారం అది తప్పు. అయినా పూర్వం పండితులే దాన్ని ఆమోదిచిన కారణంగా, ఆక్షేపణ తెలుపక మనమూ అంగీకరించాలనేది చెప్పకనే చెప్పబడిన విషయం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ‘గర్భదేవాలయం’కన్న ‘గర్భగుడి’ ఉచ్చారణ పరంగా సాఫీగా, హాయిగా ఉంటుంది. అదేవిధంగా జీవగర్ర కూడా వైరి/దుష్ట సమాసమే. ఎందుకంటే, జీవము సంస్కృతసమ శబ్దం కాగా, కర్ర అచ్చతెలుగు పదం. కర్రకు బదులు కాష్ఠము అనే తత్సమాన్ని కలిపి జీవకాష్ఠము అని రాయొచ్చు. కాని, ఉచ్చారణ పరంగా జీవకాష్ఠముకన్న జీవగర్రనే హాయిగా, సాఫీగా ఉంటుంది. జీవగర్ర కూడా అనింద్య గ్రామ్యమే. అయితే మహాపండితులే అట్లా రాసినప్పుడు మనమెందుకు రాయకూడదు అని తర్కించకూడదు.           </p>
<p>*కోర్టు ఇచ్చిన ఆ తీర్పు హిందూత్వ శక్తులకు చెంపపెట్టు.<br />
*పశువుతో పశుత్వం, మృదువుతో మృదుత్వం, శత్రువుతో శత్రుత్వం ఏర్పడినప్పుడు హిందువుతో హిందుత్వం ఏర్పడాలి తప్ప, హిందూత్వం కాదు. </p>
<p>*పుట్టిన పాప పురిటిలోనే చనిపోయింది.<br />
*పురిటి (పురుటి) అంటే పురుడు యొక్క అవుతుంది. కనుక, పురుడు తాలూకు వాసనను పురిటి (పురుటి) వాసన అంటాం. పై వాక్యంలో ‘యొక్క’ అన్వయం లేదు కనుక, పురుడులోనే చనిపోయింది అనాలి. అదే విధంగా ‘నీ చేయిని చాచు’ సరైన వాక్యం. ‘నీ చేతిని చాచు’ అవసవ్యమైనది. చేతిబలం, చేతివేళ్లు అనొచ్చు. ఎందుకంటే, ఆ పదాలు చేయి యొక్క బలాన్ని/వేళ్లను సూచిస్తాయి. గోతిని తవ్వారు అనకుండా గొయ్యిని తవ్వారు అని రాయడమే ఎక్కువ సమంజసంగా ఉంటుంది. మళ్లీ గోతిలోతు, గోతివెడల్పు అనొచ్చు &#8211; గోతి యొక్క లోతు, గోతి యొక్క వెడల్పు అనే అర్థాలను సూచించే విధంగా. </p>
<p>*జైలుకెళ్లి వచ్చాకా అదే తీరు.<br />
*వచ్చాక బదులు వచ్చాకా అని రాయటం అప్పుడప్పుడు చూస్తుంటాం మనం. మొన్నమొన్నటి దాక ఆ దీర్ఘంవల్ల అర్థంలో మార్పు ఉండేది కాదు. ‘దాకా’, ‘లాగా’ మొదలైన పదాలలాగ అన్నమాట. కాని, పై వాక్యంలో ‘క’ కు ఆ దీర్ఘం అర్థంలో మార్పును సూచిస్తోంది. ఈ వాక్యంలో జైలుకెళ్లి వచ్చాకా అంటే వచ్చింతర్వాత కూడా అన్నది ఉద్దేశిత భావం. కాని, జైలుకెళ్లి వచ్చింతర్వాత కూడా అదే తీరు &#8211; అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది. అయితే, ఆధునిక వ్యవహారంలో కొందరు కొన్ని పదాల అంతాలకు దీర్ఘాన్ని కలిపి వాడుతున్నారు, ఉదాహరణకు, ‘గురించి’కి బదులు ‘గురించీ’ అని వాక్యం మధ్యలో రాసేవాళ్లెందరినో నేనెరుగుదును. </p>
<p>*హోటల్ పరిసరాల్లో అపరిశుభ్రం.<br />
*ఈ వాక్యాన్ని ‘హోటల్ పరిసరాలు అపరిశుభ్రం’ అని గానీ, ‘హోటల్ పరిసరాల్లో అపరిశుభ్రత’ అని గానీ మార్చి రాస్తే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే అపరిశుభ్రం నామవాచకం కాదు. అది విశేషణం. ఇంట్లో dirty ఉంది అనడం తప్పు. Dirtiness ఉంది అనడమే రైటు. లేదా, ఇల్లు dirty గా ఉంది అనాలి. </p>
<p>*అధికారులు వ్యాపారులు కుమ్మక్కు.<br />
*ఈ వాక్యం ద్వారా చెప్పదల్చుకున్నది, రెండు వర్గాలవారు కలిసి ఏదో తప్పు చేశారు/చేస్తున్నారు అని. కాని, ఎటువంటి గందరగోళమూ లేకుండా ఉండాలంటే, ‘అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు’ అని మార్చాలి ఈ వాక్యాన్ని. ఈ రకానికి చెందిన మరికొన్ని దోషాలను ఉదాహరించవచ్చు. ఉదాహరణకు, మనిషికీ జంతువుకూ భేదం ఉండాలి అని రాస్తారు చాలా మంది. మనిషికీ జంతువుకూ మధ్య భేదం ఉండాలి అనేదే సరైన వాక్యం. </p>
<p>*కాస్త పెదవులకు కోల్డ్ క్రీమ్ రాసుకో.<br />
*ఈ వాక్యంలోని ‘కొంచెం’ (కాస్త) కోల్డ్ క్రీమ్ కు వర్తించాలి. కాని, ఇక్కడ కోల్డ్ క్రీమ్ ను మొత్తం పెదవులకు కాకుండా ‘కాస్త పెదవులకు’ మాత్రమే రాసుకో అనే అర్థం వస్తోంది! అంటే, మొత్తం పెదవులకు కాదన్న మాట. కనుక, పెదవులకు కాస్త కోల్డ్ క్రీమ్ రాసుకో &#8211; అని రాస్తేనే వాక్యం సరిగ్గా ఉంటుంది.</p>
<p>*అమెరికాకు భారత్ నిజమైన మిత్రుడు.<br />
*మన దేశాన్ని భరత మాత, భారత మాత అని పిల్చుకుంటున్నాం మనం. అంటే అది స్త్రీ లింగమన్న మాట. మరిక్కడ మిత్రుడు అన్నప్పుడు పుల్లిగమవుతోంది! ఇంగ్లిష్ లో India is a true friend of U.S. అనే వాక్యంలో ఎబ్బెట్టుతనమేదీ గోచరించదు. కాని, మన దేశం వేరొక దేశానికి మిత్రుడు అనగానే ఆ ‘డు’ వల్ల ఏదోలా అనిపిస్తుంది. ఈ ఎబ్బెట్టుతనాన్ని నివారించాలంటే అమెరికాకు భారత్ నిజమైన మిత్రదేశం అనవచ్చు. మళ్లీ పాకిస్తాన్ భారత్ కు శత్రువు అని రాస్తే అందులో ఏ ఎబ్బెట్టుతనమూ స్ఫురించదు. ఎందుకంటే, ‘శత్రువు’ ఉభయ లింగం కనుక. ‘డు’ వల్లనే వచ్చింది ఈ తంటా అంతా! అమెరికాకు భారత్ నిజమైన నేస్తం అని రాస్తే కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.     </p>
<p>*పరాకాష్టకు చేరిన వికృతం.<br />
*ఈ వాక్యభాగం (ఉపశీర్షిక) లో ముందు పరాకాష్ట తప్పు. పరాకాష్ఠ సరైన పదం. ఇక ‘వికృతం’ నామవాచకం కాదు, అది విశేషణం. వికృతం అంటే Ugly. కాని, మనం ఇక్కడ Ugliness ను తెలుగులో రాయాలి.  కాబట్టి, పరాకాష్ఠకు చేరిన వికృతత్వం అనాలి. లేదా, పరాకాష్ఠకు చేరిన వికృత చేష్టలు అనొచ్చు. ‘తం’తో అంతమయ్యే ఎన్నో పదాలు నామవాచకాలు కావడం వలన, వికృతం కూడా నామవాచకం అని భ్రమిస్తాం మనం. ఫలితం, మారుతం మొదలైన చాలా పదాలు నామవాచకాలే. అలాగే నైపుణ్యం, శౌర్యం, సోయగం, దుండగం &#8211; ఈ పదాలన్నీ సున్నతో ముగుస్తాయి. ఇవి కూడా నామవాచకాలు. సున్నతో, ‘తం’తో ముగిసే ఇటువంటి పదాలెన్నటినో చాలా సార్లు నోటిద్వారా విని,  అచ్చులో చూసి, వికృతం కూడా నామవాచకం అని మనసులో ఒక ఊహను బలపరచుకుంటాం. అదే ఈ తికమకకు కారణమౌతుంది. </p>
<p>*ఆ పాత మధురాలు<br />
*ఆపాతము అనే ఒక పదముంది. దాని అర్థం మంచి చెడ్డలాలోచించక అనుభవించుట. కాని, ఇక్కడ ఆనాటి పాత (old) &#8211; అని చెప్పడం ప్రధానోద్దేశం. కాబట్టి, అట్లా విడిగా రాయడం సరైనదే. అయితే మధురం నామవాచకం కాదు, విశేషణం. విశేషణాలకు బహువచనాలుండవు. ఉదాహరణకు wonders ఉంటుంది కాని  wonderfuls అనే పదం ఉండటానికి వీల్లేదు. అదే విధంగా beautifuls  ఉండదు, beauties ఉంటుంది. కనుక పై వాక్యాన్ని ఆ పాత మాధుర్యాలు (అంటే ఆ పాత పాటలలోని తియ్యదనాలు) అని సవరించాలి. మోహనాలు, మనోజ్ఞాలు, విశాలాలు, శీతలాలు మొదలైన పదాలను చాలా మంది వాడుతుంటారు. కాని, అవన్నీ విశేషణాలు కనుక, అట్లా రాస్తే అవి తప్పులవుతాయి. మోహనత్వాలు, మనోజ్ఞతలు, వైశాల్యాలు, శీతలత్వాలు అని రాస్తేనే కరెక్టు.</p>
<p>*జల పిడుగు<br />
*కావ్యరచనకు బదులు కావ్య రాత అని రాసినట్టుగా ఉంది ఈ పదబంధం. లేదా తాళపత్రాలుకు బదులు తాళ ఆకులు అన్నట్టుగా&#8230;! ఎబ్బెట్టుతనాన్ని సంతరించుకున్న ఇటువంటి వైరి సమాసాలను మానుకోవడం అసాధ్యమైన పనేం కాదు. జల పిడుగు అనే బదులు ‘పిడుగై తగిలిన జలసమస్య/నీటి సమస్య’ అనొచ్చు. </p>
<p>*ఆల్టర్నేట్ రూట్లు<br />
*Alternate కు alternative కు మధ్య ఉన్న భేదాన్ని గమనించకపోవటం వల్ల వచ్చిన చిక్కు ఇది. Alternate అంటే ఒకటి విడిచి ఒకటి. ఉదాహరణకు సోమ, బుధ, శుక్ర వారాలు alternate days. అదేవిధంగా జనవరి, మార్చ్, మే నెలలు alternate months.  కాని, ఈ వాక్యభాగంలో ఉద్దేశింపబడిన భావం ప్రత్యామ్నాయం అని. ఈ తెలుగు పదాన్ని ఇంగ్లిష్ లో alternative  అనాలి. కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్లు అనటం సరైనది. ఈ విషయాన్ని నేను భాషాసవ్యతకు బాటలు వేద్దాం అనే నా పుస్తికలో ఇదివరకే ప్రస్తావించాను. ఇక ఈ శీర్షిక కింద ఇచ్చిన విషయంలో రూట్లను రహదారులు అన్నారు. ఇది తప్పని భావిస్తారు కొందరు. రహదారి highway కు మాత్రమే సమానమైన పదమని తలుస్తారు. కాని, నిఘంటువుల ప్రకారం రహదారి అంటే అందరూ పోయేందుకు ఉద్దేశింపబడిన దారి అని అర్థం. రాచమార్గం/రాచబాట బహుశా రాజులు మాత్రమే వెళ్లేందుకు ఉద్దేశింపబడిన దారి కావచ్చు. </p>
<p>*చురుకైన మెదడుకు&#8230;.<br />
*మెదడు చురుకుగా ఉండాలంటే ఏమేం తినాలో కింద వివరించారు. అయితే శీర్షికలో మెదడుకు బదులు మెదడు కోసం అని రాస్తే మరింత సవ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. ‘కు’ ఆంగ్లంలో to ను మాత్రమే కాకుండా for ను కూడా సూచిస్తుంది.  ఈ శీర్షిక కింద రాయబడిన వస్తువుల జాబితా  కేవలం మెదడు కోసం అవసరమైన తినుపదార్థాలనే తెలుపుతుంది. అంటే for అనే అర్థం అన్వయం కావాలన్న మాట. అటువంటప్పుడు ‘చురుకైన మెదడు కోసం’ అని రాస్తే అది కేవలం for ను మాత్రమే సూచిస్తుంది. </p>
<p>*దిక్కు మాలిన శరణార్థులను జైళ్లలో పెట్టాలని అమెరికా భావిస్తోంది.<br />
*దిక్కు మాలిన అనే ప్రయోగం తిట్టులాంటి దాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు దిక్కు మాలిన వెధవ, దిక్కు మాలిన ఉద్యోగం, దిక్కు మాలిన సినిమా మొదలైనవి. కాని, పై వాక్యం ద్వారా చెప్పదల్చుకున్న భావం అది కాదు. నిస్సహాయులైన వాళ్లకు అనేదే చెప్పదల్చుకున్న భావం. కనుక దిక్కు లేని/దిక్కు కరువైన శరణార్థులను&#8230;.. అని రాయటమే కరెక్టు.</p>
<p>*మూత్రం బాగా రావాలంటే సక్రమంగా పని చెయ్యాల్సింది కిడ్నే.<br />
*మీరు వేసింది మంచి ప్రశ్నే అనే వాక్యంలో చివరి పదం ఎట్లా ఏర్పడింది? ప్రశ్న + ఏ = ప్రశ్నే అవటం వల్లనే కదా! బావిలోకి దిగడానికి మెట్లే లేవు అనే వాక్యంలో మెట్లు + ఏ = మెట్లే అయింది. అదే విధంగా సాంబారులో నాకు ఇష్టమైనది క్యారెటే అన్నప్పడు క్యారెట్ + ఏ = క్యారెటే అయింది. ఆయన మంచి మనిషే అన్నప్పుడు మనిషి + ఏ = మనిషే అయింది. అంటే అకార, ఉకార, ఇకారాలతో అంతమయ్యే హ్రస్వ పదాలు, లేక దృతము (నకారపు పొల్లు)తో ముగిసే పదాలు ‘ఏ’తో కలిసి ఏకారాంత పదాలను (ప్రశ్నే, మెట్లే, క్యారెటే, మనిషే) ఏర్పరుస్తాయన్న మాట. వీటిలోని మూలపదాలైన ప్రశ్న, మెట్లు, క్యారెట్, మనిషి హ్రస్వాంతాలు. కాని, దీర్ఘాంతాలైన పదాలకు ‘ఏ’ కలిసినప్పుడు ఏకారాంత పదం రాకుండా ‘యే’ లేక ‘నే’ చేరడం సరైనది. ఉదాహరణకు, నాకు ఇష్టమైన చెప్పుల దుకాణం బాటాయే/బాటానే అనాలి. బాటే అనకూడదు. ఆ పాటను పాడింది బాలూయే/బాలూనే అనాలి. బాలే కూడదు. అదే విధంగా, నువ్వు చెప్పాల్సింది సారీయే/సారీనే అనాలి తప్ప సారే అనకూడదు. ఈ సూత్రం ప్రకారం పై వాక్యంలో చివర కిడ్నే అని కాకుండా కిడ్నీయే/కిడ్నీనే అని ఉండటమే సమంజసం.  </p>
<p>ఆంగ్ల పదాలను తెలుగు లిపిలో రాసేటప్పుడు ఏర్పడే గందరగోళం అంతా యింతా కాదు. ఉదాహరణకు, గోడకు ఉన్న పటాన్ని చూడు అనకుండా గోడకు ఉన్న మాప్ ను చూడు అన్నప్పుడు, మాప్ (mop) అనే మరో ఆంగ్ల పదం స్ఫురణలోకి వచ్చి గందరగొళాన్ని కలిగిస్తుంది. మాప్ (mop) అంటే తుడిచే గుడ్డ, లేక చివరన తుడుపు గుడ్డ కట్టబడి వున్న పొడవైన కర్ర. ఈ అయోమయాన్ని నివారించాలంటే మాప్ అనకుండా మ్యాప్ (map) అనక తప్పదు. ఆంగ్లంలో map, mop  అనే పదాలున్నాయి కాని, భిన్నమైన అర్థానికి దారి తీసే myap అనేది లేదు. నిజానికి map కు మ్యాప్ సరైన ఉచ్చారణ కాదు. కాని, కనీసం అది మరో భిన్నమైన ఆంగ్ల పదాన్ని సూచించదు. అదే విధంగా cap ను క్యాప్ అనక తప్పదు. కాప్ అని రాస్తే అది పోలీసు (cop) ను సూచించే ప్రమాదముంది! </p>
<p>*ఆస్పత్రి అమానుషం<br />
*Inhumanity of the hospital అనేది చెప్పదల్చుకున్న భావమైతే ఈ ప్రయోగం సరైనది కాదు. ఎందుకంటే అమానుషం నామవాచకం కాదు, అది విశేషణం. అక్కడ నామవాచకాన్ని ఉద్దేశించాలనుకుంటే అమానుషంకు బదులు అమానుషత్వం సరిపోయే పదం. Inhuman hospital అనదల్చుకుంటే అమానుష(మైన) ఆస్పత్రి అని రాయాలి. </p>
<p>*కనీసం ప్రతి మండలానికి ఒక గ్రంథాలయం ఉండాలి.<br />
*ఇక్కడ ‘కనీసం’ ప్రతి మండలానికి అనే పదాలకు వర్తిస్తున్నది. కాని, అది ‘ఒక గ్రంథాలయం’కు వర్తించే విధంగా ఉండటమే కరెక్టు. కనుక, ప్రతి మండలానికి కనీసం ఒక గ్రంథాలయం ఉండాలి అనే వాక్యమే సరైనది. ఈ భాషాదోషం దాదాపు అన్న పదాన్ని వాడేటప్పుడు తలెత్తే దోషంలాంటిదే.</p>
<p>*మనిషినీ సంస్కృతినీ వేరు చేసే ధోరణులు ప్రమాదకరమైనవి.<br />
*ఈ వాక్యం ఏం చెప్తోంది? విడివిడిగా మనిషిని దేని నుండో, సంస్కృతిని దేని నుండో వేరు చేసే ధోరణులు&#8230;&#8230;. అని కదా. కాని, నిజంగా చెప్పదల్చుకున్న భావం అది కాదు. చెప్పాలనుకున్న భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించాలంటే, ఈ వాక్యాన్ని ఇలా తిరగ రాయాలి: మనిషిని సంస్కృతినుండి వేరు చేసే ధోరణులు ప్రమాదకరమైనవి. </p>
<p>*శాఖాహారం తేవాలన్నది బీజేపీ కుట్ర.<br />
*‘శాఖాహార, మాంసాహార భోజన హోటల్’ అనే బోర్డులను మనం తరచుగానే చూస్తుంటాం. వెజిటేరియన్ ను శాఖాహార/శాఖాహారి అనటం సరి కాదు. శాఖ అంటే కొమ్మ. మరి ఆ హోటల్లో కొమ్మలు కలిపిన భోజనాన్ని వడ్డిస్తారా? నాన్ వెజిటేరియన్ కరీ (curry) కి సరైన పదం శాకం. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. వెజిటేరియన్ ను శాకాహార/శాకాహారి అనటమే కరెక్టు.</p>
<p>*తొలి అణుప్రయోగం ఇక్కడే.<br />
*అణ్వస్త్ర ప్రయోగం ఉంటుంది కాని, అణుప్రయోగం ఉండదు. ఒకవేళ ఉన్నా ఇక్కడ చెప్పదల్చుకున్న పదం అది కాదు. కాబట్టి, అణ్వస్త్ర ప్రయోగం అని రాయాలి.</p>
<p>*శూన్యంలోంచి అడిగిన వస్తువును తీసిచ్చే బాబా.<br />
*ఈ వాక్యంలో రెండు క్రియలున్నాయి. మొదటిది అడగటం (అడిగిన), రెండవది తీసివ్వటం (తీసిచ్చే). ‘శూన్యంలోంచి’ని మొదటి క్రియకు ముందు ఉంచితే కర్త శూన్యంలోంచి మొదటి క్రియను చేశాడనే అర్థం వస్తుంది. కాని చెప్పదల్చుకున్న భావం అది కాదు. బాబా శూన్యంలోంచి వస్తువును తీసిస్తాడనేది అసలైన భావం. దాన్ని ఏ గందరగోళమూ లేకుండా చెప్పాలంటే, ‘శూన్యంలోంచి’ని రెండవ క్రియ ముందు ఉంచాలి. అంటే, అడిగిన వస్తువును శూన్యంలోంచి తీసిచ్చే బాబా, అని రాయాలన్న మాట.</p>
<p>*శతృ దుర్బేధ్యమైన కోట గోలకొండ.<br />
*ఇక్కడ వాక్యనిర్మాణంలో లోపమేమీ లేదు కాని, మూడు చోట్ల అక్షరాలు తప్పుగా ఉన్నాయి. శత్రువును శతృవు అని, మిత్రుడిని మితృడు అని కొందరు రాయటం అక్కడక్కడా చూస్తుంటాం మనం. అదేవిధంగా ధ్రువాలు అనేబదులు ధృవాలు అనీ, ధ్రువపరచడంకు బదులు ధృవపరచడం అనీ రాయటం అంత అరుదైన విషయమేం కాదు. కాని, అవి తప్పులు. ఇక దుర్భేద్యముకు బదులు దుర్బేధ్యము అనటం కూడా తప్పే. భేదము అని కాక బేధము అని తప్పుగా రాసేవాళ్లు చాలా మందే ఉంటారు. కాబట్టి, శత్రుదుర్భేద్యమైన కోట అని రాయడమే సరైనది. అంటే తృ, ర్బే, ధ్య &#8211; ఈ మూడు అక్షరాలు తప్పన్న మాట.</p>
<p>*ఇంటివద్దనే అవసరమైన పత్రాలను స్వీకరించి నల్లాలను మంజూరు చేస్తామని అధికారి చెప్పారు<br />
*ఈ వాక్యంలో చెప్పబడిన పత్రాలు కేవలం ఇంటివద్దనే అవసరమైనవా? బయట ఆఫీసుల్లో వీటి అవసరం లేదా? ఇటువంటి అనుమానాన్ని కలిగిస్తున్నది ఈ వాక్యం. కనుక, అవసరమైన పత్రాలను ఇంటివద్దనే స్వీకరించి&#8230;..అని రాస్తే ఏ గందరగోళమూ ఉండదు.</p>
<p>*దిగజారిన ఎగుమతులు<br />
*దిగజారడం అంటే సాధారణంగా నైతికంగా పతనమవటం అనే అర్థం వస్తుంది కనుక, తగ్గిన ఎగుమతులు అని రాస్తేనే సరిగ్గా ఉంటుంది. అదే విధంగా దిగజారిన బంగారం ధర అనకుండా దిగిన లేక తగ్గిన బంగారం ధర అనడమే సరైనది.</p>
<p>*ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన సిపాయి.<br />
*ఫణము అంటే పడగ. ఫణి అంటే పాము (ఫణమును కలిగినది). పణము అంటే పందెం. ప్రాణాన్ని పణంగా ఒడ్డటమంటే/పెట్టటమంటే వేరొకరి ప్రాణాలకొరకు తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టటం కనుక, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సిపాయి అని తిరగరాయాలి ఈ వాక్యాన్ని. </p>
<p>*గన్ మెన్ లు అవసరం లేదంటూ తిప్పి పంపిన ఎమ్మెల్యే.<br />
*పోస్ట్ మన్ (postman) అంటే తపాలా బంట్రోతు. బ్యాట్స్ మన్ (batsman) అంటే బ్యాటింగ్ చేసే క్రికెట్ ఆటగాడు. గ్యాంగ్ మన్ (gang man) అంటే రోడ్డును కానీ రేల్వే లైన్ ను కానీ సంరక్షించే ఉద్యోగులలోని ఒకడు. ఇవన్నీ ఏకవచన నామవాచకాలు. వీటికి బహువచనాలు పోస్ట్ మెన్ (postmen), బ్యాట్స్ మెన్ (batsmen) గ్యాంగ్ మెన్ (gang men). కాబట్టి గన్ మెన్ లు, బ్యాట్స్ మెన్ లు అనకూడదు. గన్ మెన్, బ్యాట్స్ మెన్ అనాలి.  </p>
<p>*కాశ్మీర్ లో ఉద్రిక్తం<br />
*ఈ వాక్యాన్ని ఎన్నో రకాలుగా సరైన రీతిలో రాయొచ్చు. కాశ్మీర్ లో ఉద్రిక్తత అనొచ్చు. లేదా కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితి అనొచ్చు. కాశ్మీర్ లో పరిస్థితి ఉద్రిక్తం అనేది కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ మధ్య కాశ్మీర్ అని కాక కశ్మీర్ అని రాస్తున్నారు. ఇది సబబే.    </p>
<p>*నీలాగా గట్టిగా పెళ్లి చేసుకోమని ఎవ్వరూ నాకు సలహా ఇవ్వలేదు సురేశ్! (సవరణల కోసం నాకు వచ్చిన ఒక కథలోని వాక్యం)<br />
*ఇక్కడ ‘నీలాగా పెళ్లి చేసుకోవడం’ అనే భావమూ, ‘గట్టిగా పెళ్లి చేసుకోవడం’ అనే భావమూ &#8211; రెండూ స్ఫురిస్తున్నాయి. కాని, నిజానికి ఈ రెండింటిలో ఏదీ ఉద్దేశింపబడిన అర్థం కాదు. ‘నీలాగా సలహా ఇవ్వలేదు’ అనేదే అసలు ఉద్దేశం. కనుక, ఈ వాక్యాన్ని ఇట్లా తిరగ రాస్తే సవ్యంగా ఉంటుంది: పెళ్లి చేసుకోమని ఎవ్వరూ నీలాగా గట్టిగా సలహా ఇవ్వలేదు సురేశ్.</p>
<p>*అక్షయ త్రితీయ నాడు బంగారం ఎందుకు కొంటారు?<br />
*తృతీయను ‘త్రుతీయ’ అని పలకకూడదు, త్రితీయ అని పలకాలనేది నిజమే. కాని, త్రితీయ అని రాయకూడదు, తృతీయ అనే రాయాలి. మరొక చోట అచ్చులో హ్రిదయం అనే పదాన్ని చూశాను. ఇక్కడ కూడా పైన చెప్పిందే వర్తిస్తుంది. హృదయం అని రాయాలి, హ్రిదయం అని ఉచ్చరించాలి.</p>
<p>*ఎంక్వైరీ జరుగుతోంది. నివేదిక రాగానే సంఘటన ఎలా జరిగిందో తెలుస్తుంది.<br />
*నివేదిక రాగానే (వచ్చిన వెంటనే) సంఘటన జరిగిందా? అట్లా జరగటానికి వీల్లేదే! కాబట్టి, ‘సంఘటన ఎలా జరిగిందో నివేదిక రాగానే తెలుస్తుంది’ అని రాయాలి.</p>
<p>*స్వచ్ఛతకు ప్రజా మద్దతు<br />
*ప్రజ సంస్కృతసమపదం కాగా, మద్దతు అన్యదేశీయం. కనుక, ప్రజామద్దతు వైరిసమాసమవుతుంది. దాన్ని నివారించాలంటే, ‘స్వచ్ఛతకు ప్రజల మద్దతు’ అని రాయాలి.</p>
<p>*రత్నఖచిత కుటీరం రంగులీనుతోంది.<br />
*ఈ వాక్యంలో అర్థప్రసరణ సరిగ్గా లేదని అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టదు. కోటీరంకు బదులు కుటీరం అనే పదం వచ్చిందిక్కడ. దానికి కారణం ఎడిటింగ్ చేసేవాళ్లో, డి.టి.పి. చేసేవాళ్లో అయివుండాలి. ‘ఒక మెరిసే స్వప్నవైడూర్యాన్ని పొదిగిన సొంత కోటీరం కోసం&#8230;’ అని నేను ఒక కవితలో రాస్తే, బహుశా డి.టి.పి. చేసే వ్యక్తి కోటీరంను కుటీరంగా మార్చాడు. కవిత అట్లానే తప్పుతో ప్రచురితమైంది. ఇది తెలంగాణ మీద రాసిన కవిత. కోటీరం అంటే కిరీటం. అది పరిపాలనాధికారానికి సంకేతం. అయితే, డి.టి.పి. చేసే వ్యక్తి ఆ పదాన్ని బహుశా అంతకు ముందెప్పుడూ వినలేదేమో!</p>
<p>**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=16220</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>యుక్తవాక్యం &#8211; మొదటి భాగం</title>
		<link>http://vaakili.com/patrika/?p=16007</link>
		<comments>http://vaakili.com/patrika/?p=16007#comments</comments>
		<pubDate>Sat, 03 Feb 2018 20:15:44 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=16007</guid>
		<description><![CDATA[<p>గమనిక: నా ‘భాషాసవ్యతకు బాటలు వేద్దాం’లో లాగానే ఇందులో కూడా కొన్ని విషయాలు వివాదాస్పదంగా కనిపించవచ్చు పాఠకులకు. ఎంతమాత్రం అయోమయానికి తావివ్వకుండా, వాక్యం పూర్తిగా సంతృప్తికరమైన రూపంలో ఉండేలా పదాలను, అక్షరాలను ఎలా రాయాలనే విషయం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండే అవకాశముంది. కాబట్టి, ఇందులో చెప్పిందే ఏకైక అంతిమ (Ultimate) రూపమని నిర్ద్వంద్వంగా నొక్కి వక్కాణించడం లేదు. ఏకీభావం కుదరని చోట కొంచెం భిన్నమైన వాక్య, పదరూపాలను అనుసరించవచ్చు.</p> <p style="text-align: center;">***</p> <p>వాక్యాన్ని సరిగ్గా రాయడమనేది చాలా మంది అనుకునేటంత సులభమైన విషయమేం కాదు. ఎందుకంటే, మనం రాసింది నిర్దుష్టంగానే కాక, నిర్దిష్టంగా కూడా ఉండాలి. నిర్దుష్టంగా అంటే భాషాదోషాలు లేకుండా (Flawlessly) అన్నమాట. ఇక నిర్దిష్టమనే పదాన్ని విస్తృతార్థంలో చూడాల్సి ఉంటుంది. భాషాదోషాలు లేకపోవటంతో పాటు, సరైన పదాలు సరైన స్థానాల్లో ఉన్నప్పుడే వాక్యానికి నిర్దిష్టత సిద్ధిస్తుంది. కొన్నిసార్లు వాక్యం వ్యాకరణపరంగా సరిగ్గానే ఉన్నా, అందులోని కొన్ని పదాలను, లేక వాటి క్రమాన్ని మారిస్తే అది మరింత బాగా తయారయ్యే సందర్భాలుంటాయి. అట్లాంటి సందర్భాన్ని నివారిస్తూ ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా రాయగలిగినవాళ్లు వచనరచనలో ఆరితేరిన వారవుతారు. ఈ కాలంలో చాలా మంది కవులు, రచయితలు భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. ఒక వాక్యం బహువచనరూపంలో ఉన్న కర్తతో మొదలై ఏకవచనరూపంలో ఉన్న క్రియతో అంతమవ్వడం, అవ్యయాలు (Prepositions) సరైన స్థానాల్లో ఉండకపోవడం, విరామచిహ్నాలు సరిగ్గా లేకపోవడం, అసలు పదాలనే తప్పుగా రాయడం &#8211; ఇటువంటి చిన్నచిన్న అపసవ్యతల నివారణ కోసం సైతం జాగ్రత్త పడకకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భాషలో కచ్చితత్వం (Correctness) అంత అవసరమైన విషయం కాదనే అభిప్రాయం కవుల్లో, రచయితల్లో ఉన్నంత కాలం దోషభూయిష్ఠమైన భాష కనిపించడం కొనసాగుతూనే ఉంటుంది. పెద్దపెద్ద స్ఖాలిత్యాలను (అంటే భాష పరంగా సూక్ష్మమైన భేదాలను పాటించకపోతే ఏర్పడే తప్పులను) చూసీచూడనట్టు పోవచ్చును కాని, ప్రాథమిక దోషాలను పట్టించుకోకుండా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><em>గమనిక: నా ‘భాషాసవ్యతకు బాటలు వేద్దాం’లో లాగానే ఇందులో కూడా కొన్ని విషయాలు వివాదాస్పదంగా కనిపించవచ్చు పాఠకులకు. ఎంతమాత్రం అయోమయానికి తావివ్వకుండా, వాక్యం పూర్తిగా సంతృప్తికరమైన రూపంలో ఉండేలా పదాలను, అక్షరాలను ఎలా రాయాలనే విషయం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండే అవకాశముంది. కాబట్టి, ఇందులో చెప్పిందే ఏకైక అంతిమ (Ultimate) రూపమని నిర్ద్వంద్వంగా నొక్కి వక్కాణించడం లేదు. ఏకీభావం కుదరని చోట కొంచెం భిన్నమైన వాక్య, పదరూపాలను అనుసరించవచ్చు.</em></p>
<p style="text-align: center;">***</p>
<p>వాక్యాన్ని సరిగ్గా రాయడమనేది చాలా మంది అనుకునేటంత సులభమైన విషయమేం కాదు. ఎందుకంటే, మనం రాసింది నిర్దుష్టంగానే కాక, నిర్దిష్టంగా కూడా ఉండాలి. నిర్దుష్టంగా అంటే భాషాదోషాలు లేకుండా (Flawlessly) అన్నమాట. ఇక నిర్దిష్టమనే పదాన్ని విస్తృతార్థంలో చూడాల్సి ఉంటుంది. భాషాదోషాలు లేకపోవటంతో పాటు, సరైన పదాలు సరైన స్థానాల్లో ఉన్నప్పుడే వాక్యానికి నిర్దిష్టత సిద్ధిస్తుంది. కొన్నిసార్లు వాక్యం వ్యాకరణపరంగా సరిగ్గానే ఉన్నా, అందులోని కొన్ని పదాలను, లేక వాటి క్రమాన్ని మారిస్తే అది మరింత బాగా తయారయ్యే సందర్భాలుంటాయి. అట్లాంటి సందర్భాన్ని నివారిస్తూ ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా రాయగలిగినవాళ్లు వచనరచనలో ఆరితేరిన వారవుతారు. ఈ కాలంలో చాలా మంది కవులు, రచయితలు భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. ఒక వాక్యం బహువచనరూపంలో ఉన్న కర్తతో మొదలై ఏకవచనరూపంలో ఉన్న క్రియతో అంతమవ్వడం, అవ్యయాలు (Prepositions) సరైన స్థానాల్లో ఉండకపోవడం, విరామచిహ్నాలు సరిగ్గా లేకపోవడం, అసలు పదాలనే తప్పుగా రాయడం &#8211; ఇటువంటి చిన్నచిన్న అపసవ్యతల నివారణ కోసం సైతం జాగ్రత్త పడకకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భాషలో కచ్చితత్వం (Correctness) అంత అవసరమైన విషయం కాదనే అభిప్రాయం కవుల్లో, రచయితల్లో ఉన్నంత కాలం దోషభూయిష్ఠమైన భాష కనిపించడం కొనసాగుతూనే ఉంటుంది. పెద్దపెద్ద స్ఖాలిత్యాలను (అంటే భాష పరంగా సూక్ష్మమైన భేదాలను పాటించకపోతే ఏర్పడే తప్పులను) చూసీచూడనట్టు పోవచ్చును కాని, ప్రాథమిక దోషాలను పట్టించుకోకుండా ఉండలేం &#8211; ముఖ్యంగా అవి పూర్తిగా భిన్నమైన అర్థాన్నిస్తున్నప్పుడు. ఉదాహరణకు ప్రముఖత లేక ప్రాముఖ్యం అని రాసే బదులు ప్రాముఖ్యత అని రాస్తే దాన్ని అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. కాని, ప్రధానమంత్రికి బదులు ప్రదానమంత్రి అనీ, అర్థంకు బదులు అర్ధం అనీ, షష్టిపూర్తికి బదులు షష్ఠిపూర్తి అనీ, మద్యపానంకు బదులు మధ్యపానం అనీ (?!మధ్యమధ్య సేవించే పానం) రాస్తే అసలు భావమే పూర్తిగా మారిపోతుంది కనుక, ఆక్షేపణ తెలుపకుండా ఉండలేము.</p>
<p>ఏ రచనలోనైనా వాక్యాలలోని పదాలు సరిగ్గా ఉండాలని కోరుకునే భాషాప్రేమికులకు ఈ రోజుల్లో సైతం కొదవ లేదని నా విశ్వాసం. కనుక, కొన్ని పొసగని వాక్యాలను ఉదాహరించి (‘ఉదహరించి’ కాదు), చిన్నపాటి వివరణల ద్వారా భాషాపరమైన సూచనలను పాఠకులకు అందించడమే ఈ వ్యాస ప్రధానోద్దేశం. ఈ కింది వాక్యాలలోని పొసగనితనాన్ని పోగొట్టేందుకు నేను సూచిస్తున్న సవరణలను, వివరణలను గమనిస్తే ఔత్సాహికులైన యువ రచయితలకు అది ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను.</p>
<p style="text-align: center;">***</p>
<p><span style="color: #800000;">*అమిత్ షా కు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని వివరించారు.</span></p>
<p>*ఈ వాక్యం ఏం చెప్తోంది? ఎవరో ఒక పరిస్థితిని అమిత్ షా కు వివరించారు, అని. అది ఏ పరిస్థితో తెలియదు. ఎవరు వివరించారో కూడా తెలియదు. దాన్ని వివరించడమనే పని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కాని, ఈ వాక్యరచయిత ఇక్కడ చెప్పదల్చుకున్నది, ఆంధ్రప్రదేశ్ లో నెలకొని వున్న పరిస్థితి వివరించబడింది అని. కాబట్టి, మనసులో ఉన్న ఉద్దేశం ఏ తికమకా లేకుండా తేటతెల్లంగా వెల్లడి కావాలంటే ఈ వాక్యాన్ని ‘(ఫలానా వ్యక్తి) ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితిని అమిత్ షా కు వివరించారు’ అని తిరగ రాయాల్సి వుంటుంది. నేనైతే ఈ వాక్యంలో అమిత్ షా తర్వాత స్పేస్ ఇచ్చి ‘కు’ అన్న అక్షరాన్ని రాస్తాను. లేకపోతే ‘షాకు’ (shock) కొట్టే ప్రమాదం కొంత లేకపోలేదు! ఏమంటారు?</p>
<p><span style="color: #800000;">*నయీంకు చెందిన ఎన్నో డెన్ లను పోలీసులు గుర్తించారు.</span></p>
