<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; పుస్తక పరిచయం</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?cat=489&#038;feed=rss2" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>ఎదురు చూపు</title>
		<link>http://vaakili.com/patrika/?p=15508</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15508#comments</comments>
		<pubDate>Thu, 30 Nov 2017 22:07:57 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[ఇంద్రగంటి శ్రీకాంత శర్మ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15508</guid>
		<description><![CDATA[రవి వీరెల్లి నలభై పైగా కవితలు ఒకే sitting లో ఏకధాటిగా చదివాను. ముందుగా కవితలన్నిటా ప్రముఖంగా,- ఆకాశం, వెన్నెల, నీరు, నది, కొండ, పచ్చదనం, చెట్లు, అతివేలమైన ప్రకృతి తాదాత్మ్యం కనిపించాయి. అన్నిటా కవి ఆత్మీయపారవశ్యాన్ని పాఠకుడిలోనికి ప్రసరింప చేయాలనే తహతహ నన్ను ఆకర్షించింది. నాకు గాడంగా ఏమనిపించిందంటే; ఇవి క్రిక్కిరిసిన అనుభవాల ప్రసారణం. ఇక్కడ సమూహం లేదు; ఉన్నవి, వ్యక్తి ఆరాటాలు, అనుభవస్పందనలే. కవి నిర్మించిన వాక్యాలకొక ప్రవాహగుణం, సున్నితమైన తాత్వికత ఉన్నాయి. ఉంటూనే, abstract images వెల్లువ కమ్ముకుంటూ కనిపిస్తుంది.]]></description>
			<content:encoded><![CDATA[<p><img class="alignleft size-full wp-image-15512" title="ravi_verelly_kumdapana" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/11/ravi_verelly_kumdapana.jpg" alt="" width="200" /></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఎ</span>దురు చూస్తాం&#8230; చాలా వాటికోసం. అనుభావాలకోసం, ఆత్మీయులకోసం, వాళ్ళ జ్ఞాపకాలకోసం. కాస్తంత ఊరటకోసం, విసుగొస్తే మార్పుకోసం. ఎదురుచూపు భవిష్యత్తుకి సంకేతం.</p>
<p>సంప్రదాయ సాహిత్యంలో పాఠకుడు పొందే కవిత్వానుభవం, పరాయిగా ఆయా కథల్ని, పాత్రల్ని (ఆ కవుల స్వభావాల్ని కూడా) అల్లుకుని ఉంటుంది. ఆధునిక కవిత్వం దగ్గరకు వచ్చేసరికి పాఠకుడి కవిత్వానుభవం, ఆయా కవుల్నే అల్లుకుని ఉంటుంది.</p>
<p>ఇక్కడ- తను నివసిస్తున్న ఏ సమాజంలో అయినా, కవే ప్రధానపాత్ర. అతడి అనుభావాల్ని, కష్టసుఖాల్ని, ఉద్రేకపారవశ్యాన్ని, పాఠకుడిక్కడ అర్థం చేసుకొనే ప్రయత్నం చెయ్యాలి. ఒకవిధంగా పాటకుడికిది పరీక్ష.</p>
<p>ఇక్కడ- కవిత్వానుభవం రెండంతరువుల్లో ఉంటుంది.</p>
<p>ఒకటి; కవి చెప్పి విడిచిన అనుభవాలవంటివే పాఠకుడికీ ఎదురైవుంటే, అతడు కవితో సామాన్యీకరణ చెంది సంతోషిస్తాడు. ఆదరిస్తాడు.</p>
<p>రెండు; కవి చెప్పే అనుభవాలు పాఠకుడికి అపరిచితమైనవీ, కేవలం వ్యక్తిగత ప్రతీకలతో నిండినవీ అయితే, ముందతడు ఆశ్చర్యపోతాడు. అర్థంకాక గాభరాపడి, అర్థమైతే బాగుండునని ఎదురుచూస్తాడు. ఈ ఇబ్బంది కవి చెప్పే అనుభవాలలో మార్మికత పెరిగితే కలుగుతుంటుంది. కవిత్వప్రేమికుడు “అరే ఇదేదో గొప్ప అనుభవం, ఈ మాటలు కొత్తగా ఉన్నాయి, మనకు అర్థమైతే బాగుండును” అని కలవర పడతాడు. కవి వాడే భాషగానీ, ఉపయోగించే technic గానీ స్వీయానుభవ ప్రకటనకి వట్టి పరికరాలు మాత్రమే. పోలిక చెప్పాలంటే,- కమలాఫలం తొక్క వొలిచి, తొనల రసం పీల్చడం లాంటిది. పాఠకుడు ఆ భాషనీ, technic నీ వొలిచిపారేసి, కవి అనుభవాల్ని పీల్చుకునే ప్రయత్నం చేస్తాడు.</p>
<p>రవి వీరెల్లి నలభై పైగా కవితలు ఒకే sitting లో ఏకధాటిగా చదివాను. ముందుగా కవితలన్నిటా ప్రముఖంగా,- ఆకాశం, వెన్నెల, నీరు, నది, కొండ, పచ్చదనం, చెట్లు, అతివేలమైన ప్రకృతి తాదాత్మ్యం కనిపించాయి. అన్నిటా కవి ఆత్మీయపారవశ్యాన్ని పాఠకుడిలోనికి ప్రసరింప చేయాలనే తహతహ నన్ను ఆకర్షించింది. నాకు గాడంగా ఏమనిపించిందంటే; ఇవి క్రిక్కిరిసిన అనుభవాల ప్రసారణం. ఇక్కడ సమూహం లేదు; ఉన్నవి, వ్యక్తి ఆరాటాలు, అనుభవస్పందనలే. కవి నిర్మించిన వాక్యాలకొక ప్రవాహగుణం, సున్నితమైన తాత్వికత ఉన్నాయి. ఉంటూనే, abstract images వెల్లువ కమ్ముకుంటూ కనిపిస్తుంది. ఈ images ని ప్రతి అభిప్రాయ ప్రకటనలో ఇబ్బడి ముబ్బడిగా రూపకాలంకారాలతో నిర్మించడం గమనించగలం.</p>
<p>తెలుగు ఆధునిక సాహిత్యంలో రూపకాలంకారాన్ని, ఉపమాలంకారాన్ని, ఆరుద్ర, కుందుర్తి, రా. వి. శాస్త్రి, బీనాదేవి, పాఠకుడికి మొగంమొత్తెంతగా వాడారు. విరివిగా రూపకాలను వాడడం ద్వారా ఏర్పడే monotony అలావుండగా, పాఠకుడి అవగాహనకు కవిత్వం సంక్లిష్టమయే ప్రమాదం ఉంటుంది.</p>
<p>రవి వీరెల్లి తాత్వికంగానూ, తాదాత్మ్య దృష్టితోనూకూడా వాక్యనిర్మాణంలో రూపకాభిలాష నాకెక్కువగానే తోచింది. అయితే- జీవితం పట్ల, జగత్ సౌందర్యం పట్ల అపారప్రేమ ఈ కవితలకు రక్ష. వాక్యాలు నిర్మించే విధానంలో ఒక చమక్కు మనల్ని ఆకర్షిస్తుంది.</p>
<blockquote><p>“వెలుగులోకి నడిచినంత ధైర్యంగా<br />
చీకట్లోకి చొచ్చుకు పోలేం కదా!” అంటూనే కొసమెరుపుగా&#8230;<br />
“అనుకుంటాం గానీ<br />
చీకట్లోకి నడిచినంత స్వేచ్ఛగా వెలుగులోకి వెళ్ళలేం<br />
&#8230;నగ్నంగా!” (కొసమెరుపు)</p></blockquote>
<p>ఈ రెండూ సత్యాలే- రెండు మానసికఅవస్థల్లోంచి వచ్చిన సత్యాలు.</p>
<p>అలాగే, మరికొన్న కవిత్వ (తాత్విక?) ప్రకటనలు:</p>
<blockquote><p>1.<br />
“కన్నూ.. కాలమూ..<br />
ఎప్పుడూ వెలితి కుండలే.<br />
కవిత్వంలా.” (వెలితికుండ)</p>
<p>2.<br />
“చీకటి కేం<br />
అంచులను చురకత్తుల్లా చేసి<br />
రంపపుకోత కొస్తుంది<br />
ఎంతైనా<br />
ఒంటరితనాన్ని మోస్తున్నవాళ్ళంటే<br />
రాత్రికి తెగ లోకువ.” (<a href="http://eemaata.com/em/issues/201712/14464.html" target="_blank">రాత్రికి లోకువై</a>)</p>
<p>3.<br />
“పోనీ,<br />
ఒక కవిత్వపుటలవై<br />
నువ్వు నన్ను<br />
ముంచెత్తినా బావుణ్ణు.” (<a href="http://vaakili.com/patrika/?p=538" target="_blank">ఆఖరితనం</a>)</p>
<p>4.<br />
“పుట్టుకతోనే విడిపోయిన ఈ ప్రపంచాన్ని<br />
ఉత్తుత్తిగా కలిపినట్టుంచే ఊహా అక్షాంశ రేఖాంశాల్లా<br />
విడివిడిగానే కలిసి భూమితో తిరుగుదాం.” (<a href="http://verelly.blogspot.com/2014/10/blog-post_15.html" target="_blank">విడివిడిగానే</a>)</p>
<p>5.<br />
“సిగ్గుతో విచ్చుకున్న పువ్వు నడుం చుట్టూ<br />
మరీ చిన్నదై బిగుసుకుపోయిన సిగ్గు బిళ్ళలా…<br />
తొడిమె.” (<a href="http://vaakili.com/patrika/?p=3890" target="_blank">చిలిపి చినుకులు</a>)</p>
<p>6.<br />
“అనంతమైన ఆకాశాన్ని సాగు చేసి<br />
చుక్కల మొక్కలు నాటిన చంద్రుడు<br />
చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి<br />
అలల తలలను దువ్వుతాడు.” (<a href="http://verelly.blogspot.com/2014/10/blog-post_72.html" target="_blank">గ్రావిటీ</a>)</p></blockquote>
<p>ఇక- ఈ మొత్తం కవితల్లో నాకు మరీ ఇష్టంగా అనిపించినవి:</p>
<p>1. <a href="http://eemaata.com/em/issues/201712/14472.html" target="_blank">దిగులు పువ్వు</a></p>
<p>2. <a href="http://vaakili.com/patrika/?p=741" target="_blank">దగ్గరిదూరాలు</a></p>
<p>3. రాత్రంతా నా కళ్ళలోనే</p>
<p>4. <a href="http://eemaata.com/em/issues/201712/14468.html" target="_blank">Solitary</a></p>
<p>5. సకినం</p>
<p>6. అమ్మ ఉత్తరం</p>
<p>7. <a href="http://vaakili.com/patrika/?p=5434" target="_blank">హోమ్ కమింగ్</a></p>
<p>8. <a href="http://www.andhrajyothy.com/artical?SID=54350&amp;SupID=26" target="_blank">తెరుచుకున్న పద్యం</a></p>
<p>9. <a href="https://teluguanuvaadaalu.com/2015/10/14/the-silent-horizon-ravi-verelly-telugu-indian/" target="_blank">నిశ్శబ్ద తిర్యగ్రేఖ</a></p>
<p>జీవితాన్ని, మానవ ప్రవృత్తుల్ని, ప్రకృతిలో సౌందర్యాస్వాదననీ తన కవితా వస్తువులుగా చేసుకుని సున్నితంగా తన మాటల్లో శబ్దించి వ్రాలుకట్టి చెప్పిన రవికి అభినందనలు.</p>
<p style="text-align: center;">***</p>
</div>
<p style="text-align: right;">(రవి వీరెల్లి కవితాసంపుటికి రాసిన ముందుమాట నుండి)</p>
<p>పుస్తకం వివరాలు:</p>
<p>పుస్తకం: కుందాపన<br />
రచయిత: <a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF" target="_blank">రవి వీరెల్లి</a><br />
పేజీలు: 136<br />
వెల: ₹ 100<br />
ప్రచురణ: వాకిలి</p>
<p>ప్రతులకు సంప్రదించండి:<br />
కినిగే: <a href="http://kinige.com/book/Kumdapana" target="_blank">http://kinige.com/book/Kumdapana</a><br />
అమెజాన్: <a href="https://www.amazon.com/ku%E1%B9%83d%C4%81pana-Ravi-Verelly/dp/0997736321" target="_blank">https://www.amazon.com/ku%E1%B9%83d%C4%81pana-Ravi-Verelly/dp/0997736321</a><br />
ఈమెయిలు: vaakili.editor@gmail.com<br />
అడ్రస్: VAAKILI, 8-415/89, SAPTAGIRI COLONY, Miyapur, Hyderabad-49</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15508</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>ఆ నేల, ఆ నీరు, ఆ గాలి (వేలూరి వేంకటేశ్వర రావు కథలు)</title>
		<link>http://vaakili.com/patrika/?p=15172</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15172#comments</comments>
		<pubDate>Sat, 30 Sep 2017 18:20:08 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[సాయి బ్రహ్మానందం గొర్తి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15172</guid>
		<description><![CDATA["అంతర్లీన ఘనీభూత సాగరాన్ని బద్దలుకొట్టే గండ్ర గొడ్డలే సాహిత్యం" అంటాడు కాఫ్కా.