<p>*డెన్ (Den) అనే ఈ ఆంగ్లపదానికి ప్రత్యామ్నాయమైన తెలుగు పదం దొరకడం కష్టమేం కాదు. ఇంగ్లిష్ భాష రానివాళ్లు ఎందరో ఉంటారు. కొందరు విద్యావంతులకు సైతం డెన్ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. డెన్ కు బదులు (రహస్య)గృహం లేక (రహస్య)స్థావరం అనొచ్చు. ఈ పదాలు కూడా అందరికీ అర్థం కావనుకుంటే రహస్య అడ్డా అనవచ్చు. అడ్డా స్వచ్ఛమైన తెలుగు పదం కాకపోయినా దాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం ఉండదనుకుంటాను.</p>
<p><span style="color: #800000;">*ప్రతి రోజూ ఉపనిషత్తులలో దాగివున్న రహస్యాల గురించి చెప్పుకుంటున్నాం కదా.</span></p>
<p>*ఈ వాక్యంలో ‘ప్రతి రోజూ’ అన్నది అర్థపరంగా ‘దాగివున్న’తో అనుసంధానమై ఉంది. కాని, అది ‘చెప్పుకుంటున్నాం’తో అనుసంధానం అయివుండాలి. అప్పుడే మన మనసులోని భావం ఎలాంటి గందరగోళం లేకుండా పాఠకులకు/శ్రోతలకు సరిగ్గా చేరుతుంది. రహస్యాలు ప్రతి రోజూ దాగివుండటం లేదు! వాటిని మనం ప్రతి రోజూ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ వాక్యం ఇలా ఉండాలి: ఉపనిషత్తులలో దాగివున్న రహస్యాల గురించి ప్రతి రోజూ చెప్పుకుంటున్నాం కదా. ఏ పదాన్నీ సరిదిద్దే అవసరం లేదు. మొదటి రెండు పదాలను అక్కడినుండి తీసి వేరే చోట పెట్టాలి, అంతే.</p>
<p><span style="color: #800000;">*దాశరథి అగ్నిధారను చదివితే మనం ఆ పద్యాలలోని ధారను గమనించ గలుగుతాం.</span></p>
<p>*రచనాప్రక్రియకు మరీ కొత్త కానివారు కూడా కొందరు వాక్యాలను ఈ విధంగా రాస్తున్నారు. మరికొందరైతే ‘దాశరథి అగ్నిధార చదివితే&#8230;.’ అని కూడా రాస్తున్నారు. ఈ వాక్యాన్ని రాసేవారి మనసులో చదవడమనే క్రియకు సంబంధించిన కర్త ‘మనం’, లేదా పాఠకులు. కాని, మొదటి రెండు విశేష్యాల (నామవాచకాల) నడుమ ప్రత్యయమో అదనపు పదమో లేనప్పుడు కర్త దాశరథి అయి, అర్థ అన్వయంలో గందరగోళం ఏర్పడుతుంది. దాన్ని నివారించడానికి రెండు మార్గాలున్నాయి. వాటిలో మొదటిది ‘దాశరథి గారి’ అని రాయడం. కాని, ఈ రోజుల్లో అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందని అనిపించవచ్చు. అట్లాంటప్పుడు ‘దాశరథి రాసిన/రచించిన’ అనవచ్చు. ఎందుకండీ, అసలు విషయాన్ని పాఠకులు అంత మాత్రం ఊహించుకోలేరా? అంటే ఊహించుకో గలుగుతారేమో. కాని, భాష ఉన్నది దేనికోసం? వాక్యం సరిగా వుండి, అర్థప్రసరణ సాఫీగా సాగటం కోసమే కదా.</p>
<p><span style="color: #800000;">*ప్రైవేటు ఆస్పత్రుల్లో డాక్టర్లు అనవసరంగా స్త్రీల గర్భసంచీలనూ వాటితో పాటు ఉండకాలనూ తొలగించారని వెల్లడైంది.</span></p>
<p>*ఇక్కడ ఉండకాలు అంటే Ovaries అని ఉద్దేశం కాబోలు. కాని, ఉండకం అనే పదం నాకైతే ఏ ప్రధాన నిఘంటువులోనూ దొరకలేదు! బహుశా ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో అటువంటి పదం ఉందేమో. గర్భకోశము, గర్భాశయము అన్నట్టే అండకోశము, అండాశయము అని రాయొచ్చును కదా. జలమును నిలువగా కలిగి ఉన్నదాన్ని జలాశయము అంటున్నాం. మరి అటువంటప్పుడు అండములను నిలువగా కలిగి ఉన్నదాన్ని అండాశయము అనటంలో ఏ యిబ్బందీ ఉండకూడదని నా అభిప్రాయం. ఒకవేళ ఉండకాలకు అపెండిక్స్ లు అనే అర్థం ఉంటే బ్రాకెట్లో appendixes, లేక appendices అని రాసి, సందేహం తలెత్తకుండా నివారించవచ్చు.</p>
<p><span style="color: #800000;">*మా నాన్నగారికి గుండెలో స్టంటు అమర్చారు.</span></p>
<p>*స్టంటు (స్టంట్ &#8211; Stunt ) అంటే సినిమాల్లో హీరోలు చేసే సాహసకార్యం లాంటిది. హృద్రోగులకు డాక్టర్లు అమర్చేదాన్ని స్టెంట్ (Stent) అనాలి. ఇక ‘గుండెలో’ కాకుండా ‘రక్తనాళంలో’ అనాలి. కొందరు ‘నరంలో’ అంటారు. అది కూడా శాస్త్రం ప్రకారం తప్పు పదమే. నరం (Nerve &#8211; నాడి) తెల్లగా ఉంటుంది. నిండుగా కూడా ఉంటుంది. అంటే లోపల బోలుతనం ఉండదన్న మాట. నిజమైన నరంలో రక్తం ప్రవహించదు. ఇవి పూర్తిగా భాషాసవ్యతకు సంబంధించిన విషయాలు కాకపోవచ్చును. కాని, రాసేవారికి లోకజ్ఞానం (General Knowledge) అవసరం. రోజువారీ వ్యవహారంలో మనం తప్పుగా వాడే మరికొన్ని ఆంగ్లపదాల గురించి వివరిస్తాను. కోర్టు వారి ఉత్తర్వును ఇంగ్లిష్ లో Injunction అంటారు. కాని, చాలా మంది దీన్ని Injection అని తప్పుగా రాస్తారు/పలుకుతారు. అదే విధంగా కవితా వస్తువును ఆంగ్లంలో Content అంటాం కదా. దీన్ని తెలుగులో రాసేటప్పుడు చాలా మంది కంటెంట్ అంటుంటారు. కాని, కంటెంట్ మెంట్ (Contentment) అంటే సంతృప్తి. కంటెంట్ లేక కంటెంటెడ్(Content, Contented) అంటే సంతృప్తి చెందిన అని అర్థాలు. కవితా వస్తువును కాంటెంట్ (Content) అనాలి. ఆంగ్లంలో స్పెలింగ్ అదే అయినా ఉచ్చారణ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక మద్యం తాగినవారి శ్వాసను పరీక్షించే పరికరాన్ని బ్రీత్ అనలైజర్ అని రాస్తారు కొందరు. బ్రెత్ (Breath) అంటే శ్వాస. బ్రీత్ (Breathe) అంటే శ్వాసించడం. మొదటిది నామవాచకం రెండవది క్రియ. కాబట్టి బ్రీత్ అనలైజర్ అనకూడదు. బ్రెత్ అనలైజర్ అనాలి.</p>
<p><span style="color: #800000;">*సి. సి. కెమెరాలతో దాడి చేసిన దుండగులను పోలీసులు గుర్తించారు.</span></p>
<p>*దుండగులు సి. సి. కెమెరాలతో దాడి చేశారా? ‘సి. సి. కెమెరాలతో’ను ‘గుర్తించారు’కు వర్తింపజేయాలి. కాని, ఇక్కడ ‘దాడి’కి వర్తింప జేశారు. కాబట్టి, అర్థ అన్వయం కుదరాలంటే ఈ వాక్యాన్ని ‘దాడి చేసినవారిని పోలీసులు కెమెరాలతో గుర్తించారు’ అని మార్చాలి.</p>
<p><span style="color: #800000;">*పోలీసులు ముప్పేట దాడి చేశారు. అతని ప్రతిభ ముప్పేటగా అల్లుకుంది.</span></p>
<p>*ముప్పేట అంటే మూడు పేటలు (వరుసలు) అని అర్థం. కాబట్టి, ముప్పేట పదాన్ని రచనలో ఎక్కడ వాడినా మూడు అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని రాయాలి. ఉదాహరణకు, ‘భాష మీద పట్టు, శిల్పవైభవం, వస్తువిస్తృతి &#8211; వీటన్నిటినీ కలుపుకుని అతని ప్రతిభ ముప్పేటగా విలసిల్లింది’ అనాలి. ఊరికే ముప్పేటగా విలసిల్లింది అనకూడదు.</p>
<p><span style="color: #800000;">*“ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్ చేశాను” అన్నది ఆమె.</span></p>
<p>*భోజనం చేశావా?, భోంచేశాను &#8211; మొదలైన వాక్యాలను వ్యావహారిక భాషలో వాడినప్పుడు, వాటిలో అపసవ్యత అంతగా కనిపించదు. కాని, చెయ్యడమంటే తయారు చేయడం అనే అర్థం కూడా వచ్చే అవకాశముంది కనుక, టిఫిన్ తిన్నాను అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది.</p>
<p><span style="color: #800000;">*విమానాశ్రయాలు పేదలు ఎక్కే స్థోమత కావాలి.</span></p>
<p>*ఈ వాక్యం చాలా గందరగోళంగా ఉంది. మొదట స్థోమత తప్పు, స్తోమత సరైన పదం. ‘పేదలకు విమానాలను ఎక్కే ఆర్థిక స్తోమత కలగాలి’ లేక ‘విమానాశ్రయాలు పేదలకు అందుబాటులోకి రావాలి’ అని రాస్తే కరెక్టుగా ఉంటుంది.</p>
<p><span style="color: #800000;">*ఆమె వస్తుంది. ఆమె వస్తున్నది. ఆమె వస్తోంది.</span></p>
<p>*ఈ మూడు వాక్యాలు ఒకే అర్థాన్నివ్వవు. మొదటి వాక్యం ఇచ్చే అర్థం తర్వాతి రెండు వాక్యాల అర్థాలకు భిన్నం. ఆమె వస్తుంది అంటే She comes. ఆమె వస్తున్నది లేక ఆమె వస్తోంది అంటే She is coming.</p>
<p><span style="color: #800000;">*ఇష్టమొచ్చినంత తాగండి. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి.</span></p>
<p>*ఇక్కడ భాషాదోషమేమీ లేకపోయినా, ఎక్కడో ఏదో పదం లోపించినట్టు అనిపించటం లేదా? ఈ వాక్యలోని అసలు ఉద్దేశం ‘మీరు ఎంతైనా తాగండి. అది మీ ఇష్టం. అయితే, తాగింతర్వాత మీ ఇంట్లోనే ఉండండి. రోడ్డుమీదికి వచ్చి ప్రమాదానికి గురి కాకండి, ప్రమాదానికి కారణం కాకండి’ అని కదా. ఈ అంతరార్థాన్ని పూర్తిగా, సంతృప్తికరంగా వ్యక్తం చేయాలంటే ‘ఇష్టమొచ్చినంత తాగండి. కాని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి’ అని రాయాలి. రెండు వాక్యాల మధ్య ‘కాని’ ఉంటేనే సంపూర్ణత సిద్ధిస్తుందిక్కడ. ఇంగ్లిష్ లో అయితే రెండు వాక్యాల మధ్య ‘but’ పెట్టకుంటే మరీ అపసవ్యంగా ఉంటుంది.</p>
<p><span style="color: #800000;">*వెలుగొండ ప్రాజెక్టు వల్ల నీటి కొరత వుండదు.</span></p>
<p>*ఈ వాక్యం అన్యాపదేశంగా ఏం చెప్తున్నది? సాధారణంగా ప్రాజెక్టుల వల్ల నీటికొరత ఉంటుంది కానీ, వెలుగొండ ప్రాజెక్టు వలన మాత్రం ఉండదని కదా! అయితే ఇక్కడ వ్యక్తం చేయదల్చుకున్న భావం మాత్రం వెలుగొండ ప్రాజెక్టు మూలంగా మున్ముందు నీటికొరత ఉండబోదని. కాబట్టి, ‘వెలుగొండ ప్రాజెక్టు వల్ల మున్ముందు/ఇకముందు/భవిష్యత్తులో నీటికొరత ఉండబోదు/తీరిపోతుంది/తీరిపోనుంది’ అని వాక్యాన్ని మార్చాలి.</p>
<p><span style="color: #800000;">*దాదాపు కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయింది.</span></p>
<p>*దాదాపు అన్న పదాన్ని సరైన స్థానంలో పెట్టకపోవడం ఈ రోజుల్లో అతి తరచుగా కనిపిస్తున్న విషయం. దాదాపు నేను మృత్యుముఖంలోకి వెళ్లాను. దాదాపు మా అక్క రెండేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చింది &#8211; ఇట్లాంటి వాక్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. దాదాపును వాక్యంలోని ఏ పదానికి వర్తింప జేయదల్చుకున్నామో జాగ్రత్తగా చూసి, ఆలోచించి వాక్యాన్ని రాయాలి. అట్లా చూసినట్టైతే, ఈ రెండు వాక్యాలు ఇలా ఉండాలి: నేను దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లాను. మా అక్క దాదాపు రెండేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చింది. అదే విధంగా ‘కొత్త సచివాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది’ అన్నది సరైన వాక్యమవుతుంది. మరో విషయమేమంటే, సచివాలయం నిర్మాణం అని కాక, సచివాలయ నిర్మాణం అని రాస్తేనే కరెక్టు. సమాసాలను రాయడం వదులుకోవాలనే అపోహ ఈ రోజుల్లో ఎక్కువగా రాజ్యమేలుతోంది. కాని, అర్థ అన్వయం కుదరడం లేదనిపించిన చోట సమాసాలను రాయక తప్పదు.</p>
<p><span style="color: #800000;">*రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ఒక్క హామీ పూర్తవలేదు.</span></p>
<p>*ఈ వాక్యాన్ని చదివినప్పుడు మొట్టమొదట మెదడుకు తట్టే భావం, ఒక్కటి తప్ప కేంద్రం ఇచ్చిన హామీలన్నీ పూర్తయ్యాయని! కాని, చెప్పదల్చుకున్నది మాత్రం, ఒక్క హామీ కూడా పూర్తవలేదు అని. ఒక్క లోని ‘క్క’ను ఒత్తి పలుకుతూ ఒక్కటి కూడా పూర్తవలేదు అనే భావాన్ని స్ఫురింజేయవచ్చు. దీన్నే కాకువు అంటారు. కాని, ఉచ్చారణ ద్వారా మాత్రమే అది సాధ్యం. రాయటం ద్వారా దాన్ని తెలుపలేము. ఇక ఈ వాక్యంలోని అర్థాన్ని స్పష్టంగా చెప్పాలంటే, ‘కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర లేదు’ అనో, లేదా ‘కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర లేదు’ అనో రాయాలి.</p>
<p style="text-align: right;">[ఇంకా ఉంది...]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=16007</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>మేధోమథనమా?, మేదోమథనమా?, మేధామథనమా?</title>
		<link>http://vaakili.com/patrika/?p=15844</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15844#comments</comments>
		<pubDate>Sun, 31 Dec 2017 18:56:00 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15844</guid>
		<description><![CDATA[<p>పదాల కచ్చితత్వం పట్ల పట్టింపు ఉన్నవాళ్లకు ఏదైనా పదం తాలూకు సరైన రూపం గురించిన సందేహం వస్తే, దాన్ని నివృత్తి చేసుకునేదాకా అశాంతితో వేగిపోతారు. ఇది సాహితీపరులకు ఉండాల్సిన మంచి లక్షణమని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. భాషకు సంబంధించిన జ్ఞానం బలంగా ఉంటే, అది రచన చేసేవాళ్లకు మంచి పునాదిగా పని చేస్తుందనటంలో అనుమానం లేదు. పదాల కచ్చితత్వాన్ని నిర్ధారణ చేసుకునే క్రమంలో ఎన్నో మలుపులు ఏర్పడవచ్చు, ఎంతో శ్రమ కలుగవచ్చు, ఎంతో కాలం పట్టవచ్చు. ఈ వ్యాసకర్త అటువంటి అశాంతిని ఎదుర్కున్న సందర్భాల్లోంచి కొన్నింటిని పేర్కొని, విపులంగా చర్చించడమే ఈ రచన ముఖ్యోద్దేశం.</p> <p>మేధోమథనం: మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి మొదలైన పదాలను మనం అచ్చులో తరచుగా చూస్తుంటాం. అయితే అవి సరైన పదరూపాలేనా? ఈ విషయం గురించిన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఆ పదాల సరైన అర్థాన్ని, భాష ప్రకారం వాటి కచ్చితమైన స్వభావాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అంటే కొంచెం లోతుగానే పరిశీలించాలన్న మాట. తెలుగు భాషలో మేధస్సు అనే పదం లేనే లేదు. మేధ, మేదస్సు &#8211; ఈ రెండు పదాలు మాత్రం ఉన్నాయి. అయితే వీటి అర్థాల మధ్య గల భేదాన్ని గుర్తించాలి. మేధ అంటే ధారణాశక్తి గల బుద్ధి అనే అర్థం కనబడుతుంది ప్రామాణిక నిఘంటువుల్లో. దీన్నే వ్యవహారంలో స్థూలంగా తెలివి అనీ, ఆంగ్లంలో intelligence అనీ అంటాము. ఇక మేదస్సుకు అర్థం మెదడు. అంటే కన్ను, చెవి, కాలు, కాలేయము, గుండెకాయ, శ్వాసకోశము వంటి శరీరావయవం అన్నమాట. మేధ చేయితో స్పృశించలేనిది కాగా, మేదస్సును మనం స్పృశించవచ్చు. ఎందుకంటే అది భౌతిక పదార్థం. మేదస్సు ఉకారాంత నపుంసకలింగ పదం. డెబ్భయ్యేళ్ల వయసొచ్చినా ఆయన కళ్లు ఇంకా బాగానే ఉన్నాయి అనే వాక్యం ఉందనుకోండి. ఇందులో కళ్లు అంటే కంటిచూపు అని అర్థం. అదే విధంగా మేదస్సు (మెదడు) పదం కొన్నిసార్లు మేధాశక్తిని కూడా సూచిస్తుంది. మేధ సంస్కృతసమ శబ్దం. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>పదాల కచ్చితత్వం పట్ల పట్టింపు ఉన్నవాళ్లకు ఏదైనా పదం తాలూకు సరైన రూపం గురించిన సందేహం వస్తే, దాన్ని నివృత్తి చేసుకునేదాకా అశాంతితో వేగిపోతారు. ఇది సాహితీపరులకు ఉండాల్సిన మంచి లక్షణమని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. భాషకు సంబంధించిన జ్ఞానం బలంగా ఉంటే, అది రచన చేసేవాళ్లకు మంచి పునాదిగా పని చేస్తుందనటంలో అనుమానం లేదు. పదాల కచ్చితత్వాన్ని నిర్ధారణ చేసుకునే క్రమంలో ఎన్నో మలుపులు ఏర్పడవచ్చు, ఎంతో శ్రమ కలుగవచ్చు, ఎంతో కాలం పట్టవచ్చు. ఈ వ్యాసకర్త అటువంటి అశాంతిని ఎదుర్కున్న సందర్భాల్లోంచి కొన్నింటిని పేర్కొని, విపులంగా చర్చించడమే ఈ రచన ముఖ్యోద్దేశం.</p>
<p>మేధోమథనం: మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి మొదలైన పదాలను మనం అచ్చులో తరచుగా చూస్తుంటాం. అయితే అవి సరైన పదరూపాలేనా? ఈ విషయం గురించిన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఆ పదాల సరైన అర్థాన్ని, భాష ప్రకారం వాటి కచ్చితమైన స్వభావాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అంటే కొంచెం లోతుగానే పరిశీలించాలన్న మాట. తెలుగు భాషలో మేధస్సు అనే పదం లేనే లేదు. మేధ, మేదస్సు &#8211; ఈ రెండు పదాలు మాత్రం ఉన్నాయి. అయితే వీటి అర్థాల మధ్య గల భేదాన్ని గుర్తించాలి. మేధ అంటే ధారణాశక్తి గల బుద్ధి అనే అర్థం కనబడుతుంది ప్రామాణిక నిఘంటువుల్లో. దీన్నే వ్యవహారంలో స్థూలంగా తెలివి అనీ, ఆంగ్లంలో intelligence అనీ అంటాము. ఇక మేదస్సుకు అర్థం మెదడు. అంటే కన్ను, చెవి, కాలు, కాలేయము, గుండెకాయ, శ్వాసకోశము వంటి శరీరావయవం అన్నమాట. మేధ చేయితో స్పృశించలేనిది కాగా, మేదస్సును మనం స్పృశించవచ్చు. ఎందుకంటే అది భౌతిక పదార్థం. మేదస్సు ఉకారాంత నపుంసకలింగ పదం. డెబ్భయ్యేళ్ల వయసొచ్చినా ఆయన కళ్లు ఇంకా బాగానే ఉన్నాయి అనే వాక్యం ఉందనుకోండి. ఇందులో కళ్లు అంటే కంటిచూపు అని అర్థం. అదే విధంగా మేదస్సు (మెదడు) పదం కొన్నిసార్లు మేధాశక్తిని కూడా సూచిస్తుంది. మేధ సంస్కృతసమ శబ్దం. అది ఆకారాంత స్త్రీ లింగ శబ్దం కనుక, మరొక సంస్కృతసమ శబ్దంతో కలిసినప్పుడు మేధామథనం, మేధాసంపత్తి, మేధాశక్తి వంటి పదబంధాలు ఏర్పడుతాయి. ఇవి వ్యాకరణం ప్రకారం సవ్యమైనవి. వైరి/దుష్ట సమాసాలు కూడా కావు. ఇక మేదస్సు అచ్చ తెలుగు పదం అనిపిస్తుంది కాని, అది కూడా సంస్కృత విశేష్యమే. కాబట్టి, దీనితో కూడా సంస్కృతసమ శబ్దాలు సంయోజనం చెందినప్పుడు, భాష రీత్యా సరైన సమాసాలు ఏర్పడుతాయి. ఆ విధంగా మేదోమథనం, మేదోసంపత్తి మొదలైన పదాలు రూపొందే అవకాశముంది. కాని మేధోమథనం లాంటి పదాలు ఏర్పడే ప్రశ్నే లేదు. అసలు మేధస్సు అనే పదమే లేనప్పుడు మేధో అనేది ఎలా సాధ్యం? మేధా మాత్రమే సాధ్యం. ‘మేదస్సు’ ఉంది కాబట్టి మేదో సాధ్యం. లలితా సహస్రనామ స్తోత్రావళిలోని 105 వ స్తోత్రపు మొదటి పంక్తి ఇలా ఉంటుంది: మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాది సమన్వితా. ఇక్కడ మేదోనిష్ఠా అని ఉండటం, మేధోనిష్ఠా అని లేకపోవటం మనం గమనించాలి. ఎందుకు లేదంటే, అది వ్యాకరణపరంగా తప్పు కనుక. ఈ పదానికి సంబంధించిన వివాదాన్ని భాషాపండితులెవరైనా అంతిమంగా పరిష్కరిస్తే సరైన రూపమే ముందు ముందు వాడుకలో ఉంటుందని నా ఆశ.</p>
<p>సమిష్టి: కొన్ని సంవత్సరాల క్రితం నేను నా గేయసంపుటిని ప్రచురిస్తున్న సందర్భంలో సమిష్టి అనే పదాన్ని వాడటం జరిగింది. అయితే పుస్తకం అచ్చుకు పోకముందు ఒకాయన సమిష్టిని సమష్టిగా సవరించాడు. పుస్తకం అచ్చయింతర్వాత మరొక పెద్దాయన సమష్టి తప్పు, సమిష్టి సరైన పదం అన్నాడు. నేను మొదట అనుకున్నదే సరైన రూపమని ఉబ్బిపోయాను. కాని, తిరుమల రామచంద్ర గారు రాసిన ‘పలుకుబడి’ గ్రంథాన్ని తర్వాత చదివినప్పుడు, అందులో సమష్టి అన్నదే సరైన రూపమని రచయిత సోపపత్తికంగా నిరూపించిన విషయాన్ని గ్రహించాను. అంటే నా అవగాహనే తప్పు అని నిరూపితమైందన్న మాట. ఆ విధంగా ఈ పదానికి సందేహ నివారణ చేసుకునే క్రమంలో ట్విస్టులు (మలుపులు) సంభవించాయి.</p>
<p>యదార్థం: కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కవితలో యదార్థం అనే పదాన్ని వాడాను. నా సమిష్టిని సమష్టిగా సవరించిన కవే యదార్థం తప్పు, యథార్థం సరైన పదం అని చెప్పడంతో నాకు కొంచెం అభిమానం దెబ్బ తిన్నట్టనిపించి, యదార్థం కరెక్టు అని చిన్నగా వాదించాను. నా ఆత్మవిశ్వాసానికి కారణమేమంటే, సాధారణంగా ఒకే పదంలో పక్కపక్కన వున్న అక్షరాలు వత్తులతో కూడుకున్నవి (మహా ప్రాణాక్షరాలు) కావటం చాలా అరుదు. అటువంటి పదాలకోసం ఎంత ఆలోచించినా ఝంఝ, అంభోధరము వంటి కొన్ని పదాలనే గుర్తించగలిగాను. కాని, ఈ పదం విషయంలో కూడా నా అవగాహన తప్పు అని నిరూపితమైంది. నిఘంటువులను పరిశీలిస్తే, యదార్థం తప్పు అనీ, యథార్థం కరెక్టు అనీ తేలిపోయింది. ఈ రెండు పదాల సరైన రూపాలను (సమష్టి, యథార్థం) నాకు తెలిపినవారు అమ్మంగి వేణుగోపాల్ గారు.</p>
<p>జగదోద్ధారణ: పురందర దాసు రచించి స్వరబద్ధం చేసిన ‘జగదోద్ధారణ ఆడిసిదళెశోదె’ అనే కీర్తన (పదము) ప్రసిద్ధమైనది. ఇది హిందుస్తానీ కాపీ రాగంలో ఉంది. అయితే జగదోద్ధారణ కరెక్టేనా? జగత్ + అంబ = జగదంబ. జగదాంబ కాదు. అదే విధంగా జగత్ + ఉద్ధారణ = జగదుద్ధారణ కావాలి. ఇవి జశ్త్వసంధులు. ‘జగద(ము)’ ఉంటే దానితో ఉద్ధారణ కలిసి జగదోద్ధారణ (గుణసంధి) అయ్యే అవకాశముంది. కాని, తెలుగులో జగదము పదం లేదు. అయితే ఇక్కడ ఒక తిరకాసు వుంది. పురందర దాసు ఆ కీర్తనను రచించింది కన్నడంలో &#8211; తెలుగులో కాదు. అందువలన, కన్నడంలో ఉన్న పదాల ప్రకారం జగదోద్ధారణ సరైనదే కావచ్చు &#8211; ఒకవేళ ఆ భాషలో జగద అనే పదం ఉంటే. కన్నడం తెలిసిన ఒకరిద్దరు మిత్రులను (అందులో ఒకరు కన్నడభాషలో నిష్ణాతులు) కోరితే వారు కన్నడ నిఘంటువులలో వెతికి, ఆ భాషలో కూడా తెలుగులోలాగా జగతి, జగత్, జగత్తు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే ఏమిటి? తెలుగులో అయినా కన్నడంలో అయినా, జగదుద్ధారణ మాత్రమే సరైన పదమన్న మాట. జగదుదర అనే పదం కన్నడ నిఘంటువుల్లో ఉంది. ఈ పదానికి కూడా తెలుగులో లాగానే జగత్ + ఉదర = జగదుదర సంధి విచ్ఛేదం అవుతుంది. ఉకారంతో మొలయ్యే ఉదర, జగత్ తో కలిసి జగదుదర ఏర్పడినప్పుడు, ఉకారంతో మొదలయ్యే ఉద్ధారణ జగత్ తో కలిసి జగదుద్ధారణ ఏర్పడవలసిందే. ఎందుకంటే ఉదర, ఉద్ధారణ &#8211; ఈ రెండూ ఉకారంతో ప్రారంభమయ్యే సంస్కృత విశేష్యాలే. రెండూ నపుంసక లింగానికి చెందిన పదాలే. పాణ్యం రామశేష శాస్త్రి గారు పురందర దాసుల వారి 125 పదములను తెలుగులోనికి అనువదించారు. ఆ గ్రంథంలో పేర్కొనబడిన మూలకృతులను &#8211; కన్నడభాష లోనివి &#8211; పరిశీలిస్తే ఈ పదం (కీర్తన) మొదటి పంక్తి జగదుద్ధారన ఆడిసిదళెశోదె అనే ఉంది. జగదోద్ధారణ అని లేదు. జగదోద్ధారణ పదం వ్యాప్తిలోనికి రావడానికి మనం రెండు మూడు వివరణలను ఇచ్చుకోవచ్చు. పురందర దాసు జగదుద్ధారణ అనే రాసి, పాడి ఉండవచ్చు. తర్వాతి గాత్రసంగీత విద్వాంసులలో ఎవరో ఒకాయన జగదోద్ధారణ అని పాడితే అనంతరం అందరూ అట్లానే పాడుతూ ఉండవచ్చు. లేదా, జగదుద్ధారణ సరైన పదమని పురందర దాసుకు తెలిసినా గాయనసౌలభ్యం కోసం జగదోద్ధారణ అని మార్చి పాడి ఉండవచ్చు. దీన్ని కూడా పండితులెవరైనా  పరిష్కరిస్తే బాగుంటుంది. శాస్త్రీయ సంగీతం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి, దాన్ని పాడేటప్పుడు విరుపుల కారణంగా భాషకూ, భావప్రకటనకూ భంగం వాటిల్లడం గురించి కొంచెం రాయాలనిపిస్తున్నది. అంటే పదాల ఉచ్చారణ పద్ధతిలో కచ్చితత్వం గురించి అన్నమాట. తెలుగువారు కానటువంటి గాత్రసంగీత కళాకారులు కర్ణాటక సంగీతంలోని కృతులను పాడినప్పుడు, విరుపుల దగ్గర ఎబ్బెట్టు అయిన పదరూపాలు ఏర్పడటం కొన్నిసార్లు జరుగుతుంది. ఉదాహరణకు త్యాగరాజ స్వామి వారి ‘ఏ తావునరా నిలకడ నీకు’ అనే కల్యాణి రాగంలోని కృతిలో ‘శివమాధవ బ్రహ్మాదుల యందా’ అన్నచోట బ్రహ్మా తర్వాత విరుపు కారణంగా దుల యందా అంటూ అక్కడనుండి మొదలు పెట్టి పాడుతారు. అదే విధంగా త్యాగరాజ స్వామి వారిదే అయిన శ్రీ రాగంలోని ‘ఎందరో మహానుభావులు’ ఉంది కదా. అందులోని ‘ఎందరో మహానుభావులందరీకీ’లో భావు తర్వాత విరుపు కారణంగా లందరీకీ నుండి మొదలు పెట్టి పాడుతారు. దీనికి ఆ గాయకులను ఎంతమాత్రం తప్పు పట్టలేము. ఎందుకంటే, అట్లా పాడేవారిలో దాదాపు అందరూ తమ మాతృభాష తెలుగు కానివాళ్లే. బాలమురళీ కృష్ణ గారు ఎప్పుడూ ఎందరో మహానుభావులు, అందరీకీ వందనములు అనే పాడేవారు. అదేవిధంగా సామరాగంలోని ‘మానస సంచరరే’ పాడినప్పుడు (ఇది సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన), మదశిఖి పింఛ(ఛా), అలంకృత చికురే అని ఉచ్చరించారు తప్ప మదశిఖి పింఛాలంకృత చికురే అని పాడలేదు. ‘మదశిఖి పింఛాలంకృత’ భాష దృష్ట్యా సరైనదే కాని, కీర్తనగా పాడుతున్నప్పుడు పింఛా తర్వాత విరామం ఇచ్చి లంకృత నుండి పాడాల్సి ఉంటుంది కనుక, అక్కడ ఎబ్బెట్టుతనం చోటు చేసుకుంటుంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మ పాడేటప్పుడు కూడా కృతులలోని, కీర్తనలలోని పదాలను ఉచ్చరించే విధానం చాలావరకు దోషరహితంగా ఉంటుంది. తెలుగును క్షుణ్ణంగా నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా ఒక తెలుగు భాషాపండితుణ్ని నియమించుకుని, సరైన ఉచ్చారణానైపుణ్యాన్ని సొంతం చేసుకున్నదట! శాస్త్రీయసంగీత గాయకులు ప్రాచీన కావ్యాలను బాగా చదివి ఉండాలి అని విదుషి కిశోరీ అమోన్కర్ వ్యాఖ్యానించడాన్ని మనమిక్కడ గమనించాలి. నళినకాంతి రాగంలో ‘మనవి యాలకించ రాదటే’ అని ఒక కృతి ఉంది. ఇది కూడా త్యాగరాజ కృతే. దీన్ని చాలామంది మనవ్యాలకించరాదటే అని పాడుతారు. త్యాగరాజ స్వామి అట్లా రాసివుంటాడని అనుకోలేము. కాబట్టి, ఆ విధంగా మార్చి పాడటానికి గల కారణాలు జగదోద్ధారణ విషయంలోని కారణాల వంటివే అయివుండాలి. శాస్త్రీయ సంగీతాన్ని వింటున్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదించాలి తప్ప, సాహిత్యపరమైన సవ్యతకోసం వెతకవద్దు అనే వాదన చేస్తారు కొందరు. అయితే భాషను బాగా ప్రేమించేవారికి సంగీతాస్వాదన చేసే క్రమంలో అపశబ్దాలు ఆటంకాలుగా పరిణమించవచ్చు. సంగీతం రాని నేను నన్ను ఆ గాత్రసంగీత విద్వాంసుల ముందు సూర్యుని ముందు దివిటీతో, పర్వతం ముందు గులకరాయితో సమానుడిగా భావిస్తాను. భాషాపరమైన చర్చను చేసి, తద్వారా భాషాప్రేమికుల్లో ఉత్సాహాన్నీ ఉత్సుకతనూ రేకెత్తించడానికి ప్రయత్నించాలనే తప్ప, ఎవరినీ తప్పు పట్టడం ఈ వ్యాసకర్త ఉద్దేశం కాదు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15844</wfw:commentRss>
		<slash:comments>14</slash:comments>
		</item>
		<item>
		<title>ఆదిలో ఒక పద్య పాదం</title>
		<link>http://vaakili.com/patrika/?p=15377</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15377#comments</comments>
		<pubDate>Tue, 31 Oct 2017 21:17:26 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[విన్నకోట రవిశంకర్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15377</guid>
		<description><![CDATA[<p>నా అభిమాన విషయం వచన కవిత్వమే గాని, ఈ వ్యాసంలో పద్య కవిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు ముచ్చటిస్తాను. తొంభైల్లో అనుకుంటా ఒకసారి పద్యం విషయంలో వచన కవులకి, పద్య కవులకి మధ్య వివాదం నడిచిన సందర్భంలో. చేకూరి రామారావు గారు ఇద్దరికీ సర్దిచెప్పబోయి, ఇరువర్గాల ఆగ్రహానికీ గురయ్యారు. అప్పుడు మిత్రులాయనకి సరదాగా “ఉభయ కవి శత్రువు” అనే బిరుదు నిచ్చారు. అందువల్ల, అటువంటి ప్రయత్నమేదీ ఇక్కడ చెయ్యటం లేదు. వచన కవుల దృష్ట్యా పద్య కవిత్వాన్ని వివరించటం, ఛందోబద్ధమైన పద్య రచనాభ్యాసం, ఆసక్తి వచన కవులకెలా ఉపయోగపడుతుందనే విషయం పరిశీంచటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.</p> <p>ఏ విద్యయినా మొదట్లో కొన్ని నియమ నిబంధనలకి లోబడి నేర్చుకోవటం కద్దు. సంగీతం నేర్చుకునేవాళ్లు స్వర స్థానాలు సరిగ్గా పలికేట్లుగా గొంతును నియంత్రిస్తారు. పెయింటింగు నేర్చుకోవటానికి రేఖా చిత్రాలలో గీతలు దాటకుండా రంగును వెయ్యటం సాధన చేస్తారు. కవిత్వ రచనలో ఛందస్సు ఇటువంటి ప్రయోజనాన్నే నెరవేరుస్తుంది. ఈ సందర్భంలో “Learn the rules like a pro so you can break them like an artist” అని పికాసో చెప్పిన మాటలు గుర్తుచేసుకోవాలి. ఛందస్సుల సర్ప పరిష్వంగమన్నది పెద్దమాట గాని, ఛందో బందోబస్తులు తెంచాలంటే ముందు అవేమిటో తెలుసుకోవాలి గదా!</p> <p>పద్య రచన వల్ల పదాల పొందిక ఎలా ఉంటుందో, ఒక చట్రంలో అవెంత తేలికగా ఒదుగుతాయో తెలుస్తుంది. భాషలో, వాక్య నిర్మాణంలో సహజంగా ఉన్న లయ, పొందిక అవగతమౌతాయి. ఉదాహరణకి “సామవేదము జానకి రామశర్మ” అనే పేరు, ఏ మార్పులూ లేకుండా ఒక గీత పద్యపాదంగా సరిపోతుంది. అలాగే, “లావు కారప్పూస పావు కేజి” అన్నది పూర్తి పాదం కాకపోయినా, సీస పద్యంలో అరపాదంగా సరిపోతుంది. ఈ ఉదాహరణలు పద్యంలో ప్రత్యేకత ఏమీ లేదని దానిని ఎగతాళి చెయ్యటానికి కూడా ఉపయోగించవచ్చు. కాని, అదే సమయంలో మరో కోణం నుంచి చూస్తే, వాక్యంలో [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">నా </span>అభిమాన విషయం వచన కవిత్వమే గాని, ఈ వ్యాసంలో పద్య కవిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు ముచ్చటిస్తాను. తొంభైల్లో అనుకుంటా ఒకసారి పద్యం విషయంలో వచన కవులకి, పద్య కవులకి మధ్య వివాదం నడిచిన సందర్భంలో. చేకూరి రామారావు గారు ఇద్దరికీ సర్దిచెప్పబోయి, ఇరువర్గాల ఆగ్రహానికీ గురయ్యారు. అప్పుడు మిత్రులాయనకి సరదాగా “ఉభయ కవి శత్రువు” అనే బిరుదు నిచ్చారు. అందువల్ల, అటువంటి ప్రయత్నమేదీ ఇక్కడ చెయ్యటం లేదు. వచన కవుల దృష్ట్యా పద్య కవిత్వాన్ని వివరించటం, ఛందోబద్ధమైన పద్య రచనాభ్యాసం, ఆసక్తి వచన కవులకెలా ఉపయోగపడుతుందనే విషయం పరిశీంచటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.</p>