ఇక్కడ సాగరం అంటే ఆలోచనలు. వాటిని ముక్కలు చేయడమే సాహిత్యం చేసే పని. జీవితంలో అనుభవాలే వాటికి ఆలంబన. ]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="text-decoration: underline;"><span style="font-size: 20px;">టీక</span></span></p>
<p><span style="font-size: 30px;">&#8220;అం</span><em>తర్లీన ఘనీభూత సాగరాన్ని బద్దలుకొట్టే గండ్ర గొడ్డలే సాహిత్యం</em>&#8221; అంటాడు కాఫ్కా.</p>
<p>ఇక్కడ సాగరం అంటే ఆలోచనలు. వాటిని ముక్కలు చేయడమే సాహిత్యం చేసే పని. జీవితంలో అనుభవాలే వాటికి ఆలంబన. ఇవి కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. వాటికి అక్షర రూపం ఇస్తే అవి సార్వజనికం అవుతాయి.</p>
<p>సరిగ్గా ఒక పుస్తకం చేసే పనే అది. అవి కథలు కావచ్చు; కవిత్వం కావచ్చు; నవలలు కావచ్చు. ఆ అనుభూతులు మనల్ని తాకితే అవి సొంత అనుభవాలుగా రూపాంతరం చెందుతాయి. ఇటువంటి అనుభవాల డయాస్పోరా కథల పుస్తక పరిచయం ఇది.</p>
<p>ఈ కథా రచనలు తెలుసుకునే ముందు డయాస్పోరా అంటే కాస్తయినా తెలియాలి. అప్పుడు ఈ కథల వెనుక తపనా, జీవితమూ మరింతగా కనిపిస్తాయి.</p>
<p><span style="text-decoration: underline;"><span style="font-size: 20px;">డయాస్పోరా అంటే ఏవిటి?</span></span></p>
<p>ప్రస్తుతం కుగ్రామమైన ఈ ప్రపంచంలో, పుట్టుకతో సంబంధం లేకుండా, ఎవరు ఎక్కడైనా జీవించే అవకాశం ఉంది. అసలు ఏ మనిషయినా తన స్వస్థలం వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అక్కడ భరించలేనంత ఇబ్బందయినా ఉండాలి. లేదా జీవితం మెరుగుపడచ్చన్న ఆశ అయినా వుండాలి.</p>
<p>ఈ రెండే మనిషిని స్థాన భ్రంశం చేయిస్తాయి.</p>
<p>కొత్త ప్రదేశం వేరే ప్రపంచాన్ని చూపిస్తుంది. కొత్త అనుభవాలని ఇస్తుంది. ఆలోచనలని రేకెత్తిస్తుంది. పాత జ్ఞాపకాలని వెలికి తీస్తుంది. వీటికి అక్షర రూపం ఇస్తే అది &#8220;డయాస్పోరా&#8221; సాహిత్యం అవుతుంది.</p>
<p>వేరొక కొత్త సమాజపు అలవాట్లూ, సంస్కృతీ ఎదురు పడినపుడు &#8211; తమ నమ్మకాలకీ, ఆలోచనలకీ, నమ్మిన విలువలకీ మధ్య సంఘర్షణ &#8211; వాటిద్వారా కలిగే ఒక మానసిక ఒత్తిడీ డయాస్పోరా జీవితాల్లో ప్రధాన అంశం. సూక్ష్మంగా చెప్పాలంటే &#8211; రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి. ఇలాంటి సందర్భాలలో కొంత మానసిక సంఘర్షణ కలుగుతుంది.</p>
<p>ఇప్పుడయితే ప్రపంచం హద్దులు చెరిగిపోయాయి. ఇల్లు కదలకుండా ప్రపంచాన్ని వేలి కొసల మధ్య పట్టేయచ్చు. పాతికేళ్ళు, ఇంకాస్త వెనక్కి అంటే నలభయ్యేళ్ళ క్రితం అమెరికాలో జీవితం ఇప్పటి తరానికి ఊహించడం కూడా కష్టం.<br />
అమెరికాలో తెలుగు వారి వలసలని మూడు కాలాలుగా వర్గీకరించచ్చు &#8211; డెబ్భైలకి (1970) కి ముందు, తరువాత 90 వరకూ, అక్కడనుండి ఇప్పటి వరకూ.</p>
<p>డెబ్భైలకి ముందు అతి తక్కువ మంది అమెరికా వలస వచ్చారు. డెబ్భైలలో ఎంతో మంది డాక్టర్లు అమెరికా వచ్చారు. తొంభైల తరువాత కంప్యూటర్ సాంకేతికత పెరిగాక అది రెట్టింపయ్యింది. 2000 తరువాత అది నాలుగింతలయ్యింది.</p>
<p>అటువంటి మొదటి తరం (’70 డెబ్భైల ముందు) ప్రవాస తెలుగు వాళ్ళల్లో ముఖ్యులు వేలూరి వేంకటేశ్వర రావు. తెలుగు భాష మీద ప్రేమా, సాహిత్యం పట్ల అభిమానమూ ఆయన చూసిన అమెరికా జీవితాన్ని కథల రూపంలో రాసారు. ఆ కథలన్నీ గుది గుచ్చి &#8220;ఆ నేల, ఆ నీరు, ఆ గాలి&#8221; పేరుతో పుస్తకంగా వచ్చింది.</p>
<p>ఎప్పటినుండో వాయిదాలు వేస్తూ వచ్చిన నా ఈ సమీక్ష ఇన్నాళ్ళకి అక్షర రూపం దాల్చింది. ఇట్స్ నెవర్ టూ లేట్. తెలియనంతవరకూ ఏదీ పాత బడదు.</p>
<p><span style="text-decoration: underline;"><span style="font-size: 20px;">అసలు కథ</span></span></p>
<p>ఈ మధ్యే నోబెల్ ప్రైజు వచ్చిన బాబ్ డిలన్ని ఎవరో అడిగారట: &#8220;<em>నువ్వు పాటకుడివా? కవివా?</em>&#8221; అని. &#8220;<em>నేను పాడగలిగితే పాట, పాడటానికి కుదరనిది కవిత!</em>&#8221; అని బదులిచ్చాడట. బాబ్ డిలన్ ప్రతిపాదన కథలకి కూడా వర్తిస్తుందని వేలూరి &#8220;నా మాట&#8221; అంటూ రాసారు ఈ పుస్తకంలో. &#8220;వావ్!&#8221; అనాలనే అనుభూతి కథ చదివాక అనిపిస్తే అది కథే &#8211; అంటారు వేలూరి.</p>
<p>ఈ కథా సంకలనంలో పాతిక పైగా కథలున్నాయి. కొన్ని డయాస్పోరా కథలూ, మరికొన్ని జ్ఞాపకాల (నాస్టాల్జియా) కథలూ.</p>
<p>కథ చెప్పడంలో వేలూరిది విభిన్న శైలి. మహా పొదుపరి. ఎక్కడా ఒక్క వాక్యం కూడా ఎక్కువ కాదు; అలాని తక్కువా కాదు.</p>
<p>పైన చెప్పినట్లు కొత్త దేశం అంటే అమెరికా వచ్చాక మన తెలుగు వాళ్ళల్లో కలిగే భయాలూ, ఇష్టాలూ, మార్పులూ ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి తెలుసున్నంత స్పష్టంగా మరొకరికి తెలీవు. ఆకాశ హర్మ్యాలూ, పెద్ద పెద్ద ఇళ్ళూ, రోడ్ల మీద వందల కొద్దీ కార్లూ ఇవన్నీ మొదటి సారి చూస్తే ఆశ్చర్యంగా కంగారుగానే ఉంటుంది. కొంత కాలానికి మామూలవుతాయి. మరికొంత కాలానికి అవీ మనవిగా మారుతాయి. ప్రవాసీయులకి ఈ మార్పు సహజం. సరిగ్గా అటువంటి మార్పునే ఒడిసి పట్టుకున్న కథ &#8220;<em><strong>మెటా మార్ఫసిస్</strong></em>&#8220;.</p>
<p>సరిగ్గా ఇదే రంగనాధంలో వచ్చిన మార్పు ఈ కథలో కనిపిస్తుంది.</p>
<p>&#8220;.<em>..నల్లతోలు సూట్కేసులో రెండు జతల బాటా బూట్లూ, ఓ డజను ప్లాస్టిక్ టంగ్క్లీనర్లూ, &#8230; బామ్మ ఇచ్చిన ఆవకాయ జాడీ, కోతి మార్కు నల్ల పళ్ళపొడీ, తాతగారిచ్చిన పాకెట్ సైజు ఆంజనేయ దండకం, కనకమ్మ పిన్ని పంపిన కొబ్బరి నూనె సీసా, &#8230; సీతా రామ లక్ష్మణుల కేలండరుతో సహా రంగనాధం న్యూయార్కులో వాలాడు,</em>&#8221; ఇలా మొదలవుతుంది కథ.</p>
<p>మొదటి సారి అమెరికా చూసిన రంగనాధం ఆశ్చర్యపోతాడు. అదిరి పడతాడు. మెల్లగా అలవాటు చేసుకుంటాడు. అమెరికన్గా మారిపోతాడు. ఇన్ని మార్పులొచ్చినా ఒక్క విషయంలో మాత్రం మారడు. అదే కథకి ముగింపు. రంగనాధమే కాదు, చాలా మంది తెలుగువాళ్ళ పరిస్థితి అదే. ఎప్పుడో ముప్పై యేళ్ళ క్రితం రాసిన కథ. ఇప్పటికీ చెక్కు చెదరని ముగింపు. ఇంత చూసీ ఈ కథ ముచ్చటగా మూడు పేజీలు. చివర్లో &#8220;వావ్&#8221; అనుకోవడం మాత్రం ఖాయం. ఇది ఎనభైల నాటి కాలం కథ అయినా ప్రవాసం వచ్చిన అమెరికా తెలుగు వారిది ఇప్పటికీ ఇదే తీరు.<br />
డయాస్పోరా జీవితానికి ఇది మొదటి ప్రతీకగా చెప్పుకోవచ్చు.</p>
<p>(<em>ఇదే పేరుతో కాఫ్కా 1925 ప్రాంతాల్లో ఒక కథ రాసాడు. గ్రెగార్ అనే సేల్స్ మాన్ ఒక రోజు హఠాత్తుగా ఒక పురుగులా మారిపోతాడు. అలా మారడంలో తనలోనూ, కుటుంబంలోనూ వచ్చే మార్పులు చివర్లో అతని ఉనికికే ప్రమాదం కలిగిస్తాయి. గూగుల్ చేస్తే దొరుకుతుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కథ అది.</em>)</p>
<p>అమెరికా గాలీ, నీళ్ళూ పడ్డాక కాస్త నిలదొక్కుకున్నాక, ఇక్కడ విచ్చలవిడితనాన్ని అలవాటు చేసుకొని పరాయి దేశ స్త్రీలతో అనుబంధాలు పెంచుకుంటాడు సుందరం. తరచు వేంకూవర్ కాన్ఫరెన్సులకి వెళ్ళినప్పుడు ఒకమ్మాయి ఇరానీ దేశస్తురాలని తెలిసాక (9/11 అప్పుడే జరుగుతుంది), అతని ఆలోచనల్లో వచ్చిన భయమూ, అనుమానమూ, మార్పుల వలన ఇంటికొచ్చాక ఊహించని షాక్ తగులుతుంది. ఇదీ <em><strong>&#8216;పడమటి సంధ్యారాగం&#8217;</strong></em> కథ. ఇటువంటివి అమెరికాలో వింటూనే వుంటాం. ఈ కథ చదువుతూంటే ఒక ఇంగ్లీషు కథలా అనిపిస్తుంది.<br />
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/veluri.jpg"><img class="alignright size-full wp-image-15175" title="veluri" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/veluri.jpg" alt="" width="138" height="200" /></a><br />
అమెరికాలో స్థిరపడి, ఇండియా వచ్చిన తెలుగు పెళ్ళికొడుకుల ప్రహసనం <em><strong>&#8220;తీన్ కన్యా&#8221;</strong></em> కథ. అమెరికాలో ఉంటున్నాడు కనుక ఏ డాక్టరో, ఎం.బి.య్యే చదివిన అమ్మాయో అయితే బావుంటుంది అనుకున్న గోవిందరావుకి అమ్మాయిల తీరు షాక్ ఇస్తుంది. చివరకి ఏ అమ్మాయికి ఓటేసాడు అన్నది ఆసక్తి కరమైన మలుపు. ఈ కథలన్నీ, అనవసరపు వర్ణనలూ, సోదీ లేకుండా సూటిగా సాగుతాయి.</p>
<p>&#8220;<em>&#8211; నల్లద్దాలతో, సైడు ఫోజులో పదేళ్ళ కిందటి తన పాత ఫొటో. ఆ ఫొటో కింద యస్.వి.ఆర్.గోవిందరావు (వెంకట్). సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (U.S.A). ఫోటో పక్కనే పెద్ద అక్షరాల్లో ఆకుపచ్చ బ్యాక్గ్రౌండులో &#8216;స్వదేశాగమన శుభాకాంక్షలూ అని హెడ్డింగు. దానికింద. &#8220;అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా అత్యుత్తమ సేవలందిస్తూ విరామము కొరకు, వివాహము కొరకూ స్వదేశానికి తిరిగి వస్తున్న మా &#8220;చి. గోవిందరావు&#8221;కి ఇవే మా శుభాకాంక్షలు &#8211;</em>&#8221; ఎనభైల్లోనూ, తొంభైల్లోనూ ఇటువంటి వివాహ ప్రకటనలు తెగ వచ్చేవి.</p>
<p>అప్పట్లో పెళ్ళి చూపుల ప్రహసనం ఈ కథ. ఈ తీన్ కన్యా కథలో వేలూరి వ్యంగ్యం తారాస్థాయిలో వుంటుంది.</p>
<p>డాలరు ఒక మహమ్మారి. అమెరికా డాలరయితే మరీనూ. పట్టుకుంటే వదలదు. అది కలల్లోనూ, ఊహల్లోనూ, ఆఖరికి భ్రమల్లోనూ దూరుతుంది. దూరడమే కాదు డైనాసార్లా తయారవుతుంది. డాలరు వాల్యూ పడిందా అంతే సంగతులు. ఎంతో మంది ఇండియన్లకి, ముఖ్యంగా తెలుగువాళ్ళకి నిద్రా, స్థిమితమూ వుండవు. డాలర్ మీద ఎక్కి &#8220;ఎగిరే గుర్రాలు&#8221; కథల గురించి వింటూనే ఉంటారు, అమెరికాలో.</p>
<p>&#8220;<em>ఇంకొక రెండేళ్ళు పట్టాలి. అంతే. తన కంపెనీ స్టాక్ ఇంకో పదిరెట్లు పెరిగి పోతుంది. ఆ తరువాత రిటైరయ్యి, బెజవాడ మార్తాండ శాస్త్రిని రప్పించి వీణ నేర్చుకోవాలి. లేదంటే హుస్సేన్ దగ్గరో, రామారావు దగ్గరో పెయింటింగ్ నేర్చుకోవాలి&#8230;.గొంతు బాగానే వుంటుంది కదా లలిత సంగీతం నేర్చుకుంటేనో&#8230;? మన మాతృ దేశానికి ఏదన్నా సాయం చెయ్యాలి&#8230;ప్రాధమిక పాఠశాలకి లైబ్రరీ కట్టించాలి&#8230;ఒక్కో బడికీ రెండు కంప్యూటర్లు ఇవ్వాలి&#8230;అయినా వెధవ డబ్బు దాచుకొని ఏం చేసుకుంటారు కనుక&#8230;?</em>&#8221; &#8212; ఇవి ఎగిరే గుర్రం ఆలోచన్లు. అచ్చం అమెరికాలో ఉండే మన వాళ్ళ ఆలోచన్లలా అనిపించడం లేదూ? ఇలా ప్రతీ కథలోనూ వేలూరి మార్కు కనిపిస్తూనే ఉంటుంది. మచ్చుక్కి కొన్ని చెప్పాను. పూర్తిగా అమెరికా జీవితానికి అలవాటు పడినా , ఇంకో పక్క స్వదేశంలో మనుషుల వైపు ఆరాటం ఓ పట్టన పోదు. ఇదొక డయాస్పోరా డోలాయమాన స్థితి.</p>
<p>అమెరికా జీవితం గురించి వ్యంగ్య రూపంలో ఇటువంటి కథలు ఈ పుస్తకంలో చాలా వున్నాయి.</p>
<p>ఎనభై, తొంభైల్లో తెలుగువారి కథలు కొన్నయితే, ఇవి కాకుండా కేవలం ఇండియాలో పాత జ్ఞాపకాల కథలూ ఉన్నాయి. క్లబ్బులో చెట్టు కథ, పన్నెండు పంపుల కథ, అంటు అత్తగారూ, ఇలా ఇంకొన్ని కథలున్నాయి.</p>
<p>తెలుగులో మనకి పొలిటికల్ సెటైర్ కథలూ, మైథలాజికల్ సెటైర్ కథలూ అంతగా లేవు. స్వర్గంలో స్ట్రిప్ టీజ్, బ్రహ్మ సృష్టి కథలు అలాంటివే. ఇవి కాకుండా కొన్ని చిత్ర కథనాలూ (పెన్ ఫొటోగ్రాఫ్స్), జ్ఞాపకాల కథలూ ఉన్నాయి.</p>
<p>కథలు అల్లడంలో వేలూరిది ప్రత్యేక శైలి. సూటిగా కథలోకి వెళిపోతారు. మొదటి రెండు వాక్యల్లోనే కథా నేపథ్యం కనిపిస్తుంది. ప్రత్యేకమైన వర్ణనలూ గట్రా వుండవు. అక్కడక్కడ రావిశాస్త్రి కథల్లా అనిపించే అవకాశం ఉంది. కానీ రావిశాస్త్రి కథల్లో ఉండే వర్ణనలూ, ఉపమానాలూ, ఉపోద్ఘాతాలూ కనిపించవు. ఒక్క సెటైర్ తప్ప.</p>
<p>ఈ పుస్తకానికి మకుటాయమయిన కథ ఒకటుంది. దాని పేరు &#8211; &#8220;<em><strong>గోమెజ్ ఎప్పుడొస్తాడో&#8230;?</strong></em>&#8220;. తెలుగువాళ్ళు ముఖ్యంగా ఎనభై, తొంభైల తరువాత అమెరికా వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆర్థికంగా (అమెరికా వాసుల్లో) మధ్య తరగతి కంటే ఎక్కువే అని చెప్పచ్చు. మాలాగే వలస వచ్చిన చైనా వాళ్ళూ, ముఖ్యంగా స్పానిష్ వాళ్ళూ కూడా ఇక్కడ ఎక్కువే. ఇక్కడ బ్రతకడం కోసం వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కార్పెంటర్ నుండి, గార్డెనింగ్ జాబులూ, క్లీనింగ్ జాబులూ ఇవన్నీ చేసేవాళ్ళల్లో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మనలాగే వీరు వలస వచ్చినా, ఆర్థిక స్థితిలో చాలా తేడా ఉంది. అది ప్రవర్తనలోనూ కనిపిస్తుంది. ఒక్కోసారి వారి మీద చులకన అభిప్రాయాలు బయటకొస్తాయి. అటువంటి స్పానిష్ వ్యక్తి కథ &#8211; &#8220;గోమెజ్ ఎప్పుడొస్తాడో?&#8221;.</p>
<p>అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పని సరి. ఇది లేకపోతే ఏ డాక్టరూ కన్నెత్తి కూడా చూడరు. చాలామంది ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్కి ఈ ఇన్సూరెన్స్ ఉండే అవకాశం తక్కువ. వారికి ఏదైనా సుస్తీ చేసినా, యాక్సిడెంట్ అయినా ఆసుపత్రికి వెళితే తడిసి మోపెడవుతుంది.</p>
<p>నిజానికి ఎందరో తెలుగు వారు భార్యా పిల్లల్ని ఇండియాలో వదిలేసి బాడీ షాపింగ్ కంపెనీల ద్వారా వచ్చేవారు. కుటుంబమంతటికీ ఇన్సూరెన్స్ ఇచ్చే వారు కాదు. ఇదే పరిస్థితి చూచాయగా ఇప్పుడూ ఉంది. జబ్బులు రానంతవరకే. వచ్చాయంటే ఇన్సూరెన్స్ లేకపోతే దాన్ని మించిన నరకం ఉండదు. ఇహ ఇల్లీగల్గా వచ్చిన మెక్సికన్ వారి సంగతి మరీ ఘోరం. ఈ డయాస్పోరా అనుభవాన్ని ఎంతో సున్నితంగా ఈ కథలో చూపించారు వేలూరి. ఆర్థికంగా ఒక మెట్టు పైన ఉన్నంత మాత్రాన అది మానసికంగానూ, ప్రవర్తనలోనూ ఉండదు అన్న సత్యాన్ని దృశ్యం రూపంలో చెప్పే కథ ఇది.<br />
చివర్లో జాలీ, కరుణా కథని వదిలి మనల్ని అంటి పెట్టుకుంటాయి. ఒక మంచి కథ చేసే పనే అది.</p>
<p>కథలు రాయాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకం నిండా రకరకాల కథన రీతులు కనిపిస్తాయి. ఎంత చిన్న వస్తువయినా కథా రూపంలో ఎలా మలచవచ్చో తెలుస్తుంది. కాకపోతే కొన్ని కథల్లో కథనం మాత్రం అమెరికన్ స్టైల్లో ఉంటుంది. నలభయ్యేళ్ళుగా ఇక్కడ ఉంటున్న వేలూరి గారి మీద అమెరికన్ కథ ప్రభావం లేదు అనుకోలేము. చాలా కథల్లో క్లుప్తత కనిపించడం ఇందువలనే అనిపిస్తుంది.</p>
<p>“<em>వేలూరి కథలు అమెరికా తెలుగువాళ్ళ వ్యవహార శైలిపై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ్య కథలు. కథని, పాత్రల్ని నిర్మించడంలో, నడిపించడంలో ఆయనకి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమయ్యింది. హాస్య, వ్యంగ్య ధోరణిలో కథలు నడిపినా, వాటిల్లో ఆవేదనా, ఆవేశమూ ఉన్నాయి</em>&#8221; &#8211; అని సిఫార్సు చేసారు ముందు మాట రాసిన వాసిరెడ్డి నవీన్. మీరూ, నేనూ, అందరం ఆయనతో ఏకీభవిస్తాం, పుస్తకం చదవడం పూర్తయ్యాక.</p>
<p>చివరగా &#8211; ఈ పుస్తకంలో కథలన్నీ ఒక ఎత్తు, వేలూరి &#8220;మా తెలుగు మాస్టార్ని తలచుకుంటూ&#8230;&#8221; తన మాటగా రాసిన వ్యాసం ఇంకో ఎత్తు. కథలకంటే ముందు ఇది చదవండి. మీ కళ్ళు చెమరుస్తాయి.</p>
<p style="text-align: right;"><span style="color: #800000;"><strong>(అక్టోబరు 12 వేలూరి గారి జన్మదిన సందర్భంగా&#8230;.)</strong></span></p>
<p>&nbsp;</p>
</div>
<p>వేలూరి ఇతర రచనలూ, కొన్ని కథలూ: <a href="http://eemaata.com/em/authors?aa=%E0%B0%B5%E0%B1%87%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81#" target="_blank">లింక్</a></p>
<p><strong>పుస్తకం</strong>: ఆ నేల, ఆ నీరు, ఆ గాలి (కథలు)<br />
<strong>రచయిత</strong>: వేలూరి వేంకటేశ్వర రావు<br />
<strong>వెల</strong>: Rs.80, $8<br />
<strong>లభించు చోటు</strong>: నవోదయా (హైద్రాబాద్), <a href="http://www.kinige.com" target="_blank">www.kinige.com</a></p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15172</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>వెంటాడే కథలు; కతల గంప – స. వెం. రమేశ్</title>
		<link>http://vaakili.com/patrika/?p=15212</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15212#comments</comments>
		<pubDate>Sat, 30 Sep 2017 18:17:47 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[తాడికొండ కె. శివకుమార శర్మ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15212</guid>
		<description><![CDATA[<p></p> <p>అస్తిత్వానికి మంచి భాషా, దాన్ని వాడుకోగల సత్తా తోడయితే కథలని ఎంత కళాత్మకంగా రూపొందించవచ్చో రమేశ్ గారు చూపిస్తారు “కతలగంప” సంకలనంలో. ఈ సంకలనంలోని 18 కథలు చదివితే ఈ రచయిత చిత్రించిన కాన్వాస్ విస్తీర్ణం అర్థమవుతుంది. వస్తువు ఈ కథల్లోని జీవితాలంత అపురూపం, చిత్రణ అనన్య సాధ్యం. అస్తిత్వం ఆయువుపట్టు అవడంవల్ల నేలని వదిలి సాముచేసే కథలేవీ కనిపించవు ఇందులో. గ్రామీణ వాతావరణమూ, దాన్ని అంటిపెట్టుకుని వుండే అచ్చమైన తెలుగు భాషా ఈ కథలకి సొబగులద్దాయి. బాట చెప్పిన, చెట్లు చెప్పిన, మట్టికుండ చెప్పిన, వానజల్లు చెప్పిన, మొయిలుకు చెప్పిన కథలూ, ఆ యా కథనాలకి దీటయిన వర్ణనలూ ఈ సంకలనానికి ప్రత్యేకం.</p> <p>కొన్ని దశాబ్దాల జీవితాలని అతి దగ్గరగా చూపే చిత్రణమే గాక కమింగ్ ఆఫ్ ఏజ్ తో మొదలుపెట్టి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ) తెలుగు నేర్పడానికి పల్లెపల్లె తిరిగిన దాకా (ఆ అడివంచు పల్లె) ఎదురయిన ప్రతీ సంఘటనా అపురూపపు జ్ఞాపకంగా మారి అందంగా అలంకరించుకుని కనిపిస్తుంది. ప్రళయకావేరి తీరంలో రాష్ట్రవిభజనవల్ల తమిళనాడులో చేర్చబడ్డ పల్లెల్లోని తెలుగువాళ్ల జీవితాల చిత్రణతో ఈ సంకలనం మొదలవుతుంది. ఒక చిన్న బడి, హాస్పిటలు కూడా లేకపోవడమే గాక బస్సు రాకకు కూడా నోచుకోనివీ పల్లెలు. పన్నెండుమంది తమిళ, నూటయాభైమంది తెలుగు పిల్లలున్న చోట బడి అంటే చూరునుంచీ పెళ్లలు రాలిపడుతున్న చిన్న, పాత కట్టడం. ఆ చోటు తమిళనాడులో ఉన్నందున అక్కడ కట్టిన కొత్త గది తమకే కావాలంటారు తమిళ పిల్లలు (తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప). అసలు బడే లేనిచోట కడితే అరవబడే అవాలన్న ప్రతిపాదనకు సరే అందా మంటారు సర్దుకుపోదామనుకునే మనస్తత్వం ఉన్న కొందరు పెద్దలు (మీసర వాన). “మమ్మల్నేమో ఈ తమిళ తోడేళ్లకి యిడిసిపెట్టి ఆ సొరణే లేకుండా ఉండిపొయ్యిండారే ఆ ఆంద్రమోళ్లు” అంటాడు ఆశ్వత్తన్న (పదిమందికి పెట్టే పడసాల). ఈ ఘర్షణ తెలుగు జీవితమంటే యాభయ్యవ దశకంలో [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><img class="alignleft size-full wp-image-15215" title="ramesh_kathala_gampa" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/ramesh_kathala_gampa.jpg" alt="" width="185" height="300" /></p>
<p><span style="font-size: 30px;">అ</span>స్తిత్వానికి మంచి భాషా, దాన్ని వాడుకోగల సత్తా తోడయితే కథలని ఎంత కళాత్మకంగా రూపొందించవచ్చో రమేశ్ గారు చూపిస్తారు “కతలగంప” సంకలనంలో. ఈ సంకలనంలోని 18 కథలు చదివితే ఈ రచయిత చిత్రించిన కాన్వాస్ విస్తీర్ణం అర్థమవుతుంది. వస్తువు ఈ కథల్లోని జీవితాలంత అపురూపం, చిత్రణ అనన్య సాధ్యం. అస్తిత్వం ఆయువుపట్టు అవడంవల్ల నేలని వదిలి సాముచేసే కథలేవీ కనిపించవు ఇందులో. గ్రామీణ వాతావరణమూ, దాన్ని అంటిపెట్టుకుని వుండే అచ్చమైన తెలుగు భాషా ఈ కథలకి సొబగులద్దాయి. బాట చెప్పిన, చెట్లు చెప్పిన, మట్టికుండ చెప్పిన, వానజల్లు చెప్పిన, మొయిలుకు చెప్పిన కథలూ, ఆ యా కథనాలకి దీటయిన వర్ణనలూ ఈ సంకలనానికి ప్రత్యేకం.</p>
<p>కొన్ని దశాబ్దాల జీవితాలని అతి దగ్గరగా చూపే చిత్రణమే గాక కమింగ్ ఆఫ్ ఏజ్ తో మొదలుపెట్టి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ) తెలుగు నేర్పడానికి పల్లెపల్లె తిరిగిన దాకా (ఆ అడివంచు పల్లె) ఎదురయిన ప్రతీ సంఘటనా అపురూపపు జ్ఞాపకంగా మారి అందంగా అలంకరించుకుని కనిపిస్తుంది. ప్రళయకావేరి తీరంలో రాష్ట్రవిభజనవల్ల తమిళనాడులో చేర్చబడ్డ పల్లెల్లోని తెలుగువాళ్ల జీవితాల చిత్రణతో ఈ సంకలనం మొదలవుతుంది. ఒక చిన్న బడి, హాస్పిటలు కూడా లేకపోవడమే గాక బస్సు రాకకు కూడా నోచుకోనివీ పల్లెలు. పన్నెండుమంది తమిళ, నూటయాభైమంది తెలుగు పిల్లలున్న చోట బడి అంటే చూరునుంచీ పెళ్లలు రాలిపడుతున్న చిన్న, పాత కట్టడం. ఆ చోటు తమిళనాడులో ఉన్నందున అక్కడ కట్టిన కొత్త గది తమకే కావాలంటారు తమిళ పిల్లలు (తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప). అసలు బడే లేనిచోట కడితే అరవబడే అవాలన్న ప్రతిపాదనకు సరే అందా మంటారు సర్దుకుపోదామనుకునే మనస్తత్వం ఉన్న కొందరు పెద్దలు (మీసర వాన). “మమ్మల్నేమో ఈ తమిళ తోడేళ్లకి యిడిసిపెట్టి ఆ సొరణే లేకుండా ఉండిపొయ్యిండారే ఆ ఆంద్రమోళ్లు” అంటాడు ఆశ్వత్తన్న (పదిమందికి పెట్టే పడసాల). ఈ ఘర్షణ తెలుగు జీవితమంటే యాభయ్యవ దశకంలో భాషాప్రాతిపదికన విభజింపబడ్డ ఇరవై జిల్లాలలో ఉన్నది మాత్రమేనని అనుకునేవా రందరికీ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగించవలసిన విషయం, ఆ విభజన తరువాత అయిదు దశాబ్దాలకా అది ఇలా అచ్చులో కనబడిందీ అన్నది.</p>
<p>మొగుడు పోయిన చెల్లవ్వ రెండు బరిగొడ్లను కొని పాలుతీసి పోసి, తెల్లవారగానే ఇడ్లీలూ, వడలూ, సాయంత్రం బోండాలు, జంతికలు అమ్మి కష్టపడి కూతురు పెళ్లిచేస్తే ఆయమ్మ మొగుడు పోయి మళ్ళీ కొడుకు సత్యాన్ని తీసుకుని తల్లిచెంతకే చేరింది (ఊడల్లేని మర్రి). పొలాన్ని అమ్మల్లా అతన్ని పట్నంలో చదివిస్తే, ఆమెకున్న ఇంటిని అమ్మేసి ఆమెకి నిలువనీడ లేకుండా చేస్తాడు ఆ మనవడు. ఇలాంటి జీవితాల గూర్చి విననివాళ్ళు లేకపోవచ్చు గానీ కథనం చివరిదాకా చదివిస్తుంది.</p>
<p>శెడి రడ్డిండ్లు శేరిండ్లేవాళ్లే గానీ రడ్డిండ్లకు శేరి శెడినోళ్లు లేరు (పదిమందికి పెట్టే పడసాల) అంటూ అన్నిచోట్లా ఒకేలా ఉండని వర్ణ వ్యత్యాసాల గూర్చిన కథ ఇది. దీనికి భిన్నంగా ఉండే కథ “అబ్బిళింత.” కౌగిలింత అనే అర్థమయినా అబ్బిళింతల చవిగోలును తెలుసుకోవాలంటే సున్నిత మనస్కులయిన పిల్లల్లో జీవితాంతం గుర్తుండిపోయేలా చేసే ఈ వర్ణ వ్యత్యాసాల కథని పూర్తిగా చదవాల్సిందే.</p>
<p>మొగుడు బాలిరెడ్డి వెంటతెచ్చిన ఏనాది పిల్ల జిలకర మీద మండిపడ్డా, ఆ పిల్ల పోయిన తరువాత ఆమె కూతురు పద్నావతిని చన్నుకుడిపి బతికించింది బూరగవ్వ (ఒంటినిట్టాడి గుడిసె). ఆ పిల్లమీద తండ్రివరసని కూడా పట్టించుకోకుండా బాలరెడ్డి చేసిన దాష్టీకాన్ని ఆపలేకపోయింది గానీ, తన స్వంత కొడుకు కూడా దాన్నే తలపెట్టడంతో మొగుణ్ణీ, కొడుకునీ వదిలేసి కూతురుకు పెళ్ళిచేసి, ఆమె చుట్టపక్కాలే ఆమెని దూరంగా ఉంచడంతో ఒంటినిట్టాడి బతుకు బతికింది ఆమె.</p>
<p>చిన్నతనంలో ఊహ తెలియనప్పుడే మొగుణ్ణి కోల్పోయి తమ్ముడి పంచన చేరి, నడి వయసులో నిమ్న కులానికి చెందిన వాడితో పొందుపెట్టుకుందని ఆ తమ్ముడి చేతే జీవితాన్ని “రయికముడి ఎరగని బతుకు” చేయించుకున్న కథ కన్నెమ్మది. వస్తువు పాతదే అయినా ఆకట్టుకునే కథనం. కుమ్మరి చేతుల్లో రూపొందే కళాఖండాల వివరాలు పాఠకులకు అదనపు ప్రతిఫలం.</p>
<p>అల్లమదేవి పదాన్నీ, అడవి అంచున పంటపొలాల మీద ఆధారపడి బతికే మాదిగ కుటుంబాలు ఏనుగుల కోపాన్ని ఎలా కాచుకుంటాయనే వైనాన్నీ, నాగారాజనే ఒక కాపు మగాడు సిరివన్నె అనే కొత్త పెళ్లికూతురుమీద చెయ్యబోయిన దాష్టీకానికి బుద్దిచెప్పడాన్నీ కలగలిపిన కథ “సిడిమొయిలు.” ఏనుగుల మందని దారిమళ్లించే వివరాలు ఉత్కంఠభరితంగా చిత్రించారు రచయిత.</p>
<p>ఎప్పుడో విన్న “బడకొడితి” అన్న జంతువు వెదుకులాట గూర్చిన కథ శీర్షిక కూడా ఆ జంతువు పేరే. దాని గూర్చిన కొన్ని వివరాలివి: “అది గాడిదంత ఎత్తు ఉండచ్చు లేదా కుక్కంత ఎత్తు ఉండచ్చు. దానికి ముక్కుమీద కొమ్ము ఉండచ్చు లేదా దవడల్లోనుంచి కోరలు పొడుచుకుని వచ్చుండచ్చు. దాని వీపుమీద పెద్ద బిందెడు నీళ్లు పట్టేంత గుంట ఉండచ్చు లేదా &#8230;” భార్యల గూర్చి భర్తలు చేసే అన్ని రకాల ఫిర్యాదులూ దర్శన మిస్తాయి ఇందులో. ఆ జంతువు చివర్లో దర్శనమిస్తుంది.</p>
<p>కాపు కుటుంబంలో పనిచేసిన మాలోళ్ల మంగమ్మ అంటరానితనం ఆ ఇంట్లో మూడు తరాల్లో ఎలా మారిందో ఒక మరవరి (ఇంజనీర్) కొడుకు చెప్పిన కథ ఇది (కాకికి కడవడు పిచిక్కి పిడికిడు). మంగమ్మ రెక్కల కష్టంతో పండించిన ధాన్యాన్ని ఆ పంటచేను కొన్నది తాము అయినందుకు ‘కాకికి కడవడు పిచిక్కి పిడికిడు’ అంటూ కొలతలేసినా మారు పలకని మంగమ్మ మొగుడికి దొంగతనాన్ని అంటగట్టి వెళ్లగొడుతుండగా అంటుంది: “మీరందురూ మీపని కోసమే అంటును పక్కన పెట్టినారు. మీ లోపలి అంటును మటుకు గట్టిగా అట్నే పెట్టుకోనుండారు. పనులు తీరిపోగానే అది మళ్లా బయటకు వస్తా ఉండాది.” మంగమ్మ ఇక్కట్లు గుండెని కలచక మానవు, వాటికి కారణమయిన సమాజపు రీతులమీద కోపమూ రాక మానదు. అంటరానితనం తుదముట్టించిన అగ్రహారం పిల్లా, కథకుని ప్రేమ కథ “మాదిగపుటక కాదు.”</p>