<p>ఏ విద్యయినా మొదట్లో కొన్ని నియమ నిబంధనలకి లోబడి నేర్చుకోవటం కద్దు. సంగీతం నేర్చుకునేవాళ్లు స్వర స్థానాలు సరిగ్గా పలికేట్లుగా గొంతును నియంత్రిస్తారు. పెయింటింగు నేర్చుకోవటానికి రేఖా చిత్రాలలో గీతలు దాటకుండా రంగును వెయ్యటం సాధన చేస్తారు. కవిత్వ రచనలో ఛందస్సు ఇటువంటి ప్రయోజనాన్నే నెరవేరుస్తుంది. ఈ సందర్భంలో “<em>Learn the rules like a pro so you can break them like an artist</em>” అని పికాసో చెప్పిన మాటలు గుర్తుచేసుకోవాలి. ఛందస్సుల సర్ప పరిష్వంగమన్నది పెద్దమాట గాని, ఛందో బందోబస్తులు తెంచాలంటే ముందు అవేమిటో తెలుసుకోవాలి గదా!</p>
<p>పద్య రచన వల్ల పదాల పొందిక ఎలా ఉంటుందో, ఒక చట్రంలో అవెంత తేలికగా ఒదుగుతాయో తెలుస్తుంది. భాషలో, వాక్య నిర్మాణంలో సహజంగా ఉన్న లయ, పొందిక అవగతమౌతాయి. ఉదాహరణకి “సామవేదము జానకి రామశర్మ” అనే పేరు, ఏ మార్పులూ లేకుండా ఒక గీత పద్యపాదంగా సరిపోతుంది. అలాగే, “లావు కారప్పూస పావు కేజి” అన్నది పూర్తి పాదం కాకపోయినా, సీస పద్యంలో అరపాదంగా సరిపోతుంది. ఈ ఉదాహరణలు పద్యంలో ప్రత్యేకత ఏమీ లేదని దానిని ఎగతాళి చెయ్యటానికి కూడా ఉపయోగించవచ్చు. కాని, అదే సమయంలో మరో కోణం నుంచి చూస్తే, వాక్యంలో సహజమైన నడకని, లయని ఛందస్సు ఎంత బాగా పట్టుకొని, తనలో ఇముడ్చుకొందో అని మనకు ఆశ్చర్యంకలుగుతుంది.</p>
<p>పద్యంలోని యతి ప్రాసల వల్ల అక్షర మైత్రి మీద పాధమిక అవగాహన ఏర్పడుతుంది. కవన్నవాడు మనిషికి మనిషికి మధ్య, మనిషికి ప్రకృతికి మధ్య ఉండే స్నేహాన్ని అర్థం చేసుకోవాలంటే అంతకంటే ముందు అక్షరానికి, అక్షరానికి మధ్య స్నేహం గురించి తెలుసుకోవటం ముఖ్యం. నిత్య జీవితంలో జరిగే సంభాషణల్లో, మనం ఉపయోగించే సామెతల్లో, అనేక చోట్ల వాక్యం రెండు భాగాలుగా విడివడటం, అక్కడ అక్షర మైత్రి ఉన్న పదం రావటం మనం గమనించవచ్చు.(ఊరంతా ఒకదారైతే, ఉలిపికట్టె దొకదారి.. వంటివి.) దీనినిబట్టి అక్షర మైత్రి తెలుగు భాషకు సహజమైన ఆభరణమని భావించాలి. కవిత్వం రాయాలనుకునే వారికి తాము రాసే భాషకున్న సహజ లక్షణాల గురించి అవగాహన ఉండటం ఎంతైనా అవసరం.</p>
<p>ఛందస్సులో పాటించే గణాలు, యతి ప్రాసల పరిమితుల వల్ల, అందుకనుగుణంగా పదాలు కూర్చాలి కాబట్టి, పదాల ఎంపిక, పదాన్వేషణ అలవాటౌతాయి. దీనివల్ల కవికి పదాల మీద అధికారమే కాదు, మమకారం కూడా ఏర్పడుతుంది. కవికి పదాల మీద ప్రేమ ఉండాలి. ప్రతి పదానికీ రంగు,రుచి,వాసన ఉంటాయన్న స్పృహ ఏర్పడాలి. ఒక ప్రసిద్ధ అమెరికన్ నవలాకారుడు తను రాస్తుంటే, డిక్ష్నరీలు, థెసారేస్ లు వెనక నుంచి ఎలుగెత్తి పిలుస్తూ ఉంటాయని అంటాడు. బాష మీద, పదాల మీద అటువంటి మోహం కొందరు కవులు, రచయితల కుంటుంది. ఐతే, భాషలో, పదాలలో నిరాడంబరత పాటిస్తూ గొప్ప కవిత్వం రాసినవారు లేరా అంటే, తప్పకుండా ఉన్నారు. అది కవిత్వ రచన విషయంలో వారి వారి దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. దానిని గాంధీ గారు కొల్లాయి కట్టటం, రమణ భగవాన్ గోచీతోనే గడపటం మొదలైన వాటితో పోల్చవచ్చు. కవితకు భాష ఆహార్యం వంటిది. మనకు తగిన ఆహార్యం మనం ధరించినట్టే, తన కవితకు సరిపోయే భాషను కవి ఎన్నుకుంటాడు. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. గాంధీగారు గాని, రమణ భగవాన్ గాని వస్త్రధారణలో పాటించిన నిరాడంబరత స్తోమతుకు సంబంధించినది కాదు. అలాగే, కవి నిరాడంబరత పాటించినా, అది పద సంపద లేకపోవటంవల్ల ఏర్పడినదై ఉంటే శోభించదు. తను నేర్చిన పదాలు వాడినా, వాడక పోయినా, ఆ పద సంపద కూర్చుకోవటానికి చేసిన కృషి ఏదో ఒక విధంగా ఆ కవి కవితాశక్తిని పెంపొందించటానికి ఉపయోగపడుతుంది.</p>
<p>పద్య రచనలో మరొక ఉపయోగం పదాల పరిమితి. ఒక పద్యంలో ఇచ్చిన గణాలలో, నాలుగు పాదాలలో చెప్పదలుచుకొన్న భావం పూర్తి కావాలి. వచన కవిత్వం రాయాలనుకున్నవారు కూడా తమకు అపరిమితమైన స్థలం ఉందని భావించరాదు. కవిత అన్నది గుడి వంటిది.. ఇంకా చెప్పాలంటే గర్భగుడి వంటిది. అందులో ప్రతి అంగుళం విలువైనది, పవిత్రమైనది. మంచి కవిత్వం రాయాలనుకునే కవికి తను రాసే కవిత మీద ఇటువంటి గౌరవం ఉండటం ఎంతో అవసరం.</p>
<p>నిబంధనల గురించి చర్చించేటప్పుడు, ఒకవేళ నిబంధన లెక్కువైపోతే ఏమవుతుందనే విషయం కూడా మాట్లాడాలి. ఏవిద్య లోనైనా నిబంధనలెక్కువైతే ఆ విద్య వినోదంగా మారిపోతుంది. కవిత్వంలో అష్టావధానాలు, శతావధానాలు మొదలైనవి ఇటువంటివే. ఒక విధంగా చెప్పాలంటే, వచన కవిత్వం ఏ దారీ తెలియని అడవిలోనో, ఎడారిలోనో మన దారి మనమే వెతుక్కుంటూ, మన రూల్సు మనమే రూపొందించుకొంటూ నడవటం లాంటిది. పద్య కవిత్వం చక్కని రహదారిలో అన్ని ట్రాఫిక్ నిబంధనలూ పాటిస్తూ నడవటం లాంటిది. ఇకపోతే, అష్టావధానాలు, శతావధానాలవంటివి సర్కస్ లో తీగ మీద నడవటంతో సమానం. ఇవి చాలా ప్రత్యేకమైన నైపుణ్యానికి సంబంధించినవి కాబట్ట్టి, ఇతర కవులు వాటి గురించి అంతగా చింతించవలసిన పనిలేదు. ఐతే, వీటివల్ల అనుకోని పరిణామం ఒకటి జరుగుతుంది. అదేమిటంటే, కొత్తగా కవిత్వం రాయాలనుకునే యుకవులు వీటిని చూసి, పద్య కవిత్వం కేవలం వినోదం కలిగించటానికే ఉపయోగపడుతుందని పొరపాటుపడి, దానికి దూరమౌతారనిపిస్తుంది. వీరు సాధారణంగా కవిత్వాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు గనుక, అటువంటి ధోరణి వచన కవితల్లోనే ఎక్కువగా కనిపించటం చూసి, పద్యకవిత్వం వినోదాత్మకమని, వచన కవిత్వం ఆలోచనాత్మకమని భ్రమపడే అవకాశం ఉంది. దీనిని నివారించటానికి, ఎప్పుడూ జనాకర్షణ మీదే దృష్టి పెట్టకుండా, మనసును కదిలించి, ఆనందంతోనో, విషాదంతోనో కళ్ళు చెమరింపజేసే గొప్ప పద్యాలకు ప్రచారం కల్పించవలసిన అవసరం పద్య కవులకుంది.</p>
<p>వచన కవులు ఛందస్సును వదిలిపెట్టినా, ఒక సంప్రదాయాన్ని మాత్రం వదులుకోలేక పోతున్నారు. అది ఆశు కవిత్వం. ఏదైనా సంఘటన గురించి విన్నప్పుడు, లేదా వార్తా పత్రికలలో పతాక శీర్షికలుగా చదివినప్పుడు వెనువెంటనే స్పందించి, ఒక కవిత రాసేసి, ఆ వార్త కరెంట్ గా ఉన్నప్పుడే ఆ కవిత అచ్చు కావాలని ప్రయత్నించటం. నా దృష్టిలో ఆశుకవిత్వానికి దీనికి పెద్ద తేడాలేదు. “ఆశు కవితా సన్యాస మెప్పించవే!” అని రాయప్రోలువారు అర్థించి ఎన్నో దశాబ్దాలయినా , అది మన తెలుగు కవుల జీన్స్ లో స్థిరంగా ఉండిపోయిందేమో అనిపిస్తుంది.</p>
<p>మొత్తం మీద చెప్పాలంటే, అది యే రకమైనదైనా, కవిత్వం మౌలికంగా భాషకు సంబంధించిన ప్రక్రియ. అందువల్ల, ఆ భాష మీద అవగాహన, పదాల మీద ప్రేమ, అక్షర మైత్రిని గురించిన జ్ఞానం, పదాన్వేషణపై ఆసక్తి – ఇవన్నీ కవికి ముఖ్యమైనవే. వచన కవిత్వం రాయటం చాలా తేలికని, దానికేవిధమైన శిక్షణ, అభ్యాసం అవసరం లేదని భావించటం సరికాదు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రతిభ, ఆసక్తులతో బాటు కవికి వ్యుత్పత్తి కూడా కావాలి. కాని, చాలా మందికి ఉత్పత్తి మీద ఉన్న ఆసక్తి వ్యుత్పత్తి మీద లేకపోవటం మన దురదృష్టం.</p>
<p>కొందరు ప్రముఖ వచన కవులు మొదట్లో రాసిన పద్యాలు పరిశీలిస్తే, ఛందోబద్ధ పద్య రచన గురించి నేను చెప్పే వాదానికి బలం చేకూరుతుంది. పద్య రచనలో వారు కనబరచిన ప్రతిభ, తత్ఫలితంగా ఏర్పడిన పునాది తరువాతి కాలంలో గొప్ప వచన కవిత్వం రాయటానికి దోహద పడి ఉంటుందని నా ఉద్దేశం. ముందుగా, శీశ్రీ పద్యాలు కొన్ని పరిశీలిద్దాం. శ్రీశ్రీ రాసిన పద్య ఖండికల్లో “సుప్తాస్థికలు” నాకు చాలా ఇష్టమైన ఖండిక.</p>
<blockquote><p>అవి ధరా గర్భమున మానవాస్థికాప<br />
రంపరాలు సుప్త నిశ్శబ్ద సంపుటములు!<br />
అటనొకే దీర్ఘ యామిని! ఆ నిశాశ్మ<br />
శాన శయ్యకు ప్రాతః ప్రసక్తి లేదు!</p></blockquote>
<p>అని మొదలయ్యే ఈ ఖండిక ఎంతో గంభీరంగా సాగుతుంది. చివరిలో-</p>
<blockquote><p>ఆ మనుష్యాస్థికలు నిద్రలో మునింగి<br />
సంచరించును భైరవ స్వప్న వీధి<br />
అవి చలించును తనుచర్మ కవచమెపుడొ<br />
బ్రతికిన దినాల తలపోత బరువు చేత!</p></blockquote>
<p>అస్థికల స్వప్నవీధి, తలపోతల వంటివాటి గురించి చెప్పటం గొప్ప ఊహ. శ్రీశ్రీ కవితాశక్తి, కవిత్వంలోని గాఢత ఈ పద్యాలలో తొంగిచూస్తాయి. యౌవనంలో ఉన్నప్పుడు మృత్యువు మీద ఒక రకమైన మోహం ఉంటుంది. బహుశా అటువంటి స్థితిలోనే ఈ ఖండిక రాసి ఉండవచ్చు.</p>
<p>శ్రీశ్రీ మరొక ఖండిక “ఖండ శశి” కూడా చెప్పుకోదగినదే.</p>
<blockquote><p>ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై<br />
వ్యాపించు కాల మేఘాళిలో పొడచూపి,<br />
ఖండేందు మూర్తి! ఆకాశ కర్పరమెల్ల<br />
నిండు నీగ్రుడ్డి వెన్నెల ధూమ ధూపమై!</p></blockquote>
<p>పై పద్యంలోని ధూమమే, మహా ప్రస్థానంలోని “ఆ రాత్రి” అన్న కవితలో</p>
<blockquote><p>గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి<br />
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను</p></blockquote>
<p>అన్నప్పుడు పొగలాగ మారి ఉంటుంది. నిజానికి, “ఆ రాత్రి” అన్న కవిత కూడా వచన కవిత కాదు. అందులో ఉన్నవన్నీ ద్విపదలు. మహా ప్రస్థానంలో మాత్రా ఛందస్సులో అనేక కవితలున్నా, చాలా ప్రాథమికమైన గణ ఛందస్సులో ఉన్న కవిత బహుశా ఇదొకటే అనుకుంటాను.</p>
<p>కవికుల తిలకుడు బాల గంగాధర తిలక్ కూడా మొదట్లోను, ఆ తరువాత కాలంలోనూ పద్య కవితలు రాసాడు. ఆర్.యస్.సుదర్శనం గారు తిలక్ పద్య కవిత్వం గురించి రాసిన వ్యాసంలో “ప్రభాతము-సంధ్య” అనే సంకలనం గురించి చెప్పారు. అది దొరకలేదుగాని, మరొక సంకలనం “గోరువంకలు” చూసాను. తిలక్ కవితల్లో సహజంగా ఉండే పద/భావ సౌకుమార్యం, మెత్తదనం ఈ పద్యాలలో అడుగడుగునా కనిపిస్తాయి.</p>
<p>ఉదాహరణకు</p>
<blockquote><p>ప్రతిదినమేగు బాష్పకణ భారనిరోధ దిశాంతనేత్రమై<br />
ప్రతి వకుళమ్ము రాలు శిశిరాత్తదళాంతగళోచ్ఛనాదమై<br />
ప్రతి తెలివేకువన్ తొలగి రాలెను తారలు గాజుపూసలై<br />
అతివ కదల్పకీ వయసు టద్దపుమేడ పునాది గోడలన్.</p></blockquote>
<p>అన్న పద్యం ఎంతో మృదుమనోహరంగా ఉంటుంది. నండూరి రామమోహన రావుగారు దీనిని తనకిష్టమైన పద్యాల్లో ఒకటిగా చెప్పారు. తిలక్ తన అత్యుత్తమమైన వచన కవితలు వెలువరించిన అరవైలలో కొన్ని పద్య ఖండికలు కూడా రాసాడు. వాటిలో “అద్వైత మాన్మధము” చెప్పుకోదగినది. సీత రామునిపై తన ప్రేమను తెలియజేస్తూ చెప్పే ఈ పద్యాలు గొప్ప కవితా విలువలతో కూడి ఉంటాయి. ఉదాహరణకు -</p>
<blockquote><p>నా యానందపు మేడలో మొదటి వీణా నాదమై మ్రోగి, నా<br />
ప్రాయోద్యాయమునందు మంద పవన ప్రాలంబమై వ్రేలి, నా<br />
యీ యేకాంతము నందు సిగ్గువయి నన్నిట్లేచి, నా స్త్రీత్వపున్<br />
సాయాహ్ణమ్ముల రాగరంజిత దిశా సందోహమై వ్రాలినన్<br />
ఏమయి పోయినానొ యిటు లేమరిపోయిన నన్ను నేనుగా<br />
నీమెయి చీకటింట గురుతింపగ నెట్టుల నేర్తు..</p></blockquote>
<p>రాముడు నల్లనివాడు కదా! ఆయన మేనిని చీకటిల్లని చెప్పటం ఎంతో హృద్యంగా ఉంది. ఇటువంటివే ఎన్నో పద్యాలలో తిలక్ కవితా వైభవం వెలుగొందుతూ కనిపిస్తుంది.</p>
<p>మూడవ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఈయన కవిపండితుడు కాబట్టి, ఆయన పద్యాలు ప్రౌఢంగా ఉంటాయి. అంతేకాకుండా, ఆయన కవిత్వంలో సాధారణంగా కనిపించే ఊహా వైచిత్రి, తాత్వికత, శ్రామిక జన పక్షపాతం వంటివి పద్య కావ్యాల్లో కూడా కనిపిస్తాయి. శేషేంద్ర ప్రసిద్ధి పొందిన పద్య కావ్యాలు ఋతుఘోష, పక్షులు. ఉదాహరణకి –</p>
<blockquote><p>చిక్కని చిగురాకు జీబులో పవళించి<br />
యెండు వేణువు కంఠమెత్తి పాడె<br />
తలిరాకులూడిచి తపసిగా మసలిన<br />
నగ్నవల్లికయు పర్ణముల దాగె<br />
జిలుగు సీతాకోకచిలుక రూపము దాల్చి<br />
కీటకయోగి కంకేళి గవిసె<br />
శిశిర వ్రతాచార జీర్ణమారుతమూర్తి<br />
యలరు గిన్నెల గంధమలదు కొనియె<br />
ఇచ్ఛ ప్రకృతిలో రెక్క విచ్చెనేమొ<br />
యెడద పురుషునిలో మొగ్గదొడిగె నేమొ</p></blockquote>
<p>అంటూ వసంతం గురించి,</p>
<blockquote><p>కనక మేఖల వోలె గగనమ్ము జఘనమ్ము<br />
నింద్రచాపము కుండలీకరించె<br />
జాజి దండల వోలె జలదమ్ము కబరిలో<br />
సౌదామినీమాల సంచలించె<br />
చిలిపి నవ్వుల వోలె చిన్కు ముత్యాలలో<br />
నీహార మధురిమ నివ్వటిల్లె<br />
అందెల రవళిగా ఆశాపథమ్ములం<br />
దంబుదధ్వనులు మోహంబుగొల్పె</p></blockquote>
<p>అంటూ వర్ష ఋతువు గురించి చెప్పిన పద్యాలు శేషేంద్ర కవిత్వంలో ప్రౌఢతకి, గాఢతకి తార్కాణంగా నిలుస్తాయి.</p>
<p>పై ముగ్గురి కవిత రీతుల్ని పరిశీలించినప్పుడు, పద్య కవితలో పునాది తరువాతి కాలంలో వారికెంతగా ఉపయోగపడి ఉంటుందన్నది మనం ఊహించుకోవచ్చు. అందువల్లనే, కవిత్వం రాయాలనే ఆసక్తి ఉన్నప్పుడు తొలిదశలో పద్యం రాస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నాకనిపిస్తుంది. వచన కవులు తమ పద్ధతిలో కవిత్వం రాస్తూనే, పద్య కవిత్వాన్ని ఆస్వాదించటం, ఎప్పుడైనా వీలయితే అభ్యసించటం చేస్తే దానివల్ల ఆనందం కలగటమే కాదు, వారి కవితాశక్తి మరింతగా పెంపొందుతుంది.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>(&#8217;10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు&#8217;లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15377</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>తెలుగు కథలు, స.ప.స.లు</title>
		<link>http://vaakili.com/patrika/?p=15395</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15395#comments</comments>
		<pubDate>Tue, 31 Oct 2017 21:16:30 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[తాడికొండ కె. శివకుమార శర్మ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15395</guid>
		<description><![CDATA[<p>తెలుగులో మంచికథలు రావట్లేదని ఈమధ్య తరచుగా వింటున్నాం, చదువుతున్నాం. అయితే, ఈ “మంచి” అన్న విశేషణం గూర్చి పెద్దగా చర్చ జరగలేదు. పైగా, “మంచికథలు రావట్లేదు” అని మొదలయ్యే వ్యాసాలు రెండో వాక్యంలోనే చెహోవ్ ఇలా అన్నాడనో, లేదా గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అలా అన్నాడనో తరచుగా చూస్తుంటాం కూడా. ఈ వ్యాసకర్తలకు సాటి తెలుగువాళ్లు గానీ లేక భారతీయులు గానీ మంచికథ గూర్చి ఏమన్నారో తెలియదో లేక తెలుసుకోవాలని అనిపించదో అర్థంకాని విషయం. అయితే, తెలుగులో మూసకథలు కొల్లలుగా వస్తున్నాయనేది మాత్రం పత్రికలే ఒప్పుకునే విషయం. ఆ మధ్య ఆంధ్రభూమి కథలపోటీని నిర్వహిస్తూ, “మాకు మూసకథలు వద్దు!” అని స్పష్టంగా చెప్పినా చివరికి బహుమతికి ఎంపిక అయినవి అవే. ఆ పత్రికా సంపాదకులు అందరికీ తెలుసు గదా అనుకుని “మూసకథ”కు నిర్వచనాన్ని ఇవ్వకపోవడం ఇందుకు కారణం కావచ్చు.</p> <p>“మూసకథ” అంటే స-ప-స కథ అనేది నా నిర్వచనం. సంగీతంతో పరిచయం ఉన్నవాళ్లకు ఆ మూడూ స్వరాలతో ముడిపడి ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం అసంఖ్యాకంగా వెలువడుతున్న కథల్లో కనబడేవి, సమస్య-పరిష్కారం-సందేశం కథలు. సంగీతంలో పంచమం లేకుండా రాగాలున్నాయి. అలాగే పై షడ్జమం లేకుండా కూడా రాగాలున్నాయి. కానీ, సమస్యో, లేక సందేశమో లేని కథలు పత్రికల్లో దాదాపు కనిపించట్లేదనే చెప్పచ్చు. కొన్ని కథలు పేర్లల్లోనే చెప్పేసి చదవాల్సిన బాధనుంచీ తప్పిస్తాయి. ఉదాహరణకి, “అమ్మకో బహుమతి,” “అమ్మా నన్ను క్షమించవూ?” ఈ కథల్లో సామాజిక సమస్యలు అగ్రభాగాన్ని ఆక్రమిస్తాయనేది నేను గమనించిన విషయం. అవి బి.టి. వంకాయలు కావచ్చు, సరోగసీ కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, అమెరికా వెళ్ళిపోయిన పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం కావచ్చు, సునామీ కావచ్చు, అంతమైపోతున్న కులవృత్తులు కావచ్చు. అది డాలర్ల వెంట పరుగెత్తడం కూడా కావచ్చు. తమాషా ఏమిటంటే, క్రితం శతాబ్దంలో మొదటిసగంలో భారతీయులు రంగూన్ వెళ్లివచ్చారు. అంతకు ముందర ఇంగ్లండ్ వెళ్లివచ్చారు. కానీ, అమెరికాకు వెళ్లడంలో ప్రత్యేకత [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">తె</span>లుగులో మంచికథలు రావట్లేదని ఈమధ్య తరచుగా వింటున్నాం, చదువుతున్నాం. అయితే, ఈ “మంచి” అన్న విశేషణం గూర్చి పెద్దగా చర్చ జరగలేదు. పైగా, “మంచికథలు రావట్లేదు” అని మొదలయ్యే వ్యాసాలు రెండో వాక్యంలోనే చెహోవ్ ఇలా అన్నాడనో, లేదా గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అలా అన్నాడనో తరచుగా చూస్తుంటాం కూడా. ఈ వ్యాసకర్తలకు సాటి తెలుగువాళ్లు గానీ లేక భారతీయులు గానీ మంచికథ గూర్చి ఏమన్నారో తెలియదో లేక తెలుసుకోవాలని అనిపించదో అర్థంకాని విషయం. అయితే, తెలుగులో మూసకథలు కొల్లలుగా వస్తున్నాయనేది మాత్రం పత్రికలే ఒప్పుకునే విషయం. ఆ మధ్య ఆంధ్రభూమి కథలపోటీని నిర్వహిస్తూ, “మాకు మూసకథలు వద్దు!” అని స్పష్టంగా చెప్పినా చివరికి బహుమతికి ఎంపిక అయినవి అవే. ఆ పత్రికా సంపాదకులు అందరికీ తెలుసు గదా అనుకుని “మూసకథ”కు నిర్వచనాన్ని ఇవ్వకపోవడం ఇందుకు కారణం కావచ్చు.</p>
<p>“మూసకథ” అంటే స-ప-స కథ అనేది నా నిర్వచనం. సంగీతంతో పరిచయం ఉన్నవాళ్లకు ఆ మూడూ స్వరాలతో ముడిపడి ఉన్నాయని తెలుసు. ప్రస్తుతం అసంఖ్యాకంగా వెలువడుతున్న కథల్లో కనబడేవి, సమస్య-పరిష్కారం-సందేశం కథలు. సంగీతంలో పంచమం లేకుండా రాగాలున్నాయి. అలాగే పై షడ్జమం లేకుండా కూడా రాగాలున్నాయి. కానీ, సమస్యో, లేక సందేశమో లేని కథలు పత్రికల్లో దాదాపు కనిపించట్లేదనే చెప్పచ్చు. కొన్ని కథలు పేర్లల్లోనే చెప్పేసి చదవాల్సిన బాధనుంచీ తప్పిస్తాయి. ఉదాహరణకి, “అమ్మకో బహుమతి,” “అమ్మా నన్ను క్షమించవూ?” ఈ కథల్లో సామాజిక సమస్యలు అగ్రభాగాన్ని ఆక్రమిస్తాయనేది నేను గమనించిన విషయం. అవి బి.టి. వంకాయలు కావచ్చు, సరోగసీ కావచ్చు, ప్రపంచీకరణ కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, అమెరికా వెళ్ళిపోయిన పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం కావచ్చు, సునామీ కావచ్చు, అంతమైపోతున్న కులవృత్తులు కావచ్చు. అది డాలర్ల వెంట పరుగెత్తడం కూడా కావచ్చు. తమాషా ఏమిటంటే, క్రితం శతాబ్దంలో మొదటిసగంలో భారతీయులు రంగూన్ వెళ్లివచ్చారు. అంతకు ముందర ఇంగ్లండ్ వెళ్లివచ్చారు. కానీ, అమెరికాకు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిటంటే అది మాత్రం డాలర్ల వెంట పరుగెత్తడం అని రచయితలూ రచయిత్రులూ నిర్ధారించేశారు. ఇంగ్లండ్ వెళ్ళిన వాళ్ల గూర్చి పౌండ్ల వెనక పరుగెత్తుతున్నారని రాయకపోవడానికి పాపం అప్పటికి తెలుగులో కథ అనేది పూర్తిగా రూపాన్ని దిద్దుకోలేదు. దీన్ని గూర్చి రాసిన, రాస్తున్న ఈ నాటి రచయితలు గనుక ఆనాడు ఉండివుంటే తెలుగు కథలు ఎలా ఉండేవోనని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. రంగూన్ వెళ్లి తిరిగి వచ్చిన పాత్రలు సినిమాల్లో బానే వచ్చాయి కదా! కథల్లో కూడా వచ్చాయేమో నాకు తెలియదు. మీ కెవరికయినా తెలుసా? రాలేదని మీరు అనేటట్లయితే అది ఆ కాలపు రచయితలకు ఎందుకు వస్తువు కాలేదంటారు?</p>
<p>ఈనాడు కథల్లో కనబడే వివక్షగూర్చి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కథల్లో వివక్ష ఉండవచ్చు గానీ, ఒక్క వివక్షని చూపించడానికి మాత్రమే కథలు రాస్తే అవి కంకాళానికి తోలు కప్పినట్లు తయారవుతాయని నా అభిప్రాయం. వివక్ష అనగానే సందేశాత్మకం అని వెంటనే అర్థమవుతుంది కూడా. వివక్షని భాగంగా మాత్రమే చూపించే కథలు ఈ మధ్య కాలంలో నాకు స.వెం. రమేశ్ గారి “<a href="http://vaakili.com/patrika/?p=15212" target="_blank">కతల గంప</a>” సంకలనంలో కనిపించాయి. విశాలమయిన వర్ణ చిత్రాలలో సంఘర్షణలని, క్షోభపడే వ్యక్తులని, చిరకాలంగా చిత్రిస్తూనే ఉన్నారు. అవి కళాఖండాలయినవి ఆ వర్ణచిత్రాల నియమాలని పాటించడంవల్లే. అంటే ఆ చిత్రాలు చూసేవాళ్ళకు ఎలా కనిపిస్తాయి అని చిత్రకారులు ఆలోచించడం వల్ల. అలాగే, కథలో కూడా కథనమూ, భాష, పాత్రల ఔచిత్యమూ ముఖ్యం. రమేశ్ గారిలాగా అద్భుతమయిన వర్ణనలనీ, వాడి వాడి వడలిపోయిన వాటిని గాక తనకే స్వంతమయిన ఉపమానాలని రచయిత సృష్టించగలిగితే అది పాఠకునికి అదనపు బోనస్.</p>
<p>మనం సమాజంలో భాగమయి నందువల్ల అందులో కనిపించే సంఘటనలూ, అస్తిత్వమూ రచనకు ప్రేరణ కావచ్చు. ఉదాహరణకి, కేతు విశ్వనాథ రెడ్డి గారి కథ &#8216;రెక్కలు&#8217;. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారని తెలిసిందే. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకి పోలింగ్ బూత్ ల దగ్గర డ్యూటీ పడేదని కూడా వినేవుంటారు. ఈ కథలో అలాంటి డ్యూటీకి ఒక సహోద్యోగితో కలిసి కథకుడు లారీలో వెడుతుంటే అదే చోటికి వెళ్లే వయసులో వున్న ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా దానిలో ఎక్కుతారు. వాళ్ళకి కథకుడు వెడుతున్న పోలింగ్ బూత్ లోనే డ్యూటీ. చేరిన చిన్న ఊళ్లో చిన్న బడిలో వాళ్ల బస. మరునాటి పొద్దున్న ఎన్నికలు. రాత్రిపూట చీకట్లో కథకుడి సహోద్యోగి ఒక కానిస్టేబుల్ మీద మక్కువని ప్రకటించబోతాడు. ఇది కల్పితంకాదని తేలిగ్గా నమ్మవచ్చు. అయితే, ఆ ఉపాధ్యాయ వృత్తిలో లేనివాళ్ళకి ఈ కథ రాసే అవకాశం లేదు.</p>
<p>అలాగే ఇంకో అస్తిత్వం కథ వేంపల్లె షరీఫ్ రాసిన “తలుగు”. ఆయన తప్ప ఇంకెవరూ ఆ అంశాన్ని ముట్టలేరనిపిస్తుంది.</p>
<p>అనిల్ ఎస్. రాయల్ కథ “శిక్ష” కూడా సమాజపు రీతుల్ని వాడుకున్నదే. ఆసక్తికరమయిన కథనంతో పాఠకుణ్ణి ఆసాంతమూ చదివిస్తుంది.</p>
<p>యాభయ్యవ దశకంలో కథలు సమాజాన్ని ఉద్ధరించడానికే రాయాలి, సమాజాన్ని ప్రభావితం చెయ్యాలి, సమాజంలోని కుళ్లుని ఎండగట్టాలి, రచయితలకి బాధ్యత ఉండాలి అనడం మొదలయిందని బుచ్చిబాబుగారి కథలవల్ల తెలుస్తుంది. ఒక కథలో ఆయన దాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఈనాడు కథాంశానికే తప్ప కథనానికి పెద్దగా చోటులేదని అనిపిస్తోంది. కథల పోటీల్లో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన వాటిలోనే కాక గెలుపొందినవాటిల్లో కూడా ఈ తత్త్వం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో సందేశం ప్రధానం. ఇవి స-స ల కథలు – అంటే, సమస్య-సందేశం కథలన్నమాట. ఈ రెండు స్వరాలే ఉన్న ఒక రాగం గానీ ఒక పాటగానీ మీకేమయినా తెలుసా?</p>
<p>పరిష్కారం చూపించని కథలు లేకపోలేదు.</p>
<p>అయితే, ఈ పరిష్కారం చూపించేది ఎవరికోసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. కథకి ముగింపు నివ్వడానికి మాత్రమే చూపే పరిష్కారాలకి ఊతనిచ్చేది సమస్యే. సమస్యతో మొదలయిన కథ పరిష్కారంకోసం దేవుళ్ళాడుతూనే వుంటుంది. అలాగని కథల్లో ఇచ్చిన సలహాలని పాటించిన వాళ్లెవరూ నాకు తెలియదు.</p>
<p>భారతీయ భాషల కథలన్నింటిలో ఈ స-ప-స ల స్వైరవిహారం వున్నదా లేక ఇది తెలుగు భాషకే ప్రత్యేకమా? తెలుగులోకి తర్జుమా చేసిన కొన్ని కథలని చదివాను గానీ వాటిలో నాకు ఇవి కనిపించలేదు. అయితే, ప్రచురింపబడ్డ వాటిలో చాలా తక్కువ శాతం వేరే భాషల్లోకి అనువదింపబడతాయి గనుక ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నా శాంపిల్ సైజు సరిపోదు. అందుకని అడుగుతున్నాను.</p>
<p>అసలు కథలెందుకు సమస్యలని తలకెత్తుకోవాలి? వాటికి పరిష్కారాల నెందుకు చూపాలి? వాటిలో సందేశాన్ని ఎందుకు ఇమడ్చాలి? ఉత్త స-స తోనే కాదు రాగాన్ని సృష్టించలేమనీ, మెలోడీని తయారుచెయ్యలేమని తెలిసేది. స-ప-స తో కూడా అవి సాధ్యం కాదు. ఆ మూడు స్వరాలలోనే ఎంత కొట్టుకున్నా మెలోడీని తయారు చెయ్యలేం. కనీసం ఐదు స్వరాలు కావాలి. స్వర్గీయ బాలమురళి గారు నాలుగు స్వరాలతోనే సృష్టించిన రాగాలని ఒప్పుకున్నా గానీ, నాలుగు స్వరాలు కావాలి. వాటిల్లో పై షడ్జమం ఉండదు.</p>
<p>ఆ మూడూ లేకుండా రాసిన ఎంతోమంది పాత కాలపు మేటి రచయితలని పక్కన పెడితే, ఈ మధ్య నాకు కొన్ని కథలు దొరికాయి. తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారివి. జై, నలుపెరుపు, గారడీ, ఆర్వీ చారి కరెంటు బిల్లు. ఇంకొక కథ నెమలీకలో సందేశ మున్నది గానీ అది ఆనందపరచేది. ఇంటి కెదురుగా ఉన్న చెట్టుని పట్టించుకోకుండా దాని పక్క నుంచే వెడుతుంటే ఎదురింటి వాళ్లు మనకు దాన్ని గూర్చి చెప్పడం లాంటిది. పొత్తూరి విజయలక్ష్మి గారి ఏలినవారి దివ్య సముఖమునకు అన్న కథ సామాజికమూ, తప్పక చదవవలసినది కూడా. హాస్యాన్ని కలిపిన వ్యంగ్యం నషాళాని కంటుతుంది. అలాగే, కె.ఎన్. మల్లీశ్వరి గారి కథ శతపత్ర సుందరి కథ చదివినప్పుడు నాకు అది సార్వజనీనమూ, సార్వకాలీనమూ అనిపించింది.</p>
<p>పత్రికలు నిర్వహించే కథల పోటీల్లో ఈ స-ప-స కథలకే అగ్ర తాంబూలం దొరుకుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి కథల నుంచి విముక్తి కలిగే అవకాశాలున్నాయా అని అనుమానం వస్తూంటుంది. అలాంటి కథలకే బహుమతులు వస్తాయి అని రచయితలు నిర్ణయించుకోవడం వల్ల అది జరుగుతోందా లేకపోతే సందేశమే ముఖ్యం అని పత్రికలు నిర్ణయించుకోవడం వల్లనా?</p>
<p>దాదాపు అరవయ్యేళ్లకు పైగా “కథలకు సామాజిక ప్రయోజనం ముఖ్యం” అనే నేపథ్యంలో ఈ స.ప.స.ల నుండి తెలుగు కథకి విముక్తి సాధ్యమా? ప్రపంచంలో ఏ సమాజమూ ఒక కథవల్లో ఒక నవలవల్లో మారిన దాఖలాలే లేనప్పుడు తెలుగు రచయితలు ఇంకా స.ప.స.లని పట్టుకుని వేళ్ళాడడం సమంజసమా? సంగీతంలో షడ్జమం లేని రాగాలే లేకపోవచ్చు. కానీ, స.ప.స.లు లేని కథలు పాత తరాల రచయితలవి కోకొల్లలు. ఈ తరంలో అలాంటి వాటిని దుర్భిణీ వేసి పట్టుకోవలసి వస్తోంది. లేకపోతే, అమ్మకు పుట్టిన ఆరుగురూ సంగీత పాఠకులు కారన్నట్టు, అరవై, డెభ్భై దశకాలు గొప్పవి, అప్పటిలాగా ఎప్పుడూ కథలు ఎలా వుంటాయి అని సర్దుకుపోవాలా?</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>(&#8217;10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు&#8217;లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15395</wfw:commentRss>