<p>అరవళ్లి సూరవళ్లి కత, నల్లతంగ కత, కాంతరాజు కత, కమ్మపణితి కత, రేణిగుంట రామిరెడ్డి కత, … ఆ ఊరి మగాళ్ల మోడికోళ్ల కతలు చాలా వున్నాయి ఆ మాదిగ అవ్వ “కతల గంప”లో. తనను కాపాడుకోలేక పోయింది గానీ కూతురునే గాక ఆ చుట్టుపక్కల పల్లెల్లోని ఆడకూతుళ్ళ నందరినీ ఆ మగాళ్ల దౌష్ట్యాన్నుంచీ తప్పించాలనుకుని ఆ కతల నమ్ముతూ బతుకుతోంది. బర్రిగొడ్డయినా ఆవుగొడ్డయినా ఆడబతుకే అట్టాంటిది అబయా అంటుంది రుప్పిణవ్వ.</p>
<p>అలాంటి ఆశయంతోనే బతికింది సునందమ్మ (పాంచాలమ్మ పాట). ధర్మరాజు జూదంలో పణంగా పెట్టి ఓడిపోయిన ద్రౌపదిని కృష్ణుడు రక్షించాడు గానీ ముద్దురెడ్డి సునందమ్మని పణంగా పెట్టి ఓడిపోతే మునిరామ నాయుణ్ణించీ రక్షించడానికి ఎవరూ లేరు. ఆమె ఆ వైనాన్ని ఆ పల్లెలో చాటింపు వెయ్యడమే గాక తల నెగరేసి శేషజీవితాన్ని అక్కడే గడపడం ఆమె ఆ పల్లెవాసులకు చేసిన గొప్ప సహాయం. ఇది బాట చెప్పిన కథ కూడా. ఈ రెండు కారణాలవల్ల కథకు “పాంచాలమ్మ బాట” అని పేరుపెట్టి వుండాల్సిం దనిపిస్తుంది.</p>
<p>“అదంటే నాకు మక్కువ. పడి చచ్చిపోతాను దానికోసం. దానిమేను ఒక్కొక్కసారి కాటుక పసనుతో మెరిసిపోతుంటాది. ఇంకొక్క సామనలుపుతో మినుకుతుంటాది. అప్పుడప్పుడూ తెల్లటి పొట్లపూవయి విరగబడుతుంటాది.” అంటూ మొదలవుతుంది “మెయిలు నొగులు.” అప్పుడప్పుడూ రాక్షసుడిలా తయారయి ఊళ్లోని ఆడవాళ్లకి కొడుకు చేస్తున్న ఎనలేని అపచారాన్ని సహించలేక చేతులు ముడుచుకుని కూర్చోని తల్లి చిన్నారవ్వ కథ ఇది.</p>
<p>రాగమ్మతో బంధాన్ని వర్ణ వ్యత్యాసమని రవ్వమ్మ అడ్డంకొట్టి కొడుకు రాజయ్యకి రాణెమ్మతో మనువుచేసింది (చెట్లు చెప్పిన కత). ఆస్తి పోయిన తరువాత రెండేళ్ల రాదను, తల్లినీ తీసుకుని మాలవాడలో రాగమ్మని చేరతాడు రాజయ్య. రాణెమ్మ పుట్టింటికి చేరుకుంటుంది. రాదని కొన్నేళ్లు పెంచిన తరువాత ఆమెను మాలపిల్లగానే ఊరు పరిగణిస్తోందని గ్రహించి రవ్వమ్మ ఆ పిల్లని రాణెమ్మ చెంతకు చేరుస్తుంది. పెళ్లయిన తరువాత తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఎత్తుకుని పెంచిన తల్లిని చూడనంటుంది. వలపూ, జీవితం సామాజికంగా వర్ణ వ్యత్యాసం కోరే బలీ ముడివడివున్న కథ ఇది.</p>
<p>ఈ కథాంశాల ఎత్తుని మించినవి వీటిల్లోని భాష, వర్ణనలు, ఉపమానాలు.</p>
<p>ప్రళయ కావేరి మాండలీకంలోని సొబగులకు రచయిత కలం ఎన్ని వన్నె లద్దిందో!</p>
<p>మచ్చుకి కొన్ని -</p>
<p>ముసలి ఉసురునూ పసి ఊపిరినీ &#8230;; పెళపెళలాడే పసను లేకపోయినా కళకళలాడే మొగము ఆ అమ్మిది; (చెట్లు చెప్పిన కత)</p>
<p>&#8230; బూరగమ్మల కడగండ్లకన్నా జిలకరమ్మల కల్లేట్లు పెద్దవి. (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>ఇంటెడు అగచాట్లనూ ఒంటెడు పాట్లనూ &#8230; (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)</p>
<p>తూరుపు పేట దడబుడ చప్పుళ్లు లేని, మంది లొడలొడలు మట్టుకే ఉండే తావు. (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)</p>
<p>ఆ మాండలీకానికి తోడుచేసిన అద్భుతమయిన వర్ణనలు ఈ పుస్తకం నిండా కనిపిస్తాయి.</p>
<p>మచ్చుకి కొన్ని -<br />
కూటికుండనూ కూరాకుచట్టినీ ఎగకట్టి పాలదుత్తను ఉట్టిమింద పెట్టి కన్ను కొరికింది రెయ్యమ్మ. కడుపే కాలిందో కన్నే కుట్టిందో ఎగిరి పాలదుత్తను తన్నింది జాబిల్లి. పాలదుత్త పగిలి మిన్నంతా వెన్నెలయి కురిసింది. (చెట్లు చెప్పిన కత)</p>
<p>గాలివానకు కొట్టుకొని పొయి ఊరికి ఎడంగా కుప్పగా పడిన ఎండుతాటాకుల మోపు మాదిరిగా ఆ బయల్లో నిలిచి ఉంటాది గోపాలక్రిష్ణ కొటాయి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)</p>
<p>వక్కాకు గములు, పొవ్వాకు కలిసిన వక్కాకు గవులు, ముక్కుపొడి గబ్బు, చెమట కంపు, మన్ను మణము, పేడ వాడ, నాటుసారాయి గదురు, చుట్టపొగ పొలపము, మిడి అత్తరు గత్తు, ఎగరతా పైనొచ్చిపడే ఉచ్చబుడ్డల వేదు &#8230; మంది నుంచి ఇన్ని పొలుపులు వెలువడతాయని అప్పుడే తెలిసింది వాడికి (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ). ప్రతీ వాసనకీ తెలుగులో ఒక పేరున్నదని ఎంతమందికి తెలుసంటారు?</p>
<p>అది పిల్లగోయి పాడినట్టు లేదు. గూట్లోని బెళవాయి కువకువమన్నట్టు ఉండాది. కట్టుకొచ్చిన పిక్కిలిగువ్వ పోతుగువ్వను పిలిచినట్టు ఉండాది. పచ్చముడ్డి కందిరీగ చెండుమల్లికి జోలపాడినట్టు ఉండాది. ముంతమావిడి పండుకోసం మునెక్క కూతురు ముదిగారంగా ఏడిచినట్టు ఉండాది. గుబ్బలమాను మీద జోడు జీరంకులు గీపెట్టినట్టు ఉండాది. (మెయిలు నొగులు)</p>
<p>జలజల కురిసింది ముంగారువాన. ఎండిన తాటాకుల మీద టపటప తాళమేస్తా కురిసింది. కొండల గుండెల్ని తడివేళ్లతో తడమతా కురిసింది. గురిగింజ పొదలోని గువ్వగూటిని నిమరతా కురిసింది. తలవాకిట దోగాడుతున్న పసిబుగ్గమీద చిటికేస్తా కురిసింది. దుమ్ముదుప్పటిని కప్పుకున్న చెట్టుచేమలను కడగతా కురిసింది. పగిలి నెర్రెలుబారిన బీళ్లను పదునెక్కిస్తా కురిసింది. చిట్టెదురు గుబురులో పిల్లంగోయి పాటయి కురిసింది. కోనేట్లో తామరాకుల మీద జారిపడతా కురిసింది. కనుమలో ఎగిరే చిలకముక్కును మెరిపిస్తా కురిసింది. ఉమ్మరిల్లిపోయిన మేనులు చెమ్మగిల్లేటట్టు కురిసింది. (బడకొడితి)</p>
<p>అప్పుడే అలికి ఎర్రమన్ను ఓరు తీసిన నట్టింట్లో ముగ్గుబుట్ట ఒలికినట్టుగా ఉండేది బూరగవ్వ. (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>పిలపిలమని గోలచేసే పులిచింతగువ్వల పసను ఆయమ్మిది. (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>చింతనిప్పుల మీది నివురు నెరుపు ఆ బిడ్డది. (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>తలాకిట కళ్లాపి చల్లి, ఎర్రమన్నుతో ఓరు తీసి, చుక్కల ముగ్గు వేసిందంటే ఆ వన్నెల వారసను చూడడానికి వానవిల్లే దిగివచ్చేది. (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>తలపుల గోళ్లతో గీరుకొని నెంజును పచ్చిపుండు చేసుకొనేది. గాయపడిన నెంజు నెత్తురయి ఆ అమ్మి కళ్లల్లో నుంచి కారిపోయేది. (చెట్లు చెప్పిన కత)</p>
<p>పువ్వరిసి మానుమింద పగిడిగువ్వ పకపక నగే పొద్దు, గురిగింజ పొదలలో గీజనగువ్వలు కువకువలాడే పొద్దు, &#8230; అంటూ పలురకాల పొద్దులు; పైర్లు వెన్నులిడిచే కాలం, చేన్లపైన ఏనుగులు దాడులు చేసేకాలం అంటూ పలురకాల కాలాలు. (ఆ అడివంచు పల్లె)</p>
<p>ఈ పుస్తకంలోని ఉపమానాలు ఈ రచయితకు ప్రత్యేకం. ఎన్ని ఉదహరించినా తక్కువే ననిపిస్తుంది. అయినా, మచ్చుకి కొన్ని -<br />
మనపాటికి మనం ఎవర్నీ పట్టించుకోకుండా ఏవో తలపోతల్లో మునిగి బాట ఓర్న ఒదిగి నడిచిపోతుంటే, వెనకనించి వచ్చిన తులవగొడ్డు ఎత్తి కుదేసినట్టుగా, ఉన్నట్టుండి తగులుకొనింది నాకీ వెన్ను నెప్పి. (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)</p>
<p>పొదల వానకు పొటమరించి పొట్లపూల వానలో పగలబడి పూస్తాదే గోరింట &#8230;; మింద మంచు పడితే మోదుగ పూసినట్టు, పైన ఈడు పది రాగమ్మ కూడా పూసింది. (చెట్లు చెప్పిన కత)</p>
<p>కాసేపటికి వట్టిపొయిన పత్తిచేలో తిరుగులాడే ఒంటరితుమ్మెద రోదలాగా పెరిగి పెద్దదయింది ఆ పాట సద్దు (ఎందుండి వస్తీవి తుమ్మెదా)</p>
<p>జమ్ముగుబురులో జోపానంగా పెట్టుకున్న గుడ్లను జంగుపిల్లి ఎత్తుకొని పోతే, గుండెలు పగిలేటట్లు అరస్తాదే నీళ్లకోడి, అట్లుంది ఆమె ఏడుపు. (ఎందుండి వస్తీవి తుమ్మెదా)</p>
<p>నడిరెయ్యిలో ఒళ్లెరగని తొంగులో ఉండే గువ్వగూటి మీదకు గూబ దూకినట్టు, &#8230; (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>ఆ మాటతో ఉచ్చెంటికను పెరికినట్టు అనిపించి ఒళ్లుమండి పైకి చూసినాను. (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>పెట్టకోడి తను పెట్టిన గుడ్లను రెక్కలకింద పొదుక్కొన్నట్లు అరవై ఇండ్లను అబ్బిళించుకొని ఉందాపల్లె (ఆ అడివంచు పల్లె)</p>
<p>&#8230; అని పిల్లలపంది మాదిరిగా ఎదురు తిరిగి అరిచింది. (ఒంటి నిట్టాడి గుడిసె)</p>
<p>గ్రామీణ సామెతలు కూడా కొల్లలుగానే కనిపిస్తాయి. మచ్చుకి కొన్ని -</p>
<p>అవ్వకు అణిగినట్టు, మనవడికి తీరినట్టు &#8230; (వాడూ గోపాలక్రిష్ణ కొటాయీ)</p>
<p>తెగించింది తెరువుకు పెద్ద, విడిచింది వాడకు పెద్ద; దున్నపోతు అన్నాక దున్ని చావాల, అన్నదమ్ములు అన్నాక వేరుపొయి చావాల; సారె వానలో నానితే సన్నికల్లు కూడా నొగులు పడతాది; గూట్లో పెడితే గూబ ఎత్తుకు పోతాది బీట్లో పెడితే పిల్లి ఎత్తుకొని పోతాది (చెట్లు చెప్పిన కత)</p>
<p>ఆంగ్ల పదాలు దాదాపు ఈ పుస్తకంలో కనిపించవనే చెప్పవచ్చు. అందువల్ల తెలుగు భాషాభిమానులకు ఈ పుస్తకం సంతోషాన్ని తప్పక కలిగిస్తుంది. అన్ని వర్గాల ప్రజల్లోనూ వాడుక సాధారణమయిన ఆంగ్ల పదాలకు కూడా బదులుగా అచ్చ తెలుగు పదాలే దర్శనమిస్తాయి. మచ్చుకి కొన్ని -</p>
<p>పేరేగి (కారు); పట్టేగి (ట్రైన్), తానేగి (ఆటో), తోలేరు (డ్రైవర్), కూటిల్లు (హోటల్), మందులిలు (హాస్పిటల్), అలపలుకి (సెల్ ఫోన్), చిరువాలు (సిగ్నల్), ఎనికెన (కంప్యూటర్), తూకువెళుకు (లాంతరు), మైనంతిత్తి (ప్లాస్టిక్ బాగ్)</p>
<p>ఒంటరిగా మిగిలిన చెల్లవ్వ (ఊడల్లేని మాను), కెంచక్క (మాదిగపుటక కాదు), సునందమ్మ (పాంచాలమ్మ పాట), బూరగవ్వ (ఒంటినిట్టాడి గుడిసె), చిన్నారవ్వ (మెయిలు నొగులు), పెండ్లి చేసుకోకుండా మిగిలిపోయిన మద్దూరవ్వ, లచ్చుమవ్వ (ఆ అడివంచు పల్లె) ఈ రచయితకు ఆప్తులు. వాళ్ల కడగండ్లకు తను మున్నీరై పాఠకులచేత కన్నీరు పెట్టిస్తాడు.</p>
<p>తెలుగు భాష ఇతనికి ప్రాణం. “వేల ఏండ్ల మాదిగల ఉనికికి ఆటపట్టు ఈతావు. ఈడ ఆటా మాటా పాటలు మటుకే కాదు, పైరు ఎన్నుపై వాలి కూసే నీలిగువ్వ కూత తెలుగు. కానల్లో కోనల్లో సందెపొద్దుల్లో యిగిడి. కొండగాలితో కలిసివొచ్చి పల్లెంతా పరుసుకొనే అడవిపూల తావి తెలుగు. మాపుసరి మాదిగా పల్లెంతా కమ్ముకొని మత్తెక్కించే నంజర కూర కమ్మదనం తెలుగు. పనిచేసే మాదిగపిల్ల నొసటి సిరుసెమట తెలుగు. బిడ్డకు సన్నుగుడిపే పొద్దయి, సేపిన రొమ్ములు రైకముడిని కోసేస్తుంటే, పనిచేయలేక పనినింకా లేవలేక ఆ బాలింత పడే యెతలు తెలుగు. నల్లటి మెయిలు నుంచి కారే తెల్లటి తోలి సినుకు తెలుగు. ఈడ పుటక తెలుగు, సావు తెలుగు, పుటక సావులకు నడానుండే బతుకంతా తెలుగే” అంటూ పల్లె ప్రజలకి తెలుగు నేర్పడానికి వెళ్లిన ఈ తెలుగు భాషాభిమాని ‘ఆ అడివంచు పల్లె’లో పులకించిపోతాడు.</p>
<p>“ఆ అడివంచు పల్లె” తో బాటు చాలా కథలని మాకొద్దు అన్న పత్రికలు ఈ కథలన్నిటినీ చదివి ఆనందంగా ఆస్వాదించిన తరువాత రచయిత వ్యక్తిత్వం పూర్తిగా అర్థమై, అరెరే అని నాలిక్కరుచుకునే అవకాశం మెండుగా వుంది. వీటిల్లో మూడు మాత్రమే “వలపత్రికల” (web magazines)లో, మూడు “భూమిక”లో ప్రచురింపబడ్డాయి. రెండుమూడింటిని వార్షిక సంకలనాల్లో చూసిన గుర్తు. అందరికీ అందుబాటులో లేని మిగిలిన కథలని సంకలనంగా ప్రచురించినందుకు “మల్లవరపు వెలువరింత”లకు నాలాంటి పాఠకులు తప్పక ధన్యవాదాలు చెబుతారు. వెయ్యి ప్రతులూ త్వరగా అమ్ముడయిపోయి రెండూ, మూడూ కాక పదుల సంఖ్యలో పునఃప్రచురణలతో ఈ సంకలనం వెలుగు చూడాలనీ, వాటిల్లో ఇంకొన్ని పదాలకు అర్థాల నివ్వాలనీ (ఉదా: సిడిమొయిలు) కోరుకుంటున్నాను. ఆ పునఃప్రచురణలో ప్రతి కథకీ చివర్లో కొన్నికొన్ని పదాలకి అర్థాల నివ్వడం కాకుండా అన్ని పదాల అర్థాల పట్టికని పుస్తకం చివర్లో అకారక్రమంలో ఇస్తే పాఠకులకు సౌలభ్యంగా ఉంటుంది.</p>
</div>
<p style="text-align: center;">***</p>
<p>పుస్తకం: కతల గంప (కథలు)<br />
రచయిత: స. వెం. రమేశ్<br />
ప్రతులకు: 1-2-740, హనుమాన్ మందిరం దగ్గిర, రాకాసి పేట, బోధన్ 503 180. ఫోను: +91 90101 53505</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15212</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>మూడవ మనిషి &#8211; ఓ చీకటి దృశ్యం</title>
		<link>http://vaakili.com/patrika/?p=15161</link>
		<comments>http://vaakili.com/patrika/?p=15161#comments</comments>
		<pubDate>Sat, 30 Sep 2017 18:17:20 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[వాసుదేవ్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=15161</guid>
		<description><![CDATA[కొన్ని అపురూపాలకి కవిత్వమూ మినహాయింపు కాదు. అలాంటిదే ‘మూడవ మనిషి’ దీర్ఘ కవిత.