		<slash:comments>9</slash:comments>
		</item>
		<item>
		<title>అవే కథలు ఇంకెన్నాళ్ళు?</title>
		<link>http://vaakili.com/patrika/?p=15487</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15487#comments</comments>
		<pubDate>Tue, 31 Oct 2017 21:05:13 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[పద్మవల్లి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15487</guid>
		<description><![CDATA[<p>నాకు పుస్తకాలంటే పిచ్చి ఎప్పుడు ఎలా మొదలయ్యిందో తెలీదు కానీ, జ్ఞాపకాలను తవ్వుకుంటే ఒకటి గుర్తొస్తుంది. నాకు దాదాపు ఎనిమిదేళ్ల వయసున్నపుడు, ఒక చిన్న పల్లెటూళ్ళో ఉండేవాళ్ళం. అక్కడ ఒక డాక్టర్ గారింటి నుండి పత్రికలు తెచ్చుకుని అక్షరం వదలకుండా చదవడం నా మొదటి జ్ఞాపకం. ఈరోజుకి కూడా అందులో ఒక సీరియల్ పేరు “ఇది ఒక పాంథశాల” అని గుర్తుంది. ఆ పేరంటే చెప్పలేనంత మోజు నాకు. రచయిత అంటూ ఒకరుంటారని కూడా తెలీని వయసు కాబట్టి వాళ్ళ పేరూ గుర్తు లేదు.</p> <p>నా చిన్నప్పుడు నాన్న ఒక హైస్కూల్లో పనిచేసేవారు. అక్కడి లైబ్రరీలో, బొమ్మలతో పురాణ కథల పుస్తకాలూ, పాకెట్ సైజు కథల పుస్తకాలు, సోవియట్ కథల పుస్తకాలూ లెక్కలేనన్ని ఉండేవి. అవన్నీ మాకోసం ఇంటికి తీసుకొచ్చేవారు. వేసవి సెలవుల్లో నాన్న మధ్యాన్నం భోజనానికి ఇంటికి వచ్చివెళ్ళేప్పుడు, నేను కూడా తనతో సైకిల్ మీద వెళ్ళిపోయి, కావలసినన్ని పుస్తకాలు తీసుకొని, ఒక్కదాన్నే దాదాపు రెండు మైళ్ళు నడిచి వెనక్కి వచ్చేదాన్ని. ఇంటికి వెళ్ళేవరకూ కూడా ఆగలేక, దారి పక్కన చింత చెట్ల క్రింద కూర్చుని, కొంచెం కొంచెంగా పుస్తకం చదువుకుంటూ వెళ్ళడం బాగా గుర్తు. ఇంటికి వెళ్ళేలోగానే కొన్ని పుస్తకాలు పూర్తయిపోయేవి. బహుశా నాకు పుస్తకాల రుచి తెలియడం, వాటి మీద ఆకలీ, అలా మొదలయ్యిందనుకుంటాను.</p> <p>అమ్మ టీచర్. పనితో ఎంత అలిసిపోయి ఉన్నా గానీ, కనిపించిన పుస్తకమల్లా చదివేది. అలా నాకు పన్నెండేళ్ల వయసులోనే “చిల్లర దేవుళ్ళు”, “బలిపీఠం”, “కళ ఎందుకు”, “శ్రీకాంత్” చదివే అవకాశం దొరికింది. ఇక చందమామ లాంటి పిల్లల పత్రికలూ, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికలూ మామూలే. ఆ సమయంలో యండమూరి, మల్లాది, యద్దనపూడి సీరియల్స్ వరసబెట్టి వస్తూ ఉండేవి. అదీ ఇదీ అని లేకుండా అన్నిటినీ చదివేసేవాళ్ళం. ప్రక్కింటి అన్నయ్య, న్యూస్ పేపర్ల గుట్ట క్రింద దాచుకునే, స్పెషల్ పుస్తకాలకు తప్ప, దేనికీ ఆంక్షలు ఉండేవి [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">నా</span>కు పుస్తకాలంటే పిచ్చి ఎప్పుడు ఎలా మొదలయ్యిందో తెలీదు కానీ, జ్ఞాపకాలను తవ్వుకుంటే ఒకటి గుర్తొస్తుంది. నాకు దాదాపు ఎనిమిదేళ్ల వయసున్నపుడు, ఒక చిన్న పల్లెటూళ్ళో ఉండేవాళ్ళం. అక్కడ ఒక డాక్టర్ గారింటి నుండి పత్రికలు తెచ్చుకుని అక్షరం వదలకుండా చదవడం నా మొదటి జ్ఞాపకం. ఈరోజుకి కూడా అందులో ఒక సీరియల్ పేరు “ఇది ఒక పాంథశాల” అని గుర్తుంది. ఆ పేరంటే చెప్పలేనంత మోజు నాకు. రచయిత అంటూ ఒకరుంటారని కూడా తెలీని వయసు కాబట్టి వాళ్ళ పేరూ గుర్తు లేదు.</p>
<p>నా చిన్నప్పుడు నాన్న ఒక హైస్కూల్లో పనిచేసేవారు. అక్కడి లైబ్రరీలో, బొమ్మలతో పురాణ కథల పుస్తకాలూ, పాకెట్ సైజు కథల పుస్తకాలు, సోవియట్ కథల పుస్తకాలూ లెక్కలేనన్ని ఉండేవి. అవన్నీ మాకోసం ఇంటికి తీసుకొచ్చేవారు. వేసవి సెలవుల్లో నాన్న మధ్యాన్నం భోజనానికి ఇంటికి వచ్చివెళ్ళేప్పుడు, నేను కూడా తనతో సైకిల్ మీద వెళ్ళిపోయి, కావలసినన్ని పుస్తకాలు తీసుకొని, ఒక్కదాన్నే దాదాపు రెండు మైళ్ళు నడిచి వెనక్కి వచ్చేదాన్ని. ఇంటికి వెళ్ళేవరకూ కూడా ఆగలేక, దారి పక్కన చింత చెట్ల క్రింద కూర్చుని, కొంచెం కొంచెంగా పుస్తకం చదువుకుంటూ వెళ్ళడం బాగా గుర్తు. ఇంటికి వెళ్ళేలోగానే కొన్ని పుస్తకాలు పూర్తయిపోయేవి. బహుశా నాకు పుస్తకాల రుచి తెలియడం, వాటి మీద ఆకలీ, అలా మొదలయ్యిందనుకుంటాను.</p>
<p>అమ్మ టీచర్. పనితో ఎంత అలిసిపోయి ఉన్నా గానీ, కనిపించిన పుస్తకమల్లా చదివేది. అలా నాకు పన్నెండేళ్ల వయసులోనే “చిల్లర దేవుళ్ళు”, “బలిపీఠం”, “కళ ఎందుకు”, “శ్రీకాంత్” చదివే అవకాశం దొరికింది. ఇక చందమామ లాంటి పిల్లల పత్రికలూ, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికలూ మామూలే. ఆ సమయంలో యండమూరి, మల్లాది, యద్దనపూడి సీరియల్స్ వరసబెట్టి వస్తూ ఉండేవి. అదీ ఇదీ అని లేకుండా అన్నిటినీ చదివేసేవాళ్ళం. ప్రక్కింటి అన్నయ్య, న్యూస్ పేపర్ల గుట్ట క్రింద దాచుకునే, స్పెషల్ పుస్తకాలకు తప్ప, దేనికీ ఆంక్షలు ఉండేవి కాదు. ఆఖరుకు కిరాణా సరుకుల పేపర్లూ, పకోడీ పొట్లం కాయితాలూ కూడా చదివిన తర్వాతనే చెత్తలోకి వెళ్ళేవి. ఎంత చదివినా దాహం తీరేదే కాదు.</p>
<p>కాలేజీకొచ్చేసరికి పుస్తకాల కోసం స్నేహాలు చెయ్యడం కూడా అలవాటయ్యింది. ఏ ఇంట్లో ఏ పత్రికలూ కొంటారో, ఏ పత్రిక ఏ రోజు వస్తుందో చిట్టా చేతివేళ్ల చివరే ఉండేది. పత్రిక రాగానే మన చేతికి రావాలంటే, ఆ యింట్లో అత్తయ్యతో స్నేహం చెయ్యటం మంచిదా, లేక మావయ్యతోనా అనే రాజకీయాలు కూడా అప్పుడే అబ్బేయి. ఒకవైపు యండమూరి, మరోవైపు కుప్పిలి పద్మ, ఆ రోజుల్లో నన్నో ఊపు ఊపి వదిలేసారు. ఎవరి నాయికలను రోల్ మోడల్ చేసుకోవాలా అనే అప్పటి నా పరిస్థితి &#8220;రాక్సీ లో నార్మా షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల” లా ఉండేది. మల్లాది, కొమ్మనాపల్లి లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. మరోవైపు అందమైన అమ్మాయి ఫోటోలతో కిరణ్ ప్రభ గారి కవితలు వచ్చేవి. చాలాకాలం వరకూ ఆ అమ్మాయే కిరణ్ ప్రభ అనుకున్న అజ్ఞానం నాది.</p>
<p>ఆంధ్రా యూనివర్సిటీలో కొందరు స్నేహితుల సాంగత్యం, పుస్తకాల మీద ప్రేమని ఇంకా పెంచింది. అప్పట్లో మహాప్రస్థానాన్నీ, అమృతం కురిసిన రాత్రినీ ఒకే తలగడ క్రింద పెట్టుకుని పడుకోగలిగిన విశాల హృదయం ఉండేది. యూనివర్సిటీ లైబ్రరీ వల్ల పుస్తకాల తృష్ణ కాస్త తీరింది. బారిస్టర్ పార్వతీశం, చివరకు మిగిలేది, గోర్కీ అమ్మ, గీతాంజలి, గోదాన్ &#8230; ఇవన్నీ చదువుకున్నది అక్కడే. అప్పుడపుడూ కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా అవి చేజ్, సిడ్నీ షెల్డన్ రచనలే.</p>
<p>పెళ్లి తరువాత దేశం వదిలి వచ్చాను. పుస్తకాలు చదివే అలవాటున్న వారు దాదాపు లేని చోట, ఉన్నా యండమూరి, యద్దనపూడి తప్ప మరో తెలుగు రచయిత ఉంటారని కూడా తెలీని వాళ్ళున్నచోట పడ్డాను. క్రొత్త జీవితం, క్రొత్త ఊరు, క్రొత్త ఉద్యోగం&#8230; అన్నీ బానే ఉన్నా, ఎక్కడో ఏదో లోటు. అది దేనిగురించో కూడా చాన్నాళ్ళు తెలిసేది కాదు.</p>
<p>అప్పుడప్పుడే వారపత్రికలు ఆన్లైన్ లో వస్తున్నాయి. ఆంధ్రప్రభలో గొల్లపూడి సీరియల్ “సాయంకాలమయింది” కోసం వారం వారం ఎదురుచూస్తున్నప్పుడు, ఏం మిస్ అవుతున్నానూ అన్నది సడెన్ గా అర్ధమయ్యింది. ఇక్కడ అమెరికాలో కూడా లైబ్రరీలు ఉంటాయి, పుస్తకాలు తెచ్చుకుని చదవొచ్చు, అన్న ఆలోచన ఎందుకనో నాకు చాన్నాళ్ళ వరకూ కలగనేలేదు. ఎంతసేపూ తెలుగు పుస్తకాల గురించే బెంగ. అప్పటినుండి ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పుడు, లగేజీలో పొడులూ పచ్చళ్ళ స్థానం పుస్తకాలు ఆక్రమించాయి. ఆన్లైన్లో పుస్తకాలు తెప్పించుకునే అవకాశాలూ, ఆనైన్ మేగజైన్లూ, ఎలెక్ట్రానిక్ పుస్తాకాలూ ఎక్కువవడంతో నాకు పుస్తకాల కొరత కొంతవరకూ తీరింది.</p>
<p>ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాలో పుస్తకాల మీద ఎంత ఆపేక్ష ఉండేదో, పుస్తకాలు నా జీవితంలో ఎలాంటి ముఖ్యభాగమో చెప్పడం కోసం. పుస్తకాల కోసం నాలాంటి కొందరు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవడం కోసమూనూ. బహుశా మీలో ఇక్కడున్న చాలామందికి ఇలాంటి అనుభవమే ఉండొచ్చు.</p>
<p>ఇన్ని రకాలుగా తెలుగు సాహిత్యం, రకరకాల మాధ్యమాల విరివిగా లభ్యం అవుతుంది. ఇలా దొరికిన పుస్తకమల్లా చదువుతున్నప్పటికీ, నాలో ఏదో చిన్న అసంతృప్తి. జాగ్రత్తగా గమనించుకుంటే, నాకు నచ్చుతున్న పుస్తకాల పట్ల నాకు ఒక ఛాయిస్ ఏర్పడటం మొదలయ్యింది. ఇంతకు ముందులా చదివిన ప్రతీదీ నచ్చకపోవడమే కాకుండా, కొన్నిటిని పూర్తిచెయ్యకుండానే వదిలెయ్యటం, కొన్నిటిని అసలే చదవాలనిపించకపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది.</p>
<p>అయితే పుస్తకాల కోసం అంత తపించిపోయి, అక్షరాన్ని అపురూపంగా హత్తుకున్న నేను, చిత్తు కాగితాన్ని కూడా వదలకుండా చదువుకున్న నేను, ఇపుడు ఎంచి ఎంచి చదివే స్థితికి ఎందుకు చేరుకున్నాను? దానికి కారణం నాకు మానసిక పరిపక్వత పెరిగిపోవడమో, లేదా ఇవేవీ రంజింప చెయ్యలేని స్థాయికి నేను బౌద్ధికంగా ఎదిగిపోవడమో ఎంతమాత్రమూ కాదు.</p>
<p>ఆలోచించగా దీనికి నాకు తోచిన కారణాలు మీతో పంచుకుంటాను. ఇవి కేవలం నా అభిప్రాయాలూ, ఆలోచనలూ మాత్రమే. మీరు నాతో ఏకీభవించొచ్చు, లేదా విభేదించనూవచ్చు. మీలో నాలాంటి సామాన్య పాఠకులూ ఉన్నారు, రచయితలూ ఉన్నారు. కొందరికన్నా నా ఆలోచనల్లో సామీప్యం కనిపిస్తుందేమో అనే ఆశ, రచయితలకు చిన్న ఫీడ్ బ్యాక్.</p>
<p>నాకు తోచిన మొట్టమొదటి అతి ముఖ్యకారణం కథల్లో నాణ్యత తగ్గడం. ఒక్కమాటలో చెప్పాలంటే, రాశి ఎక్కువ వాసి తక్కువ. ఇప్పటి కథలను సమాచార సాధనాలూ, సోషల్ మీడియా అతిగా ప్రభావితం చేస్తుండటం దురదృష్టం అనిపిస్తుంది.</p>
<p>instant emotions&#8230; ఏదైనా ఒక సామాజిక విపత్తు జరగగానే, నేనే ముందు స్పందించాలన్న ఆత్రుత తప్ప, జరిగిన సంఘటనలపై గానీ, వాటికి మూలకారణాల పట్ల గానీ రచయితలకు పూర్తి అవగాహన ఉన్నట్టుగా నాకు అనిపించదు. దానితో సమస్య పట్ల రచయితకు సహానుభూతి లోపించి, రచనలో సహజత్వం కనిపించడం లేదనిపిస్తోంది. దీనివల్ల ఆ రచన పాఠకులకు ఏ అనుభూతీ మిగల్చడంలేదు. ఉదాహరణకు రోహిత్ మరణం గురించి వచ్చిన అన్ని రచనల్లోనూ, అట్టాడ అప్పలనాయుడు గారి కథ ‘ఎన్నెలో ఎన్నెలా’ మాత్రమే పూర్తిగా చదివించి, నన్ను కొంచెమైనా ఆలోచింపచేసింది. శ్రీరమణ కథ రాయటం గురించి ఇలా అంటారు. “ఒకసారి కథ మన మనసులోకి వచ్చాకా, దానికి రూపం ఏర్పడ్డాకా, ఇక రాయకుండా ఉండలేని స్థితి ఒకటి వస్తుంది. ఒక బరువులాగా ఉంటుంది లోపల.” అని. అలా తనలో ఒక సంఘర్షణ కలిగే స్థితి వచ్చేవరకూ రచయితలు ఆగి రాస్తే ఎంత బావుంటుంది!!! నిబద్ధత, సహానుభూతి లోపించిన కథలు చదివితేనాకు రుదాలీల ఏడుపు గుర్తొస్తుంది.</p>
<p>instant feedback&#8230; ఒకప్పుడు రచయితలు కథ రాయాలంటే, దాని కోసం ఓపికగా విషయసేకరణ చేసేవారు. ఇప్పుడు దేనిగురించయినా కావాల్సినంత సమాచారం ఇంటర్నెట్ పుణ్యమా అని క్షణాల్లో దొరికేస్తుంది. దానితో ఇన్స్టంట్ గా కథలు తయారయి, మనముందుకి వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల పాఠకుల స్పందన కూడా, అంతే వేగంగా రచయితలకు చేరుతోంది. దీనివల్ల రచయితలు ఇన్స్టంట్ కుకింగ్ నే ఇష్టపడుతున్నారనేది నా అభిప్రాయం. చాసో తన కథలు కొన్ని తనకే నచ్చక వదిలేసి, అవి అంత ప్రచురించాల్సిన కథలేం కావని అన్నారట. ఇపుడు అలా ఆలోచించే వారెవరయినా ఉన్నారా!!!</p>
<p>నాకు తోచిన ఇంకొక కారణం, రచయితలకు తమ సాటి రచయితలతో బయటకి కనబడని పోలికా, పోటీ. ఎవరెన్ని కథలు రాసారూ, ఎవరివి ఎన్ని పుస్తకాలు వచ్చాయీ అనేది రచయిత ప్రతిభకు ఒక కొలమానంగా మారిపోయిందేమో అనిపిస్తుంది. ఈ విషయంలో చాసో, సి. రామచంద్రరావు, అల్లం శేషగిరిరావు, కళ్యాణ సుందరీ జగన్నాధ్ లాంటి కొందరు రచయితల కథలు గుర్తుతెచ్చుకుంటే గంగిగోవుపాలు అనిపిస్తాయి.</p>
<p>రచయితలలో కథను మలిచే నేర్పు, ఓర్పు, ఎడిటింగ్ అనేవి లోపించడం కథలకు నాణ్యత తగ్గడానికి మరొక ముఖ్యకారణం. శ్రీరమణకు కొన్ని కథలు రాయడానికి ఏడాది కాలం పట్టిందట. ఆయన ‘కథను ముందు సన్నివేశాల వారీగా చిన్న కాగితం ముక్కలపై రాసుకుని, వాటిని ఒక పద్ధతిలో పేర్చుకుంటూ, క్రమం మారుస్తూ, అక్కర్లేనివి తీసేస్తూ కథను తయారు చేసుకుంటాను’ అన్నారు. అందుకనే మాలతీ చందూర్ గారు “బంగారు మురుగు” కథ చదివి, ‘మేం కథలు రాసేవాళ్లం కథలు చదివేటప్పుడు ఎక్కడన్నా ఒక వాక్యం తీసేయగలమా అన్న దృష్టితో చదువుతాం. అలా తీసేయగలిగింది ఏం దొరకలేదు నాకు’ అన్నారట. అలానే శ్రీపాద కథలు చాలా పెద్దవయినప్పటికీ, అనవసరమైనది ఒక్క వాక్యమూ కనిపించదు. పూర్తవగానే అపుడే అయిపోయిందా అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు తమ కథలని, కనీసం తమకి సంతృప్తి కలిగేవరకూ అయినా తిరగరాసుకునేవారు ఉన్నారా అని నాకు అనుమానం వస్తుంది. అసలు చేతిరాతతో మాత్రమే కథలు రాయాలీ, తిరగరాయాలీ అన్న నిబంధన గనుక పెడితే, వచ్చేవాటిలో సగం పొల్లు ఎగిరిపోతుంది.</p>
<p>ఇప్పుడు కథావస్తువు గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. కథావస్తువును ఎవరూ నిర్దేశించరు, నిర్దేశించకూడదు కూడా. కానీ వైవిధ్యం ఉండాలని మాత్రం కోరుకుంటాం. కథావస్తువులో వైవిధ్యం ఎక్కువగా లేకపోవడం, సృజనాత్మకత లోపించడం వల్ల చాలా కథలు, వార్తాకథనాలుగానో, ఉపన్యాసాలుగానో అనిపిస్తున్నాయి. ఒకే విషయాన్ని ఎంతమంది అయినా చెప్పొచ్చు, అయితే కథనంలో అయినా కొత్తదనం ఉండాలి కదా. 9/11 సంఘటన ప్రభావాన్ని కొత్త కోణంలో చూపించిన, మూసకు లొంగని ఒక చక్కని కథ కొత్తావకాయ బ్లాగులో వచ్చింది. ఆ కథ పేరు “<span style="color: #ff00ff;"><a href="http://kothavakaya.blogspot.com/2016/02/blog-post.html" target="_blank"><span style="color: #ff00ff;">సుచిత్ర చెప్పిన కథ</span></a></span>”.</p>
<p>కొందరు తమ కథలకు గుర్తింపు తెచ్చుకోడానికి షాక్ వాల్యూస్ ను తోడు తెచ్చుకుంటున్నారు. “జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే, ఆ ఏడురంగుల ఇంద్రధనసుకు ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ?” అని ఎపుడో నా బ్లాగులో రాసుకున్నాను. ఆ కొత్త వర్ణాల గురించి కూడా కథలు చెప్పండి, అయితే నేర్పుగా, ఇంపుగా చెప్పండి. పాఠకులను మెప్పించేలా చెప్పండి. కథావస్తువును ఆమోదించని వాళ్ళచేత కూడా, కథనాన్ని ఇష్టపడి, ఆ పాత్రల సంఘర్షణను అర్ధం చేసుకుని సానుభూతి చూపేలా రాయొచ్చు అనేదానికి ఒక ఉదాహరణ కల్పనా రెంటాల వ్రాసిన “తన్హాయి”.</p>
<p>చాలాసార్లు రచయితలు వారి వాదాలూ, దృక్పథాలను సమర్ధించుకుంటూ, సమస్యలకు పరిష్కారాలు కూడా చెప్పేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన “నా చుట్టూ ఉన్న జీవితాన్ని సాంతంగా పరిశీలించడం, అందులో నన్ను కదిలించినదీ, కరిగించినదీ ఏదైనా ఉంటే రాయడం. అంతవరకే నా విధి. పాఠకుల తెలివితేటల మీద నమ్మకమున్న రచయితలెవరూ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు పరిష్కారమార్గాలకోసం వ్రాయరు. రచయిత తెలివైన పాఠకులు సరిగ్గా ఆలోచించేటట్టు చేయగలడు” అంటారు. ఇప్పటి రచయితలకు పాఠకుల మేధ మీద బొత్తిగా నమ్మకం లేనట్టుంది. పజిల్స్ వాళ్ళే ఇస్తారు, సమాధానమూ వాళ్ళే చెప్పేస్తారు.</p>
<p>రచనల్లో కనిపిస్తున్న వివిధ వాదాలతో నాకు పేచీల్లేవు. వీటిలో నా దృష్టిని ఆకర్షించినది ‘ఫెమినిజం’. అప్పటి వరకు ఫెమినిజం, ఫెమినిస్ట్ అన్న పదాలకు అర్ధం తెలుసుకోవాల్సిన అవసరం రాకుండా పెరిగిన నాకు, దానిగురించి వివరంగా తెలుసుకోవాలనిపించి చదివాను. ఈ మధ్యకాలంలో వస్తున్న కథలు చూస్తే, ఫెమినిజం అంటే పురుష నింద లేదా స్త్రీ విశృంఖల స్వేచ్ఛ అనే భ్రమలో ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. “I am a Happy African Feminist Who Does Not Hate Men” అంటారు చిమామండా అడిచె. ఈ నైజీరియన్ రచయిత్రి వ్రాసిన “A Feminist Manifesto in 15 suggestions”, “We should all be Feminists” పుస్తకాలు ఫెమినిజం మేన్యుయల్స్. అడిచే ఇంగ్లీష్ లోనూ, రంగనాయకమ్మ తెలుగులోనూ ఒకటే చెప్పారు. “స్త్రీ సమస్యల పట్ల స్త్రీకి ఎంత అవగాహన ఉండాలో పురుషుడికీ అవగాహన అంతే ముఖ్యం” అని. దీనికి గొర్తి సాయిబ్రహ్మానందం కథ “అతను” ఒక ఉదాహరణ.</p>
<p>కథాంశాల గురించి మాట్లాడుతూ, డయాస్పోరా గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ప్రవాస రచయితల కథలకూ కేవలం నాస్టాల్జియా, కల్చర్ షాక్, సాంస్కృతిక సంఘాల మీదా, సాటి దేశీయుల మీద విసుర్లూ వంటి విషయాలే ఇప్పటికీ కథావస్తువులు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం సత్యం మందపాటి గారు వ్రాసిన ఎన్నారై కబుర్లు కొత్తగా అమెరికా వచ్చినవారికి సర్వైవల్ మేన్యుయల్స్ గా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అప్పటి నుండీ ఇప్పటి వరకూ, చిట్టెన్ రాజు గారి నుండి ఫణి డొక్కా వరకూ అదే పంధాలో చాలా మంది వ్రాసారు, వ్రాస్తున్నారు. అయితే ప్రవాస జీవితంలోని సంక్లిష్టతలను మాట్లాడిన కథలు నేను చాలా తక్కువగా చూసాను. ఉదాహరణలు చెప్పుకోవాలంటే వేలూరి వెంకటేశ్వరరావు గారి “<span style="color: #ff00ff;"><a href="http://eemaata.com/em/issues/201201/1891.html" target="_blank"><span style="color: #ff00ff;">గోమేజ్ ఎప్పుడొస్తాడో</span></a></span>”, నారాయణస్వామి గారి “<span style="color: #ff00ff;"><a href="http://eemaata.com/em/issues/199909/839.html" target="_blank"><span style="color: #ff00ff;">తుపాకీ</span></a></span>”, గొర్తి సాయిబ్రహ్మానందం గారి “<span style="color: #ff00ff;"><a href="https://kathaalayam.com/2017/02/14/%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B9%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81/comment-page-1/" target="_blank"><span style="color: #ff00ff;">సరిహద్దు</span></a></span>” లాంటివి కొన్నికథలు. పూర్తిస్థాయిలో ప్రవాసజీవిత ప్రస్థానాన్ని చిత్రించిన కథలు, పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఝుంపా లాహిరి “నేమ్ సేక్” తరువాత, రెండేళ్ల క్రితం వచ్చిన సాయిబ్రహ్మానందం గారి “అంతర్జ్వలన” మాత్రమే నా దృష్టిలోకి వచ్చినవి.</p>
<p>ఒక ఇంటర్యూలో ‘మీరు డయాస్పోరా కథలు ఎందుకు రాయరు’ అన్న ప్రశ్నకు , ‘ఇక్కడ అంత జీవనవైవిధ్యం ఉండదు. ఊరికే రికార్డ్ చేయడానికి రాయబుద్ధి కాదు.’ అన్నారు చంద్ర కన్నెగంటి. ఈ మాటతో నేను ఏకీభవిస్తూనే, విభేదిస్తాను. ఎక్కడ ఉన్నా భారతీయులం మూసల్లో ఒదిగి, మన కంఫర్ట్ జోన్ దాటకుండా బ్రతకడానికి ఇష్టపడతాం, కాబట్టి జీవనవైవిధ్యం ఉండని మాట నిజమే. అయితే మన చుట్టూ ఉన్న జీవితాల్లో బోలెడు కథలు కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు ప్రతీవారికీ ఓ గోమేజ్ పరిచయమయే ఉంటాడు. కదిలిస్తే బోలెడు కథలు చెపుతాడు. అవన్నీ రచనల్లో రావాలి.</p>
<p>మీలో చాలామంది అమెరికాలో కనీసం రెండు తరాలను దగ్గరగా చూసి ఉంటారు. జీవితపు సంధ్యలో ఉన్నవారు, ఒంటరిగా మిగిలిపోయినవాళ్లు, శేషజీవితాన్ని గడపడానికి ఎంచుకున్న దారులూ, అందులోని కష్టనష్టాలూ మాట్లాడే కథలు ఎక్కడ? ఒక దరి చేరకుండానే చెదిరిపోయిన జీవితాలూ ఉన్నాయి. వాళ్ళ తరపున కథలు చెప్పే వారేరీ? అతివేగంగా మారుతున్న హార్దిక, ఆర్ధిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటే, మూస ముగింపులేవీ కూడా ఇప్పుడు వాస్తవికమూ కాదు, సార్వజనీనమూ కాదు. కాబట్టి తాము చూస్తున్న వాటి నుండి ఇంకేం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో కూడా చెపితే బావుంటుంది. విన్నకోట రవిశంకర్ గారి “<span style="color: #ff00ff;"><a href="http://vaakili.com/patrika/?p=3232" target="_blank"><span style="color: #ff00ff;">తోడు</span></a></span>” కథ ఈ దిశలో ఒక మంచి ప్రయత్నం అని నేను అనుకున్నాను.</p>
<p>నా చిన్న పరిధిలో చూసిన జీవితాల్లో నాకే ఎన్నో కథలు కంటబడ్డాయి, కలత పెట్టాయి. అయితే వాటి గురించి ఆలోచింపచేసేలా రాసే నైపుణ్యం నాకు లేదు. ఆ భారం దించుకొనేందుకు, మహా అయితే ఒక బ్లాగ్ పోస్ట్ రాసుకోగలుగుతాను. రచయితలైన మీరు, మీ చుట్టూ ఉన్నవాటి నుండే కథలు చెప్పండి. అవి మన కథలే అయ్యుండక్కర్లేదు. ఇలాంటి జీవితాలు కూడా ఉంటాయి అని తెలుసుకోవడం కూడా అవసరమే.</p>
<p>ఇప్పటివరకూ వర్తమాన సాహిత్యం మీద నా అసంతృప్తిని చెప్పాను కదా. ఇపుడు నా ఆకాంక్షలు గురించి కూడా కొంచెం మాట్లాడతాను. ఎప్పుడయితే నాకు తెలుగు సాహిత్యం సెలెక్టివ్ గా చదవడం అలవాటయిందో, సహజంగానే ఇంగ్లీష్ సాహిత్యం వైపు మళ్ళాను. అసంకల్పితంగానే రెండిటినీ పోల్చి చూడటమూ ఒక అలవాటపోయింది. ఇంగ్లీష్ లో వస్తున్న కొన్ని కథాంశాలు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తాయి. తెలుగులో ఇలాంటి అంశంతో వచ్చి ఉంటుందా, ఒకవేళ ఇదే కథను తెలుగులో రాస్తే మన నేటివిటీకి సరిపోయేట్టు ఎలా మారుస్తారు అని ఆలోచిస్తుంటాను. మంచి కథలన్నీ తెలుగులో కూడా అందరికీ అందుబాటులో ఉండేలా వస్తే బావుండని అనిపిస్తుంది. అనువాదాలు చేసేవారు చాలామంది కాఫ్కా, మార్కెజ్, చెహోవ్ లాంటి పాతతరం కథకులకు మాత్రమే పరిమితమవ్వడం గమనిస్తున్నాను. ఇపుడు క్రొత్త కథకులు ఎంతోమంది ఉన్నారు. వైవిధ్యమయిన అంశాలతో మంచి రచనలు చేస్తున్నారు. క్రొత్త కథకుల దృక్పథాన్ని, భావజాలాన్ని కూడా పరిచయం చేస్తే బావుంటుంది. నాకు నచ్చిన కొన్ని కథలను నా బ్లాగు ‘<span style="color: #ff00ff;"><a href="http://padamatikoyila.blogspot.com/" target="_blank"><span style="color: #ff00ff;">పడమటి కోయిల</span></a></span>’ లోనూ, కౌముది మాసపత్రికలో ‘<span style="color: #ff00ff;"><a href="http://koumudi.net/books/KOUMUDI_PUSTAKAM_O_NESTAM.pdf" target="_blank"><span style="color: #ff00ff;">పుస్తకం ఓ నేస్తం</span></a></span>’ అనే శీర్షిక ద్వారానూ పరిచయం చేసాను.</p>
<p>ఇంతకూ నువ్వెన్ని కథలు రాసావేంటి అని అడుగుతారేమో, నేను ఒక్కటి కూడా రాయలేదు. రాతగాళ్ళందరూ రచయితలు కాలేరు. మరి ఒక్క కథ కూడా రాయని, రాయలేని నాలాంటి వాళ్ళకు, ఎలాంటి కథలు రావాలో చెప్పే హక్కు ఉంటుందా అని మీరడగొచ్చు. మీ రచనలనూ, పాత్రలనూ, వారి రాగద్వేషాలను సొంతం చేసుకుని, వాటితో పాటు ఏడ్చీ, నవ్వీ, మిమ్మల్ని బేషరతుగా అభిమానించే మీ పాఠకులం. కాబట్టి మాకా హక్కు ఉంటుందనే అనుకుంటున్నాను. మీరు రచనలు చేసేదీ మాలాంటి పాఠకుల కోసమే. మాకోసమే మేము రాసుకుంటాం అని ఎవరన్నా అంటే నమ్మడానికి I wasn’t born yesterday.</p>
<p>మంచి కథలను వ్రాయగల సత్తా ఉన్నవాళ్ళు కూడా మూసకథలకు పరిమితమవ్వడం బాధాకరమయిన విషయం. ‘ఇలా కూడా ఆలోచించమని నిర్దేశించేదే మంచికథ’ అంటారు జలంధర. అయితే నేను అల్పసంతోషిని. ఒక కథ చదివాక, నా టైం వృధా అనిపించకపోతే చాలు, నేను దాన్ని మంచి కథగానే జమ చేస్తాను. కథలు సమాజానికి సందేశాన్ని ఇచ్చి తీరాలనే భ్రమ నాకు లేదు గానీ, పాఠకునికి కనీసం ఒక మంచి అనుభూతిని మిగల్చాలి. వీలయితే ఉత్తేజితం చెయ్యగలగాలి. అలాంటి కథలు ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను.</p>
<p>గమనిక: నా ప్రసంగంలో ప్రస్తావించిన కథలూ, కథాంశాలూ, రచయితలూ, నేను చదివిన లేదా నా దృష్టికి వచ్చినవాటి నుండి, నా జ్ఞాపకశక్తి మీద ఆధారపడినవి లేదా సమీపకాలంలో చదవటం వల్ల గుర్తున్నవీనూ. ఈ ప్రసంగ వ్యాసం సమగ్రం అని నేను కూడా అనుకోవడం లేదు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>(&#8217;10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు&#8217;లో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం.)</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15487</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>ప్రబంధరసఝరి</title>
		<link>http://vaakili.com/patrika/?p=15179</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15179#comments</comments>
		<pubDate>Sat, 30 Sep 2017 18:17:32 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[రవి E.N.V]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15179</guid>
		<description><![CDATA[<p>నేడు మనకు తెలిసిన తెలుగు పద్యం ఎప్పుడో సహస్రాబ్దాల క్రితం ఊపిరిపోసుకుంది. ఆ పసిబిడ్డకు పాలిచ్చి పెంచిన వారు కొందరు. మాటలు నేర్పిన కవయిత్రులు/కవులు ఇంకొందరు. వస పోసి లాలించి పాలించిన వారు ఇంకా కొందరు. ఆ పద్యానికి తప్పటడుగులు, నడకలు, నడతలు, సుద్దులు, బుద్దులు, వినయం ఒద్దిక, నగవు, పొగరు ఇవన్నీ నేర్పిన వారు ఇంకెంతో మంది. అలా అంతమంది ఆప్తబంధువుల లాలన, పాలనలతో &#8211; ప్రబంధకాలానికి తెలుగుపద్యం అపురూపమైన లావణ్యాన్ని సంతరించుకుని యౌవనవతి అయింది. ఈ అందమైన అమ్మాయికి అలంకారాలు, లయలు, హొయలు, విలాసాలు, ఆట, పాట నేర్పిన కవులు ప్రబంధకవులు. వారిలో అగ్రగణ్యుడు వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు/భట్టుమూర్తి.</p> <p>తెలుగులో కావ్యప్రస్థానం సంస్కృతకావ్యాలకు అనుసృజనగా మొదలైనదని మనకు తెలుసు. అనుసృజనతో మొదలైనప్పటికీ సాధ్యమైనంత వరకు స్వతంత్రమైన రచనాసంవిధానాన్నే మనకవులు అనుసరించారు. ప్రబంధకాలంలో తెలుగు కవిత యొక్క స్వతంత్రత శిఖరాన్ని చేరుకొన్నది. అప్పటి వరకు సంస్కృతం నుంచి తెనుగు అనువాదాలకే తెనుగు రచన పరిమితం కాగా, పదునారవశతాబ్దం తరువాత వసుచరిత్ర మొదటిసారి సంస్కృతంలోనికి వసుచరిత్ర చంపువుగా అనువదింపబడినది. అంతే కాదు, సాధారణంగా ఇతర భాషాకవిత్వాలను అంతగా పట్టించుకొనని తమిళులు వసుచరిత్రను తమ భాషలో అనువదించుకున్నారు. వసుచరిత్రను అనుసరిస్తూ పిల్లవసుచరిత్రలు బయలుదేరినవి. ఈ కావ్యంలోని కొన్ని పద్యాలకు సంగీతబాణీలు కూర్చారు (శిష్టు కృష్ణమూర్తి వంటి) వ్యాఖ్యాతలు. (ఆ వ్యాఖ్యానం అలభ్యం). వీణియపై &#8220;లలనాజ, నాపాంగ, వలదావ, సదనంగ..&#8221; వంటి పద్యాలను పలికించే వారని పెద్దలంటారు. పద్యానికి పట్టం కట్టిన రచన ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో &#8211; తెలుగు పద్యం తాలూకు లావణ్యాన్ని ఎత్తిచూపిన ఒకానొక పద్యం పై వ్యాఖ్యానం ఈ వ్యాసం.</p> <p style="text-align: center;">***</p> <p>అదొక పెద్దకొండ. (పెనుగొండ). ఆ కొండ పేరు కోలాహలుడు. అతడు హిమాలయపర్వతరాజుకు సుతుడు. అంటే జగజ్జనని పార్వతీదేవికి అనుంగు తమ్ముడు. శంకరునికి ముద్దు మఱది. ఆ కోలాహలుడు అధిష్ఠాన నగరం దాపుల నున్నాడు. ఆ నగరాన్ని చుడుతూ, [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">నే</span>డు మనకు తెలిసిన తెలుగు పద్యం ఎప్పుడో సహస్రాబ్దాల క్రితం ఊపిరిపోసుకుంది. ఆ పసిబిడ్డకు పాలిచ్చి పెంచిన వారు కొందరు. మాటలు నేర్పిన కవయిత్రులు/కవులు ఇంకొందరు. వస పోసి లాలించి పాలించిన వారు ఇంకా కొందరు. ఆ పద్యానికి తప్పటడుగులు, నడకలు, నడతలు, సుద్దులు, బుద్దులు, వినయం ఒద్దిక, నగవు, పొగరు ఇవన్నీ నేర్పిన వారు ఇంకెంతో మంది. అలా అంతమంది ఆప్తబంధువుల లాలన, పాలనలతో &#8211; ప్రబంధకాలానికి తెలుగుపద్యం అపురూపమైన లావణ్యాన్ని సంతరించుకుని యౌవనవతి అయింది. ఈ అందమైన అమ్మాయికి అలంకారాలు, లయలు, హొయలు, విలాసాలు, ఆట, పాట నేర్పిన కవులు ప్రబంధకవులు. వారిలో అగ్రగణ్యుడు వసుచరిత్రకారుడైన రామరాజభూషణుడు/భట్టుమూర్తి.</p>
<p>తెలుగులో కావ్యప్రస్థానం సంస్కృతకావ్యాలకు అనుసృజనగా మొదలైనదని మనకు తెలుసు. అనుసృజనతో మొదలైనప్పటికీ సాధ్యమైనంత వరకు స్వతంత్రమైన రచనాసంవిధానాన్నే మనకవులు అనుసరించారు. ప్రబంధకాలంలో తెలుగు కవిత యొక్క స్వతంత్రత శిఖరాన్ని చేరుకొన్నది. అప్పటి వరకు సంస్కృతం నుంచి తెనుగు అనువాదాలకే తెనుగు రచన పరిమితం కాగా, పదునారవశతాబ్దం తరువాత వసుచరిత్ర మొదటిసారి సంస్కృతంలోనికి వసుచరిత్ర చంపువుగా అనువదింపబడినది. అంతే కాదు, సాధారణంగా ఇతర భాషాకవిత్వాలను అంతగా పట్టించుకొనని తమిళులు వసుచరిత్రను తమ భాషలో అనువదించుకున్నారు. వసుచరిత్రను అనుసరిస్తూ పిల్లవసుచరిత్రలు బయలుదేరినవి. ఈ కావ్యంలోని కొన్ని పద్యాలకు సంగీతబాణీలు కూర్చారు (శిష్టు కృష్ణమూర్తి వంటి) వ్యాఖ్యాతలు. (ఆ వ్యాఖ్యానం అలభ్యం). వీణియపై &#8220;లలనాజ, నాపాంగ, వలదావ, సదనంగ..&#8221; వంటి పద్యాలను పలికించే వారని పెద్దలంటారు. పద్యానికి పట్టం కట్టిన రచన ఈ ప్రబంధం. ఈ ప్రబంధంలో &#8211; తెలుగు పద్యం తాలూకు లావణ్యాన్ని ఎత్తిచూపిన ఒకానొక పద్యం పై వ్యాఖ్యానం ఈ వ్యాసం.</p>
<p style="text-align: center;">***</p>
<p>అదొక పెద్దకొండ. (పెనుగొండ). ఆ కొండ పేరు కోలాహలుడు. అతడు హిమాలయపర్వతరాజుకు సుతుడు. అంటే జగజ్జనని పార్వతీదేవికి అనుంగు తమ్ముడు. శంకరునికి ముద్దు మఱది. ఆ కోలాహలుడు అధిష్ఠాన నగరం దాపుల నున్నాడు. ఆ నగరాన్ని చుడుతూ, కొండచరియలో ఒద్దికగా, నిర్మలంగా, అమాయకంగా ఓ వాగు ప్రవహిస్తోంది. ఆ వాగు పేరు శుక్తిమతి. (ముత్యాలవాగు) ఆ శుక్తిమతిని కోలాహలుడు మోహించాడు. ఆమె ప్రవాహపు దారిని అడ్డగించినాడు. ఆ కన్నె అతణ్ణి వినయంగా ప్రార్థించి, అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి, అడ్డు తొలగుమని వేడింది. కోలాహలుడు వినిపించుకొనలేదు. అతడు మోహపరవశుడై శుక్తిమతి చీరె కొంగు పట్టుకున్నాడు.</p>
<p>అప్పుడు&#8230;&#8230;</p>
<blockquote><p>ఉ||<br />
వేణి చలింపఁ గంపితనవీనమృణాళభుజాగ్రకంకణ<br />
శ్రేణి నటింప లోలశఫరీనిబిరీశకటాక్షకాంతి వి<br />
న్నాణము చూప హంసకగణక్వణనంబులు మీఱ సైకత<br />
శ్రోణి వివర్తితాబ్జముఖశోభితయై కడు సంభ్రమించినన్.</p></blockquote>
<p>వేణి = నీటిపాయ/అల్లిన జడ<br />
చలింపన్ = కదులాడగా<br />
కంపిత నవీన మృణాళ భుజాగ్ర కంకణశ్రేణి<br />
కంపిత = చలించిన<br />
నవీన = క్రొత్తదైన<br />
మృణాళ = తామరతూండ్ల<br />
భుజాగ్ర = బాహువుల కొనలందు<br />
కంకణ = జలబిందువుల/హస్తాభరణముల<br />
శ్రేణి = వరుస<br />
నటింప = నటనము చేయగా<br />
లోల శఫరీ నిబిరీశ కటాక్షకాంతి<br />
లోల = కదలుచున్న<br />
శఫరీ = బేడిసమీనుల (Silver fish)<br />
నిబిరీస = నిబిడమైన<br />
కటాక్ష = క్రీగంటి చూపుల<br />
కాంతి = ప్రకాశము<br />
విన్నాణము చూప = తెలియరాగా<br />
హంసకగణక్వణనంబులు<br />
హంసకగణ = హంసలగుంపు యొక్క/కాళ్ళ అందియల<br />
క్వణనంబులు = కలకలము<br />
మీఱ = హెచ్చవగా<br />
సైకతశ్రోణి = ఇసుకతిన్నెలు/ఇసుకతిన్నెలవంటి జఘనభాగము గల్గిన శుక్తిమతి<br />
వివర్తితాబ్జముఖశోభితయై<br />
వివర్తిత = ప్రక్కకు త్రిప్పుకొనిన<br />
అబ్జముఖ = కమలములతో/కమలము వంటి ముఖముతో<br />
శోభితయై = అలంకరింపబడినదై<br />
కడు = మిక్కిలి<br />
సంభ్రమించినన్ = తొందరపాటు పడెను.</p>
<p>ఈ పద్యానికి నదీపరంగా, కన్య పరంగా రెండు అర్థాలు. దీనికి శేషాద్రి రమణ కవుల తాత్పర్యం ఇలా ఉంది.</p>
<p>కోలాహలపర్వతము నదినడ్డగించుటచే నీటిపాయ చెదరెననియుఁ దామరతూండ్లు కలఁగెననియు, జలకణములు చిందెననియు, బేడిసమీ లెగిరి పడెననియు, హంసలు ధ్వని చేసెననియు, తామరపూలు కలతనొందెననియు (నదీపరమైన భావము)</p>
<p>శుక్తిమతి కొంగు కోలాహలుడు పట్టుకొన జడ కదలెననియు, భుజములు వణకుటచే కంకణములు మ్రోగెననియు ఓరకంటి చూపులొప్పారెననియు, కాలియందెలు మ్రోగెననియు, తొట్రుపాటుచేత మోము త్రిప్పుకొనెననియు (పడతి పరముగా నన్వయము).</p>
<p style="text-align: center;">***</p>
<p>ఈ అపూర్వమైన పద్యంలో ఎన్నో విశేషాలు. ఒక్కొక్కటీ వివరంగా చర్చించుకోవాలి.</p>
<p>1.<br />
శఫరమంటే బేడిసమీను. Silver fish. దీనిని చంచలమైన కనులకు ఉపమానంగా సూచించటం తెనుగు కవిత్వ సాంప్రదాయం.</p>
<p>&#8220;కంపితనవీనమృణాళభుజాగ్రకంకణశ్రేణి, లోలశఫరీనిబిరీశకటాక్షకాంతి, హంసకగణక్వణనంబులు, వివర్తితాబ్జముఖశోభిత&#8221; ఇత్యాది శబ్దాలు రూపకములు. ఈ రూపకములన్నీ నది/యువతి యొక్క శరీరవిన్యాసములలో పరిణమిస్తున్నాయి. అందువలన ఇవి ఏకదేశవివర్తి రూపకములు. వేణి, కంకణ, హంసక, అబ్జముఖ వంటి శబ్దములు &#8211; శ్లిష్టములు. శ్లేషార్థకములు. అంటే అర్థద్వయం కలిగినవి.</p>
<p>ఈ రూపకములు నదిని వర్ణిస్తూ, యువతి యొక్క సంభ్రమములలో పర్యవసిస్తున్నవి. అంటే కవి &#8211; నదిపై యువతిని superimpose (ఆరోపితం) చేశాడు. ఇది చాలా చాలా అరుదైన, అద్భుతమైన ప్రక్రియ. ఈ విధమైన superimpose అన్న ’కళ’ సాహిత్యం ద్వారా మాత్రమే సాధింపగల ప్రక్రియ అని, ఇటువంటి ప్రయత్నాన్ని ’చిత్రం’ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తే విఫలం కావచ్చుననీ అంటారు శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు.</p>
<p>2. &#8220;వేణి చలింపఁ&#8230;&#8221; పద్యానికి వావిళ్ళవారి వ్యాఖ్యానప్రతిలో ముందుమాట వ్రాస్తూ, శ్రీ నిడుదవోలు వెంకటరావు గారు ఈ మాట అంటారు. &#8220;కవి, చిత్రకారునికన్నా మిన్న యని రామరాజభూషణుడు మహాసమర్థతతో నిరూపించినాఁడు. ఈ పద్యమున శుక్తిమతీనది స్త్రీవలె సంభ్రమముతో వచ్చునట్టు నద్భుతభంగిని చెప్పినాఁడు. దీనిని రవివర్మ గంగావతరణముతో పోల్చిన చిత్రకారుడెట్ల కృతార్థుడు కాలేకపోయెనో తెలియవచ్చును.</p>
<p>పద్యమున శ్లేషచేత మనకు స్త్రీ మనోనేత్రములకు అగుపడుచున్నది. ప్రకృతిలో కన్నులకగుపడునది నదియే. రవివర్మ ఆకాశగంగ యవతరించుట చిత్రించఁబోయి గంగ వచ్చునట్లు కొన్ని గీతల మూలమునఁ దెలిపి, యా వెనుక వాని మధ్య నొక స్త్రీమూర్తిని లిఖించినాడు. దీనివలన ఆతని ఆశయము భగ్నమైనది&#8230;&#8221;</p>
<p>స్థూలంగా వారి తాత్పర్యమేమిటంటే, ఈ పద్యం చిత్తరువుకన్నా మరింత సమర్థమైనది. చిత్రంకన్నా సమర్థవంతంగా ఈ పద్యం నదిని యువతిగా మనోనేత్రం నుందు నిలుపుతోంది. వేంకటరావు గారు ప్రస్తావించిన రవి వర్మ చిత్రించిన ఆ గంగావతరణ చిత్రము యిదీ.<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/prabhandha_ravi_env.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/prabhandha_ravi_env.jpg" alt="" title="prabhandha_ravi_env" width="466" height="640" class="aligncenter size-full wp-image-15184" /></a><br />
3. శ్రీ నిడుదవోలు వారి వ్యాఖ్యను అనుసరిస్తూ ఆలోచిస్తే, ఈ పద్యం ఒక చిత్తరువు కాదనీ, ఇదొక చలనచిత్రము (Multimedia) తరహా పద్యమని మనకు తెలియవస్తుంది. ఈ విధమైన చలనచిత్ర ప్రక్రియకు దోహదం చేస్తున్నవి ఈ పద్యంలోని క్రియాపదాలు. వీటిని కవి ఎంతో నేర్పుతో, తెనుగులో కూర్చాడు. &#8220;చలింపన్, నటింప, విన్నాణము సూప, మీఱన్, కడు సంభ్రమించినన్.&#8221; ఈ తెనుగు క్రియలన్నిటినీ ప్రకృతంలో జరుగుతున్నట్టుగా కల్పించడంతో ఈ పద్యం ఒక చలనచిత్రాన్ని రూపుకట్టిస్తోంది. ఇటువంటి ప్రక్రియలు సంస్కృతసాహిత్యంలో అరుదు. సంస్కృతంలో పదచిత్రాలే ఎక్కువ. తెనుగు సాహిత్యంలో ఇటువంటి ’చలన’చిత్రాల ఒరవడిని ఎత్తుకు తీసుకు వెళ్ళిన కవి, ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన అని చెప్పుకోవాలి.</p>
<p>సంస్కృతంలో శ్లోకాన్ని ఒక వాక్యరూపంలో నిమంత్రించి, క్రియ (ధాతువు)తో ముగించటం సాంప్రదాయంగా వస్తోంది. బహుశా అందుకనే సంస్కృత సాహిత్యంలో పదచిత్రాలే ఎక్కువగా కనిపిస్తాయి. వసుచరిత్ర కావ్యాన్ని, అప్పయ్యదీక్షితపండితుని శిష్యుడైన కాళహస్తి కవి సంస్కృతంలో పరివర్తించినాడు. ఆ కావ్యంలో &#8220;వేణి చలింపఁ..&#8221; పద్యానికి సంస్కృతంలో అనువాదం యిది.</p>
<blockquote><p>వేణీ చచాల బిసవద్భుజకంకణానాం<br />
శ్రేణీ ననర్త విబభుశ్శఫరీకటాక్షాః<br />
నాణీయసీ పరిరరాణ చ హంసకాలీ<br />
శ్రేణీలసత్పులినసాచితమబ్జవక్త్రమ్ || (178)</p></blockquote>
<p>చచాల = చలించెను.<br />
ననర్త = నర్తించెను<br />
విబభుః = ప్రకాశించెను<br />
పరిరరాణ = రవములు సలిపెను.</p>
<p>ఇవన్నీ స్థిరమైన ధాతు రూపాలు. శ్లోకం ఆఖరు పాదంలో మాత్రం &#8220;లసత్&#8221; అన్న ధాతురూపం &#8220;సంభ్రమించినన్&#8221; అన్న అర్థంలో ముగుస్తోంది.</p>
<p>తెలుగులో &#8220;చలింపన్, నటింప..&#8221; ధాతురూపాలు సంస్కృతములో పరివర్తితమయ్యే సరికి సంస్కృతశ్లోకం పదచిత్రాల సముదాయంగా మారటం స్పష్టంగా పైని శ్లోకంలో గమనింపవచ్చు.</p>
<p>4. వేణి చలింపఁ &#8211; మన పద్యంలో శబ్ద గుణాల గురించి కూడా చెప్పుకోవాలి. పద్యాన్ని ఎడమచేతితో ఆడించేంత నైపుణ్యం గల ఒక గొప్ప కవి వ్రాసిన పద్యం యిది.అందుకనే గణయతి ప్రాసలు, తమంతట తాము అమరిపోయినట్టుగా అనాయాసంగా సమకూరటం పద్యంలో గమనించవచ్చు. అంతే కాదు, పద్యం చదువుకుంటూ వెళుతుంటే, అదే క్రమంలో అర్థమూ కుదురుతూ పోతోంది. ఇలా పద్యపు వరుసలో అర్థము సమకూరటాన్ని &#8220;రీతి&#8221; అని నిర్వచించినారు ఆలంకారికులు. &#8220;యథార్థక్రమ నిర్వహణం రీతిరిత్యభిదీయతే&#8221;. ఇటువంటి పద్యాలు వసుచరిత్రలో కొల్లలుగా కనిపిస్తాయి.</p>
<p>ఈ పద్యంలో &#8211; నాయిక శుక్తిమతి (నది) విభ్రమం కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్ళటం స్పష్టంగా ప్రతీయమానం అవుతోంది.</p>
<p>మొదట ఆ యువతి<br />
౧. వేణి (జడ) చలించింది<br />
౨. అటుపై తామరతూడువంటి భుజాగ్రం నటించింది.<br />
౩. పిమ్మట మీలవంటి క్రీగంటి చూపు ప్రకాశం దాల్చింది<br />
౪. తదనంతరం కాలియందల రవములు మీఱినవి.<br />
౫. ముఖం శోభించింది.</p>
<p>చలించి, నటించి, విన్నాణము చూపి, మీఱి, &#8211; చివరన ’కడు సంభ్రమించినది’. ఈ ఎత్తుగడ కవి వివక్షితమో, అవివక్షితమో తెలియదు కానీ, నిష్ణాతుడైన కావ్యకర్త యొక్క పద్యశిల్పంగా యిది తోస్తున్నది.</p>
<p>5. ఇందాక సంస్కృతకావ్యాలలో పదచిత్రాల గురించి చెప్పుకున్నాం. సంస్కృతంలో సాధారణంగా పదచిత్రాల సాంప్రదాయం ఎక్కువ. అయితే ’చలనచిత్ర’ రూపాలు కూడా సంస్కృతంలో అక్కడక్కడా లేకపోలేదు. అమరుశతకంలో ఈ క్రింది శ్లోకం చూడండి.</p>
<blockquote><p>ఆలోలా మలకావళిం విలుళితాం భిభ్రచ్చలత్కుండలం<br />
కిఞ్చిన్మృష్ట విశేషకం తనుతరైః స్వేదామ్భసాం జాలకైః |<br />
తన్వ్యా యత్సురతాన్త తాన్తనయనం వక్త్రం రతివ్యత్యయే<br />
తత్త్వాం పాతు చిరాయ కిం హరిహర బ్రహ్మాదిభి ర్దైవతైః ||</p></blockquote>
<p>పురుషాయిత కేళిలో యే తన్వి యొక్క ముఖము పై ముంగురులు చలించి, చెదరిన వరుసను తాల్చి, చెవిపోగులు ఊగి ,సూక్ష్మములైన చెమటబొట్టులచేత నుదుటి బొట్టు కొంచెం చెరగి, కనులు అలసియుండుట గలదో, అట్టి సుందరముఖము నిన్ను రక్షించుగాక. హరిహరబ్రహ్మాది దేవులచేత ప్రయోజనమేమి?</p>
<p>భట్టుమూర్తి కవి &#8211; తన యొక్క నరసభూపాలీయ కావ్యారంభంలో, తనను తాను అమరేశ్వరుని యొక్క సమస్రముఖదృష్టి గలవాడని చెప్పుకొన్నాడు.</p>
<blockquote><p>&#8220;బాణు వేగంబును, భవభూతి సుకుమార<br />
తయు, మాఘు శైత్యంబు, దండిసమత,<br />
&#8230;&#8230;.<br />
&#8230;..<br />
యమరేశ్వరుని సహస్రముఖదృష్టి&#8221;</p></blockquote>
<p>ఇక్కడా మూర్తి కవి శ్లేషనుపయోగించాడు. అమరేశ్వరుని సహస్రముఖదృష్టి ఇంద్రుని వేయికనులచూపు అని, అమరుకవి యొక్క బహుముఖీన ప్రజ్ఞ అని అర్థాలు. అమరుకవిని వసుచరిత్రకారుడు ప్రస్తావించాడు కాబట్టి, ఆయన శ్లోకం ద్వారా కొంత ప్రేరణ గొని ఉన్నాడని ఊహించటం అర్థరహితం కాబోదు. అయితే మన తెనుగు కవి యువతి యొక్క సంభ్రమాలను చిత్రిస్తూ, నదిపై యువతిని ఆరోపం చేశాడు. అచేతనమైన నదిని, పర్వతాన్ని నాయికానాయకులుగా తీర్చటం తెలుగులోభట్టుమూర్తి కవియే మొట్టమొదటగా చేశాడు.</p>
<p>6. నాయికానాయకులను స్త్రీ పురుషులుగా కల్పించుట &#8211; కాళిదాసు ప్రేరణ అని శ్రీ కొరిడె రాజన్నశాస్త్రి పండితులు ఓ వ్యాసంలో పేర్కొన్నారు.శ్రీ రాజన్న శాస్త్రి పండితుడు పేర్కొన్న కాళిదాసు శ్లోకం యిది.</p>
<blockquote><p>వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాఞ్చీగుణాయాః<br />
సంసర్పన్య్తాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః |<br />
నిర్విన్య్ధాయాః పథి భవ రసాభ్యన్తరః సన్నిపత్య<br />
స్త్రీణా మాద్యం ప్రణయ వచనం విభ్రమో హి ప్రియేషు || (మేఘదూతమ్ 1.29)</p></blockquote>
<p>ఉజ్జయినికి తూర్పు దిశలో వెళ్ళుమని యక్షుడు మేఘునితో చెబుతూ, దారిలో నిర్వింధ్య నదిని చూచి, దానితో సంభోగించుమని చెపుతున్నాడు.</p>
<p>ఓ మేఘుడా! నిర్వింధ్య నది నిన్ను వలచిన నాయికగా నీకడకు వచ్చును. అలలచలనము చేత కదిలింపబడిన పక్షుల కూజితములే &#8211; ఆ నది (యువతి) మొలనూలి శబ్దములు. ఆ (నది) సుడిగుండములే నాభి. మేఘుడా! ఆమెతో కూడి నీవు ఆ రసములను గ్రహింపుము. ఆమె వలచుటకు మునుపే కూడుట యెట్లు అన్న సందేహము వలదు. ఎందుకంటే, స్త్రీలు తమ వివిధములైన విలాసములతో ప్రణయమును ప్రకటింతురు. కావును ఆమెకు ప్రియుడవు కమ్ము.</p>
<p>కాళిదాసమహాకవి అమోఘమైన శ్లోకం యిది. ఈ శ్లోకంలోని సంభోగశృంగారపు ఘాటును తెనుగు కవి తగ్గించుకొన్నాడు. వసుచరిత్ర &#8211; సన్నివేశపరంగా అనిష్టురాలైన నాయికపై, మోహపరవశుడైన నాయకుని ధాష్టీకం. అయినప్పటికీ, కవి అందులో ఔచిత్యాన్ని పద్యపు ఎత్తుగడ ద్వారా పరిహరించినాడు. కాళిదాసు మేఘదూత శ్లోకంలో సన్నివేశం ప్రణయబద్ధమైనా శ్లోకంలో ఘాటైన శబ్దాల తీరు వలన కొంత ’అరుచి’ కలిగించే అవకాశం ఉంది.</p>
<p>7. వస్తుపరంగా ఈ పద్యం కాళిదాసును అనుకరించినది అని రాజన్నశాస్త్రి గారన్నారు. వసుచరిత్రపై కూలంకషమైన వ్యాసం వ్రాసిన వజ్ఝల చినసీతారామశాస్త్రి గారు &#8220;వేణి చలింపఁ..&#8221; పద్యశైలి సంస్కృతకవి శ్రీహర్షుని శైలిని పోలినదని అభిప్రాయపడ్డారు. శాస్త్రి గారి వ్యాఖ్య యిది.</p>
<p>&#8220;నియతములగు యతిప్రాసములను మాత్రము నిలిపియు, నతిమనోహరమగు తూఁగు వెలయునట్లు పద్యముల నడిపించు నేర్పు రామరాజభూషణునకే గలదని చెప్పవచ్చును.</p>
<blockquote><p>శ్లో. వాచం తదీయాం పరిపీయ మృద్వీం మృద్వీకయా తుల్యరసాం స హంసః|<br />
తత్యాజ తోషం పరపుష్టఘోషే (ఘుష్టే) ఘృణాం చ వీణాక్వణితే వితేనే ||</p></blockquote>
<p>యని యిట్లు నైషధకావ్యమున శ్రీహర్షుఁ డానుషంగికానుప్రాసములతోఁ దాండవమాడి యున్నాఁడు. అట్టి రీతులు శ్రీనాథుని యాంధ్రీకరణమున నంతగా నగపడవు. రామరాజభూషణునకుఁ గల శ్రీహర్షుని కవితామార్గముల ననుసరించుటయందలి యభిరుచి యీ విషయమునను జూపఁబడినదని తోఁచుచున్నది.</p>
<p>ఇట్లె యర్థాంతరస్ఫోరకముగఁ గవిత్వము చెప్పు నభిరుచియు శ్రీహర్ష మార్గానుసరణ లోలుపత్వమును వెల్లడి సేయుచున్నది.&#8221;</p>
<p>శాస్త్రి గారు ఉటంకించిన &#8220;వాచం తదీయాం..&#8221; శ్లోకార్థం యిది.</p>
<p>&#8220;ఆ హంస ద్రాక్షతో సమానమైన రుచి గల దమయంతీదేవి పలుకులను మిక్కిలి శ్రద్ధతో నాలకించి, కోకిలకూజితము పై సంతోషమును త్యజించినది. వీణానాదమందు విరక్తి పొందినది. అనగా ఆ దమయంతి పలుకులు ద్రాక్షరసము కన్నా, కోకిల కూజితములకన్నా, వీణానాదముకన్నా మధురముగానున్నవని యర్థము&#8221; &#8211; (నైషధీయచరితమ్ &#8211; 3.60)</p>
<p>వజ్ఝల వారు శ్రీహర్షుని పోలిక చెప్పినా, రాజన్నశాస్త్రి గారు కాళిదాసును అనుకరించినట్లు చెప్పినా, ప్రస్తుత వ్యాసకర్తకు (నాకు) అమరుకుని శ్లోకం స్ఫురణకు వచ్చినా, ఇవన్నీ భట్టుమూర్తి పద్యానికి గల విభిన్న పార్శ్వాలను సూచిస్తాయనటం న్యాయం.</p>
<p>ఏతావతా, రామరాజభూషణకవి మార్గం స్వతంత్రమైనది, సంస్కృతకవిత్వరీతులకు ధీటైనదని ఒప్పుకోక తప్పదు.</p>
<p style="text-align: center;">***</p>
<p>అట్లు సంభ్రమించిన ఆ నదిపై పర్వతానికి గల అతిశయగుణంతో కోలాహలుడు కోపముతో ముఖము జేవురింపగా ఆమెను బలవంతంగా పరిగ్రహించాడు. అది రసాభాసమని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.</p>
<p>ఈ వసుచరిత్ర కావ్యం &#8211; ప్రబంధకాలంలో పుట్టినది. ప్రబంధకవులకు కథ చెప్పటం కన్నా, వర్ణనలమీద, వ్యాకరణ, జ్యోతిష్య, సంగీత, నాట్యాది శాస్త్ర విషయాలపైన,భాషపైన, అలంకారాలపైన, ఆలంకారిక పద్ధతులపైన గురి. ఈ కాలంలో కథకన్నా, పద్యం రాణకెక్కింది. అందుచేత ఆ దృష్టిలో చదువుకుంటేనే ఉత్తమం.</p>
<p>ఇరవై ఒకటవ శతాబ్దంలో అల్పమైన వ్యుత్పత్తి కలిగి, మూడు నాలుగు వ్యాసాలు చదివిన ఒక సాధారణ పాఠకుడికే విషయాలు తెలిస్తే, నాటియుగంలో సంగీతసాహిత్యాలను మథించిన ఎందరు రసికులను ఈ కావ్యం ఉర్రూతలూగించిందో!</p>
<p>&#8220;మూర్తికవీ, ధన్యుఁడవీ వన్నిటన్.&#8221;</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15179</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>మాయా &#8220;క్లాసిక్&#8221;!</title>
		<link>http://vaakili.com/patrika/?p=14743</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14743#comments</comments>
		<pubDate>Tue, 01 Aug 2017 18:40:56 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[సాయి బ్రహ్మానందం గొర్తి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14743</guid>
		<description><![CDATA[<p>నేటి మానవ జీవితంలో సినిమా ఒక విడదీయరాని అంతర్భాగం. ఒక దృశ్యం వేయి మాటలకి సమానం అంటారు. సాంకేతిక ప్రగతి అభివృద్ధితో పాటు సినిమా రంగం కూడా పెరిగింది. పలు అంశాలతో కొన్ని వేల సినిమాలు వచ్చుంటాయి ఇప్పటి వరకూ. మిగతా భాషలు మినహాయించి ఒక్క తెలుగులోనే పదివేల పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్ని సినిమాలు గొప్పవి? ఆ సినిమాలు ఎన్ని తరాలకు గుర్తుంటాయి? ఇలాంటి సమాధానం చెప్పాలంటే ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. మంచివి ఎంపిక చెయ్యాలి.</p> <p>ఎన్నో సినిమాలు వచ్చినా వాటిలో కొన్ని సినిమాలే కాలానికి నిలబడతాయి. కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. సినిమా అనేది సామూహిక సృజన. దర్శకుడూ, రచయితా, నటులూ, ఫొటోగ్రాఫరూ, సంగీతమూ, ఆహార్యమూ వంటివే కాకుండా ఇంకా ఎన్నో విభాగాలు కలిస్తేనే ఒక సినిమా తయారవుతుంది. ఇవన్నీ సమపాళ్ళల్లో కుదిరితేనే ఆ సినిమా అందరినీ అలరిస్తుంది. అన్ని వంటకాలూ అద్భుతంగా కుదిరి గుర్తుండే విందు భోజనం లాంటిదే సినిమా కూడా. అన్నీ సమపాళ్ళల్లో కుదిరిన సినిమాలు అరుదుగా వస్తాయి. అవే కాలానికి నిలబడతాయి. వాటినే సినిమా పరిభాషలో క్లాసిక్స్ అంటారు.</p> <p>అసలు క్లాసిక్స్ అంటే ఏవిటి? ఏ సినిమాలని క్లాసిక్స్ అంటారు? వాటిలో ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? ఎక్కువ కాలం నడిచిన సినిమానా? ఎక్కువ ప్రజాదరణ పొందిన సినిమానా? ఎక్కువ డబ్బులు గడించిన సినిమానా? ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతాయి. ప్రజాదరణ పొందిన ప్రతీ సినిమా గొప్ప సినిమా కానేరదు. అలాగే సినిమాలో చాలా అంశాలు అద్భుతంగా ఉన్నా ప్రజాదరణ లేకపోవచ్చు. కొన్ని సినిమాల్లో అన్ని అంశాలూ కుదరకపోయినా విశేషమైన డబ్బు సంపాదిచవచ్చు. ప్రేక్షకుల ఆదరణా, అభిరుచీ ఒక్కోసారి ఊహకు అందవు.</p> <p>డెబ్బయ్యేళ్ళ పైబడిన తెలుగు సినిమా చరిత్రలో పాతిక అత్యుత్తమ చిత్రాలు ఎంపిక చేయడం సాహసంతో కూడిన పని. అంతే కాదు వాటి స్థానం ఎంపిక చెయ్యడం ఇంకాస్త కష్టమైన విషయం. అసలు [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">నే</span>టి మానవ జీవితంలో సినిమా ఒక విడదీయరాని అంతర్భాగం. ఒక దృశ్యం వేయి మాటలకి సమానం అంటారు. సాంకేతిక ప్రగతి అభివృద్ధితో పాటు సినిమా రంగం కూడా పెరిగింది. పలు అంశాలతో కొన్ని వేల సినిమాలు వచ్చుంటాయి ఇప్పటి వరకూ. మిగతా భాషలు మినహాయించి ఒక్క తెలుగులోనే పదివేల పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్ని సినిమాలు గొప్పవి? ఆ సినిమాలు ఎన్ని తరాలకు గుర్తుంటాయి? ఇలాంటి సమాధానం చెప్పాలంటే ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. మంచివి ఎంపిక చెయ్యాలి.</p>
<p>ఎన్నో సినిమాలు వచ్చినా వాటిలో కొన్ని సినిమాలే కాలానికి నిలబడతాయి. కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. సినిమా అనేది సామూహిక సృజన. దర్శకుడూ, రచయితా, నటులూ, ఫొటోగ్రాఫరూ, సంగీతమూ, ఆహార్యమూ వంటివే కాకుండా ఇంకా ఎన్నో విభాగాలు కలిస్తేనే ఒక సినిమా తయారవుతుంది. ఇవన్నీ సమపాళ్ళల్లో కుదిరితేనే ఆ సినిమా అందరినీ అలరిస్తుంది. అన్ని వంటకాలూ అద్భుతంగా కుదిరి గుర్తుండే విందు భోజనం లాంటిదే సినిమా కూడా. అన్నీ సమపాళ్ళల్లో కుదిరిన సినిమాలు అరుదుగా వస్తాయి. అవే కాలానికి నిలబడతాయి. వాటినే సినిమా పరిభాషలో క్లాసిక్స్ అంటారు.</p>
<p>అసలు క్లాసిక్స్ అంటే ఏవిటి? ఏ సినిమాలని క్లాసిక్స్ అంటారు? వాటిలో ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? ఎక్కువ కాలం నడిచిన సినిమానా? ఎక్కువ ప్రజాదరణ పొందిన సినిమానా? ఎక్కువ డబ్బులు గడించిన సినిమానా? ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతాయి. ప్రజాదరణ పొందిన ప్రతీ సినిమా గొప్ప సినిమా కానేరదు. అలాగే సినిమాలో చాలా అంశాలు అద్భుతంగా ఉన్నా ప్రజాదరణ లేకపోవచ్చు. కొన్ని సినిమాల్లో అన్ని అంశాలూ కుదరకపోయినా విశేషమైన డబ్బు సంపాదిచవచ్చు. ప్రేక్షకుల ఆదరణా, అభిరుచీ ఒక్కోసారి ఊహకు అందవు.</p>
<p>డెబ్బయ్యేళ్ళ పైబడిన తెలుగు సినిమా చరిత్రలో పాతిక అత్యుత్తమ చిత్రాలు ఎంపిక చేయడం సాహసంతో కూడిన పని. అంతే కాదు వాటి స్థానం ఎంపిక చెయ్యడం ఇంకాస్త కష్టమైన విషయం. అసలు అత్యుతమ చిత్రం అంటే ఏది? కొలమానాలు ఏవిటి? వీటినే ఇంగ్లీషులో క్లాసిక్స్ అంటారు. మనకి ఇలాంటి విషయాలమెద ఆసక్తీ, శ్రద్ధా తక్కువ.</p>
<p>ఏ సినిమానయినా క్లాసిక్ అనడానికి ముఖ్యమైన అంశం &#8220;కాలానికి నిలబడడం&#8221;. అంటే కొన్ని తరాలని ఆ సినిమా రంజింపచేయడం. అలాగే ఎన్ని సార్లు చూసినా విసుగు కలగకపోవడం. అత్యున్నత సాంకేతిక విలువలూ, నటీ నటుల అద్భుతమైన నటనా, బిగువైన కథాకథనం (స్క్రీన్‌ప్లే), ఇంకా ప్రేక్షకులని చివరివరకూ కట్టి పడేయడం వంటివి కూడా ముఖ్యమైన అంశాలు. ఇంకా ఎంపిక చేసుకున్న కథ కూడా ముఖ్యమే. అది ఎటువంటిదయినా కావచ్చు. అంటే సాంఘికం, ఇతిహాసం, చారిత్రికం, లేదా సైన్స్ ఫిక్షన్, ఇలా ఏదయినా కావచ్చు.</p>
<p>ఇవన్నీ ఒక సినిమాని క్లాసిక్ అనడానికి ఎంచుకునే అంశాలు. స్థూలంగా ఇవీ ప్రమాణాలు. హాలీవుడ్‌లో ఈ ప్రమాణాలతోనే సినిమాలు ఎంపిక చేస్తారు.</p>
<p>తెలుగులో వచ్చిన కొన్ని వేల సినిమాల్లో క్లాసిక్స్ అనబడేవి మహా అయితే ఇరవయ్యో, పాతికో ఉండచ్చు. వాటిలో కొన్ని &#8211; మాలపల్లి, పాతాళ భైరవి, దేవదాసు, బంగారు పాప, మల్లీశ్వరి, మాయాబజార్, మిస్సమ్మ, కన్యా శుల్కం, జగదేక వీరుని కథ, పల్లెటూరు, లవకుశ, అల్లూరి సీతారామ రాజు, ముత్యాల ముగ్గు, శంకరాభరణం, సాగర సంగమం. ఇవి కాకుండా మరికొన్ని ఉండచ్చు. మరలా వీటిలో అత్యుత్తమమైన చిత్రం ఏదంటే చెప్పడం కాస్త కష్టంతో కూడిన పని. సినిమా మొదటి నుండి చివరవరకూ అన్ని అంశాలలో అద్భుతంగా కుదిరి, ఎన్ని సార్లు చూసినా విసుగనిపించని సినిమా ఎంపిక చెయ్యడం కష్టమే! అంతే కాదు అది కాలానికి నిలబడాలి. అంటే కొన్ని తరాల ప్రేక్షకులని అలరించాలి.</p>
<p>ఇలాంటి అంశాలన్నీ అద్భుతంగా అమరిన ఏకైక తెలుగు సినిమా &#8220;మాయా బజార్&#8221;.</p>
<p>అది విడుదలయ్యి అరవయ్యేళ్ళు అయ్యింది. ఇవాళ చూసినా ఆ సినిమా కొత్తగానే ఉంటుంది. అంతే కాదు, మొదటి సారి చూసిన వాళ్ళనీ అంతగానే అలరిస్తుంది. దీనికి వయసు భేదం లేదు. ఈ సినిమా క్లాసిక్ అనడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా మీద వందల కొద్దీ వ్యాసాలూ, విశ్లేషణలూ వచ్చాయి. నాకు నచ్చిన అంశాలు ఏవిటీ, ఎందుకు ఈ నాటికీ అందర్నీ రంజింప చేస్తోందీ సినిమా అన్న దానిపై నా పరిశీలనలు కొన్ని.</p>
<p>కె.వి రెడ్డి దర్శకత్వంలో, నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా విజయా వారి బ్యానర్ మీద మార్చ్ 27, 1957 నాడు ఈ సినిమా విడుదలయ్యింది. సంగీతం ఎస్. రాజేశ్వర రావూ, ఘంటసాల నిర్వహించగా, మార్కస్ బార్ట్లే ఫొటోగ్రఫీ చేసారు. హేమాహేమీలయిన నటులు ఎస్వీ రంగారావూ, సావిత్రీ, ఎన్. టీ రామారావూ, నాగేశ్వర రావూ. సి.ఎస్. ఆర్, ప్రధాన పాత్రలుగా కనిపిస్తారు. వీరు కాకుండా గుమ్మడి, రమణా రెడ్డి, ముక్కామల, ఆర్ నాగేశ్వర రావూ, ఛాయాదేవి, సూర్యకాంతం, ఋష్యేంద్రమణి వంటి నటీనటులు కూడా ఉన్నారు.</p>
<p>ఈ సినిమాని అజరామరంగా నిర్మించిన ఘనత దర్శకుడు కె.వి.రెడ్డికి దక్కుతుంది. అలాగే ఈ సినిమాకి ఆయువు పట్టు మాటల మాంత్రికుడు పింగళి. సంగీతం వరకూ వస్తే నేటికీ ఈ సినిమాలో పాటలు అందరి నోటా నానుతూనే ఉంటాయి. ఇవి కాకుండా కడుపుబ్బ నవ్వించే హాస్యం, మాయలూ, మంత్రాలూ ఇవన్నీ ఈ సినిమాలో సమపాళ్ళల్లో చక్కగా అమరాయి.</p>