కవితా వస్తువుని ఎంచుకోవటంలోనే కవి తన ధైర్యాన్ని చాటుకున్నాక ఇక కవితలో చదవాల్సింది చాలానే ఉండి ఉండాలి అనుకున్నా. ]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/ayo.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/09/ayo.jpg" alt="" title="ayo" width="324" height="504" class="aligncenter size-full wp-image-15265" /></a></p>
<p><span style="font-size: 30px;">కొ</span>న్ని అపురూపాలకి కవిత్వమూ మినహాయింపు కాదు. అలాంటిదే &#8216;మూడవ మనిషి&#8217; దీర్ఘ కవిత.</p>
<p>కవితా వస్తువుని ఎంచుకోవటంలోనే కవి తన ధైర్యాన్ని చాటుకున్నాక ఇక కవితలో చదవాల్సింది చాలానే ఉండి ఉండాలి అనుకున్నా. అలానే ఆద్యంతమూ చదివించింది.</p>
<p>కుర్షించని మేఘాలూ, రాయని బలపాలూ, పాలివ్వని ఆవులూ మనకెప్పుడూ చిరాకే, కానీ వాటి గురించి ఆలోచించే సమయముంటే అవీ మాట్లాడతాయి. అవీ తమ గోడుని వెళ్ళబోసుకుంటాయి. వాటిని సవరదీసి మచ్చిక చేస్కుంటే అవీ తమ కథలు చెప్థాయి. హిజ్రాలు ఆ కోవకి చెందినవారె. ఎంతసేపూ వారిని ఊరినుంచో, ఇంటి నుంచో తరిమికొట్టే ప్రయత్నమే కానీ వారిని అర్ధం చేసుకునే ప్రయత్నమేదీ మనం చెయ్యం.</p>
<p>ఆ ప్రయత్నంలో భాగమే ఈ దీర్ఘ కవిత &#8220;మూడవ మనిషి&#8221;.</p>
<p>భారత సమాజంలో మూడో జెండర్ మనుషుల స్థానం ఎప్పుడూ అవమానకరమే. వారిని ముందుగా కుటుంబం అంగీకరించదు. సమాజం అంతకన్నా రానివ్వదు. ప్రభుత్వ చట్టాలు ఎక్కడున్నాయో, ఏం చెప్తున్నాయో ఎవరికీ తెలీదు. వీరికి ఎక్కడా ఉద్యోగం ఇవ్వరు. కానీ మిగతా దేశాల్లో వీరి జీవన విధానం మాములు ప్రజల కంటే భిన్నమేమీ కాదు&#8211; చదువూ, ఉద్యోగం, కుటుంబం అన్నీ మాములే. అక్కడ వీరిని అన్ని కార్యక్రమాలకి మిగతా అందరిలానే స్వాగతిస్తారు.</p>
<p style="text-align: center;">***</p>
<p>ఆంగ్లంలో ట్రాన్స్జెండర్స్ పై రాసిన కవితలు చాలానే ఉన్నాయి, కానీ తెలుగులో ఈ ప్రయోగం కొత్తదే. నిజానికి ఆంగ్ల భాషలో 2013 లోనె దాదాపు 55 హిజ్రాలు తమంతట తామే ఓ సంకలనాన్ని విడుదలా చేసుకున్నారు వారి కవితలతో! “Troubling the Line: Trans and Genderqueer Poetry and Poetics”.</p>
<p>&#8220;మూడవ మనిషి&#8221;&#8211; ఈ దీర్ఘ కవిత పదిహేను కథలుగా చెప్పబడింది. అందువలన రీడబిలిటీ సులభమవుతుంది పాఠకులకి. పుస్తకం తెరిచి ఏ కథతోనైనా కవిత చదవటం ప్రారంభించొచ్చు. ఈ కవితకి ఉన్న ప్రత్యేక లక్షణాల్లో ఇదొకటి.</p>
<p>ఆత్మకథగా ప్రారంభమైనా ఓ మోనోలాగ్ గానే కొనసాగింది మొత్తం పదిహేను ఖండికల్లోనూ. ఇంకా నిర్ధారించి గట్టిగా చెప్పాలంటే ఓ డ్రమటిక్ మోనోలాగ్ రూపంలోనే ఈ దీర్ఘ కవితంతా రాయటం జరిగింది. కవి కావాలనే ఈ మోడ్ లో రాసారో లేక కవిత చివరికొచ్చేసరికి ఆ రూపం వచ్చిందో నాకైతే తెలియదు.</p>
<p>&#8221; మెత్తటి పూలచెండులా దూదిబొమ్మలా/ అమ్మ గుండెలమీద నేను&#8221; ఇలా కవిత ఆద్యంతమూ వినిపిస్తుంది ఈ మూడవమనిషి స్వరం. కన్నకొడుకు కంటిముందే అమ్మయిలా తయారవ్వుతుంటే బిడ్డని ఎవ్వరికీ చూపించలేకా, చూపించకుండా ఉండనూలేకా ఆ తల్లిపడే అవేదనని కవయిత్రి చాలా చక్కగా మలచుకున్నారు. అదీ కవితలోని ప్రధాన పాత్ర-ఓ హిజ్రా ద్వారా!</p>
<p>మాములు కవితల్లో కవితా వస్తువుని వర్ణించటానికీ , పాఠకులముందు విస్పష్ట పర్చటానికీ, ఇలాంటీ రచనల్లో కవితా వస్తువును శ్లాఘించటానికీ చాలా తేడాఉంది. ఇక్కడ హిజ్రాలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఆ పాత్ర గురించి పూర్తి అవగాహన లేకున్నా ఉన్నట్లుగా పూర్తిగా ఊహించి మరీ రాయటం కష్టమైన పనే.</p>
<p>ఓ సంక్లిష్ట సబ్జెక్ట్ ని తీసుకున్నాక ఆ కవిత భాష అలతిగా లేకపొతే పాఠకులు చదివే అవకాశాలు తక్కువవుతాయి. కానీ ఈ కవితలో రేణుకా గారి పాటవం అంతా ఇక్కడె కనిపిస్తుంది.</p>
<p>&#8220;గాయపు పొర రేగి చిమ్మిన నెత్తురు/ వేసవి గాలి తెచ్చిన దుమ్ములా/కాగితాల మీద పేరుకుంది/కథ చెప్తున్న కలం<br />
కాగితం చాపమీద నడుం వాల్చింది&#8221; ఈ వాక్యాల ద్వారా చాలా విషయాలు బోధపడే అవకాశం ఉంది: కొన్ని వాక్యాలు ఎలా కవిత్వమవుతాయి అన్నదీ, కాగితం చాప అన్న మెటఫర్ ప్రయోగం- ఇలాంటివి మరికొన్ని ఈ కవితని జీవితాంతం గుర్తుంచుకుపోయేలా చేస్తాయి.</p>
<p>కవితని రెండు భాగాలుగా విభజించి చూడొచ్చు&#8211; వీరు ప్రపంచానికి ఎలా కనపడతారు, వీరికి ప్రపంచం ఎలా కనపడుతుంది.</p>
<p>&#8220;శరీరాన్ని కావలించుకున్న మగతనపు ఛాయలు&#8221;</p>
<p>&#8220;సంతృప్తి పమిట కప్పుకుని, తెలి మెరుపుల జరీపోగుల చీరతో, తెల్లగులాబీలా&#8221; ఈ వాక్యాల్లో హిజ్రా తనని తానే ఆవిష్కరించుకుంటే,</p>
<p>&#8220;ఈ దారినిండా మనుషులు/ఆర్తి నిండిన ముఖాలు/ తెగింపు తిరస్కారంతో నిండిన చూపులు&#8221;<br />
లాంటి ఒక్క వాక్యం చాలు వీరిని ప్రపంచం ఎలా ట్రీట్ చేస్తుందో అర్థమవ్వటానికీ.</p>
<p>ఇలంటివి ఈ దీర్ఘ కవితలో చాలానే ఉన్నయన్న నిజాన్ని మీ నుంచి దాచిపెట్టలేనన్నదే ఏకైక నిజం.</p>
<p>రేణుకా అయోలా గారికి అభినందనలతో..</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=15161</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>బబ్లూ గాడి బుక్ రివ్యూ</title>
		<link>http://vaakili.com/patrika/?p=14922</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14922#comments</comments>
		<pubDate>Fri, 01 Sep 2017 02:10:29 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[బబ్లూ]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14922</guid>
		<description><![CDATA[నేను పుట్టానో లేదో గొల్లపూడి వాళ్ళేసిన కాశీ మజిలీ కథలు పేద్ద పేద్దవి ఆరు పుస్తకాలూ, కథా సరిత్సాగరం, రంగుల ఎన్‌సైక్లోపీడీయాలూ, ఈసఫ్ , జాతక , భేతాళ, ప్రపంచ కథలూ, రామయణ, మహా భారతాలూ , ఇంకా టాం సాయర్ లాంటి బండెడు పుస్తకాలు ఓ బీరువా నిండా పేర్చిపెట్టాడు మా నాన్న.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/RussianJanapadaKathalu600.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/RussianJanapadaKathalu600.jpg" alt="" title="RussianJanapadaKathalu600" width="398" height="600" class="alignleft size-full wp-image-14928" /></a></p>
<p><strong>చెప్పింది:</strong> బబ్లూ<br />
<strong>రాసింది:</strong> వాళ్ళ డాడీ</p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఈ </span>పెద్దోళ్ళకన్నీ తెలుసని వాళ్ళనుకొంటారు. కానీ వాళ్ళకేమీ తెలీదని నాకు మాత్రమే తెలుసు. అ విషయం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళింకా నమ్మలేదు.</p>
<p>లేపోతే చూడూ!</p>
<p>నేను పుట్టానో లేదో గొల్లపూడి వాళ్ళేసిన కాశీ మజిలీ కథలు పేద్ద పేద్దవి ఆరు పుస్తకాలూ, కథా సరిత్సాగరం, రంగుల ఎన్‌సైక్లోపీడీయాలూ, ఈసఫ్ , జాతక , భేతాళ, ప్రపంచ కథలూ, రామయణ, మహా భారతాలూ , ఇంకా టాం సాయర్ లాంటి బండెడు పుస్తకాలు ఓ బీరువా నిండా పేర్చిపెట్టాడు మా నాన్న.</p>
<p>నాకప్పటికి ఏబీసీడీ లు రావు. అందుకే &#8220;నాన్న&#8221; అనేవాడిని. మూడేళ్ళప్పుడు ఇంట్లో శుబ్బరంగా ఆడుకొంటుంటే ప్లే స్కూల్లో వేసేశారు &#8211; అక్కడ బోలెడన్ని ఆటలు ఆడుకోవచ్చని మోసం చేసి. ఇక అప్పటినించీ వాళ్ళని నమ్మటం మానేశాను. వాడిని డాడీ అనటం కూడా మొదలెట్టాను. తప్పు &#8216;వాడు &#8216; అనకూడదు అని క్వీనీ టీచర్ పెద్ద క్లాసు పీకిందిలే. మరి స్కూల్లో ఫ్రెండ్స్‌ను వాడు అనటల్లా? ఆ టీచర్‌కీ బుర్రలేదు.</p>
<p>పెద్దోళ్ళకు ఏమీ తెలీదన్నాను కదూ.</p>
<p>ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఏముందో నాకే కాదు, మా డాడీకి అసలే తెలీదు. అసలు చదవటానికి వాడు ఇంట్లో ఉంటేగా! మళ్ళీ ఆఫీసు నుంచి గంటకో ఫోను &#8211; బబ్బు గాడేం చేస్తున్నాడని. వాటినెవడు చదూతాడని తెచ్చిపెట్టాడో మరి? నేనన్నా నయం- అప్పుడప్పుడు వాటిలో బొమ్మలు చూస్తుండేవాడిని. కొన్ని పేజీలయితే చింపి పోగులు పెట్టేవాడిని.</p>
<p>ఓ సారేమయిందో తెలుసా?</p>
<p>అర్ధరాత్రి లాప్‌టాప్ బాగ్ పట్టుకొని దొంగలాగా ఇంట్లో దూరబోతున్నాడు ఎప్పట్లాగే! నేను అప్పుడే బాత్రూం నుంచి రెండు బకెట్లు హాల్లోకి లాక్కొచ్చి ఆ నీళ్ళతో స్నానం చేస్తున్నా. వాడికి గుండాగిపోయి కేకలు పెట్టి అందర్నీ నిద్ర లేపాడు- అందుకే ఈ పెద్దోళ్ళకి ఎమీ తెలీదంది &#8211; బజ్జున్న వాళ్ళని లేపకూడదన్న విషయం నాకు తెలుసు, కానీ అంత వయసొచ్చినా వాళ్ళకి తెలీదు.</p>
<p>పాపం మా మమ్మీ కొన్ని పుస్తకాలు చదివి ఆ కథలు చెప్పబోయింది గానీ, మనం వింటేగా? వాళ్ళు విని చచ్చారు గనకనా వాళ్ళ పెద్దోళ్ళ మాటలు? కావాలంటే మా అమ్మమ్మనీ , నాయనమ్మనీ అడగండి. అంచేత మనమూ వినక్కర్లేదు.</p>
<p>ఇంతకీ వాళ్ళ పుస్తకాల గోల. వాటిని చదివి గ్యానం పెంచుకోవాలని నాకు పదేళ్ళొచ్చేదాకా ఒకటే నస. ఇంగ్లీషు స్కూల్లో వేసి మళ్ళీ ఇంట్లో మాత్రం తెలుగు పుస్తకాలు చదవాలంట! అసలు వీళ్ళకి బుర్రుందా అని ?</p>
<p>అలా వాళ్ళు ఏడిచీ, గోల పెట్టీ, పానీ పూరీ కొనిస్తామని ఊరించీ, తంతామని బెదిరించీ ఎలాగో మొదటిసారిగా టింకిల్ చదివించి తెగ సంతోషించారు. నేను బొమ్మలు మాత్రమే చూస్తూ పేజీలు స్పీడుగా తిప్పుతున్నానని వాళ్లకు తెలిసి చస్తేగా&#8230;</p>
<p>ఆ తర్వాత నేనే పేపరంకుల్ తో చెప్పి టింకిల్ తెప్పించుకొని, చదివిందే మళ్ళీ మళ్ళీ చదివి స్కూల్లో తక్కువ మార్కులు తెచ్చుకొన్నా వాళ్ళు ఇంకేం అన్లేకపోయారు- వయసు పెరిగిందిగా కొంచెం బుద్దొచ్చిందనుకొంటా.</p>
<p>టింకిల్ వాళ్ళ మహాభారతం తర్వాత సి. రాజగోపాలాచారి రాసిన ‘మహాభారతం’ అడిగి తెప్పించుకొన్నా. రాజగోపాలాచారి తాత అప్పటి మద్రాసు ముఖ్యమంత్రీ, చివరి గవర్నర్ జనరల్ కూడా అంట.</p>
<p>అది చదివి , బోలెడు రీసెర్చ్ చేసి, కౌరవులు వందమంది కాదు 102 మంది అనీ, అందరూ మగవాళ్ళు కాదు- నూట ఒకటో ఆమె దుశ్శల అనీ కనిపెట్టి, అ పేర్లన్నీ వరసగా రాసి చూపించేసరికి మా వాళ్ళకి మతి పోయింది. ఇంకానేమో కౌరవులు అందరూ చెడ్డవాళ్ళు కాదు- వికర్ణ, యుయుత్సు ఇద్దరూ మంచి వాళ్ళని చెప్పే సరికి &#8211; ఇక దిమ్మ తిరిగి మైండు బ్లాకయిందనుకో! (అందుకే మరి మహేష్ బాబు సినిమా మొదటిరొజే చూడాలి నాలాగా).</p>
<p>వీడికీ పేర్ల గోల ఎంటో అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నవ్వుతూ ఏడుస్తూ చెప్పుకొన్నారని అక్కడి ఆంటీలు చెప్తే తర్వాత తెలిసింది. వాటినే ఆనంద బాష్పాలు అంటారని వాళ్ళే చెప్పారు. నాలాగే ఆ ఆంటీలకీ వీళ్ళ పుస్తకాల గోలంటే వళ్ళు మంట. అందుకే వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ముందు గదుల్లో పుస్తకాల గోల చేస్తుంటే నేను వంటగదిలో దూరి వాళ్ళతో కబుర్లు చెపుతూ ఉంటాను- తినటానికేమున్నాయా అని వెతుక్కుంటూ.</p>
<p>బయట అందరికంటే చెవులు పగిలేట్టు పుస్తకాల గోల చేసేవాళ్ళలో ఎప్పుడూ ఫష్ట్ వచ్చేది అనిల్ అంకులే.</p>
<p>ఆయన ఓ సారి &#8216;ఉక్రేనియన్ ష్టోరీస్ &#8216; అని ఓ బండ పుస్తకం గిఫ్ట్‌గా ఇచ్చి చదివారా? చదివారా? అని కనిపించిన చోటల్లా కొన్ని వందల సార్లు అడిగే సరికి, మా చిన్నారికి జాలేసి రెండు రోజుల్లో ఆ 550 పేజీల పుస్తకం చదివి పారేసింది. అది ఫోన్‌లో చెప్పేసరికి మొహమంతా వెలిగిపోతూ &#8220;మీలాంటి వాళ్ళకోసమే ఇవి డబ్బింగ్ చేశాను &#8221; అని వచ్చి ఇంకో రెండు పుస్తకాలు తెచ్చిచ్చాడు.</p>
<p>అవే &#8216;రష్యన్ జానపద కథలు &#8216;.</p>
<p>వాటిని చూసేసరికి భయమేసి చచ్చాను. ఎందుకంటే అవి తెలుగు పుస్తకాలు.</p>
<p>చిన్నప్పుడెప్పుడో మా అమ్మ కష్టపడి తెలుగు నేర్పింది. అప్పుడు పేపర్ చూసి సినిమాల వివరాలు చదివేంత బాగా తెలుగు వచ్చింది. కానీ ఇంకా బాగా రావాలని మా వాళ్ళు ఓ ట్యూషన్ లో చేర్పించారు. ఆ టీచర్ దెబ్బలకి తెలుగు మీద విరక్తి పుట్టి వచ్చినదంతా మరిచిపోయాను.</p>
<p>రెండోదేమో, ఆ పుస్తకాలు చదివి, మళ్ళీ వాటి గురించి మీటింగులో మాట్లాడాల్సింది కూడా మీరే అని కూడా చెప్పి పోయాడు అనిల్ అంకుల్.</p>
<p>చచ్చాం రా బాబూ! అంది చిన్నారి.</p>
<p>తప్పించు కొందామని ఎన్నో ఎత్తులేసాం. అయితే అంతకంటే ఎక్కువ ఎత్తులేసి మా అమ్మా నాన్నా వాటిని చిత్తు చేశారు. ఇక చిప్స్ కొనమనీ , మహేష్ బాబు నానీ సినిమాలు బందనీ మా వీక్నెస్ మీద దెబ్బ కొట్టారు. అలా వాళ్ళకి మాకంటే కొంచెం తెలివి ఎక్కువే ఉందని తెలిసొచ్చింది మొదటిసారిగా.</p>
<p>ఇక్కడో సీక్రెట్ చెప్పాలి. కథలు చదవటం కష్టమే, కానీ వాటి మీద మాట్టాడటం మాత్రం ఇష్టం, మీకు లాగే. చాలా మంది లాగా నాకూ మైకు పిచ్చి ఉందని మా అమ్మ చిన్నప్పుడే కనిపెట్టేసింది. అందుకే చిన్నారి(చిన్నారి అంటే మా చెల్లెలు రాక్షసి) కంటే నేను మాత్రం హాపీ&#8230;</p>
<p>పొన్లే, మా టైం ఇంకా రాలేదని కాంప్రమైజ్ అయి ఆ పుస్తకం కొంచెం తెరిచి చూశాం.</p>
<p>ఆసమ్! ఒక్కో కథకూ ఓ రంగుల బొమ్మ. మెరిసే ఆయిల్ పేపర్‌ల మీద పాతిక దాకా అలాంటి బొమ్మలే. ఆ రంగుల బొమ్మలు చూశాక ఇంక కథ చదవాలనిపించింది. ఎలాగో కష్టపడి వచ్చీ రాని తెలుగులో చదవటం మొదలెట్టా. రెండు మూడు కథలు చదివాక మిగతా కథలు చదవటం ఈజీ అయ్యింది.</p>
<p>మీకు నచ్చినా నచ్చకపోయినా అదే చెప్పండి అని అనిల్ అంకుల్ చెప్పటం ఇంకా నచ్చింది. అందుకని కథలన్నీ చదవకముందే కొన్ని పాయింట్‌లు రాసేసుకొన్నా.</p>
<p>ఈ పుస్తకం ఎందుకు నచ్చిందంటే:</p>
<p>- రంగు రంగుల బొమ్మలు. మనం ఓ రంగుల తోటలో నడిచినట్టు ఉంటుంది.</p>
<p>- తెలుగు అంతగా రాకపోయినా నేను చదవటం. ఇంకో సీక్రెట్! మా అమ్మా నాన్నలు తెలుగులో ఏం రాశారో ఇంతవరకూ నేను చదవలేదు. కానీ ఈ పుస్తకం చదవ గలిగాను. &#8220;తెలుగు రానట్టు భలే యాక్షన్ చేశావురా ఇన్నాళ్ళూ&#8221; అని కుళ్ళుకున్నారు వాళ్ళు.<br />
- రాసిన వాక్యాలన్నీ సింపుల్ గా ఉన్నాయి. అర్ధం కాని కథంటూ ఏమీ లేదు.</p>
<p>- నాకు ప్రేమ్‌చంద్ కథలు రెండు తెగ నచ్చాయి. ఒక మనవడు అమ్మమ్మ కోసం అట్లకాడ కొనే కథ, రెండు ఎద్దులు కలిసి ఓ ఆంబోతుని ఓడించే కథ. ఎందుకో ఈ కథలు చదూతుంటే ఆ కథలు గుర్తొచ్చాయి.</p>
<p>- నాకు కలలంటే ఇష్టం. ఎందుకంటే వాటిలో మనకిష్టమొచ్చినట్టు కలలు కనేయొచ్చు. ఈ కథలు కూడా ఆ కలల్లానే ఉన్నాయి. ఒకో బొమ్మకూ ఒక్కో కల.</p>
<p>- అక్కడెక్కడో రష్యా అనే దేశంలో కూడా మనలాంటి పిల్లలు మనలాగే ఇవీ చదూతారని తెలుసుకోటం.</p>
<p>- చీపురు కట్టల మీద ఎగిరే హారీ పోటర్ ఏడు బండ పుస్తకాల కంటే ఈ కథలు బాగా ఉన్నాయనిపించటం (చిన్నారికి హారీ పోటర్ అంటే ఇష్టమని ఇది రాశానని చెప్పకండి. తెలిస్తే నన్ను గిచ్చి గిచ్చి పెడుతుంది).</p>
<p>ఇంకా ఇలాంటివే నేను ఇంగ్లీషు తెలుగులో రాశాను. అవి చూసి మా డాడీ &#8220;నువ్వు చెప్పు, నేను తెలుగు తెలుగులో రాసి పెడతాను&#8221; అన్నాడు.</p>
<p>నేనేది చెప్తే అదే రాయాలి, దాన్ని మార్చ కూడదు అని కండిషన్ పెట్టాను. అలా అన్ని కథలూ చదవక ముందే ఇది తయారయ్యింది. దీన్నే బుక్ రివ్యూ అంటారని కూడా అన్నాడు మా డాడీ.</p>
<p>మీకు నచ్చితే- నచ్చినట్టు కామెంట్లు పెడితేనే- ఇలాంటివి ఇంకొన్ని చెప్పి రాయిస్తాను (ఎవరూ చదవక పోయినా రాస్తూ పబ్లిష్ చేస్తూ ఉండటానికి నేనేం పెద్దోడిని కాదు).</p>
<p>మీకు నచ్చకపోయినా పెద్దోడినయ్యాక తెలుగు రాయటం నేర్చుకొని ఎలాగూ నా ఇష్టమొచ్చినట్టు రాస్తాను.</p>
<p>అప్పుడు మీరు చచ్చినట్టు చదవక తప్పదు.</p>
<p>ఎందుకంటే మీరేది రాసినా ఇప్పుడు మేం చచ్చినట్టు చదవటంలా? మాకూ ఉంటాయి హక్కులు &#8211; కావాలంటే మా సివిక్స్ టెక్స్ట్ బుక్ చదవండి.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<hr/>
<img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/Babloo_Vaakili.png" alt="" title="Babloo_Vaakili" width="200" class="alignleft size-full wp-image-14931" /></p>
<p>బబ్లూ ఇంట్రో:</p>
<p>చదవటం కంటే చూడటం, చూడటం కోసం తిరగటం, తిరగటం కంటే తినటం ఇష్టం.</p>
<p>తినటంలో నా స్పెషాలిటీ : పుట్టకొక్కులు, ముల్లంగి, కాబేజీ, బీట్‌రూట్, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, ఇంకా బోలెడు సూపులు, నూడుల్స్. </p>
<p>చిన్నప్పుడు ముప్పయ్యేళ్ళ కాలెండర్, ప్రపంచ దేశాలు, ఇండియాలో అన్ని రాష్ట్రాల వివరాలూ చెప్పి , రెండు నిమిషాల్లో రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేసరికి,  అది తెలిసి ఇద్దరు డాక్టరంకుల్స్ నన్ను వెతుక్కొంటూ వచ్చి మా మమ్మీ డాడీలకు ఫ్రెండ్సయిపోయారు.  </p>
<p>ఇంకో సారేమో &#8220;మీ ముత్తాత మేనల్లుడి మూడో తమ్ముడి నాలుగో మేనల్లుడి రెండో చెల్లెలుంది. బంగారబ్బొమ్మ.  చేసుకొంటావురా?&#8221; అంది మా చినమ్మమ్మ పెద్ద కోడలు &#8211; నేను అయిదో క్లాసులో ఉన్నప్పుడు. &#8220;అదెలా కుదురుద్ది? అది నాకు చెల్లి వరస కదా అత్తా!&#8221; అనేసరికి, పళ్ళూడిన చుట్టాలందరూ ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కొని నేనే కరెక్టని తేల్చి &#8211; ఇక అప్పట్నించీ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారో తెలుసుకొనేందుకు అమెరికానుంచీ కూడా ఫోన్లు చెయ్యటం మొదలెట్టారు.</p>
<p>ఇంకా  తబలా , పియానో, కీ బోర్డు , డ్రమ్‌స్ కొట్టటమంటే ఇష్టం. చదవటం కంటే కథలు రాయటం ఎక్కువ ఇష్టం. </p>
<p>ఎప్పటికయినా పేద్ద ఆటో మొబైల్ ఇంజనీర్నీ, బిజినెస్ మాన్ నీ , చెఫ్ నీ , ప్రైం మినిష్టర్నీ అవుతాను. మా పిల్లల బండెడు పుస్తకాల బరువునీ, పరీక్షల బాధనీ బ్యాన్ చేస్తా. ఈ పెద్దోళ్ళకి కొంచెమన్నా బుద్ది రాకపోతే స్కూల్లో చేర్పించి నాతో పాటు మళ్ళీ 8th క్లాసు పరీక్షలు పెట్టిస్తాను.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14922</wfw:commentRss>
		<slash:comments>22</slash:comments>
		</item>
		<item>
		<title>సురపురం &#8211; మెడోస్ టైలర్ ఆత్మకథ</title>
		<link>http://vaakili.com/patrika/?p=14771</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14771#comments</comments>
		<pubDate>Tue, 01 Aug 2017 18:41:55 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[పద్మావతి.బి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14771</guid>
		<description><![CDATA[</p> <p>మనకిప్పుడు ఎక్కడికైనా వెళ్ళటానికి బస్సులు, రైళ్లు, విమానాలు, ఎవరితో అయినా మాట్లాడటానికి రకరకాల సమాచార వ్యవస్థలు, ఏ మూల పల్లెటూరికైనా కనీసం ఒక మట్టిరోడ్డు, మన స్థిర చరాస్తు లేవైనా కానీ వాటిమీద మన హక్కు, మనమీద ఎవరైనా దాడి చేస్తే పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఇంకో ఆలోచన లేకుండా మన జీవితంలో బాగం అయిపొయాయి. ఇవన్నీ లేని ఒకానొక కాలంలో &#8211; 1824 లో &#8211; ఇంగ్లాండు నుండి ఒక 16 ఏళ్ల కుర్రవాడు బొంబాయిలో ఈ దేశపు గడ్డ మీద అడుగుపెట్టి ఒక 36 సంవత్సరాలు ఈ దేశంలో తిరుగుతూ తను చూసిన కళ్ళతో అక్షరాల్లో అవన్నీ చూపిస్తుంటే చూడటం ఎంత బావుంటుంది. ఈ రోజు భారతదేశం కంటే అప్పటి భారతదేశం కళ్ళకింకా ఇంపుగా కనపడుతుంది అతని అక్షరాల్లో.మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ లోని లివరపూల్ లో 1808 లో పుట్టాడు. తండ్రివైపు, తల్లివైపు బంధువులు ఇంగ్లాండ్ లో పలుకుబడి గల కుటుంబాలకు చెందినవాళ్ళు. తండ్రి వ్యాపారమేదో చేసి నష్టపోయాడు. మెడోస్ టైలర్ ది అత్తెసరు స్కూల్ చదువు. 13, 14 ఏళ్ల వయసులోనే భారతదేశం తో వ్యాపారం చేసే సంస్థలో ఒక చిన్న ఉద్యోగం చేసాడు. తండ్రి లాగే అతనికీ వ్యాపారం చేయటమంటే ఇష్టం. బాక్సర్ అనే వ్యాపారస్థుడి దగ్గర బొంబాయి లో పనిచేయటానికి, భవిష్యత్తు లో అతని వ్యాపారం లో భాగమవ్వటానికి మాట్లాడుకుని మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ నుండి ‘నాలుగున్నర నెలలు ప్రయాణం’ చేసి తన పదహారవ ఏట 1824 లో బొంబాయి లో కాలు పెట్టటం తో అతని భారతదేశ ప్రస్థానం మొదలవుతుంది.మెడోస్ టైలర్ ఒకరకమైన ప్రజ్ఞ తో పుట్టాడు. ఇచ్చిన పని సమర్ధవంతం గా చేయగలడు అనే గురి అతనిమీద ఎవరికయినా కలుగుతుంది. భారతదేశం లో బాక్సర్ వ్యాపారం సరిగా లేకపోవటం, బాక్సర్ నుంచి సకాలంలో సరియైన సమాచారం బొంబాయి చేరకపోవటం అనే కారణాల వల్ల [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/CoverPageofSurapuram.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/08/CoverPageofSurapuram.jpg" alt="" title="CoverPageofSurapuram" width="439" height="780" class="alignleft size-full wp-image-14788" /></a></p>
<p><span style="font-size: 30px;">మ</span>నకిప్పుడు ఎక్కడికైనా వెళ్ళటానికి బస్సులు, రైళ్లు, విమానాలు, ఎవరితో అయినా మాట్లాడటానికి రకరకాల సమాచార వ్యవస్థలు, ఏ మూల పల్లెటూరికైనా కనీసం ఒక మట్టిరోడ్డు, మన స్థిర చరాస్తు లేవైనా కానీ వాటిమీద మన హక్కు, మనమీద ఎవరైనా దాడి చేస్తే పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఇంకో ఆలోచన లేకుండా మన జీవితంలో బాగం అయిపొయాయి. ఇవన్నీ లేని ఒకానొక కాలంలో &#8211; 1824 లో &#8211; ఇంగ్లాండు నుండి ఒక 16 ఏళ్ల కుర్రవాడు బొంబాయిలో ఈ దేశపు గడ్డ మీద అడుగుపెట్టి ఒక 36 సంవత్సరాలు ఈ దేశంలో తిరుగుతూ తను చూసిన కళ్ళతో అక్షరాల్లో అవన్నీ చూపిస్తుంటే చూడటం ఎంత బావుంటుంది. ఈ రోజు భారతదేశం కంటే అప్పటి భారతదేశం కళ్ళకింకా ఇంపుగా కనపడుతుంది అతని అక్షరాల్లో.మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ లోని లివరపూల్ లో 1808 లో పుట్టాడు. తండ్రివైపు, తల్లివైపు బంధువులు ఇంగ్లాండ్ లో పలుకుబడి గల కుటుంబాలకు చెందినవాళ్ళు. తండ్రి వ్యాపారమేదో చేసి నష్టపోయాడు. మెడోస్ టైలర్ ది అత్తెసరు స్కూల్ చదువు. 13, 14 ఏళ్ల వయసులోనే భారతదేశం తో వ్యాపారం చేసే సంస్థలో ఒక చిన్న ఉద్యోగం చేసాడు. తండ్రి లాగే అతనికీ వ్యాపారం చేయటమంటే ఇష్టం. బాక్సర్ అనే వ్యాపారస్థుడి దగ్గర బొంబాయి లో పనిచేయటానికి, భవిష్యత్తు లో అతని వ్యాపారం లో భాగమవ్వటానికి మాట్లాడుకుని మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ నుండి ‘నాలుగున్నర నెలలు ప్రయాణం’ చేసి తన పదహారవ ఏట 1824 లో బొంబాయి లో కాలు పెట్టటం తో అతని భారతదేశ ప్రస్థానం మొదలవుతుంది.మెడోస్ టైలర్ ఒకరకమైన ప్రజ్ఞ తో పుట్టాడు. ఇచ్చిన పని సమర్ధవంతం గా చేయగలడు అనే గురి అతనిమీద ఎవరికయినా కలుగుతుంది. భారతదేశం లో బాక్సర్ వ్యాపారం సరిగా లేకపోవటం, బాక్సర్ నుంచి సకాలంలో సరియైన సమాచారం బొంబాయి చేరకపోవటం అనే కారణాల వల్ల తన తల్లి పెత్తల్లి కుమారుడైన బొంబాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి &#8216; న్యూ హోమ్&#8217; సహాయం చేసి హైదరాబాద్ లో నిజాం కొలువులో సైనికోద్యోగం ఇప్పిస్తాడు మెడోస్ టైలర్ కి.</p>
<p>బొంబాయి నుండి బయలుదేరేటప్పుడు &#8216; నువ్వు ఉపయోగపడతావని తేలగానే నిన్ను ఉపయోగకారిగా చేస్తారు. నిబ్బరంగా తెలివితేటలతో చేసుకో, విజ్ఞతతో వ్యవహరించమని చెప్పిన న్యూ హోమ్ సలహా తో బొంబాయి నుండి హైదరాబాద్‌కు బయలుదేరతాడు మెడోస్ టైలర్.</p>
<p>పనిచేస్తూ నేర్చుకోవడం, అట్లా నేర్చుకున్న పనిని సమర్ధవంతంగా చేయటం, అట్లా పనిచేస్తూ తన చుట్టూవున్న వాళ్ళ హృదయాలని గెలుచుకోవటం మెడోస్ టైలర్ కి అప్రయత్నంగా అబ్భింది. ఈ పుస్తకం పూర్తయ్యాక మనల్ని ఆకర్షించింది మెడోస్ టైలర్ వ్యక్తిత్వమా, ఆయన చూపించిన మన దేశమా అని తేల్చుకోలేకపోతాం.</p>
<p>1758 ప్లాసీ యుద్ధం తరువాత భూమి నుండి వచ్చే ఆదాయం, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మీద పన్ను ద్వారా లభించే డబ్బు ఆయా ప్రాంతాల్ని బట్టి స్థానిక సంస్థానాధీశులకైనా, జమీందార్లు నవాబులకైనా, నిజాముకైనా, కొన్ని చోట్ల ప్రత్యక్షంగానూ, కొన్ని చోట్ల పరోక్షంగానూ పరిపాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ కయినా అదే ఆదాయ వనరు. వీళ్ళందరితో పాటు అప్పటికి లక్షల్లో అప్పులివ్వగలిగే వడ్డీ వ్యాపారస్తులు బలమైన వర్గం.</p>