<p>కథ వరకూ వస్తే ఈ కథకి మూలం మహాభారతం. బలరాముడూ, రేవతిల కూతురు శశిరేఖ. చెల్లెలు సుభద్ర ని అర్జునిడికిచ్చి వివాహం జరుగుతుంది. శ్రీకృష్ణుడూ, అర్జునుడూ బావా బావ మరుదులే కాదు, అత్యంత సన్నిహితులు కూడా. సుభద్ర కొడుకు అభిమన్యుణ్ణి శశిరేఖకిచ్చి వివాహం జరిపిస్తానని కృష్ణుడి సమక్షంలో చెల్లెలికి ప్రమాణం చేస్తాడు బలరాముడు. శశిరేఖా, అభిమన్యుడూ కూడా ఒకరినొకరు ఇష్ట పడతారు. ఈలోగా కౌరవుల మాయా జూదంలో పాండవులు సర్వస్వమూ కోల్పోయి, పాండవులు అరణ్యవాసం వెళితే, సుభద్ర పుట్టింటికి వస్తుంది. బలరాముడూ, రేవతీ సుభద్రని ఆదరించకపోతే వాళ్ళని ద్వైత వనంలో ఉన్న ఘటోత్కచుడి దగ్గరకి రహస్యంగా పంపిస్తాడు కృష్ణుడు. పాండవులని కౌరవులు మాయాజూదంలో మోసం చేసారని తెలుసుకొని హస్తినకు వెళతాడు బలరాముడు. అక్కడ బలరాముణ్ణి సత్కరించి, ప్రశంసలతో ముంచెత్తి అతన్ని శాంత పరుస్తారు శకునీ, ధుర్యోధనులు. పనిలో పనిగా శశిరేఖని ధుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో వివాహం జరిపించాలని నిశ్చితార్థం జరిపిస్తారు కౌరవులు. సందలు ఇష్టపడే రేవతికీ ఈ సంబంధం నచ్చుతుంది. శశి రేఖ మాత్రం ఈ పెళ్ళికి ఇష్టపడదు. ఈలోగా అక్కడ ద్వైత వనం చేరుకున్న అభిమన్యుడి ద్వారా విషయం తెలుసుకున్న ఘటోత్కచుడు శశిరేఖను తీసుకొచ్చి అభిమన్యుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన అనుచరులతో ద్వారకకి వెళతాడు. అక్కడ శశి రేఖా, లక్ష్మణ కుమారుల వివాహం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. తన అనుచరులతో అక్కడ నానా రభసా సృష్టించి, మాయా శశి రేఖగా మారి మగ పెళ్ళివారిని బెంబేలెత్తిస్తాడు ఘటోత్కచుడు. చివరకి ఈ పెళ్ళి పెటాసు చేసి, కౌరవులకి బుద్ధి చెప్పి, అభిమన్యుడికీ, శశి రేఖకీ వివాహం జరిపిస్తాడు ఘటోత్కచుడు. స్థూలంగా ఇదీ కథ. ఇది మహా భారతంలో లేదు. అసలు బలరాముడికీ, రేవతికీ శశిరేఖ అన్న కూతురే లేదు. ఈ కథ జానపద వాంగ్మయంలో పుట్టుకొచ్చింది. ఆనోటా ఈనోటా శశిరేఖా పరిణయంగా చెలామణీ అవుతూ వచ్చింది. భారతంలో ఎన్నో ప్రక్షిప్త కథలున్నాయి. అందులో ఇదీ ఒకటి.</p>
<p>స్థూలంగా ఇదొక పౌరాణిక చిత్రం. కానీ సినిమా చూస్తున్నంత సేపూ అలా అనిపించదు. సినిమాలో ఘటోత్కచుడి మాయలూ, మంత్రాలతో పెళ్ళి పేరు చెప్పి కౌరవులనీ, వారి బంధు వర్గాన్నీ అపాసుపాలు చేయడంలో ఎంతో హాస్యం కనిపిస్తుంది.</p>
<p>శశిరేఖా, అభిమన్యుల ప్రేమ కథ. దీనికి ప్రధాన సూత్రధారి ఘటోత్కచుడూ, కృష్ణుడూ. మహాభారతంలో శ్రీకృష్ణుడు ప్రథాన పాత్రధారి. కానీ ఈ కథకి ఘటోత్కచుడు ప్రధాన పాత్రధారి. సినిమా మొత్తం ఇతని చుట్టూనే తిరుగుతుంది. అలా అని మిగతా పాత్రలకి ప్రాముఖ్యత లేదని కాదు. శశిరేఖా, అభిమన్యుడూ కూడా ముఖ్య పాత్ర ధారులే. వీరు కాకుండా శకునీ, లక్ష్మణ కుమారుడూ ఇలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు కూడా ఉన్నాయి.</p>
<p>ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర నిడివి తక్కువ. ఎక్కడ ఎంత అవసరమో అంత వరకే ఉంటుంది. అలాగే కృష్ణుడి పాత్రని ఆకాశానికి ఎత్తేసి మిగిలన పాత్రలని పట్టించుకోకపోవడం కనబడదు. ఇంకా ఈ కథలో పాండవుల ప్రస్తావన వస్తుంది కానీ వారెవరూ కనిపించనే కనిపించరు. నిజానికి ఈ కథని జనరంజకంగా తెరకెక్కించడం అంత సులువు కాదు, ఘటోత్కచునికి ఎన్ని మాయలూ, మంత్రాలూ పెట్టి చూపించినా. పాండవులు లేకుండా ఈ కథ చెప్పడం కష్టం.</p>
<p>ఇక్కడే దర్శకుడు కె.వి రెడ్డి ప్రతిభ కనిపిస్తుంది. ఈయనకి తోడైన మాటల రచయిత పింగళీ, కెమేరామెన్ మార్కస్ బార్ట్లే కూడా వారికిచ్చిన బాధ్యతని గొప్పగా నిర్వహించారు.</p>
<p>పైన చెప్పినట్లు కథలో పాండవులు లేరు. కథ కౌరవులకీ, పాండవులకీ మధ్య మాయాజూదం జరగక ముందు మొదలవుతుంది. మాయా జూదం తరువాతా ఉంటుంది. పాండవులు జూదంలో ఓడిపోవడమూ, అన్నగారి పంచన సుభద్ర పుట్టింటికి చేరడమూ ఇవన్నీ మాయా జూదం సంఘటన తరువాత జరుగుతాయి. పాండవులు తెరేమీద కనిపించకుండా ఎలా కథని నడిపించాలి? ఇక్కడే కె.వి రెడ్డి తెలివితేటలు కనిపిస్తాయి. ఇది ఎంతో సులభంగా చూపించేస్తాడు, మూల కథకి భంగం రాకుండా. శశిరేఖా, అభిమన్యుల చిన్నతనంతో సినిమా ప్రారంభించి, బలరాముడు అభిమన్యుడే తన అల్లుడన్న ప్రమాణం సుభద్రకి చేయడం చూపిస్తాడు. అప్పుడే కౌరవుల మాయా జూదం చూపించాలి. అది ఎక్కడో వేరే చోట జరుగుతుంది. అదంతా చూపించాలంటే సినిమా నిడివి చచ్చేటంత అవుతుంది. పైగా ఈ కథ దారి తప్పే ప్రమాదం కూడా ఉంది.<br />
అందుకని కృష్ణుడి చిన్నప్పటి విశేషాలు పాట రూపంలో కృష్ణుడూ, రుక్మిణికీ ఒక ప్రదర్శన జరుగుతున్నట్లు చూస్తాడు. పాట చివర్లో కృష్ణుడు పరధ్యానంలోకి వెళ్ళి కొంతసేపటికి మామూలు స్థితికి వస్తాడు. ఆ పరధ్యానం ఎందుకంటే అక్కడ ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగుతూ ఉంటుంది. ద్రౌపది కృష్ణుణ్ణి మొరపెట్టుకోవడంతో కృష్ణుడు ఆమెను కాపాడడం కోసం వెళతాడు. అతని పరధ్యానం గమనించిన రుక్మిణి ఏమయ్యిందని అడుగుతుంది. అక్కడే మాయా జూదంలో పాండవుల ఓటమి గురించీ, ద్రౌపదీ వస్త్రాపహరణం గురించీ తెలివిగా కృష్ణిడి చేతే చెప్పిస్తాడు దర్శకుడు. ఇదంతా ఒక పాటరూపంలో మూడు నిమిషాల్లో తెరపై చూపిస్తాడు.<br />
మరుక్షణమే సుభద్ర, అభిమన్యుడితో పుట్టింటికి రావడం సీన్ వచ్చేస్తుంది. కథ అభిమన్యుడూ, శశిరేఖలమధ్యకి వచ్చేస్తుంది. వెనువెంటనే బలరాముడు వారి పెళ్ళి తిరస్కరించడమూ, అవమానంతో సుభద్ర అక్కడ ఉండలేని పరిస్థితి గ్రహించి కృష్ణుడు ఘటోత్కచుడి నివాసానికి పంపించడమూ చూపించేస్తాడు. ఇదీ కె.వీ రెడ్డి స్క్రీన్‌ప్లే ప్రతిభ.<br />
ఇంకోటి ఈ సినిమా మొత్తంలో ఎక్కడా కృష్ణుడి మహిమలూ, మాయలూ ఉండవు. కృష్ణుడి పాత్ర ఎంత అవసరమో అంతే ఉంటుంది. ఎక్కడా అనవసరంగా శృతి మించదు.<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Mayabazar.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Mayabazar.jpg" alt="" title="Mayabazar" width="271" height="368" class="alignright size-full wp-image-14760" /></a><br />
పాండవులకీ, కౌరవులకీ అసలేం జరిగిందో తెలుసుకోవడానికి బలరాముడు ఒక్కడూ వెళతాడు. ఇక్కడ కృష్ణుడు తోడు వెళ్ళనట్లు చూపించి తప్పిస్తాడు. అక్కడ ధుర్యోధనుడి కొడుకుతో శశిరేఖ వివాహానికి ఒప్పేసుకొని వచ్చేస్తాడు. ఇలా ప్రతీ సన్నివేశంలోనూ ఏ పాత్ర అవసరం ఎంతో అంతే ఉంటుంది.</p>
<p>ఇవి కాకుండా ఈ కథ పౌరాణికమయినా ఏ పాత్రా మనకి అలా అనిపించదు. బలరాముణ్ణీ, సుభద్రనీ, కృష్ణుణ్ణీ, రేవతీ, శశిరేఖాభిమన్యుల్ని చూస్తూంటే మన ఇళ్ళల్లో ఓ పెదనాన్ననీ, బాబయ్యనీ అత్తయ్యల్ని చూస్తున్నట్లు ఉంటుంది. మన కుటుంబాల్లో మేనరికం పెళ్ళిళ్ళ గురించి వింటూనే ఉంటాం. చిన్నప్పుడు మాట ఇచ్చుకొని, పెద్దయ్యాక ఆస్తులూ అవీ పోతే కాదనడం వింటూ ఉంటాం. అందువల్ల బలరాముడూ, కృష్ణుడూ, రేవతీ, సుభద్రా, అభిమన్యుడూ, శశిరేఖా పౌరాణకి పాత్రల్లా కాకుండా మనింట్లో మన మధ్య మసిలే మనుషుల్లాగే అనిపిస్తాయి; ఒక్కఆహార్యం తప్ప. మనకి ఈ పౌరాణిక పాత్రలు మామూలు మనుషుల్లా అనిపించడానికి ప్రధాన కారణం మాటల మాంత్రికుడు పింగళి. ఎక్కడా పెద్ద పెద్ద సంస్కృత సమాసాలూ, బరువైన పెద్ద డయిలాగులూ ఉండవు. అన్ని సంభాషణలూ మన ఇళ్ళలో మాట్లాడుకున్నట్లే ఉంటాయి.<br />
అలాగే వదినా, మరదళ్ళ మధ్య దెప్పిపొడుపులూ, మాటలు తిరిగి అప్పజెప్పడాలూ, వ్యంగ్యాలూ, విసుర్లూ ఇవన్నీ వ్యవహారిక భాషలో ఉంటాయి. వింటూంటే మన ఇళ్ళల్లో సంభాషణల్లా ఉంటాయి తప్ప ఎక్కడా పౌరాణికం అన్న భావన కలగదు.</p>
<p>ఉదాహరణకి కొన్ని. అభిమన్యుడు తన విలువిద్యని శశిరేఖకి ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరుతాడు. శశిరేఖ నెత్తిమీద పెట్టి ఒక పండుని కొట్టే సమయానికి రేవతి వచ్చి అడ్డుకొని, అభిమన్యుడి విల్లంబులు లాక్కొంటుంది. మరదలు సుభద్ర దగ్గరే ఇది తేలుద్దామని వస్తూండగా, అక్కడ బలరాముడూ, కృష్ణుడూ పాచికలు ఆడుతూ కనిపిస్తారు. రేవతి చేతిలో విల్లంబులు చూసి &#8211; &#8220;కృష్ణా! చేతిలో ఆ ధనుర్బాణాలు చూస్తూంటే మీ వదిన అపర కాళికా దేవిలా లేదూ?&#8221; అంటూ హాస్యమాడతాడు బలరాముడు. ఇలాంటి హాస్యాలు మన ఇళ్ళలో తరచూ చూస్తూనే ఉంటాం.<br />
అలాగే అభిమన్యుడూ, శశిరేఖా నౌకా విహారం వెళ్ళారని తెలిసి, అది నిజమో కాదో తేలుద్దామని రేవతి బలరాముడితో బయల్దేరుతుంది . అది తెలిసీ కృష్ణుడు వారికంటే ముందు రుక్మిణితో వెళ్ళి అభిమన్యుడూ, శశిరేఖల్ని తప్పిస్తాడు. నౌకలో కృష్ణుడూ, రుక్మిణులని చూసి రేవతి &#8220;ఈ వయసులో రుక్మిణికి నౌకా విహారం ముచ్చటా?&#8221; అని బలరాముడితో అంటుంది.<br />
తరువాత రేవతీ, బలరాములు నౌకా విహారం చేస్తూంటే సరిగ్గా రుక్మిణీ అదే మాటంటుంది. ఇక్కడే స్త్రీల మనస్తత్వాన్ని అద్భుతంగా చూపిస్తాడు. వేంటనే &#8211; &#8220;రస పట్టులో తర్కం కూడదు&#8221; అని కృష్ణుడి చేత పలికిస్తాడు. మన కుటుంబాల్లో ఆడవాళ్ళ మధ్య ఇలాంటి ప్రవర్తనలే చూస్తూ ఉంటాము.</p>
<p>సినిమా మొత్తమూ ఇలాంటి సహజమైన సంభాషణలతోనే సాగుతుంది. ఎక్కడా పౌరాణిక వాసనలు కనిపించవు. అలాగే అభిమన్యుడు కృష్ణ్ణి మావయ్యా అని సంబోధించడమూ, బలరాముడు అభిమన్యుణ్ణి మేనల్లుడని చెప్పడమూ, శశిరేఖ సుభద్రని అత్తయ్యా అని పిలవడమూ, ఇవన్నీ మనకి అలవాటయిన పిలుపులు.<br />
అలాగే లక్ష్మణ కుమారుణ్ణి పొగిడే భట్రాజులు కౌరవల గురించి చెబుతూ &#8220;బాబాయిలు&#8221; అనడమూ, అర్జునుడి గురించి చెబుతూ ఘటోత్కచుడు &#8220;అర్జున బాబాయి&#8221; అనడమూ సినిమాలో కనిపిస్తాయి. బాబాయికి బదులు పినతండ్రి అనచ్చు. కానీ బాబాయి అన్నది వ్యవహారికం. ఇలాంటి జాగ్రత్తలు సంభాషణల్లో తీసుకోవడం సినిమా మొత్తమూ ఉంది. మాటలన్నీ మామూలుగా సహజంగా ఉంటాయి.</p>
<p>సినిమా చివర్లో లక్ష్మణ కుమారుడితో మాయా శశిరేఖ పెళ్ళిలో ఘటోత్కచుడి అనుచరుల మాయల వల్ల అందరూ తుమ్ముతారు. &#8220;నీళ్ళు కొత్త చేసుకుంటాయి&#8221; అని కృష్ణుడు అంటే, అది రేవతి అందుకుంటుంది. అది విని రుక్మిణి &#8220;అవును పాపం&#8221; అని వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తుంది. ఇలా ప్రతీ పాత్ర విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ రాయలేము.</p>
<p>ఈ సంభాషణలు కాకుండా ఈ సినిమాలో మరో మహత్తరమైన ప్రయోగం ఉంది. అది పెళ్ళి. ఈ పెళ్ళి వేడుక మొత్తమూ తెలుగు వారి పెళ్ళి వేడుకే! పద్ధతులూ, ఆచారాలూ, ఆఖరికి పెళ్ళి విందూ, వంటకాలూ ఇవన్నీ తరచూ తెలుగు ఇళ్ళల్లో కనబడేవే.<br />
సాధారణంగా రామాయణ, భారతాలలో కథల్ని తీసుకొని మన జీవితాలకి అన్వయించి కథలు రాయడమూ, సినిమాలుగా తీయడమూ చూస్తూనే ఉంటాం. కానీ ఈ సినిమాలో మన అలవాట్లూ, సాంప్రదాయాలూ, పద్ధతులూ పౌరాణిక పాత్రలకి ఎంతో సహజంగా అన్వయించడం కనిపిస్తుంది. దీన్నే ఇంగ్లీషులో reverse adaptation technique అంటారు. ఈ సినిమాలో మొత్తం పెళ్ళి తంతు అంతా తెలుగు పెళ్ళే. తెలుగు వారి పద్ధతులూ, ఆచారాలూ ఇవన్నీ భారతంలో కుదించేసారు.</p>
<p>సంభాషణల్లో వాడుక మాటలు ఎలాగో పెళ్ళి పద్ధతుల్లోనూ అవే పాటించారు. మగపెళ్ళి వారు పెళ్ళి విడిదికి రాగానే పెళ్ళికూతురు ఎలా ఉంటుందో చూడాలన్న తహతహ కుటుంబాల్లో ఉంటుంది. ఇక్కడ శశిరేఖని చూడ్డానికి లక్ష్మణ కుమారుడూ, భానుమతే కాదు, శకునీ మిగతా బంధుగణమూ వెళతారు. అలాగే మగ పెళ్ళి వారు పెళ్ళిళ్ళలో సదుపాయాలూ సరిగ్గా లేవూ, పట్టించుకోవడం లీదూ, ఆతిధ్యం సరిగా లేదని అయిన దానికీ, కాని దానికీ లూ, ఒంకలూ చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఈ సినిమాలో చక్కగా కనిపిస్తాయి. హాస్యం కోసం, మిగతా పాత్రల, అంటే ధుర్యోధనుడూ, శకుని వంటి రాచరికపు పెద్దల, స్థాయి తగ్గకుండా ఆడపెళ్ళి వారి వద్ద బెట్టు చేయడం పురోహితులకి అప్ప జెప్తారు. అలా వాళ్ళ చేత హాస్యం పండిస్తారు.<br />
ఇంకా పెళ్ళిలో బాసికం కట్టడం, తెర పట్టడమూ, పాద పీడనం, పెళ్ళికొడుకు నిలబడి తాళి కట్టడం ఇవన్నీ ఆనాటి పద్ధతులేనా అనుకునేలా భ్రమించ చేసారు.<br />
అలాగే పెళ్ళికి విచ్చేసిన వారికి &#8220;రుమాలు&#8221; ఇవ్వడం పూర్వం పెళ్ళిళ్ళలో తెలుగు వారి సాంప్రదాయం. అది కూడా హాస్యం కోసం తెలివిగా వాడుకున్నారు. ఆ రుమాళ్ళకోసం కౌరవ సోదరులు ఎగపడటం హాస్యాన్ని పుట్టిస్తుంది.</p>
<p>ఇహ పెళ్ళిలో భోజనం గురించి చెప్ప నవసరమే లేదు. వివాహ భోజనంబు పాట నిండా తెలుగు వంటకాలే! బొబ్బట్లూ, గారెలూ, బూరెలూ, చెగోణీలూ, ఆఖరికి గోంగూరని కూడా కౌరవుల కాలం నాటి వంటకం చేసేస్తారు. అలా చేయడం సినిమాలో ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించదు. ఇది కె.వి.రేడ్డి, పింగళిల మేధోచమత్కారం.</p>
<p>అసలు ఈ సినిమా మొదలవ్వడమే శశిరేఖ రజస్వల (లేదా ఓణీ పండగ) సందర్భంతో పాటతో మొదలవుతుంది. రజస్వల అన్నది ఎక్కడా పాటలో కనిపించదు. మాటలూ ఉండవు.<br />
పుట్టిన రోజని కూడా అనుకోవచ్చు కానీ, చూస్తే అదే సందర్భం అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటి సందర్భాలకి ఇంట్లో ఆడవాళ్ళనే పిలుస్తారు. అందుకే అక్కడ సుభద్ర, పిల్లవాడు అభిమన్యుడూ కనిపిస్తారు. అర్జనుడు కనిపించడు.<br />
ఇక్కడ పాండవులని, ముఖ్యంగా అర్జనుణ్ణి, తెరపై చూపించే అవకాశం ఉంది. దర్శకుడు ఇక్కడా తెలివిగా దాట వేసాడు. ఇలా ప్రతీ సన్నివేశ నిర్మాణంలోనూ ఎంతో చాకచక్యం కనిపిస్తుంది.</p>
<p>ఈ మాయ బజార్ సినిమా ఆరేడు తరాలకి అమితంగా నచ్చడానికి హాస్యమూ, నటనా, మాటలూ, పాటలూ ఒక కారణమయితే, అంతర్లీనంగా తెలుగువారి జీవన విధానాన్ని సినిమాలో జొప్పించడం మరో ప్రధాన కారణం.</p>
<p>ప్రతీ తరంలోనూ పెళ్ళిళ్ళు ఉంటాయి. చిన్న చిన్న ఆచారాలూ, పద్ధతులూ, సాంప్రదాయాలూ తేడా ఉండచ్చు గాక. కానీ ప్రధాన తంతు రమారమి అందరికీ ఒకటే. అలాగే పెళ్ళిళ్ళలో తగవులూ, అపార్థాలూ ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. అందువల్ల ఏ తరం వారయినా ఈ సినిమా చూస్తే ఇట్టే సొంతం చేసేసుకుంటారు. తమ జీవితాలకి దగ్గరగా ఉండడం వలన అన్వయం చక్కగా కుదురుతుంది. ఇవి కాకుండా హాస్యం ఎలాగూ ఉంది. పిల్లా, పెద్ద తేడా లేకుండా ఈ సినిమా హాయిగా చూసేయచ్చు. ఒకసారి కాదు, ఎన్ని సార్లు చూసినా విసుగనిపించదు. ఒక పౌరాణిక సినిమా చూస్తున్న భావనే కలగదు. వీటికి తోడు అద్భుతమైన ఫొటోగ్రఫీ ట్రిక్కులూ, అలరించే సంగీతమూ ఉన్నాయి. ఇవన్నీ మించి నటీనటులందరిదీ అద్భుతమైన నటనా కౌశలమూ ఉంది. ముఖ్యంగా ఎస్వీయార్, సావిత్రీ ఈ సినిమాకి హీరోలు. ఎస్వీ రంగారావుకి అలాంటి పాత్ర కొట్టిన పిండి. సావిత్రి మాయా శశిరేఖగా చేసిన నటన అద్భుతం. చిన్న చిన్న హావభావాలు పలికించడంలో ఆమె చూపించిన నటన అద్భుతమూ, అజరామరమూ.</p>
<p>ఇహ స్క్రీన్‌ప్లే వరకూ వస్తే ఈ సినిమాలో ఏ ఒక్క అనవసర సన్నివేశమూ కనిపించదు. సినిమా మొత్తం వేగంగా నడుస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో చూపించిన అబ్బురపరిచే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి &#8211; తలచిన వారిని చూపించే ప్రియదర్శిని, రెండోది సత్య పీఠం. ప్రియదర్శిని ప్రస్తుత టీవీ లేదా వీడియో కెమేరా అనుకోవచ్చు. అప్పటికే పాశ్చాత్య దేశాల్లో టీవీ వచ్చేసింది. ప్రియ దర్శిని అని చక్కటి పేరుపెట్టి సినిమా కథనంలో ఇమిడ్చి చూపించారు. అలాగే సినిమా మొదట్లో కృష్ణుడి తమ్ముడు సాత్యకి ద్వారా ప్రవేశ పెట్టిన సత్యం పీఠం చివర్లో శకుని బండారం బయట పెట్టడానికి వాడుకున్నారు. చివర్న ఘటోత్కచుడు మాయలూ అవీ చేస్తాడు కానీ కృష్ణుడు మామూలు వ్యక్తిగానే అంతా చూస్తూ ఉంటాడు. అన్నగారి దగ్గర అతి వినయంతో ప్రవర్తించే తమ్ముడిలా కనిపిస్తాడు తప్ప ఎక్కడా దేవుడు అన్న భావనే కలగదు.</p>
<p>ఈ చిత్రంలో మనకి ప్రతీ పాత్రా చివరి వరకూ గుర్తుంటుంది. ఘటోత్కచుడి అనుచర గణమూ, లక్ష్మణ కుమారుడి సన్నిహితుడూ, పురోహితులూ, దుశ్శాశనుడూ, శకునీ, ఆఖరికి మాయా శశి రేఖ చెలికత్తె చంప, ఇలా అందరూ గుర్తుంటారు. వారి పాత్రల నిడివితో సంబంధం లేకుండా.</p>
<p>ఇవి కాకుండా ఈ సినిమాలో సంభాషణలు కొన్ని తరాలు అందరి నోటా నానుతూనే ఉన్నాయి. &#8220;వెయ్ వీడికో వీర తాడు!&#8221;, &#8220;ఇదే మామ మన తక్షణ కర్తవ్యం&#8221;, &#8220;హై హై నాయకా&#8221;, &#8220;దుసట చసుటతయమూ&#8221; వంటి ప్రయోగాలూ ఇన్నేళ్ళయినా వాడుకలోనే ఉన్నాయంటేనే పింగళి వారి గొప్పతనం తెలుస్తోంది.</p>
<p>ఇహ ఈ సినిమాలో పాటలు. కొన్ని పాటలు కట్టకా సాలూరి రాజేశ్వర రావుకీ, నిర్మాతలకీ విభేదాలు వచ్చి, ఆయన చేయగా మిగిలిన పాటలూ, నేపథ్య సంగీతమూ ఘంటసాల చేసారని అంటారు. ఈ సినిమాలో ఒక్కో పాటా ఒక ఆణి ముత్యం. &#8220;నేవేనా నను తలచినదీ&#8221;, &#8220;చూపులు కలసిన శుభవేళా&#8221;, &#8220;లాహిరి లాహిరిలో, &#8220;అహ నా పెళ్ళి అంట&#8221;, &#8220;వివాహ భోజనంబు&#8221; ఇలా ప్రతీ పాటా ప్రసిద్ది చెందినవే. ఇవి ఎంతలా ప్రజల నోళ్ళల్లో నానాయంటే, ఈ పాటల పల్లవులతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఇది ఏ సినిమాకీ దక్కని అపూర్వ గౌరవం.</p>
<p>ఈ సినిమాకి మరో గొప్పదనం కూడా ఉంది. పైన చెప్పిన అంశాలన్నీ కన్నుల విందుగా చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లీ మాయా జాలం మనల్ని కట్టి పడేస్తుంది.</p>
<p>సాంకేతిక ప్రగతి అంతగా లేని ఆ రోజుల్లో ఈయన చేసిన కొన్ని ఫొటోగ్రఫిక్ ట్రిక్స్ ఇప్పటికీ ఆశ్చర్యమే.</p>
<p>మయ ద్వారక సెట్టింగు ఇప్పటికీ ఒక అద్భుతం. అలాగే వివాహ భోజనంబు పాటలో చూపించిన ట్రిక్ ఫొటోగ్రఫీ; వంగర, బాలకృష్ణ, అల్లు రామలింగయ్యల మధ్య హాస్య సన్నివేశాలలో తివాచీ చుట్టుకు పోవడం, గిర్రున తిరిగే మంచం, అటూ ఇటూ కదిలే తాంబూల పళ్ళెం ఇవన్నీ అప్పట్లో ఎలా తీయగర్లిగారు అన్నది ఊహకే అందవు. ఘటోత్కచుడు పెద్దగా అవడం, పెళ్ళివారి విడిది సన్నాహం పాటలో, చెప్పులూ, బెందెలూ ఇవన్నీ కొట్లలో వరసగా అమరడం, ప్రియదర్శినిలో అభిమన్యుణ్ణి చూస్తూ శశి రేఖ పాడే సన్నివేశమూ ఇవన్నీ బార్ట్‌లీ ప్రతిభకి తార్కాణం. తెలుపు నలుగు చిత్రంలో వెన్నెల్లో ఉన్నట్లు భ్రమించేలా తీసిన లాహిరి లాహిరి పాటా ఇవన్నీ మాయా బజార్ సినిమాని మరో మెట్టుపైకి తీసుకెళ్ళాయి.</p>
<p>సెట్టింగులు వేసిన గోఖలే, కళాధరూ, ఆహార్యం అందించిన భక్తవత్సలం అందరూ శక్తికి మించి తలో చెయ్యీ వేసారు ఈ కళాఖండంలో. ఎన్నో తరాలకి పసితనంలోనే పరిచయమయ్యే సినిమా మాయాబజార్. అందుకే ఇన్నేళ్ళు అంటే అరవయ్యేళ్ళు గడిచినా ఈ సినిమా తెలుగు వారి హృదయాల్లో చిరకలాంగా నిలిచి పోయింది. ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి. అందుకే వీటిని క్లాసిక్స్ అంటాం. అనడమే కాదు, మరలా మరలా చూస్తూనే ఉంటాం.</p>
<p>ఏ ముహుర్తాన మాయ అని టైటిల్లో తగిలించారో, ఇన్నేళ్ళుగా తెలుగు వారిని ఈ సినిమా మాయ చేస్తూనే ఉంది. ఉంటుంది కూడా. ఎంతైనా క్లాసిక్ కదా!</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>మొదటి ముద్రణ: తానా సావనీర్.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14743</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=14368</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14368#comments</comments>
		<pubDate>Wed, 31 May 2017 21:50:15 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14368</guid>
		<description><![CDATA[<p></p> <p>ఆంగ్ల క్రాస్ వర్డ్ ఆధారాలను, వాటి విశిష్టతను వివరిస్తూ ఈ రచయిత రాసిన వ్యాసం వాకిలి, ఏప్రిల్ 2017 సంచికలో వచ్చింది. ఇప్పుడు, తెలుగు పజిళ్లలోని ఆధారాల గురించి అటువంటి మరొక వ్యాసాన్ని పాఠకుల ముందంచటం జరుగుతున్నది. పాత తెలుగు క్రాస్ వర్డ్ లు అంటే వెంటనే మనసులో మెదిలేవి శ్రీశ్రీ గారి పదబంధ ప్రహేళికలు. అవి ప్రమాణికతతో కూడుకున్నవి కావటమే అందుకు కారణం. తర్వాత ఆరుద్ర గారి పదబంధ ప్రహేళికలు గుర్తుకొస్తాయి. ‘పొద్దు’ ఇంటర్నెట్ పత్రికలో వచ్చిన తెలుగు పజిళ్లను, ‘ఈమాట’ అంతర్జాల పత్రికలో వస్తున్న పజిళ్లను తర్వాత పేర్కొనవచ్చు. ఇవి కాక, ‘వాకిలి’లో దాదాపు ఇరవై నెలలుగా వస్తున్న ‘నుడి’ ఉండనే వుంది. మిగతా పత్రికలలో వచ్చిన, వస్తున్న పజిళ్లలో నిగూఢ (cryptic) ఆధారాలు చాలా తక్కువ కనుక, అవి ఈ వ్యాసపరిధిలోకి రావు. ప్రధానంగా శ్రీశ్రీ గారు రూపొందించిన ఆధారాలను పరిశీలించి, వాటికి వివరణలను ఇవ్వటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. వాటిని కింద ఇస్తున్నాను. చదివి ఆనందించండి.</p> <p>1.ఆడదాని ఆద్యంతాలు కెరటం (2)<br /> దీనికి సమాధానం అల. ఎలా అంటే, ఆడది = అబల. ఆద్యంతాలు అంటే అబలలోని మొదటి అక్షరమైన ‘అ’ను, చివరి అక్షరమైన ‘ల’ను తీసుకోవాలి. రెండింటిని కలిపితే అల వస్తుంది.</p> <p>2. కవిత్వం మధ్య నునుపులు మొదలెట్టి ఆకర్ణించు (2)<br /> కవిత్వం మధ్య అంటే కవిత్వం అనే పదంలోని మధ్య అక్షరమైన వి. నునుపులు మొదలు అంటే నునుపులు లోని మొదటి అక్షరమైన ను. వి + ను = విను = ఆకర్ణించు. కనుక, విను సమాధానం.</p> <p>3. అనడు, కనడు, వినడు. అకవి లేడు, పో! (2)<br /> అనడు, కనడు, వినడు &#8211; ఈ మూడు పదాలలోని మొదటి అక్షరాలు (అకవి) లేకుంటే ప్రతి పదంలో మిగిలేది నడు. నడు = పో కనుక, అదే సమాధానం.</p> [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/06/unnamed.png"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/06/unnamed-150x150.png" alt="" title="unnamed" width="150" height="150" class="alignright size-thumbnail wp-image-14370" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఆం</span>గ్ల క్రాస్ వర్డ్ ఆధారాలను, వాటి విశిష్టతను వివరిస్తూ ఈ రచయిత రాసిన వ్యాసం వాకిలి, ఏప్రిల్ 2017 సంచికలో వచ్చింది. ఇప్పుడు, తెలుగు పజిళ్లలోని ఆధారాల గురించి అటువంటి మరొక వ్యాసాన్ని పాఠకుల ముందంచటం జరుగుతున్నది. పాత తెలుగు క్రాస్ వర్డ్ లు అంటే వెంటనే మనసులో మెదిలేవి శ్రీశ్రీ గారి పదబంధ ప్రహేళికలు. అవి ప్రమాణికతతో కూడుకున్నవి కావటమే అందుకు కారణం. తర్వాత ఆరుద్ర గారి పదబంధ ప్రహేళికలు గుర్తుకొస్తాయి. ‘పొద్దు’ ఇంటర్నెట్ పత్రికలో వచ్చిన తెలుగు పజిళ్లను, ‘ఈమాట’ అంతర్జాల పత్రికలో వస్తున్న పజిళ్లను తర్వాత పేర్కొనవచ్చు. ఇవి కాక, ‘వాకిలి’లో దాదాపు ఇరవై నెలలుగా వస్తున్న ‘నుడి’ ఉండనే వుంది. మిగతా పత్రికలలో వచ్చిన, వస్తున్న పజిళ్లలో నిగూఢ (cryptic) ఆధారాలు చాలా తక్కువ కనుక, అవి ఈ వ్యాసపరిధిలోకి రావు. ప్రధానంగా శ్రీశ్రీ గారు రూపొందించిన ఆధారాలను పరిశీలించి, వాటికి వివరణలను ఇవ్వటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. వాటిని కింద ఇస్తున్నాను. చదివి ఆనందించండి.</p>
<p>1.ఆడదాని ఆద్యంతాలు కెరటం (2)<br />
దీనికి సమాధానం అల. ఎలా అంటే, ఆడది = అబల. ఆద్యంతాలు అంటే అబలలోని మొదటి అక్షరమైన ‘అ’ను, చివరి అక్షరమైన ‘ల’ను తీసుకోవాలి. రెండింటిని కలిపితే అల వస్తుంది.</p>
<p>2. కవిత్వం మధ్య నునుపులు మొదలెట్టి ఆకర్ణించు (2)<br />
కవిత్వం మధ్య అంటే కవిత్వం అనే పదంలోని మధ్య అక్షరమైన వి. నునుపులు మొదలు అంటే నునుపులు లోని మొదటి అక్షరమైన ను. వి + ను = విను = ఆకర్ణించు. కనుక, విను సమాధానం.</p>
<p>3. అనడు, కనడు, వినడు. అకవి లేడు, పో! (2)<br />
అనడు, కనడు, వినడు &#8211; ఈ మూడు పదాలలోని మొదటి అక్షరాలు (అకవి) లేకుంటే ప్రతి పదంలో మిగిలేది నడు. నడు = పో కనుక, అదే సమాధానం.</p>
<p>4. చెడి పోయిన ఊళ్లలో వ్యాపార కేంద్రం (2)<br />
డిపో అంటే వ్యాపార కేంద్రం కనుక, డిపో అన్నది సమాధానం. జవాబు అయిన ఈ పదం మొదటి రెండు పదాల మధ్య ఏ మార్పూ లేకుండా దాగివుంది.</p>
<p>5. కనుదెరచి చూడరా శిష్యా! కనబడుతుంది చక్రం (2)<br />
ఇక్కడ చక్రం అంటే రాశిచక్రం లోని రాశి అన్న మాట. కనుక, అదే జవాబు. చూడరా శిష్యా మధ్య రాశి ఉన్నది కదా.</p>
<p>6. గురుతిడని చోట వెనక్కి చూసి పరిభ్రమించు (3)<br />
పరిభ్రమించు = తిరుగు కాబట్టి, తిరుగు జవాబు. ఆధారంలోని మొదటి మూడక్షరాలను తిరగేస్తే (వెనక్కి చూస్తే) తిరుగు వస్తుంది.</p>
<p>7. ఇంటికి వింటికి కావాలి (2)<br />
వింటికి (విల్లుకు లేక ధనుస్సుకు) అల్లెతాడు ఉంటుంది కదా. దాన్ని నారి అంటారు. ఇక నారి అంటే ఇల్లాలు (స్త్రీ) అనే అర్థం కూడా వుంది. ఇల్లుకు కూడా నారి కావాలి కనుక, ఇక్కడ నారి జవాబు.</p>
<p>8. వంటింట్లోనూ వాటికన్ లోనూ (2)<br />
పోప్ జాన్ పాల్ (Pope John Paul) గారు వాటికన్ లో ఉంటారు. వారిని తెలుగులో పోపు అనవచ్చు మనం. ఇక పోపు (తాలింపు) వంటింట్లో కూడా అవసరమే.</p>
<p>9. విరోధాలు (రాత్రికి కావచ్చు) (3)<br />
విరోధాలుకు సమానార్థకమైన పగలు (శత్రుత్వాలు) సమాధానం. ఇక పగలు (daytime) అన్నది రాత్రికి విరుద్ధం. ఇదే ఈ ఆధారంలోని చమత్కారం.</p>
<p>10. పండు, నీళ్లలో కొట్టేది (2)<br />
ఇక్కడ ఈత సమాధానం. ఈతపండు ఉంటుంది. నీళ్లలో కొట్టే ఈత (స్విమింగ్) కూడా ఉంటుంది.</p>
<p>11. విశ్వనాథ సత్యనారాయణలో ఉన్న రెండింటిలో ఒకటి మదీయం (1)<br />
విశ్వనాథ లోని మూడవ అక్షరం నా. సత్యనారాయణ లోని మూడవ అక్షరం కూడా నా. మదీయం అంటే నా(యొక్క) కనుక, నా అనేది జవాబు.</p>
<p>12. వ్యధా రహిత వ్యవధానము; అదే అడవి, అదే నీరు (3)<br />
వ్యవధానము లోంచి వ్యధా తీసేస్తే వనము మిగుల్తుంది. వనముకు అడవి, నీరు అని రెండర్థాలున్నాయి. జ = పుట్టినది. వనము(నీరు)లో పుట్టినది వనజము. అదే తామర పువ్వు. తామరపువ్వుల వంటి కన్నులు గలది వనజాక్షి (స్త్రీ).</p>
<p>13. ఎప్పుడూ హృదయం లేని సరదా (2)<br />
ఎప్పుడూకు సమానార్థకమైన సదా ఇక్కడ సమాధానం. సరదా లోని మధ్య అక్షరం ర నట్టనడుమ ఉంటుంది కనుక, అది హృదయానికి సమానం. అందుకే సరదా మైనస్ ర = సదా. ఇంగ్లిష్ పజిళ్లలో మధ్య అక్షరాన్ని లేక అక్షరాలను సూచించడానికి essentially, at heart అనే పదాలను వాడుతారు.</p>
<p>14. లంక కొస నుండి లంక మొదటి దాకా; మధ్యని మధ్యకు ప్రారంభం. ఇదో పువ్వని వేరే చెప్పాలా? (3)<br />
లంక కొస = క. లంక మొదలు = లం. మధ్యకు ప్రారంభం = మ. కలం మధ్యన మ చేరితే వచ్చే కమలం సమాధానం.</p>
<p>15. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు (2)<br />
ఇది ప్రసిద్ధినీ, ప్రజాదరణనూ పొందిన ఆధారం. కష్టజీవి లోని మొదటి, చివరి అక్షరాలను కలిపితే కవి వస్తుంది. కవి అన్నవాడు ప్రజల పక్షం వహించాలని అన్యాపదేశంగా చెప్పబడిందిక్కడ.</p>
<p>16. కడుగడు; కడు విడు; మిగిలేది తల లేని అద్దె (2)<br />
కడుగడు మైనస్ కడు = గడు. దాన్ని రివర్స్ చేస్తే డుగ వస్తుంది. అదే జవాబు. అద్దె = బాడుగ. తల (మొదటి అక్షరం) లేకుంటే డుగ వస్తుంది.</p>
<p>17. వారాలకు రాలలేని మాట. కావత్తు కావాలంటారు కొందరు (2)<br />
వారాలకు మైనస్ రాల = వాకు. దీనికి కావత్తు కలిపితే వాక్కు వస్తుంది. వాక్కు = మాట. ఇక్కడ సమాధానం వాకు.</p>
<p>18. కల కతన మారిన పసిడి తీగ (3, 2)<br />
కల కతనను తారుమారు/కలగాపులగం చేయగా వచ్చే కనకలత ఇక్కడ జవాబు.</p>
<p>19. కవిగారి తోక, తల; తరువాత తలకిందులు; చాంచల్యం (4)<br />
కవి తోక = వి. కవి తల = క. ‘తల’కిందులు అంటే తలను తారుమారు చేయగా వచ్చే లత. వి + క + లత = వికలత = చాంచల్యం కనుక, వికలత జవాబు.</p>