<p>ఈస్ట్ ఇండియా కంపెనీ కున్న ఇంకో వెసులు బాటు వ్యవసాయం ద్వారా వచ్చే మిగులుని వర్తకానికి ఉపయోగించి వాళ్లదేశం నుండి తెప్పించిన వెండీ, బంగారం తో చెల్లింపులు చెయ్యకుండా ఇక్కడి వ్యవసాయం మీద మిగులుతోచేసి, దేశమంతటా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరింపచేసుకోవటం వాళ్ళకి మాత్రమే వున్న వెసులుబాటు. వ్యవసాయం మీద ఎక్కువ మిగులు రావాలంటే వ్యవసాయం చేసే విస్తీర్ణం పెరగాలి. కొన్ని ప్రాంతాల్లో జమీందార్ల కింద గానీ ఇంకొన్ని ప్రాంతాల్లో రైతువారీ పద్ధతి ద్వారా గానీ వ్యవసాయం చేసే రైతులకి, కౌలుదార్లకీ ఏ భూమి మీద అయితే కష్టపడుతున్నారో ఆ భూమి మీద కష్టపడే హక్కు, స్థానిక పెత్తందార్ల మూలాన సందేహాస్పదంగా మిగిలిన ఆ హక్కు నికరంగా వుండాలి. వ్యవసాయ భూముల మీద ప్రాపర్టీ రైట్స్ క్లియర్ గా ఉండాలి. వ్యవసాయం మీద వచ్చే ఆదాయం దొంగలు, దోపిడీదార్ల పాలవ్వకుండా తమకే దక్కుతుందనే భరోసా వుండాలి. స్థానిక నీటివనరుల్ని వుపయోగించుకొనే సౌలభ్యం వుండాలి. అప్పటికి పుంతలుగానే వున్న దారుల్ని రహదారులు చేయాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూములన్నీ సర్వే చేయించాలి. జిల్లాల సరిహద్దులు, అధికారానికి సంబంధించి రెవిన్యూ, సివిల్ క్రిమినల్ విషయాలకి వీటిల్లో ఒకదానితో ఒకటి ఎంతమేరకు జోక్యం చేసుకోవచ్చనే అధి కారానికి సంబంధించిన విచక్షణ ఇవీ ఆ రోజుకి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశ రాజకీయ, ఆర్ధిక విషయాల్లో జోక్యం చేసుకుంటున్న బ్రిటిష్ ఎడ్‌మినిస్ట్రేషన్ ముందున్న కర్తవ్యాలు.</p>
<p>అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక రాజకీయ వ్యవహారాల్లో తమ జోక్యం కోసం &#8216; రెసిడెంట్ &#8216; ని కొన్ని కొన్నిచోట్ల వుంచారు. అలాగే నిజాం రాజ్యం లో కూడా. ఆ రాజ్య పాలకుడు తమ వ్యాపార ప్రయోజనాలకనుకూలమైన నిర్ణయాలు చేసినంతకాలం ఆ &#8216; రెసిడెంట్ &#8216; ఆ రాజ్యానికి అనుకూలంగా వుంటాడు. రాజ్య పాలకుడు తమకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ పాలకుడి మీద మిలిటరీ దాడి చేయించి తమకనుకూలమైన వాళ్ళనో, లేదా తామే పాలకులగానో అవతారమెత్తుతారు. ఇదీ అప్పటి భారతదేశ రాజకీయ ముఖచిత్రం.</p>
<p>గుర్రాలతో, గుడారాల తో ప్రయణిస్తూ, కవాతు నేర్చుకుంటూ, రెండు దళాల జమా ఖర్చులు చూస్తూ, ఒక మున్షీ ని పెట్టుకుని హిందూస్థానీ బాష నేర్చుకుంటూ, మధ్య మధ్యలో అడవిపందుల్నీ, పిట్టల్నీ వేటాడుతూ, సమర్ధుడు అని &#8216;రెసిడెంట్ &#8216; దృష్టిలో పడి హైదరాబాద్ చేరతాడు.</p>
<p>అప్పటి హైదరాబాదు ఎలా వుండేదో మెడోస్ టైలర్ మాటల్లో ….</p>
<p>“ అప్పటి నగర జనాభా మూడున్నర లక్షలు. హాయిగా తిరిగేవాడిని.మూసీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే కోటలు, గోడలు, బురుజులు, ఒకపక్క బేగం బజారు, చక్కటి చెట్లు ఎంతో మనోజ్ఞమైన దృశ్యాలు, నదిలో పలువురు స్నానం చేస్తూ వుండేవారు, గుడ్డలు వుతుకుతూ వుండేవారు.చెలిమలు తవ్వి నీళ్లు తీసుకు వెళుతూ వుండేవారు. ఇసుకతో వొళ్ళు రుద్దుతూ వుంటే.. హాయిగా నిలబడి వుంటే.. ఏనుగులు, రకరకాల దుస్తులు ధరించిన జనం, ఒకవైపున చార్మినార్, మక్కా మసీదు, విశాలమైన మీర్ ఆలం చెరువు, దూరంగా ఆకాశం లో కానవచ్చే గోలకొండ ఖిల్లా, సూర్యోదయ కాలం కమ్మ తెమ్మెరలు అనుభవిస్తూ, బంగారు కాంతులీనే సూర్యాస్తమయాలు, ఆ ఇసక తిప్పలపైన ముస్లిం పెద్దలు తివాచీలు పరిపించుకుని, ఎవళ్ళ హుక్కా వాళ్ళు తాగుతూ, వాళ్లతో సంభాషిస్తూ కాలక్షేపం చేయటం నాకు వినూత్నమైన అనుభవం “</p>
<p>పర్షియన్ బాష నేర్చుకోవడం మొదలుపెడతాడు. &#8216; రెసిడెంట్ &#8216; అతనిని బొలారం లో సైన్యానికి ఇచ్చే సరుకుల ధరలు, నాణ్యానికి సంబంధించిన విషయాలు చూడమని పంపిస్తాడు.వాటినన్నిటినీ ఒక క్రమంలోకి తెచ్చినందుకు సిపాయిలందరూ సంతోషిస్తారు. పై అధికారి మెచ్చుకుంటాడు.</p>
<p>మెడోస్ టైలర్ కి సైనికోద్యోగం కంటే పౌర పరిపాలనా వ్యవస్థలో ఉద్యోగం అంటే ఇష్టం. సదాశివపేట ప్రాంతానికి పోలీస్ అసిస్టెంట్ సూపరిండెంట్ గా పంపిస్తారు. అప్పుడతనికి 18 సంవత్సరాలు నిండలేదు. అతనికిచ్చిన ప్రాంతం 250 మైళ్ళ పొడవు, 60 మైళ్ళ వెడల్పు 10 లక్షల జనాభా కలది. ఆ జిల్లా పరిధిలో గల వ్యాపారస్తులు తప్పుడు తూనికలతో ప్రజల్ని మోసం చేస్తుంటే వాళ్ళని సరిచేయటానికి బంజారాల్ని పిలిపించి వ్యాపారం చేయిస్థాడు. తూనికలు, కొలతలు పరిశీలించటానికి పోలీసులకు హక్కు కల్పిస్తాడు. అతను ఆ జిల్లాలో తిరుగుతూ ఒక విషయం గమనిస్తాడు. &#8216; నేనున్న జిల్లాలో బోలెడన్ని జమీందారీలున్నవి. నిజాం ప్రభుత్వ ఉత్తర్వులని వాళ్ళు ఖాతరు చేయరు. హైదరాబాదు లో పలుకుబడి కల పెద్దలున్నారు. ఈ జమీందారులకి ఆ పెద్దల అండదండలున్నవి. దొంగలు, బం దిపోట్లు ఈ జమీందారుల్ని ఆశ్రయించుకుని తమ క్రూరకృత్యాలు సాగిస్తున్నారు. ఆ దొంగలు సంపాదించిన ధనం లో జమీందార్లకు వాటాలున్నవి. అటువంటి జిల్లాలో శాంతి భద్రతీసు కాపాడటం కష్టం. ముందు నాకు గల అధికారాలు, వ్యవహరణ పరిధులు స్పష్టంగా తేల్చుకోవాలి’ అనుకుంటాడు. ఇది 1826 లో తెలంగాణా పల్లె చిత్రం.</p>
<p>రెవిన్యూ సర్వే చెప్పి అక్రమాలు చేసి, లంచాలు పుచ్చుకునేవారెందరినో పట్టుకుంటాడు. అప్పుడా ప్రాంతంలో దాయాదుల్ని హత్య చేసిన ఒక జమీందారు నెలకి 300 రూపాయిల జీతగాడైన మెడోస్ టైలర్ కి లక్ష రూపాయలు లంచమిస్తానన్నా లొంగడు.ఆ ప్రాంతంలో ధగ్గుల కదలికల్ని పసిగడతాడు.ఆ జిల్లాలో పనిచేస్తూ ఎవరు చేసుకుంటున్న భూమిని వారికి ఇచ్చే కార్యక్రమం, బాటలకు రక్షణ కార్యక్రమం చేబడతాడు. అక్కడున్నప్పుడు మరాఠీ బాష నేర్చుకుంటాడు. సైన్యం లో చేసిన మార్పులవలన అతనికి పిలుపు వచ్చి హైదరాబాద్ చేరతాడు. తిరిగివెళ్ళేటప్పటికి అతనికి 21 ఏళ్ళు.</p>
<p>హైదరాబాద్ లో పామర్ తో ఎక్కువ స్నేహం మెడోస్ టైలర్ కి. చరిత్ర పట్ల,సాహిత్యం పట్ల ఆసక్తిని పామర్ తో మాట్లాడుతూ తీర్చుకొనేవాడు. పామర్ విశాలమయిన గ్రంధాలయం మెడోస్ టైలర్ జ్ఞానం పెరగటానికి ఎంతగానో ఉపయోగపడింది. ఒకానొక సందర్భం లో నిజాం కి, అతని తమ్ముడికి వచ్చిన గొడవ లో సైనిక చర్య జరపాల్సిన సందర్భంలో &#8211; అత్యంత సహనం తో దాన్ని పరిష్కరించినందుకు అతని సైనికులు అతనిని &#8216; మహాదేవ బాబా &#8216; అని పిలిచి జై కొడతారు. నిజాం తమ్ముడు తనకు ఇచ్చిన ముప్ఫయి వేల రూపాయల బహుమానాన్ని తిరస్కరిస్తాడు. 1832 లో పామర్ కూతురు మేరీ తో సికిందరాబాదు చర్చిలో అతని వివాహమవుతుంది.</p>
<p>మనకు చరిత్రలో భాగమయిన విలియం బెంటింగ్, లార్డ్ మెకాలే, డల్హౌసీ అందరికీ తను పనిచేసే క్రమం లో దగ్గరౌతాడు. మెకాలే గురించి అతడి జ్ఞానం అపారమైందని, అతడితో పరిచయం మూలాన తను ముందు ముందు ఏమేమి చదువుకోవాలో అర్ధమయిందని, అతనితో కలిసి పనిచేస్తే బావుండేదని అనుకుంటాడు. ఉష్ణ మండలం లో ఉండటం వలన ఆరోగ్యం పాడయి రెండు సంవత్సరాలు సెలవు తీసుకుని 1938 లో ఇంగ్లాండు కి వెళతాడు. ‘భారత దేశంలో అనాగరిక తండాలలో నివసిస్తున్న లక్షణాలేవీ నీలో లేవే’ అని అక్కడి వాళ్ళు ఆశ్యర్యపోతారు.</p>
<p>&#8216; భారతదేశంలో ప్రజలు ఉన్నత నాగరీకత కలవారేనని, వారూ ఇంగ్లీష్ అంత వారేనని చెప్పినా ప్రయోజనం లేదని అని- వారు నమ్మని కథలని నేనెందుకు చెప్పాలని &#8216; అంటాడు. ఇంగ్లాండు లో వున్నపుడే &#8216; Confessions of a Thug &#8216;, ‘టిప్పు సుల్తాన్’ మీద పుస్తకం రాస్తాడు. బొంబాయి నుండి 1824 లో తను హైదరాబాద్ వచ్చినప్పటి పరిస్థితి పోలుస్తూ ఇప్పుడు 1840 లో దోవపొడవునా దున్నని భూములు ఎక్కువగా కన్పడ్డాయి. పంట బాగా వుంది, మునపటికంటే సర్వే బాగా సాగుతుంది, పన్ను తగ్గటమే కాకుండా భూమి విలువని బట్టి నిర్ణయించటం జరుగుతుంది, మెట్ట ప్రాంతాలలో జొన్నలు, అపరాలు, పల్లపు ప్రాంతాలలో జొన్న, గోధుమ కనపడతాయి. దేశపు తీరుతెన్నులు మారిపోతున్నాయి అనుకుంటాడు. మధ్య మధ్య లో గుడారాల్లో మజిలీ చేస్తూ ఏనుగులమీద, గుర్రాల మీద సాగిన ఆ ప్రయాణం లో అడుగడుగునా ప్రజల బ్రహ్మాండమయిన స్వాగతం, అతనక్కడ వున్నప్పుడు తమకు జరిగిన మేలు స్మరించుకుంటూ. ఆ సమయంలో ఆయన భారతదేశం లో విద్య గురించి రాస్తూ విద్య దేశీయ భాషాల్లోనూ, ఇంగ్లీష్ లోనూ సాగాలని సూచిస్తాడు, సంస్కృతం లోనూ, పర్షియన్ లోనూ కాకుండా. టైమ్స్ పత్రిక కు గౌరవ వేతనం మీద భారత దేశం గురించి తరుచూ రాస్తూ వుంటాడు.</p>
<p>గుల్బర్గా కి దగ్గర్లో వున్న &#8216; సురపురం&#8217; సంస్థానం చిక్కుల్లో పడుతుంది. సంస్థానాన్ని ఏలుతున్న రాజు చనిపోతాడు. రాజుగా వచ్చిన కొత్త వ్యక్తి నుండి ఏటేటా పెంచే కప్పమే కాకుండా 15 లక్షల నజరానా తీసుకుంటాడు నిజాం. సురపురం సంస్థానం వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పుచేసి నజరానా చెల్లిస్తుంది. వడ్డీ వ్యాపారస్థులు, సంస్థానం మధ్య గొడవలు, వడ్డీ వ్యాపారస్తులు, నిజాం మధ్య గొడవలు. సంస్థానానికి వారసులు, చనిపోయిన రాజు భార్య రాణీ ఈశ్వరమ్మ మధ్య గొడవలు, 12,000 మంది బేడర్ల ని చేతిలో పెట్టుకుని రాణీ తిరుగుబాటు ప్రయత్నం. అక్కడున్న ప్రతినిధి చేతులెత్తేశాడు. ఎటువంటి చిక్కుపరిస్థితుల లోనించయినా నేర్పుగా బయటపడేసే సామర్ధ్యం మెడోస్ టైలర్ కి వుందని నమ్మిన అతన్ని అక్కడికి పంపుతాడు &#8216; రెసిడెంట్ &#8216;.</p>
<p>&#8216;సురపురం లో ఎవరినీ నమ్మటానికి వీలులేదు. పైకి పెద్ద మనుషులవలెనే కనపడతారు. తేలికగా ద్రోహం, దౌష్ట్యం చేస్తారు. కొంచెం హెచ్చరికగా వుండండి &#8216; అని అంతకుముందు అక్కడ పనిచేసిన రాజకీయ సలహాదారు చెప్పాడు. చనిపోయిన రాజు ఎనిమిది సంవత్సరాల కొడుకుని వారసుడిగా గుర్తిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అతనికి యుక్త వయస్సు వచ్చేవరకు చనిపోయిన రాజు తమ్ముడు పెద్ది నాయక్ రాజ ప్రతినిధిగా కొనసాగుతాడు. అది కాదన్నవారు తిరుగుబాటు చేసిన వారేనని వాళ్ళని అణచివేయవలసిందనీ మెడోస్ టైలర్ స్పష్టంగా చెబుతాడు. ఇక అక్కడ్నుంచి అత్యంత నాటకీయంగా భయపెట్టవలసినవాళ్ళని భయపెట్టి, బుజ్జగించవలసిన వాళ్ళని బుజ్జగించి, కఠినంగా వుండవలసి దగ్గర కఠినంగా వుండి, రక్షణ కల్పించవలసిన వాళ్ళకి రక్షణ కల్పించి, శిక్షించవలసినవాళ్ళని శిక్షించి దిన దిన నాటకీయ పరిణామాల మధ్య ఆ ఎనిమిదేళ్ల రాజకుమారుడికి తనే స్వయంగా చదువుచెబుతూ పరిస్థితిని మొత్తం తన చేతిలోకి తీసుకుంటాడు.</p>
<p>ప్రతిరోజూ రాజకోట రహస్యం లాటి పరిణామాల మధ్య అన్నిటినీ చక్కగా నిర్వహించిన మెడోస్ టైలర్ 1841 నుండి 1853 వరకు సంస్థానం లో ఎం చేశాడనేది చదివి తీర వలిసిందే.</p>
<p>ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సంస్థానాన్ని నిర్వహించటమే కాకుండా సంస్థానపు ప్రజలకి చాలా మేళ్ళు చేసాడు మెడోస్ టైలర్. గ్రామలన్నీ తిరిగి భూముల కొలతలను గూర్చి, పన్నులను గూర్చి ఉద్యోగులకు తగు సూచనలు చేస్తూ, బేడర్లు చేస్తున్న పశువుల చోరీలు తదితర దొంగతనాలు విచారిస్తూ, ఖజానా ఏర్పాటు చేసి రాజ ప్రతినిధి పెద్ది నాయక్ మోసం చేయకుండా సక్రమమయిన ఖర్చులు పెట్టమని సలహా చెబుతూ అతడ్ని హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ వుండేవాడు మెడోస్ టైలర్. గ్రామ ప్రాంతాలకు పర్యటనకు వెళుతూ, పొలాలు కౌలుకు తీసుకుని పంటలు పండించుకొమ్మని, కౌలు కత్తులు రాయమని రైతుల్ని ఆడిగేవాడు. మీ రాతకోతలు నిలిచివుంటాయా అని అడిగినవారికి మీ కష్ట సుఖాల్ని గమనిస్తూ ఉంటానని మాట ఇచ్చేవాడు.అతని మాటల్లోనే వినండి.</p>
<p>“బొంబాయి రాష్ర్ట హద్దుల్లో పలువురు రైతులు తమంత తామే వచ్చి భూములు పుచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్లినా నా గుడారం చుట్టూ వందల రైతులు చేరే వారు”.</p>
<p>“వాళ్ళకి మాపద్ధతులే వింతనిపించాయి. నా పట్ల ఎంతో విశ్వాసంచూపించేవాళ్ళు. అంత బాగా నా జీవితంలో ఎప్పుడూ నేను పనిచేయలేదు. అంత హాయిగా తిరగానూ లేదు. అంత హాయిగా నిద్రించానూ లేదు “</p>
<p>“ భాగ్యవంతులు సరిగా పన్నులు ఇవ్వరు. వారికంటే పేదలే నయం, గత 50 సంవత్స రాలుగా లెక్కలను ఎవరూ సరిగా రాసివుంచట్లేదు. వసూలయినదాన్ని సరిగా ఖజానా కి ఇవ్వట్లేదు దీన్ని సరి చేయాలంటే ఇంకొన్నాళ్లు పడుతుంది”</p>