<p>ఇట్లా, శ్రీశ్రీ గారి పజిళ్లలో word play, జటిలత్వం మరీ అంత ఎక్కువగా లేకపోయినా, అద్భుతమైన చమత్కారం ఉంటుంది అక్కడక్కడ. పాఠకులకు మరీ కొరుకుడు పడని ఆధారాలను తయారు చెయ్యడం ఆయనకు ఇష్టం లేకుండిందేమో అనిపిస్తుంది. తెలుగులో ప్రామాణిక పజిళ్లను ప్రవేశపెట్టిన శ్రేయస్సు శ్రీశ్రీ గారికే దక్కుతుంది.</p>
<p>‘ఈమాట’ అంతర్జాల పత్రికలో వస్తున్న ‘గడినుడి’ లోని ఆధారాలు కూడా చెప్పుకో తగినవే. అందులో ఇప్పటిదాక ఏడు పజిళ్లు వచ్చాయి. త్రివిక్రమ్, భైరవభట్ల కామేశ్వరరావు, కొల్లూరు కోటేశ్వరరావులు వీటి కూర్పరులు. అదే క్రమంలో ఒక్కొక్కరివి ఐదు చొప్పున ఆధారాలను వివరిస్తున్నాను.</p>
<p>1.వాడన పని చెడి కరువును తెచ్చింది (3, 2)<br />
దీనికి సమాధానం పడని వాన. ఎలా అంటే, వాడన పని లోని అక్షరాలను కలగాపులగం చేస్తే పడని వాన వస్తుంది. అది కరువుకు కారణం కదా.</p>
<p>2. తిరుమాడ వీధుల్లో తిరిగొచ్చిన కోతి (3)<br />
తిరిగొచ్చిన అంటే వెనక్కి వచ్చిన. అంటే రివర్స్ అయిన అన్న మాట. ఆధారంలోని మొదటి మూడక్షరాలను రివర్స్ చేస్తే మారుతి వస్తుంది. మారుతి అంటే హనుమంతుడు. కనుక, మారుతి సమాధానం.</p>
<p>3. నరసమాంబ తలలో మడత పడిన నాలుక (3)<br />
ఇక్కడ తల అంటే మొదటి భాగమనుకోవచ్చు. మొదటి మూడక్షరాలను తారుమారు చేస్తే రసన వస్తుంది. రసన అంటే నాలుక కనుక, అదే జవాబు.</p>
<p>4. ఎలుక గుట్టుగా ఉండే చోటు (3)<br />
గుట్టుగా అంటే నిగూఢంగా. ఆధారంలోని 2, 3, 4 వ అక్షరాలను తారుమారు చేయగా వచ్చే కలుగు ఈ ఆధారానికి సమాధానం.</p>
<p>5. నారిని లోభిగా మార్చే కంప్యూటరు (2)<br />
ఇది చాలా మంచి క్లూ. కూర్పరికి మంచి ఊహాశక్తి ఉందన్న విషయాన్ని సూచిస్తుంది. పర్సనల్ కంప్యూటరుకు పి.సి. పొట్టిరూపం కదా. నారికి ముందు పిసిని కలిపితే పిసినారి వస్తుంది. కనుక, సమాధానం పిసి.</p>
<p>6. కసరత్తు సరిపాళ్లతో పిండి కలిపితే అమ్మవారి నైవేద్యం రెడీ.<br />
ఇక్కడ సరిపాళ్లు అంటే కసరత్తు లోని 2, 4 వ అక్షరాలన్న మాట. 2, 4 సరి సంఖ్య (even number) కు చెందినవి. వాటిని కలిపితే సత్తు వస్తుంది. దీనికి పిండిని కలుపగా వచ్చే సత్తు పిండి సమాధానం.</p>
<p>7. వేరే ప్రశంస సరే, తీసి చూడు. లోపలి మార్గం కనిపిస్తుంది.<br />
మొదటి ఐదు అక్షరాలలోంచి సరే తీసివేయగా మిగిలినదాన్ని మిశ్రమం చేస్తే వచ్చే ప్రవేశం ఇక్కడ సమాధానం.</p>
<p>8. ఒక పురుగు విషం కూడా శుభమే<br />
ఇది మంచి క్లూ. దీనికి సమాధానం శ్రీ. శ్రీ అనే పదానికి (సాలె) పురుగు, విషం, శుభం అని అర్థాలున్నాయి.</p>
<p>9. ఇది ఆడవాళ్ల కేశపాశానికి ఉరి కాదు, ఆభరణం.<br />
దీనికి జవాబు జడకుచ్చు. ఎలా అంటే, కేశపాశానికి అంటే జడకు. ఉచ్చు అంటే ఉరి. జడకుచ్చులు ఒక రకమైన ఆభరణాలు. వ్యుత్పత్తిని పరిశీలిస్తే, జడకు ఉచ్చు అనే అర్థం వచ్చే అవకాశం ఉన్నా, వాస్తవంలో జడకు + ఉచ్చు (జడకు ఉరి) కాదు అన్నది ఇక్కడి ధ్వని.</p>
<p>10. నందమూరి గోల చేస్తే టూకిగా అది రక్తభరిత సమరమే.<br />
టూకీగా అంటే షార్ట్ ఫామ్ లో అన్న మాట. రక్త భరిత సమరమే &#8211; ఈ మూడు పదాల మొదటి అక్షరాలను కలిపితే వచ్చే రభస జవాబు.</p>
<p>11. అక్కడక్కడ వేలు మధ్యన చిక్కుకున్న శతకకారుడు (3)<br />
వేలు మధ్యన – దీనిలోని 1, 3, 5 వ అక్షరాలను కలుపగా వచ్చే వేమన దీనికి జవాబు.</p>
<p>12. రకరకములైన తినుబండారాలు తింటుంటే తిరిగి వచ్చే ధ్వని (4)<br />
ఇక్కడ తిరిగి వచ్చే అంటే రివర్స్ లో వచ్చే అన్న మాట. ఆధారంలోని మొదటి నాలుగు అక్షరాలను రివర్స్ చేస్తే వచ్చే కరకర జవాబు.</p>
<p>13. రాయలేని ఆటంకముతో చావు (3)<br />
ఇది కొంచెం జటిలమైన ఆధారం. ఆటంకముకు సమానార్థక పదం అంతరాయము. ‘రాయలేని’ అని ఉంది కనుక, అంతరాయము లోంచి ‘రాయ’ను తీసివేయాలి. అట్లా చేస్తే అంతము మిగులుతుంది. అంతము అంటే చావు.</p>
<p>14. వాడు పట్టుకుని చెల్లాచెదురైతే ఇక బట్టలెవడు కుడతాడు? (6)<br />
బట్టలెవడు కుడతాడు? అనే ప్రశ్నకు జవాబైన కుట్టుపని వాడు ఇక్కడ సమాధానం. ఆధారంలోని మొదటి ఆరు అక్షరాలను తారుమారు చెయ్యాలన్న మాట.</p>
<p>15. చేబదులు అక్కడక్కడ తీసుకుంటే రుచిగానే ఉంటుంది (2)<br />
ఆధారంలోని 1, 3 వ అక్షరాలను కలుపగా వచ్చే చేదు ఇక్కడ జవాబు. కాని, చేదు రుచిగా ఉండదు కదా, అని సందేహం కలుగవచ్చు ఎవరికైనా. అయితే ఇక్కడి చమత్కారమేమంటే, చేదు షడ్రుచులలో ఒకటి. కాబట్టి, అది ఆరు రుచులలోని ఒకటి అని చెప్పటం.</p>
<p>ఇంకా వేరే పత్రికల్లో కూడా ఇటువంటి ఆధారాలతో కూడిన పజిళ్లు వచ్చి ఉండవచ్చు. కాని, అవి నాకు అందుబాటులో లేవు. పైగా అన్నింటినీ ఉదాహరించలేం కదా.</p>
<p>ఈ విధంగా తెలుగు క్రాస్ వర్డ్ వికసనం చెందుతున్నదని భావించవచ్చు. ఈ ప్రక్రియకు మరింత ప్రాచుర్యం, వైభవం దొరకాలని, ఆ దిశగా ప్రయత్నం చేసేందుకు కొత్త కూర్పరులు పుట్టుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14368</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>‘ద హిందు’ క్రాస్ వర్డ్ పజిళ్లలోని చమత్కార వైవిధ్యం, విస్తృతి, వైచిత్రి</title>
		<link>http://vaakili.com/patrika/?p=13786</link>
		<comments>http://vaakili.com/patrika/?p=13786#comments</comments>
		<pubDate>Fri, 31 Mar 2017 21:48:42 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[ఎలనాగ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=13786</guid>
		<description><![CDATA[<p></p> <p>ఈ మధ్య అంతర్జాల పత్రికల్లో క్రాస్ వర్డ్ పజిళ్ల హవా బాగా వీస్తోంది. దీనికి ముఖ్య కారణం పజిల్ ప్రక్రియ పట్ల ఆ సంపాదకులకు గల అమితమైన ఆసక్తే కనుక, వారిని మనమెంతో అభినందించాలి. మామూలు పజిళ్లను ప్రచురించడానికి ఏ పత్రికలైనా ముందుకు వస్తాయి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. అభినందించవలసిందీ లేదు. కాని, జటిలతను కలిగిన ప్రామాణిక పజిళ్లను వేసుకోవటానికి వ్యాపార పత్రికలు చాలా సందేహిస్తాయి.</p> <p>నిగూఢ ఆధారాలు (cryptic clues) ఉండే ప్రామాణిక పజిళ్లతో మెదడుకు చాలా వ్యాయామం, తద్వారా మానసికానందం దొరుకుతాయి. భాషను మెరుగు పరచుకునే అవకాశం కూడా వాటి ద్వారా లభిస్తుంది. ప్రామాణిక ఆంగ్లపజిళ్ల లోని పద్ధతులను బాగా పరిశీలించి, ప్రయత్నం చేస్తే తెలుగులో కూడా నాణ్యమైన క్రాస్ వర్డ్స్ ను తయారు చెయ్యవచ్చు. ఆధారాలను కాపీ చెయ్యనక్కర్లేదు కాని, ఆధారాలను తయారు చేసే పద్ధతులను మనం తెలుగులో అవలంబించడం తప్పు కాదనుకుంటాను.</p> <p>కేవలం జటిలత్వాన్ని నింపుకున్న పజిళ్లు మెదడుకు మేతను బాగానే ఇవ్వవచ్చు కాని, అవి వినోదాన్ని కలిగించవు. ఒక ఆధారాన్ని ఆకళింపు చేసుకుని సరైన సమాధానాన్ని రాబట్టింతర్వాత పాఠకునికి ఆనందం, సంతృప్తి కలగాలన్నది పజిల్ కూర్పరుల ప్రధాన ధ్యేయం కావాలి.</p> <p>గ్రిడ్ (తెలుపు, నలుపు గడుల చట్రం) ను రూపొందించడం నుండే ప్రారంభమౌతుంది పజిల్ ను తయూరు చేసేవారి ప్రతిభ. ఏ పజిల్ గ్రిడ్ కైనా ద్వైపార్శ్వ సౌష్ఠవం (Bilateral symmerty) అతి ముఖ్యమైన prerequisite (ముందుగా అవసరమైన అంశం). ఎందుకంటే అది అందాన్ని చేకూరుస్తుంది. Bilateral symmetry లేకుండా గ్రిడ్ ను రూపొందించడం సులభం. కవిత్వంలోనైనా, కథలోనైనా లేక మరే సాహిత్య ప్రక్రియలోనైనా సౌందర్యం ప్రధానాంశంగా ఉండాలి. న్యూయార్క్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ‘ద హిందు’, ఇండియన్ ఎక్స్ ప్రెస్ మొదలైన క్రాస్ వర్డ్స్ లో కాని, పూర్వం శ్రీశ్రీ ఆరుద్రలు తయారు చేసిన క్రాస్ వర్డ్స్ లో కాని గ్రిడ్ సౌష్ఠవానికి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/puzzle.jpg"><img class="aligncenter size-full wp-image-13852" title="puzzle" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/03/puzzle.jpg" alt="" width="500" height="500" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఈ </span>మధ్య అంతర్జాల పత్రికల్లో క్రాస్ వర్డ్ పజిళ్ల హవా బాగా వీస్తోంది. దీనికి ముఖ్య కారణం పజిల్ ప్రక్రియ పట్ల ఆ సంపాదకులకు గల అమితమైన ఆసక్తే కనుక, వారిని మనమెంతో అభినందించాలి. మామూలు పజిళ్లను ప్రచురించడానికి ఏ పత్రికలైనా ముందుకు వస్తాయి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. అభినందించవలసిందీ లేదు. కాని, జటిలతను కలిగిన ప్రామాణిక పజిళ్లను వేసుకోవటానికి వ్యాపార పత్రికలు చాలా సందేహిస్తాయి.</p>
<p>నిగూఢ ఆధారాలు (cryptic clues) ఉండే ప్రామాణిక పజిళ్లతో మెదడుకు చాలా వ్యాయామం, తద్వారా మానసికానందం దొరుకుతాయి. భాషను మెరుగు పరచుకునే అవకాశం కూడా వాటి ద్వారా లభిస్తుంది. ప్రామాణిక ఆంగ్లపజిళ్ల లోని పద్ధతులను బాగా పరిశీలించి, ప్రయత్నం చేస్తే తెలుగులో కూడా నాణ్యమైన క్రాస్ వర్డ్స్ ను తయారు చెయ్యవచ్చు. ఆధారాలను కాపీ చెయ్యనక్కర్లేదు కాని, ఆధారాలను తయారు చేసే పద్ధతులను మనం తెలుగులో అవలంబించడం తప్పు కాదనుకుంటాను.</p>
<p>కేవలం జటిలత్వాన్ని నింపుకున్న పజిళ్లు మెదడుకు మేతను బాగానే ఇవ్వవచ్చు కాని, అవి వినోదాన్ని కలిగించవు. ఒక ఆధారాన్ని ఆకళింపు చేసుకుని సరైన సమాధానాన్ని రాబట్టింతర్వాత పాఠకునికి ఆనందం, సంతృప్తి కలగాలన్నది పజిల్ కూర్పరుల ప్రధాన ధ్యేయం కావాలి.</p>
<p>గ్రిడ్ (తెలుపు, నలుపు గడుల చట్రం) ను రూపొందించడం నుండే ప్రారంభమౌతుంది పజిల్ ను తయూరు చేసేవారి ప్రతిభ. ఏ పజిల్ గ్రిడ్ కైనా ద్వైపార్శ్వ సౌష్ఠవం (Bilateral symmerty) అతి ముఖ్యమైన prerequisite (ముందుగా అవసరమైన అంశం). ఎందుకంటే అది అందాన్ని చేకూరుస్తుంది. Bilateral symmetry లేకుండా గ్రిడ్ ను రూపొందించడం సులభం. కవిత్వంలోనైనా, కథలోనైనా లేక మరే సాహిత్య ప్రక్రియలోనైనా సౌందర్యం ప్రధానాంశంగా ఉండాలి. న్యూయార్క్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ‘ద హిందు’, ఇండియన్ ఎక్స్ ప్రెస్ మొదలైన క్రాస్ వర్డ్స్ లో కాని, పూర్వం శ్రీశ్రీ ఆరుద్రలు తయారు చేసిన క్రాస్ వర్డ్స్ లో కాని గ్రిడ్ సౌష్ఠవానికి చాలా ప్రాధాన్యం ఇవ్వబడటానికి కారణం అదే. గ్రిడ్ ను చూడగానే అది కక్కరిబిక్కరిగా ఉన్నట్టనిపిస్తే అందులో సౌందర్యాభాస లోపిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.</p>
<p>ఆంగ్ల పజిళ్లలోని చమత్కారవిస్తృతిని, వైచిత్రిని లోతుగా పరిశీలించడం ఎందుకు అవసరమంటే, తెలుగులో కూడా ఎన్నెన్ని రకాలుగా కొత్తదనాన్ని ప్రవేశపెడుతూ ఆధారాలను తయారు చెయ్యవచ్చునో దానిద్వారా తెలుస్తుంది మనకు. అయితే ఆంగ్ల పజిళ్లలోని వైవిధ్యాన్ని, వైచిత్రిని సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకోవాలంటే ఇంగ్లిష్ భాష బాగా రావటమే కాకుండా, ఆధారాలలోని రహస్యాన్ని decipher (decode) చేయగలిగే మేధ, ఊహాశక్తి అవసరం. ఆంగ్ల పజిళ్లలోని వైచిత్రిని వివరించడం ద్వారా తెలుగు పజిల్ కూర్పరులలో ఈ విషయం గురించిన అవగాహనను మరింతగా పెంచడానికి చేస్తున్న ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని భావించాలి. ఇంతకు ముందు ఇదే ‘వాకిలి’ పత్రిక ద్వారా ఇటువంటి ఒక చిన్న వ్యాసాన్ని అందించాను. కాని, అది సరిపోదనేది నిశ్చయం. కాబట్టి, ‘ద హిందు’ పజిళ్లలోని కొన్ని ఆధారాలను మీ ముందుంచి, వాటిని ఎలా decode చేయాలో ఒకదాని తర్వాత మరొకదాన్ని వివరిస్తాను.</p>
<p>1. Drop engineering degree one day (4)<br />
దీనికి సమాధానం bead. ఎట్లా అంటే, engineering degree = B.E. ఇక one కు a, day కు d తీసుకుని BE కి కలపాలి. Bead = Drop. నీటి బిందువులను beads అని కూడా అంటారు ఆంగ్లంలో. ఉదాహరణకు చెమట బిందువులను beads of sweat అనటం మామూలే.</p>
<p>2. Bird in hurry to follow time by the hour (5)<br />
Time కు t, hour కు h తీసుకోవాలి. Hurry = rush కనుక, మూడింటినీ కలిపితే వచ్చే thrush( ఒక పక్షి పేరు) దీనికి జవాబు.</p>
<p>3. Group has means to buy bone and couple of eggs (7)<br />
Means = plan. Bone అన్నప్పుడు tibia లోని మొదటి అక్షరమైన t ని తీసుకోవాలి. టిబియా మన మోకాలిలో ఉండే ఒక ఎముక పేరు. Eggs = oo. Plan లో too ను (t+oo) చేర్చితే platoon వస్తుంది. సైన్యంలో ఉండే పదాతిదళం లోని ఒక విభాగాన్ని platoon అంటారు. అది ఒక రకమైన గ్రూపే కదా! కనుక అదే సమాధానం.</p>
<p>4. Article submitted by scholar has radical answers on law related to heat (7)<br />
A, An, The &#8211; వీటిని ఆంగ్లభాషలో articles అంటాం కదా. సందర్భాన్ని బట్టి వీటిలోని ఒకదాన్ని తీసుకోవాలి. ఇక్కడ the ని తీసుకోవాల్సి వుంటుంది. Radical కు r తీసుకోవాలి. Scholar కు m తీసుకోవాలని ఒక నియమం (mనే ఎందుకు తీసుకోవాలో తెలియదు). తర్వాత answerకు a నూ, law కు L నూ తీసుకుని కలపటంతో వచ్చే thermal దీనికి సమాధానం. Thermal = related to heat.</p>
<p>5. General overturned advance against downwind (7)<br />
General కు Lee ని తీసుకోవాలి. బహుశా పూర్వం ప్రపంచ యుద్ధంలో పని చేసిన ఒక ప్రసిద్ధ జనరల్ పేరు లీ కావటం అందుకు కారణం కావచ్చు. Advance = Draw. Overturned అంటున్నాం కనుక, draw ను తారుమారు చెయ్యాలి. అప్పుడు ward వస్తుంది. Lee + ward = Leeward = Downwind. Leeward జవాబు.</p>
<p>6. Infants suffer from blood loss, replenished with serum at the heart for disease (6)<br />
Infants = Babies. Blood loss అన్నాం కనుక, blood లోని మొదటి అక్షరమైన b ని తీసెయ్యాలి. అప్పుడు abies మిగులుతుంది. B ని ఖాళీ చేయగా ఏర్పడిన స్థానాన్ని serumకు హృదయం (మధ్య అక్షరం) అయిన r తో భర్తీ చెయ్యాలి (replenish చెయ్యాలి). అప్పుడు Rabies వస్తుంది. Rabies ఒక వ్యాధి పేరు కాబట్టి అదే సమాధానం!</p>
<p>7. Black market amasses billion (5)<br />
Market = Sale (Verb form లో). అది బిలియన్ ను పోగు/జమ చేసుకుంటుంది అంటున్నాం కనుక, billion లోని మొదటి అక్షరమైన b ని నడుమ చేర్చాలి. అప్పుడు వచ్చే sable ( black) సమాధానం.</p>
<p>8. Cab doesn’t start without maiden – that’s taken for granted (5)<br />
Cab = Taxi. Doesn’t start అంటున్నాం కనుక t ని తీసేస్తే axi మిగులుతుంది. ఇక without maiden అంటే with out maiden అన్న మాట. Out లోని o ను, maiden లోని m ను axi కి కలుపగా వచ్చే axiom దీనికి సమాధానం. With out maiden అని పదాలను విడివిడిగా కాక, without maiden అని కలిపి ఇవ్వటం పాఠకులను తికమక పెట్టటం కోసమే! Axiom అంటే సూక్తి. సూక్తులలోని అర్థాన్ని ప్రశ్నించకుండానే మనం ఒప్పుకుంటాం కదా. Taking for granted కు ఉన్న అర్థాలలో ఇదొకటి.</p>
<p>9. Autographed and gestured everybody to leave (6)<br />
Autographed కు సమానమైన signed దీనికి సమాధానం. అది ఎట్లా వచ్చిందంటే, gestured = signalled. Everybody = All. కాబట్టి, signalled లోంచి all వెళ్లిపోగా signed మిగిలింది!</p>
<p>10. Care-givers lose head getting President’s top prize amounts (6)<br />
Care-givers = Nurses. వాళ్లు n ను (తలను) పోగొట్టుకుని, అదే స్థానంలో president లోని మొదటి అక్షరమైన p ని పొందారు. తత్ఫలితంగా ఏర్పడిన purses (prize amounts) ఇక్కడ జవాబు. పూర్వకాలంలో రాజులకు ఇవ్వబడిన భరణాలను purses అనేవారు.</p>
<p>11. Sing about each district magistrate being routine (9)<br />
Sing = Trill. Each లోని మొదటి రెండక్షరాలైన ea, district లోని d, magistrate లోని m తీసుకుని Trill లో చేర్చితే వచ్చే treadmill దీనికి సమాధానం. నిజానికి ట్రెడ్ మిల్ అంటే శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడం కోసం ఉపయోగించే ఒక సాధనం. దానికి ఉండే బెల్టు మీద నడుస్తాం. అయితే ఇక్కడ treadmill అంటే విసుగును తెప్పించే పని/ఉద్యోగం అనే మరో అర్థాన్ని ఉద్దేశించాడు setter (పజిల్ కూర్పరి).</p>
<p>12. Vandals remove top of fortifications and get hard (7)<br />
Vandals అంటే విధ్వంసాన్ని సృష్టించేవాళ్లు. దీనికి సమానమైన Hunkers ఈ ఆధారానికి జవాబు. ఎలా అంటే, fortifications = bunkers. దీనిలోని అగ్రభాగాన్ని (topను – అంటే b అనే అక్షరాన్ని) తీసేసి, అదే స్థానంలో h ను (Hard లోని మొదటి అక్షరాన్ని) పెట్టాలి.</p>
<p>13. Police novice yearning to overspend (7)<br />
Police = SP (Superintendent of police). Novice = Learner కాబట్టి మొదటి అక్షరమైన L ను తీసుకోవాలి. Yearning = urge. వీటన్నిటినీ కలిపితే వచ్చే splurge దీనికి జవాబు. Splurge అంటే బాగా ఖర్చు చేయటం. ఇక్కడ police అనే పదం ఆధారంలో క్రియగా లేదా విశేషణంగా, సమాధానంలోనేమో నామవాచకంగా ఇవ్వబడినట్టు గమనించాలి.</p>
<p>14. The last run one requires to get a score a week after the thirteenth (9)<br />
ఇక్కడ score కు ఇరవై అనే మరో అర్థాన్ని తీసుకోవాలి. ఒక స్కోర్ (20) ను సాధించడానికి అవసరమైన చివరిది ఇరవయ్యో పరుగు కనుక, సమాధానం twentieth. ఇది పదమూడో తేదీ తర్వాత వారం (ఏడు) రోజులకు వస్తుంది!</p>
<p>15. Urge deviant NGOs to make drinks (7)<br />
To egg on అంటే ప్రోత్సహించుట. కనుక, egg ను urge కు సమానార్థక పదంగా తీసుకోవచ్చు. Deviant NGOs = NOGS. రెండింటినీ కలుపగా వచ్చే Eggnogs కోడిగుడ్డు సొనతో తయారు చేయబడే ఒక రకమైన డ్రింక్స్. వీటిని ఎక్కువగా పాశ్చాత్యులు తాగుతారు.</p>
<p>16. Graduate takes public transport to Hong Kong wearing a scarf (8)<br />
Graduate = B.A. Public transport = bus. Hong Kong = HK. Ba, bus, hk – ఇవన్నీ కలిసి స్కార్ఫ్ కు ముందున్న a ను ధరిస్తాయి. వీటన్నిటినీ కలిపితే వచ్చే Babushka ఒక రకమైన స్కార్ఫ్ కనుక అదే జవాబు.</p>
<p>17. Last month Indian Military Academy student got this point, perhaps (7)<br />
Last month అంటే సంవత్సరంలోని చివరి నెల అయిన December. దానికి short form అయిన Dec ను తీసుకోవాలి. Indian Military Academy కి short form IMA. Student = Learner కనుక, ఇక్కడ L ను తీసుకోవాలి. Dec + ima + l = Decimal = Point. కాబట్టి జవాబు అదే.</p>
<p>18. Some Africans admit soldier to Bangalore University at first (5)<br />
ఇటువంటి క్రాస్ వర్డ్ పజిళ్లలో ఎక్కడైనా సోల్జర్ అనే పదం వస్తే దానికి సమానార్థకంగా ant తీసుకోవాలి. Bangalore University at first (first letters) = BU. Bu మధ్య ant చేరగా ఏర్పడే Bantu ఆఫ్రికాలోని ఒక తెగ పేరు కనుక, అదే సమాధానం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి సోల్జర్ కు GI తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా కొన్ని సార్లు worker కు ant ను తీసుకోవాలి. చీమలు ఆపకుండా పని చేస్తాయని అలా నిర్ణయించి వుంటారు.</p>
<p>19. Mounted soldiers from Virginia in California get royal salary at last (7)<br />
To mount అంటే ఎక్కుట. Mounted soldiers అంటే గుర్రమెక్కిన సిపాయిలు. అంటే అశ్వదళమన్న మాట. దీనికి సమానమైన ఆంగ్ల పదం cavalry. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి CAL, వర్జీనియా రాష్ట్రానికి VA, short forms. Cal లో va చేరితే Caval వస్తుంది. తర్వాత Royal లోని మొదటి అక్షరమైన r నూ, salary లోని చివరి అక్షరమైన y నీ చేర్చాలి. అన్నింటినీ కలిపితే వచ్చే Cavalry దీనికి సమాధానం!</p>
<p>20. Cheerfulness shown by girl, one that is typically disheartened (6)<br />
Girl = G. One = a. That is = i.e. Typically disheartened అంటే మొదటి, చివరి అక్షరాలను తప్ప మధ్యన ఉన్న అక్షరాలను (అవి హృదయానికి సమానమైనవి – ఇక్కడ ypicall) తీసేయడం. అట్లా చేస్తే ty మాత్రమే మిగులుతాయి. G + a + ie + ty = gaiety = cheerfulness. కనుక gaiety జవాబు.</p>
<p>21. Good, mostly willing to become educated (4-4)<br />
Good = well. Willing = ready. Mostly (చాలా వరకు) అంటున్నాం కనుక y ని వదిలేసి read మాత్రమే తీసుకోవాలి. Well read = educated కనుక, అదే జవాబు.</p>
<p>22. Limitless fire at building, smoke is annoying (7)<br />
Limits అంటే సరిహద్దులు, లేక పొలిమేరలు. ఇక్కడ fire లోని మొదటి, చివరి అక్షరాలు (f,e) అన్న మాట. అవి పోగా మిగిలేవి i,r. Building smoke అంటే smoke లోని అక్షరాలను (పునర్) నిర్మించాలి. అప్పుడు ksome వస్తుంది. ir + ksome = irksome = annoying. కాబట్టి ఇక్కడ irksome అన్నది జవాబు.</p>
<p>23. Missing sources of fine art via lethargy (7)<br />
ఇక్కడ sources అంటే ప్రథమాక్షరాలు. Fine, art, via – ఈ మూడు పదాల మొదటి అక్షరాలైన f, a, v లను miss చేస్తే (తొలగిస్తే) మిగిలేది inertia = lethargy. కనుక జవాబు inertia.</p>
<p>24. Poets are leading drunks in pubs (5)<br />
Pubs = Bars. Leading drunks అంటే drunks లోని మొదటి అక్షరమైన d. Bars లో d ని చేర్చగా వచ్చే bards జవాబు. Bard = poet.</p>
<p>25. Asian engineer protected by giant (7)<br />
Asian కు సమనమైన Tibetan ఇక్కడ జవాబు. అది ఎట్లా వచ్చిందంటే, Giant = titan. Engineer = B.E. Titan లో be పెడితే Tibetan వస్తుంది. Protect అంటే చుట్టూ ఉండటమన్న మాట. Be చుట్టు (రెండు వైపులా) titan ఉన్నదని ఆధారంలో అన్యాపదేశంగా చెప్పబడింది.</p>
<p>26. Final villager falls into grave in famine (6)<br />
ఇక్కడ death ను grave కు సమానార్థక పదంగా తీసుకోవాలి. Final villager అంటే villager లోని చివరి అక్షరమైన r అన్న మాట. Death లో r ను చేర్చగా వచ్చే dearth = famine. ఇక్కడ dearth సమాధానం.</p>
<p>27. Fan’s vow in the future (8)<br />
ఈ వాక్యానికి అర్థం, ‘భవిష్యత్తులో నేను చేస్తాను’ అనే అభిమాని యొక్క ప్రతిజ్ఞ/వాగ్దానం &#8211; అని. ఈ ఆధారానికి సమాధానం idolater. ఆరాధకుణ్ని ఆంగ్లంలో idolater అంటాము. దీన్ని I do later అని విభజిస్తే అది భవిష్యత్తులో నేను చేస్తాను అనే అర్థాన్ని సూచిస్తుంది!</p>
<p>28. Enlist courtiers to regulate, dethroning other small chiefs (7)<br />
Enlist కు సమానార్థక పదమైన recruit దీనికి జవాబు. Other small chiefs అంటే ఆ రెండు పదాల ప్రథమాక్షరాలు &#8211; s,c అన్న మాట. వాటిని courtiers లోంచి తొలగించి తారుమారు (regulate) చేస్తే recruit వస్తుంది!</p>
<p>29. Images of international fraud found at stations primarily (5)<br />
International కు i, fraud కు con (మోసం) ను తీసుకోవాలి. Stations primarily అంటే మొదటి అక్షరమైన s అన్న మాట. వీటన్నిటినీ కలిపితే icons = images. కాబట్టి icons సమాధానం.</p>
<p>30. Getting used to one day at fair in Germany’s capital (9)<br />
One కు a, day కు d, fair కు just (fair కు సమానార్థక పదం), Germany కి g తీసుకోవాలి. ఆధారంలోని in ను g కి ముందు ఉంచాలి. అన్నిటినీ కలిపితే వచ్చే adjusting (getting used to) ఈ ఆధారానికి సమాధానం. ఇక్కడ capital అంటే రాజధాని అని కాక, తల (మొదటి అక్షరం) అని అర్థం చేసుకోవాలి.</p>
<p>31. Definitely rude when European butts in (6)<br />
Rude కు సమానార్థక పదం surly. European లోని మొదటి అక్షరమైన e ని surly లో చేర్చాలి. అప్పుడు వచ్చే surely (definitely) సమాధానం. To butt in అంటే లోపలికి రావడం.</p>
<p>32. Fight and run into a fit of shivering (5)<br />
వణుకును కలిగించే చలిజ్వరాన్ని ఆంగ్లంలో ague అంటారు. దానిలో run కు మొదటి అక్షరమైన r ను చేర్చితే వచ్చే argue (fight) సమాధానం.</p>
<p>33. Scolding fool in South Africa summoning someone in Telugu repeatedly (9)<br />
ఇదొక గమ్మత్తైన క్లూ. Fool కు సమానార్థక పదమైన ass ను తీసుకుని, దాన్ని SA లో (South Africa లోని ప్రధానాక్షరాలు) చేర్చాలి. Sassa వచ్చింది కదా. ఇక summoning someone in Telugu అంటే ‘రా’ ( summoning &#8211; పిలవడం) కు సమానమైన ra అనే అక్షరాలు. వాటిని ఉంచాలి. Repeatedly అంటున్నాడు కాబట్టి మరొక ra చేర్చాలి. అంతా కలిపితే వచ్చే sassarara (scolding) దీనికి సమాధానం.</p>
<p>34. Hunter man leaves Kashmiri dazed (7)<br />
Hunter కు సమానమైన shikari సమాధానం. Man లోని మొదటి అక్షరమైన m ను Kashmiri లోంచి తీసేసి తారుమారు చేస్తే shikari వస్తుంది. ఇక్కడ dazed తికమక/తడబాటు/కకావికలును సూచిస్తుంది.</p>
<p>35. Horrid North Arcot pigpen (5)<br />
ఇటువంటి ఆంగ్ల పజిళ్లలో pen లేక pigpen వచ్చినప్పుడు, sty (పందుల దొడ్డి) ని తీసుకోవాలి. అది pen కు ఉన్న మరో అర్థం. North Arcot లోని ప్రధానాక్షరాలైన Na పక్కన sty పెడితే వచ్చే nasty (horrid) సమాధానం.</p>
<p>36. Enclosure with silver found in church (4)<br />
Silver కు సింబల్ Ag. Church కు CE (Church of England) తీసుకోవాలని నియమం. దానిలో ag ని చేర్చగా వచ్చే cage (enclosure) జవాబు.</p>
<p>37. What goes ahead of the act in favour of Oriental pal tired at end of day (8)<br />
In favour of = for. Oriental = eastern కనుక మొదటి అక్షరమైన e ని తీసుకోవాలి. Pal tired at అన్నప్పుడు అక్షరాలను తారుమారు చేయగా వచ్చే pla, end of the day అన్నప్పుడు day లోని చివరి అక్షరమాన y ని తీసుకోవాలి. అన్నిటినీ కలిపితే వచ్చే foreplay (what goes ahead of the act) సమాధానం.</p>
<p>38. Great! That woman’s beginning to overtake spiderman, for example<br />
(9)<br />
Great = Super. That woman’s = her. Beginning to overtake = overtake లోని మొదటి అక్షరమైన o. అన్నిటినీ కలిపితే వచ్చే superhero సమాధానం. spiderman సూపర్ హీరోకు కు ఒక ఉదాహరణ కదా.</p>
<p>39. New Indian transforms as Desh ki Beti (7)<br />
New కు n తీసుకుని, తర్వాత Indian లోని అక్షరాలను తారుమారు చేయగా వచ్చే andini ను కలుపగా ఏర్పడే nandini దీనికి సమాధానం.</p>
<p>40. Indian dish for one in Indian chariot (5)<br />
Indian chariot కు ఇక్కడ rata తీసుకున్నాడు setter. One ను సూచించే i ని rata లో చేర్చగా వచ్చే raita (Indian dish) దీనికి సమాధానం. హిందు పత్రికలోని పజిళ్లను తమిళులు కూరుస్తారు. తమిళంలో మహాప్రాణాక్షరాలు లేవు. భక్తిని బక్తి అనీ, ప్రభాతాన్ని ప్రబాతం అనీ, రథంను రతం అనీ ఉచ్చరిస్తారు కనుక, ratha అనకుండా rata అన్నాడు. రైతాను కూడా తమిళేతరులైతే raitha అని రాసే అవకాశాలు ఎక్కువ.</p>
<p>41. Swell time no good to return to initial position (9)<br />
Swell = Boom. Time = era (శకం). No Good లోని మొదటి అక్షరాలను (ng లను) పక్కన చేర్చాలి. అన్నిటినీ కలుపగా వచ్చే boomerang (to return to initial position) జవాబు. ఇక్కడ బూమెరాంగ్ క్రియాపదంగా ఇవ్వబడింది. నామవాచకమైన బూమెరాంగ్ కూడా ఉంటుంది.</p>
<p>42. Spiritual leader is cautious entering support group for drunks (7)<br />
దీనికి జవాబు acharya. ఎలా అంటే, cautious కు సమానార్థక పదం chary. AA = Alcoholics Anonymous. అది మద్యానికి బానిసలైన వాళ్లకు సహాయ సహకారాలనందించే ఒక గ్రూపు. AA లో chary ని చేర్చగా వచ్చే acharya (spiritual leader) సమాధానం.</p>
<p>43. Old and every so often unsteady (4)<br />
Unsteady లోని 1, 3, 5, 7 వ అక్షరాలను కలుపగా వచ్చే used (old) దీనికి సమాధానం.</p>
<p>44. Grandchild lacking blood group system developed protection (8)<br />
బ్లడ్ గ్రూపులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ABO system, మరొకటి Rh system (ఈ పదాన్ని Rhesus అనే కోతి పేరులోంచి తీసుకున్నారు). రెండవదానిలో Rh plus, Rh minus అని మళ్లీ రెండు రకాలు. అందుకే మన బ్లడ్ గ్రూపును A +ve, అనో B -ve అనో చెప్తాం. Grandchild లోంచి rh ను తొలగించి కలగాపులగం చేస్తే వచ్చే cladding సమాధానం. Cladding అంటే కవచం, లేక పూత.</p>
<p>45. Restored short rebus – it included 3rd of July (7)<br />
దీనికి సమాధానం rebuilt. ఎలా అంటే, short rebus = rebu (పొట్టిది అంటున్నాం కనుక, ఒక అక్షరాన్ని తగ్గించాలి.) తర్వాత July లోని మూడవ అక్షరమైన L ను it లో కలిపి మిశ్రమం చెయ్యాలి. తత్ఫలితంగా rebuilt (restored) ఏర్పడుతుంది.</p>
<p>46. Victor joins party to meet model with American historian (9)<br />
దీనికి జవాబు Herodotus. Victor = Hero. Party = do. Model కు t ని తీసుకోవాలి (దీన్ని model T Ford నుండి తీసుకున్నారు). ఇక American కు US ను తీసుకుని, అన్ని అక్షరాలను వరుసగా రాయాలి. Herodotus ఒక చరిత్రకారుని పేరు.</p>
<p>47. Automobile company fired head of vehicles for tin – It may blow out (5)<br />
దీనికి సమాధానం volcano. ఎలా అంటే, automobile company = Volvo. Fire అంటే (ఉద్యోగంలోంచి) తొలగించడం. Vehicles కి head అయిన v ని Volvo లోంచి తొలగించి, దాని స్థానంలో tin కు సమానమైన can ను చేర్చాలి.</p>
<p>48. Before team takes books to chairman (9)<br />
Before = Pre. Team = side (ఆటల్లో ఒక వైపున ఆడే టీమును సైడ్ అంటాం కదా). Books = NT. ఎందుకంటే బైబిల్ గ్రంథం పాత వర్షన్ ను OT (Old Testament) అనీ, కొత్త వర్షన్ ను NT (New Testament) అనీ అంటారు. Pre + side + nt = president = chairman. కనుక president సమాధానం.</p>
<p>49. Teachers taking back prize (6)<br />
ఇక్కడ టీచర్స్ అంటే NUT (National Union of Teachers) తీసుకోవాలి. ఇక prize కు gem తీసుకుని రివర్స్ చెయ్యాలి. రెండింటినీ కలిపితే వచ్చే nutmeg (ఒక రకమైన సుగంధ ద్రవ్యం) జవాబు.</p>
<p>50. Bowler mostly bends this (5)<br />
ఇక్కడ elbow ఎందుకు జవాబంటే, bowler చాలా వరకు మోచేయిని వంచుతాడు కనుక. ఇక మరో రకంగా చూస్తే bowler అనే పదంలోని చాలా వరకు (ఐదక్షరాలను) వంచితే కూడా elbow వస్తుంది. ఇదే ఈ ఆధారంలోని చమత్కారం.</p>
<p>51. Confusion as one of the lights gets no power (6)<br />
Confusion కు సమానార్థక పదమైన bedlam ఇక్కడ జవాబు. Light = bed lamp. అందులోంచి p (power) మాయమైతే bedlam వస్తుంది.</p>
<p>52. Force to do nothing, 50% fall for handyman (8)<br />
Force కు F తీసుకోవాలి. To do = act. Nothing = o. తర్వాత 50% fall కు tum ఎందుకు తీసుకోవాలంటే, tumble లో ble (చివరి యాభై శాతం) పడిపోతే tum మిగుల్తుంది కనుక. ఇప్పుడు అన్నిటినీ కలుపగా వచ్చే factotum (handyman) సమాధానం.</p>
<p>53. Summer resident in the African savannah, perhaps (5)<br />
ఇది మరొక చమత్కార భరితమైన క్లూ. ఇక్కడ summer అంటే వేసవి కాదు. దానికి పాము అనే అర్థాన్ని ఊహించుకోవాలి. ఎందుకంటే sum = add. Summer = adder. ఆంగ్లంలో adder పదానికి పాము అనే అర్థం ఉంది. సవానాలు ఆఫ్రికా ఖండంలోని ఒక రకమైన అడవులు.</p>
<p>54. Play for fifty and one hundred (6)<br />
రోమన్ సంఖ్యల ప్రకారం fifty = L, one = I, one hundred = C. ఇక play for అంటున్నాడు కనుక, for తో అక్షరక్రీడ సలుపగా వచ్చే fro ను తీసుకోవాలి. Fro + l = i = c = frolic. Frolic కు కేళి అనే అర్థం ఉంది.</p>
<p>55. Refuse to stay in Sicily after vacation – there’s hardly anything (6)<br />
మనం దేన్నైనా నిరాకరించేటప్పుడు ‘నా వల్ల కాదు’ అనే వాక్యాన్ని వాడుతాం కదా. దాన్ని ఆంగ్లంలో I can’t అంటాం. కనుక ఇక్కడ refuse = can’t. ఇక Sicily after vacation అంటే Sicily లోని మధ్య అక్షరాలను (icilను) vacate చేయగా వచ్చే sy అన్న మాట. Sy లో cant ను చేర్చగా వచ్చే scanty జవాబు. Scanty కి స్వల్పము, లేశము, కొంచెము అని అర్థాలున్నాయి. దీన్నే ఆంగ్లంలో There is hardly anything అన్నాడు setter.</p>
<p>56. For sixty seconds hospital department became famous (9)<br />
Pro = for కనుక for కు pro తీసుకోవాలి. Sixty seconds = one minute కనుక దానికి పొట్టి రూపమైన min తీసుకోవాలి. Hospital department అన్నప్పుడు OP గాని, ENT గాని తీసుకోవాలి. Pro + min + ent = prominent (famous) జవాబు.</p>
<p>57. Late, therefore article returned by setter (8)<br />
Therefore = So. Article returned అన్నప్పుడు article కు సమానమైవ item ను తారుమారు చేయగా వచ్చే meti తీసుకోవాలి. తర్వాత setter అంటే పజిల్ కూర్పరి (one who sets puzzles). ఈ పదానికి me తీసుకోవాలని చెప్పబడింది. అవే అక్షరాలను ఎందుకు తీసుకోవాలో తెలియదు. So + meti + me = Sometime కనుక అదే జవాబు.</p>
<p>58&#8230;. draws into sailors’ circles (7)<br />
Drawing in అంటే పీల్చుకోవడం లాంటిది కనుక, draws in కు సమానార్థక పదమైన absorbs ఈ ఆధారానికి జవాబు. ఎట్లా అంటే, ఇటువంటి పజిళ్లలో sailor వచ్చినప్పుడు దానికి సూచకమైన AB తీసుకోవాలి. పురాతన కాలంలో ఓడలకు మోటార్లు ఉండేవి కావు. బలిష్ఠులైనవారే (దృఢమైన శరీరమున్నవారే) చాలా మంది కలిసి పెద్దపెద్ద తెడ్లతో ఓడను నడిపేవారు. వాళ్లను Able Bodied men అనేవారు కనుక, దానికి పొట్టి రూపమైన AB ని వాడటం ఆనవాయితీ అయిపోయింది. ఇక్కడ ఆ పదం బహువచనంలో వాడబడింది కాబట్టి Abs తీసుకోవాలి. ఇక circles కు సమానమైన orbs ను (ఇది orbits కు పొట్టి రూపం) abs కు కలపాలి. ఫలితంగా వచ్చే absorbs జవాబు.</p>
<p>59. A crowd without energy, a shape-shifting entity (6)<br />
A crowd = a mob. Without energy అంటే with out energy. Energy లోని బయటి (చివరి) అక్షరమైన e అన్న మాట. దీన్ని mob లో దూర్చితే moeb వస్తుంది. తర్వాత, ఆధారంలోని a ను చివర్న రాయాలి. A + moeb + a = Amoeba. అమీబా తన శరీరాకారాన్ని నిరంతరం మార్చుకునే ఏకకణ జీవి. అదే జవాబు.</p>
<p>60. Father’s state: about to turn bankrupt (6)<br />
Father = Pa. State = UP (ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం). About = Re (regarding కు పొట్టి రూపం). దాన్ని తారుమారు చేస్తే er వస్తుంది. అన్నిటినీ కలిపితే వచ్చే pauper = bankrupt. కనుక, pauper జవాబు.</p>
<p>61. Gradually convert gold hoarded by politician at home (5)<br />
Politician = MP. Gold కు సాధారణంగా Au (Aureum కు పొట్టి రూపం) తీసుకుంటాం. కాని, ఇక్కడ or తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని mp లో చేర్చినప్పుడు morp వస్తుంది. At home అన్నాడు కనుక home లోని మొదటి అక్షరమైన h ను కలపాలి. తత్ఫలితంగా ఏర్పడే morph = gradually convert. కనుక అదే జవాబు. నిజానికి ఇటువంటి పజిళ్లలో at home కు in ను తీసుకోవాల్సిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసర్లు తమ రూములో ఉన్నప్పుడు IN, బయట ఉన్నప్పుడు OUT అనే బోర్డులను పెడతారు.</p>
<p>62. Monster runs away from mate (5)<br />
Mate = Friend. Runs లోని మొదటి అక్షరమైన r ను friend లోంచి తొలగిస్తే fiend వస్తుంది. దీనికి భూతం/దయ్యం అనే అర్థం ఉంది. అది monster కు దాదాపు సమానమైన పదం కనుక, fiend జవాబు.</p>
<p>63. Influential people with firm flipping hat (6)<br />
Firm = company. దానికి పొట్టి రూపం Co. Firm flipping (returning) అన్నాడు కనుక Co, oc గా మారుతుంది. Hat = topi టోపి. Oc + topi = octopi. ఇది octopus కు బహువచనం. పలుకుబడి కలిగిన బడా బాబులను sharks, octopi అంటారు కనుక, జవాబు octopi. నిజానికి ప్రామాణిక ఆంగ్లభాష ప్రకారం octopus కు బహువచనం octopuses. కాని, ఇటువంటి పజిళ్లలో చాలా సార్లు కొంచెం దూరంగా ఉండే అర్థాన్నిచ్చే పదాలను జవాబుగా ఇస్తారు. అది ఉద్దేశపూర్వకమైన చర్య.</p>
<p>64. Fault, pass, featuring regularly in European mountains (4)<br />
ఇక్కడ featuring regularly అంటే మధ్యమధ్య/సమాన దూరంలో అని అర్థం. Fault pass లోని 2, 4, 6, 8 వ అక్షరాలను కలిపితే వచ్చే Alps దీనికి జవాబు. ఈ పర్వతాలు యూరపులో ఉన్నాయి.</p>
<p>65. Regulars save good rum (7)<br />
Rum అంటే విచిత్రమైన. Surreal దీనికి దగ్గరగా వస్తుంది కనుక, అదే సమాధానం. Save అంటే వినా/రహితంగా అని మరొక అర్థం కనుక, good లోని మొదటి అక్షరమైన g ని regulars లోంచి మైనస్ చేసి కలగాపులగం చేస్తే surreal వస్తుంది. చూశారా, ఈ ఆధారం తెలుగు పజిళ్లలోని ఆధారాలకు రెండు విధాలుగా భిన్నంగా ఉంది. ఒకటి, good అంటే g తీసుకోవాలి. తల, ప్రారంభం, మొదలు గట్రా ఏ సూచనా ఉండదు. ఇక రెండవది, తారుమారు చేయాలని ఎక్కడా చెప్పలేదిందులో. Rum దాన్ని అన్యాపదేశంగా సూచిస్తున్నదని భావించాలి.</p>
<p>66. No. 1 to score (8)<br />
Score = 20 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ setter (పజిల్ కూర్పరి) No తర్వాత చుక్క పెట్టి పాఠకులను మరింతగా తికమక పెట్టదల్చుకున్నాడు. No. 1 to score అంటే ఇరవైకన్న ఒకటి తక్కువ అని అర్థం. అందుకే జవాబు nineteen.</p>
<p>67. Proved, our doctors too arrogant (9)<br />
మామూలుగా చూస్తే, మన డాక్టర్లు దురుసైనవాళ్లని నిరూపితమైంది అనే అర్థం వస్తుంది ఈ వాక్యంలో! (చాలా వరకు ఆధారాలు ఇట్లానే ఉంటాయి). కాని, ఈ అర్థాన్ని పట్టుకుని క్లూను ఛేదించాలని ప్రయత్నిస్తే విజయాన్ని సాధించలేం. ఈ నియమం పజిళ్లలో చాలా తరచుగా వర్తిస్తుంది. ఇక్కడ proved our అన్నది anagram. అందులోని అక్షరాలను మిశ్రమంచేస్తే వచ్చే over proud దీనికి సమాధానం. ఇక్కడ ‘doctor’ క్రియాపదం అని గ్రహించాలి. Doctoring అంటే ఫోర్జరీ చేయడం (tampering) లాంటిది. The attendance register was doctored/The documents were doctored అంటే హాజరు పట్టిక/పత్రాల లోని అంశాలు మార్చబడినాయని అర్థం. ఇక్కడ proved our లోని అక్షరాలు doctor(ing) చేయబడినాయన్న మాట.</p>
<p>68. Coin, one found in an Italian town (5)<br />
Coin కు సమానార్థకమైన paisa దీనికి జవాబు. Pisa ఇటలీ దేశంలోని ఒక నగరం పేరు. One కు సమానమైన a ను Pisa లో చేర్చితే paisa వస్తుంది.</p>
<p>69. Accessories king gave away to Pole as salary (8)<br />
Salary = earnings కనుక అదే సమాధానం. Earrings ఒక రకమైన accessories. King కు r తీసుకోవాలి &#8211; royal, regal పదాలలోని మొదటి అక్షరం కనుక. ఇక Pole అంటే North, South ధ్రువాలలోని North కు సమానమైన N. King (r) తన స్థానాన్ని n కు ఇచ్చాడు కనుక, earnings ఏర్పడింది.</p>
<p>70. Forgetfulness of men wandering in the largest continent (7)<br />
Largest continent = Asia. Men wandering అంటున్నాడు కనుక, men ను కలగాపులగం చేసి Asia లో చేర్చాలి. అప్పుడు amnesia వస్తుంది. అది మతిమరుపు లక్షణంగా గల వ్యాధి పేరు.</p>
<p>71. Member/worker has a resting place (8)<br />
Member కు arm కాని, leg కాని తీసుకోవాలి. Worker కు నమానార్థక పదం char. A = I (1 అనే సంఖ్యలా ఉంటుంది కనుక). Char లో i ని చేర్చి, వచ్చినదాన్ని arm పక్కన పెడితే armchair వస్తుంది. అది ఒక resting place. అదే సమాధానం.</p>
<p>72. Setting nail head in bed, later removing nail head (7)<br />
ఇది మరొక మంచి, చమత్కార భరితమైన క్లూ. Nail head = n. Bed = cot. Cot లో n చేరితే cont ఏర్పడుతుంది. Later = next. అందులోంచి nail లో head అయిన n ను తీసేస్తే ext మిగులుతుంది. దాన్ని cont కు కలిపితే వచ్చే context (setting) సమాధానం.</p>
<p>73. Mysteries about ship bordering Crete vandalised (7)<br />
Ship కు SS (Steam Ship కు పొట్టి రూపం) తీసుకోవాలి. Vandalised అంటే ధ్వంసమైన/చెల్లాచెదరైన కనుక, Crete (గ్రీస్ దేశంలోని అతి పెద్ద ద్వీపం పేరు) ను కలగాపులగం చేసి SS లో పెట్టాలి. అప్పుడు వచ్చే secrets (mysteries) జవాబు.</p>
<p>74. Choose opponent, impeach victor against some charge (10)<br />
Choose = elect. Opponent = rival. Victor కు ప్రారంభ అక్షరమైన v ని rival లోంచి తీసి అదే స్థానంలో c ని (charge లోని మొదటి అక్షరం) పెట్టాలి. అప్పుడు rical వస్తుంది. దాన్ని elect పక్కన పెడితే వచ్చే electrical సమాధానం. Electrical = a kind of chagre కదా.</p>
<p>75. A model admitting semi-human beings in flat (9)<br />
Model కు t తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. A model = A t. ఈ రెండక్షరాలు part men (semi-human beings) ను లోపల చేర్చుకుంటే ఏర్పడే apartment (flat) దీనికి జవాబు.</p>
<p>76. Right Reverend is away from monkey with anger – in more than a few words (8)<br />
Monkey = Langur. Anger = rage. ఈ రెండింటిని కలిపితే langurrage వస్తుంది. Right Reverend = rr (మొదటి అక్షరాలు). Langurrage లోంచి rr ను తీసేస్తే వచ్చే language సమాధానం. భాషలో ఎన్నో పదాలుంటాయన్నది ఇక్కడి ధ్వని.</p>
<p>77. Crazy men by a day, I see, get a memory device (8)<br />
Crazy ‘men’ = Mne. A day = mon (Mon Day). I = i. See అంటే ఉచ్చారణ అదే విధంగా ఉన్న అక్షరం c. అన్నిటినీ కలిపితే వచ్చే mnemonic దీనికి జవాబు. Mnemonic (నిమొనిక్) అంటే సులభంగా జ్ఞాపకం పెట్టుకోవటం కోసం తయారు చేసుకున్న కొన్ని అక్షరాల లేక పదాల సముదాయం. మనిషి మణికట్టులో ఎనిమిది చిన్నచిన్న ఎముకలుంటాయి వాటి పేర్లు S, L, T, P, T, T, C, H అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటిని అదే క్రమంలో గుర్తు పెట్టుకోవటం కోసం వైద్య విద్యార్థులు తయారు చేసుకున్న నిమొనిక్ She Looks Too Pretty, Try To Catch Her!</p>
<p>78. Unplanned money comes with mantra (6)<br />
Money = Rand (currency of South Africa). Mantra = Om (ఓం &#8211; దీన్ని ఆంగ్లభాషలో కలుపుకున్నారు). Rand + om = random = unplanned.</p>
<p>79. The woman, educated, leaves alien protected (9)<br />
The woman = she. Educated = lettered. Alien = et (Extra Terrestrial). Lettered మైనస్ et = ltered. She + ltered = sheltered = protected. అదే జవాబు.</p>
<p>80. Undermine one politician with look (6)<br />
One = I. Politician = MP. Look కు సమానార్థక పదం air (verb form). అన్నీ కలిపితే వచ్చే impair (undermine) జవాబు.</p>
<p>81. Blind Henry left jailhouse in a riot (8)<br />
Henry లోని మొదటి అక్షరమైన h ను jailhouse లోంచి తొలగించి మిశ్రమం చేయగా వచ్చే jalousie దీనికి సమాధానం. In a riot అంటే అల్లకల్లోలంగా అని చెప్పుకోవచ్చు. Blind అంటే కిటికీకి కట్టే తెర వంటిది. ఉదాహరణకు venetian blind. ఇట్లా ఆంగ్ల పదాలకు సామాన్య అర్థం కాక, అరుదైన అర్థం గల పదాలు ఇవ్వబడతాయి ఇటువంటి పజిళ్లలో.</p>
<p>82. Using some utterly repugnant policy, leaders get to overthrow (5)<br />
ఇక్కడ లీడర్స్ అంటే ప్రారంభాక్షరాలు Using, Some, Utterly, Repugnant, Policy – ఈ పదాల మొదటి అక్షరాలను కలిపితే వచ్చే usurp = overthrow (ఆక్రమించుట, దురాక్రమించుట). అదే సమాధానం.</p>
<p>83. Quietly run out and bring every other quid to hide from view (6)<br />
Quietly కి sh తీసుకోవాలి. నిశ్శబ్దంగా ఉండు అనటాన్ని ష్ అనే అక్షరంతో సూచిస్తాం కదా. Run out కు ro, every other quid కు ud (ఒక అక్షరం విడిచి ఒకటి) తీసుకోవాలి. అన్నిటినీ కలుపగా వచ్చే shroud (to hide from view) సమాధానం.</p>
<p>84. I substituted for ace in group? Not true (7)<br />
Group = faction. Ace = a. Faction లోని a స్థానంలో i ని పెడితే ఏర్పడే fiction<br />
జవాబు. ఫిక్షన్ అంటే కల్పితం కదా.</p>
<p>85. Dismiss aloof model to make way for victor (6)<br />
ఇది కూడా పై క్లూ లాంటిదే. Aloof = remote. Model = t. Victor = v. Remote లోని t ని తొలగించి, అదే స్థానంలో v పెడితే వచ్చే remove (dismiss) సమాధానం.</p>
<p>86. Wine service managers in 2000, met a priest with hesitation to enter an appeal (10)<br />
ఇది కూడా చాలా మంచి క్లూ. రోమన్ సంఖ్యల ప్రకారం ఒక వేయిని M తో సూచిస్తారు. ఇక్కడ 2000 అంటున్నాడు కాబట్టి MM రాయాలి. యూదుల దేవాలయాలలోని (synagogues లోని) పూజారిని eli అంటారు. ఇక hesitation కు er తీసుకోవాలి. వీటన్నిటినీ కలిపితే mmelier వచ్చింది కదా. SOS (Save Our Souls) అనేది ఒక రకమైన appeal. ఓడలు ఆపదలో చిక్కుకున్నప్పుడు సహాయాన్ని అర్థిస్తూ ఇతర ఓడలకు గాని, ఓడరేవు అధికారులకు గాని పంపే పిలుపును SOS అంటారు. ఆ మాటకొస్తే ఎవరు సహాయాన్ని కోరుతూ పంపినా ఆ పిలుపు SOS అవుతుంది. ఇప్పుడు SOS లో mmelier ను చేర్చగా వచ్చే sommeliers (wine service managers) సమాధానం.</p>
<p>87. Not happy hour oddly for a holy man (5)<br />
Not happy = sad. Hour oddly అంటే బేసి (odd) స్థానాలలో ఉన్న h,u అనే అక్షరాలు. Sad + hu = sadhu = holy man. కనుక సమాధానం sadhu. Good man/holy man కు st (saint) తీసుకోవాల్సిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి ఈ పజిళ్లలో.</p>
<p>88. Hundreds are sick, it’s a complaint (11)<br />
Ton = hundred కనుక, hundreds = tons. Sick = ill. It’s = it is. అన్నిటినీ కలిపితే వచ్చే tonsillitis దీనికి జవాబు. ఇటువంటి పజిళ్లలో complaint ను వ్యాధికి సమానార్థక పదంగా వాడుతారు.</p>
<p>89. Before Aishwarya got married, it was on the menu (8)<br />
Before = past. Aishwarya కు ఆమె ఇంటిపేరైన Rai ను తీసుకోవాలి. Married = m. Rai got married అంటే rai, m ను పొందింది. అంటే rai లో m చేరిందన్న మాట. ఫలితంగా ఏర్పడేది rami. Past + rami = Pastrami. దీనికి అర్థం కాల్చిన (smoked) ఎద్దు మాంసం. అదే జవాబు.</p>
<p>90. Place to accommodate the President – one with loose morals (8)<br />
Place = set. The president = Trump (ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు). Set లో trump ను చేర్చగా వచ్చే strumpet (వేశ్య) దీనికి సమాధానం.</p>
<p>91. After college, two choices which allow free passage (8)<br />
College = c. Choice కు or తీసుకోవాలి. ఎందుకంటే choice = this OR that. రెండు అంటున్నాడు కనుక oror తీసుకోవాలి. అవి free కి సమానమైన rid ను తమలోపలికి అనుమతిస్తున్నాయి. కనుక oror మధ్య rid చేరి orridor ఏర్పడుతుంది. దీన్ని c కి కలిపితే వచ్చే corridor (passage) సమాధానం.</p>
<p>92. Doctor inspected endlessly – it’s infected (6)<br />
ఇక్కడ doctor ను క్రియాపదంగా వాడాడు setter. Inspected అనే పదంలోని చివరను (dని) తొలగించి, మిగిలిన అక్షరాలను మిశ్రమం చేయాలని చెప్తున్నాడనుకోవద్దు. Inspected లోంచి end ను తీసేసి కలగాపులగం చేయమంటున్నాడు. అట్లా చేస్తే వచ్చే septic (infect అయినదని అర్థం) ఈ ఆధారానికి సమాధానం.</p>
<p>93. Two styles – lacking the French humility (7)<br />
ఇక్కడ Two styles అంటే, ఒకటి mode (ఇది స్టైల్ కు సమానమైన పదం), మరొకటి style. వీటిని కలిపితే modestyle వస్తుంది. ఫ్రెంచ్ భాషలో The ని le అంటారు కనుక, modestyle లోంచి le ని తొలగించాలి. అప్పుడు వచ్చే modesty (humility) జవాబు.</p>
<p>94. Equip old fellow for the final conflict (10)<br />
Equip కు arm తీసుకోవాలి. ఇది క్రియాపదం (to arm అంటే సమకూర్చుట). తర్వాత old = aged. Fellow కు ఇక్కడ don ను తీసుకోవాలి. Armageddon (అంతిమ సమరం) దీనికి జవాబు. Arm + aged + don = Armageddon.</p>
<p>95. A poor nation, no choice for a renegade (8)<br />
Nation = state. కనుక a poor state వస్తుంది. Choice కు or తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి a poor state లోంచి or ను మైనస్ చేయగా వచ్చే apostate (renegade) దీనికి జవాబు. Renegade/apostate అంటే మాట తప్పి వెనుకకు పోయినవాడు అని అర్థం.</p>
<p>96. New copies left in the city (6)<br />
New కు n, left కు L తీసుకుని, వాటిని copies కు సమావమైన apes తో కలగాపులగం చేస్తే వచ్చే Naples దీనికి సమాధానం. To ape = to copy. Naples అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల నగరం.</p>
<p>97. Every other journo in ours is inexperienced (6)<br />
Every other అంటే ఒకటి విడిచి ఒకటి కదా. Journo in ours లోని 1, 3, 5, 7, 9, 11 వ అక్షరాలను కలిపితే వచ్చే junior దీనికి సమాధానం.</p>
<p>98. Sluggish general imprisoned by secret agent (6)<br />
General కు Lee తీసుకోవాలని ముందే చెప్పుకున్నాం. ఇక secret agent కు spy తీసుకోవాలి. Spy లో lee ఇంప్రిజన్డ్ అయితే వచ్చే sleepy (sluggish) దీనికి జవాబు.</p>
<p>99. Current rule’s mantra – to adopt hard stance at first on litigation (4, 3)<br />
Mantra = Om (ఓం). Hard stance at first అంటే ఆ రెండు పదాల మొదటి అక్షరాలైన hs. Litigation = law. అన్నిటినీ తీసుకుని మిశ్రమం చేస్తే వచ్చే Ohm’s law దీనికి జవాబు. Ohm’s law అనేది విద్యుచ్ఛక్తికి సంబంధించిన ఒక సూత్రం. ఇక్కడ rule’s అంటే rule is అన్న మాట.</p>
<p>100. Short-lived record, he initially mastered on time with rookie (9)<br />
Record కు EP తీసుకోవాలి. ఎందుకంటే, పాతకాలంలో గ్రామఫోన్ రికార్డులు EP (Extended Playing), LP (Long Playing) అని రెండు రకాలుగా ఉండేవి. He ని అట్లాగే ఉన్నదున్నట్టుగా చేర్చుకోవాలి. Initially mastered = m. Time = era. Rookie = learner/novice కనుక L తీసుకోవాలి. అన్నిటినీ కలుపగా వచ్చే ephemeral (short-lived) దీనికి సమాధానం.</p>
<p>101. Outrage at prison cell where 500 usurp nationalist (7)<br />
Prison cell = dungeon. ఇక రోమన్ సంఖ్యల ప్రకారం D = 500. Nationalist కు మొదటి అక్షరమైన n తీసుకోవాలి. Usurp అంటే ఆక్రమణ కనుక n ను తొలగించి అదే స్థానంలో d ని చేర్చాలి. తత్ఫలితంగా వచ్చే dudgeon (outrage/ill-will) దీనికి జవాబు.</p>
<p>ఇంకా poem = if (Rudyard Kipling’s famous poem ‘if’), Lawrence = dh (D.H. Lawrence), key = a, b, c, d, e, f, or g (musical keys), agent = rep (representative), friend = pal, Copper = cu (Cuprium), bend = s or u, old/former = ex, debt = iou (I Owe You), communist = red, editor/journalist = ed, for example = e.g., bill = ac (account), artist = ra (Royal Academy), tea = cha (?short for Chai), direction = N, E, W, S &#8211; ఇట్లా లెక్క లేనన్ని సంకేత పదాలు, అక్షరాలు ఉంటాయి.</p>
<p>‘ద హిందు’ పత్రికకు ఆధారాలను కూర్చే setters ఈ విధంగా తమ మేధాపాటవంతో, ఊహాశక్తితో స్వైరవిహారం చేస్తారు. అట్లా చేయాలంటే ఎంతో లోకజ్ఞానం (General knowledge), ఆంగ్లభాష మీద బలమైన పట్టు, చమత్కారాన్ని మేళవించగలిగే అద్భుతమైన మెదడు &#8211; వీటన్నిటినీ కలిగివుండాలి. అయితే పజిళ్లను కూర్చేటప్పుడు వీరికి చెప్పలేనంత స్వాతంత్ర్యం ఉంటుంది. పదాల అర్థాలు కచ్చితంగా సరిపోయే అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగానే కొంచెం దూరంగా ఉండే అర్థం గల పదాలను ఇవ్వవచ్చు. ఇతర భాషలలోని పదాలను ఉవయోగించుకోవచ్చు. మధ్యలో విరామ చిహ్నాలు వచ్చేలా సమాధానాలను ఏర్పరచవచ్చు. అది తప్పు అవదా? అని ప్రశ్నించడానికి వీల్లేదు. నిజానికి ఇటువంటి మార్గాలను అవలంబించడం వెనుక ఉన్న ప్రధాన ధ్యేయం పాఠకుడిని సాధ్యమైనంత ఎక్కువగా తికమక పెట్టటమే. మెదడుకు ఇంత వ్యాయామాన్ని కలిగించగలిగే ఇటువంటి క్రాస్ వర్డ్ పజిళ్లు, వాటిపట్ల ఆసక్తి గలవారికి ఒక విధంగా వరాలు అనటంలో అతిశయోక్తి లేదు.</p>
<p>నా ఈ వ్యాసాన్ని ఆకళింపు చేసుకుని, భవిష్యత్తులో ఇంకెవరైనా అపారమైన మేధాసంపత్తిని కలిగినవాళ్లు, ఆంధ్రాంగ్లాల మీద మంచి పట్టున్నవాళ్లు తెలుగు క్రాస్ వర్డ్ ప్రక్రియను కొత్త పుంతలు తొక్కిస్తూ, దాన్ని మరింత సుసంపన్నం చెయ్యాలని, తద్వారా ముందుతరాలకు మరింత నాణ్యమైన, ప్రామాణికమైన తెలుగు క్రాస్ వర్డ్స్ అందాలని నా ఆకాంక్ష.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=13786</wfw:commentRss>
		<slash:comments>11</slash:comments>
		</item>
	</channel>
</rss>