<p>“గ్రామాల్లో పరిస్థితి తెలుసుకోవటానికి రోజుకి పన్నెండు గంటలుపనిచేసినా సరిపోదు. క్రౌర్యాలు,వత్తిడులు,మోసాలు,అసత్యాలు ఎన్నోబయటపడుతున్నాయి.తెలుసుకున్నకొద్దీపుట్టల్లోనిపాముల్లాగావెలువడుతున్నాయి “</p>
<p>&#8220;ప్రజల కష్టాలు తెలుసు కోవటానికి ఎందుకు అంత శ్రమ పడతావు. దువ్విన కొద్దీ దువ్వెన విరగటమే కానీ చిక్కులు విడవు. ఒకసారి జుట్టు గొరిగేస్తే మళ్లీ పెరుగుతుంది. చిక్కులు పడకుండా జాగ్రత్త పడవచ్చు&#8221; అని ఒక స్నేహితుడు హితవు చెప్పాడు. దారుణమయిన హితవు, ఓపికతో దువ్వెననే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను అంటాడు.</p>
<p>సరిహద్దుల్లో అల్లర్లు తగ్గినయ్యి.పశువుల చోరీలు లేవు. ఏదయినా నేరం జరిగితే నేరం చేసినవారిని పట్టుకుని కొట్టడానికి, వాళ్ళ ఇళ్లు తగలపెట్టటానికి ప్రజలు సాయుధముఠాలుగా బయలు దేరటం లేదు. ఏదయినా నేరం జరిగితే అధికారులకి ఫిర్యాదు చేస్తున్నారు</p>
<p>ఈ లోపు తన భార్యకి జబ్బు చేసి చనిపోతుంది.</p>
<p>“ఆమె నా భార్య. ప్రియురాలు. నా సుఖశాంతులు కోరిన వ్యక్తి.సురపురం లో సుఖం లేకుండా జీవితం గడపమని అన్నట్లుగావెళ్ళిపోయింది. ఆమెసానుభూతి లేకుండానే ఇక నేను పనిచేసుకోవాలి. ఆమె లాలన లేకుండానే జీవయాత్రగడపాలి.<br />
ఆమె మరణానంతరం నా ఆరోగ్యమూ చెడింది. నా ఇల్లు కట్టడమూ పూర్తయింది ఎవరు వుంటే నాకిది ఇల్లు అవుతుందో వారు లేకపోయిన తరువాత ఈ ఇల్లు నేనేమి చేసుకోను” అంటాడు.</p>
<p>నిజాం బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన అప్పు కి బదులుగా కొన్ని జిల్లాల్ని బ్రిటిష్ వారికి దత్తత ఇస్తాడు. రాయచూరు కి పక్కనున్న &#8216; నల్ దుర్గ్ &#8216; కూడా అందులో ఒకటి. అరబ్బులు ఎక్కువగా వుండే ప్రాంతం. నిజాం తమకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేవరకు కోటలో అడుగుపెట్టనివ్వమని బీరాలు పోయినా నిజాం తోనే తేల్చుకొమ్మని లేదంటే సైనిక ప్రయోగం చేస్తామనే మెడోస్ టైలర్ మాటలకితగ్గి కోట ని స్వాధీనం చేస్తారు. మెడోస్ టైలర్ సహాయకుడు ఒక ఇంగ్లాండ్ వాసి. అతని తండ్రి ఏడింబరో లో న్యాయవాది. స్కాట్లాండ్ అంత దేశాన్ని ఇద్దరు బ్రిటిష్ ఉద్యోగులు చిన్న పదాతి దళ సహాయం తో ఆక్రమించి అదుపులోకి తీసుకురావటం కనీ వినీ ఎరుగని సంఘటన అని ఆశ్చర్య పోతాడు. 1853 నుండి1857 వరకు &#8216;నలదుర్గ్&#8217; కి అసిస్టెంట్ అసిస్టెంట్ కమీషనర్ గా చేసాడు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని పనులు ఎవరయినా చేయగలరా అని ఆశ్యర్య పోయేటన్ని పనులు చేసాడు ఆ కొద్ది కాలంలో.</p>
<p>నలదుర్గ్ జిల్లాలో బందిపోట్ల బెడద ఎక్కువగా వుండేది. ఆ జిల్లాలో న్యాయస్థానాలు లేవు. నిజాం ప్రభుత్వ ప్రతినిధులు, అరబ్బులు నేరాలు చేసినవారినే శిక్షించేవారు. చిన్న నేరాలు చేసిన వారినే శిక్షించేవారు. బందిపోట్లను శిక్షించలేరు. నిజాం ప్రభుత్వ పతినిధికి వాటాలుండేవి. బందిపోట్లతో ప్రభుత్వోద్యోగులు షరీకై వుండేవాళ్ళు. ఇక హత్యలు ఎన్నడూ ఎవళ్ళూపట్టించుకున్నదే లేదు.కొన్నిసంవత్సరాలుగా ఈ ప్రాంతంలో న్యాయస్థానాలే లేవు. మెడోస్ టైలర్ బొంబాయి రాష్ట్ర పద్ధతి లో ఒక శాసనావళిని, నిబంధనావళిని రూపొందించాడు. గ్రామ పటేళ్లకూ,తాలూకా ఉద్యోగులకూ సహాయకుల్ని ఏర్పాటు చేశాడు. గ్రామ పటేళ్లకూ, తాలూకా ఉద్యోగులకు, తనకూ అంచెలవారీగా విచారణాధికారాలు కేటాయించాడు. ‘తను చేసిన తీర్పులపై రెసిడెంట్ కి అప్పీల్ చేసుకోవచ్చు’.</p>
<p>మెకాలే రచించిన శాసనావళి అమలు చేసేటప్పుడు, ఆస్తి హక్కుల దావాలకు సంబంధించి మెడోస్ టైలర్ రూపొందించిన శాసనావళినే యధాతధంగా మెకాలే శాసనావళిని లో వుంచేశారు. ఇవే కాకుండా వివిధ శాఖలూ, ఉద్యోగులూ అనుసరించదగు నియమావళిని కూడా రూపొందించాడు. 1854 లో నలదుర్గ్ తూర్పు ప్రాంతం దుర్భరమయిన పరిస్థితుల్లో వుండేది. అంతకు ముందు పాలించింది అరబ్బులు. వాళ్ళ హయాంలో హత్యలు, దోపిడీలు, పంటల విధ్వంసం యధేచ్చగా సాగాయి. జిల్లా పరిపాలనను సరిదిద్దటానికి కోడి కూత నుండి రాత్రి 8 గంటలవరకూ పనిచేశాడు మెడోస్ టైలర్. ఇప్పుడు నలదుర్గ్ జిల్లాలో బందిపోట్లు లేరు. బందిపోటు దొంగతనాలన్నీ నిజాం పరిపాలనా కాలంలోనే. పోలీసులు నిక్కచ్చిగా పనిచేస్తున్నారు. ప్రతి గ్రామ పటేలుకు కొంతవరకు న్యాయ నిర్ణయాధికారాలు ఇచ్చాడు. అందువల్ల గ్రామోద్యోగుల గౌరవం పెరిగింది.</p>
<p>మాలిక్ అంబర్ కాలం లో సెటిల్మెంట్ వివరాలు గ్రామోద్యోగుల దగ్గర వున్నాయి. వాటిని ఆధారం చేసుకుని కొత్త వివరాలను చేర్చి సెటిల్మెంట్ పని మొదలెట్టాడు. పంజాబు ప్రాంతంలో సర్వే పద్ధతుల్ని చెప్పే ఒక పుస్తకం సహాయంతో ప్రతి గ్రామాన్ని సర్వే చేయించాడు. సర్వే కి కావలసిన కొన్ని పరికరాల్ని తయారుచేసుకుని, కొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి సర్వే చేయించాడు. ప్రభుత్వం ఇతని పనితీరుని ఆమోదించింది. మెడోస్ టైలర్, అతని ఉద్యోగులు చేసిన పని చాలా పెద్దది. మొత్తం 34,474 వివరణ పత్రాలు, జాబులూ ఇంగ్లీష్ లో, పర్షియన్ లో, మరాఠీలో వాళ్ళమధ్య నడిచాయి. అతనికీ, అతని సహాయకులకీ మధ్య నడిచిన ఉత్తరాలే ‘తొమ్మిది వేలు’న్నాయి. నలదుర్గ్ జిల్లాలో మొత్తం 2 లక్షల 60 వేల ఎకరాల సర్వే పూర్తి అయింది. భూమి హక్కు స్థిరంగా వుండేటట్లు తగు చర్య తీసుకోవాలని ప్రతిపాదించి 30 ఏండ్ల పాటు ఆ హక్కు వుంటుందని నిర్ణయించాడు. అప్పటివరకూ సిస్తు మారదు. రైతుకు తన భూమి హక్కు సురక్షితమనే భావం వుంటేనే భూమిపై పెట్టుబడి పెట్టటం, శ్రమించటం సాధ్యమవుతుందని మెడోస్ టైలర్ అంటాడు.భూమి హక్కుకూ, శిస్తుకూ సంబంధించిన వివరాలన్నీ మరాఠీ భాషలోకి అనువదించి, గ్రామ పెద్దలనందరినీ పిలిపించి,తను చేస్తున్న పనులనూ, ప్రభుత్వ అనుమతి లభిస్తే చేయ తలపెట్టిన పనులను వివరించి చెబుతాడు.మునపటివలె ఎవరూ భూఖామందును భూమినుండి వెళ్ళగొట్టరనీ, శిస్తులు యథేచ్ఛగా పెంచే అవకాశం లేదని చెబుతాడు.</p>
<p>అక్కడున్నవారందరూ ఒక కొత్త యుగం ప్రారంభమయినదని సంతోషపడతారు. రెసిడెంట్ కూడా పంజాబులో జరుగుతున్న పాలన కంటే నలదుర్గ్ ప్రాంతం లొనే పరిపాలన బాగా సాగుతున్నదని చెబుతాడు.</p>
<p>అహ్మదనగర్ ప్రాంతాన్ని చూసి ఎన్నో వాగులున్నాయి. నీరు పుష్కలం. చక్కటి జలాశయాలు నిర్మించుకుంటే సేద్యం ఎంతయినా అభివృద్ధి చెందుతుంది అనుకుంటాడు.తుల్జాపురం లో రెండు జలాశయాలు నిర్మించాలని పథకం వేసుకుంటాడు. తుల్జాపురం నుండి అహ్మద్ నగరం వరకు చెరువుల నిర్మాణం చెయ్యాలని సూచిస్తాడు. ఆ ప్రాంతాలలో కాటకం ఏ క్షణాన్నైనా ముంచుకు రావొ చ్చని జలాశయాలకి కావలసిన పరిశీలనలు, విషయసేకరణ అన్నీ చేస్తాడు.</p>
<p>గోదావరి నదికి నలదుర్గ్ జిల్లాకి మద్ధ్యలో ఎంత వర్షం పడుతుంది, ఎన్ని వాగులు ఎట్లా ప్రవహిస్తున్నవి, ఎన్ని చెరువులు ఏర్పాటు చేయవచ్చును అనే విషయమై 600 చదరపు మైళ్ళ మేర క్షుణ్ణంగా పరిశీలన చేసాడు. భటోరి దగ్గర అహ్మద్ నగరానికి నీళ్లు సరఫరా చేసే పెద్ద సరస్సు నిర్మాణం చేపడతాడు. చాలా చోట్ల రహాదారుల నిర్మాణం చేపడతాడు. మెడోస్ టైలర్ జాతకం చెప్పిన ఒక జ్యోతిష్కుడు చెప్పినట్లు &#8221; మీరు పనిచేయటానికే పుట్టారు, భోగభాగ్యాలలో దొర్లటానికి పుట్టలేదు. ఇక మీ జీవితం ఇంతే &#8220;. అది నిజమేనేమో.</p>
<p>1857 లో భారత దేశం లో తిరుగుబాటు పరిస్థితులదృష్ట్యా క్లిష్టమయిన బీరార్ జిల్లాకి బదిలీ చేస్తారు మెడోస్ టైలర్ ని.</p>
<p>మెడోస్ టైలర్ బదిలీ మీద బీరార్ కి పొయ్యేటప్పుడు ప్రముఖ ఉద్యోగులు 1622 మంది సంతకాలతో ఒక సన్మాన పత్రాన్ని సమర్పించి వీడ్కోలు చెప్పారు. అతని మాటల్లోనే చదవండి …</p>
<p>&#8221; సభలో పలువురు కన్నీరు కార్చారు. మహాదేవ బాబా కి జై అని నినదించారు. నా కళ్లల్లో నీళ్లు తిరిగినవి. వాళ్ళకి ఉపయోగకరంగా నేనే దయినా చేసి వుంటే ధన్యుడిని. ఆ రాత్రి నేను ప్రయాణమై పోతూ వుంటే వేలాది ప్రజలు వీధులలో నిలబడి మహాదేవ బాబా కి జై అంటూ 2 మైళ్ళదూరం నడిచి వచ్చారు. సురపురం నుండి వచ్చేస్తుంటే మనస్సు బాధ చెందింది. ఇక్కడినుండి వెళ్లిపోతుంటే వాళ్ళ ఆదరం నుండి దూరమయి పోతున్నట్లనిపించింది.&#8221;</p>
<p>నలదుర్గ్ నుండి బయలుదేరిన మెడోస్ టైలర్ &#8216; బ్రిటిష్ పరిపాలకుల వలన దేశంలో శాంతి నెలకొన్నది పరిపాలన ఇక క్రమంలో రూపొందుతున్నది ? అటువంటప్పుడు తిరుగుబాటు ఆలోచన దేనికి ? &#8216; అనుకుంటాడు. బీరార్లో ఆర్ధిక పరిస్థితులు, శాంతి భద్రతలు అస్తవ్యస్తం గా వున్నాయి. 20 లక్షల జనాభా వున్న బీరార్ కి సహాయంగా పంపటానికి సైన్యం లేదు. నైతిక బలంతో అదుపు చేయండి అని రెసిడెంట్ కబురు చేస్తాడు. బీరర్ చుట్టుపక్కల అన్ని సంస్థానాలు, నవాబులు ఏదో ఒక మేరకు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం లో వున్నాయి. అది బీరార్ దాటితే నిజాం రాజ్యానికి కూడా పాకే ప్రమాదముంది. నిజాం మొఘల్ చక్రవర్తుల మీద వ్యతిరేకతతో బ్రిటిష్ సైన్యానికి సహాయం చేస్తున్నాడు. నిజాం ని, రెసిడెంట్ ని చంపాలని &#8216; రోహల్లా&#8217; లు హైదరాబాద్ రెసిడెన్సీ మీద దాడి చేశారు. బీరార్ లో కూడా కొన్ని సైనిక స్థావరాల్లోనించి సైనికులు వెళ్లిపోయారు. ఉన్నవాళ్ళని నమ్మేటట్లు లేదు.</p>
<p>మెడోస్ టైలర్ ని చంపమని, చంపేసామని, చంపేస్తామని ప్రతిరోజు వార్తలొస్తున్నాయి. కానీ మెడోస్ టైలర్ ప్రజలమధ్యనే గుడారం వేసుకుని పనిచేస్తూ తిరుగుబాటు బీరార్ కి వ్యాప్తి చెందకుండా చూస్తున్నాడు. ఎక్కడైతే కుదురుతుందో అక్కడల్లా స్థానిక సహాయం తీసుకుంటున్నాడు. నాగపూర్ కి అతను బీరార్ నుండి పంపిన 600 ఎడ్ల బండ్ల వలన మధ్యభారతం లో తిరుగుబాటు ని అణచటం సాధ్యమైంది. 1858 కల్లా పరిస్థితులు బ్రిటిష్ వాళ్ళ అదుపులోకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పోయి ప్రత్యక్షంగా రాణీ గారి పాలన వచ్చింది.</p>
<p>సురపురం లో ఏదో సమస్య తలెత్తిందని, తక్షణం హైదరాబాద్ రావాలని రెసిడెంట్ నుండి జాబు రావటం తో మెడోస్ టైలర్ మళ్ళీ వెనక్కి బయలుదేరతాడు. సురపురం రాజ కుమారుడు బ్రిటిష్ సైన్యంపై దాడి చేసి ఓడిపోయి హైదరాబాద్ కు పారిపోగా, అక్కడ అతనిని ప్రభుత్వం పట్టుకుని నిర్బంధంలో వుంచింది. పీష్వాల నాటి మహారాష్ట్ర ప్రాభవాన్ని ఉద్ధరించటానికి సురపురం సంస్థానాదీసుల వంటి వారు పూనుకుని తిరుగుబాటును సానుకూలం చేయాలని రాజకుమారుడికి ఎవరో ఉపదేశం చేశారు. పదివేల మంది బేడర్లతో బళ్లారి, ధార్వాడ్, బెల్గాం -రాయచూరు ప్రాంతాన్ని అతడు పట్టుకుంటే మిగిలినవారు అతడి నాయకత్వాన్ని అనుసరిస్తారని తిరుగుబాటుదారులు నూరిపోశారు.</p>
<p>సురపురం మీద బ్రిటిష్ వాళ్ళు దాడిచేయగా ఎక్కడివాళ్ళక్కడ పారిపోయారు. సహాయం కోసం హైదరాబాద్ వచ్చిన రాజకుమారుడు వీధుల్లో తిరుగుతుండగా పట్టుకున్నారు. తండ్రి లాటి మెడోస్ టైలర్ తో మనసు విప్పి మాట్లాడిన రాజకుమారుడ్ని రక్షించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఉరిశిక్ష పడుతుందనుకున్న రాజకుమారుడికి మెడోస్ టైలర్ ప్రయత్నాల వలన నాలుగు సంవత్సరాలు ఖెదు పడుతుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో రాజకుమారుడు మరణిస్తాడు. సురపురానికి కమిషనర్ గా పంపిస్తారు మెడోస్ టైలర్. ఒక సంవత్సరం అక్కడుండి అస్తవ్యస్తమయిన పరిస్థితుల్ని వీలయినంత వరకు సరిదిద్ది తన ఆరోగ్యం బాగోలేక ఇంగ్లాండు కి బయలుదేరతాడు మెడోస్ టైలర్.</p>
<p>సురపురం ప్రజల వద్ద వీడ్కోలు తీసుకోవటం కష్టమైంది మెడోస్ టైలర్ కి. అతని మాటల్లో వినండి&#8230;</p>
<p>“నా చేత దర్బారు జరిపించి మరాఠీ భాషలో నాకొక వీడ్కోలు పత్రం సమర్పించారు. నే చేసిన పనులన్నీ పేరు పేరునా పేర్కొని నాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారిలో నేను ఎరగని వారు లేరు. కొందరు నా ఎదుట పెద్దలయినవారే. నన్ను వారు మరిచిపోరు. నేనూ వారిని మరిచిపోలేను. ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి లేచిపోదామని అనుకున్నాను. అర్ధరాత్రి చూద్దును కదా అందరూ రోడ్లమీదనే వున్నారు. బేడర్లు అందరూ అక్కడే కాపలా వేశారు. కొందరు ఏడ్చారు. కొందరు నిశ్శబ్దం గా నాతో నడిచారు”</p>
<p>&#8221; ఇప్పుడు మాకు దిక్కు లేదు. ఉదయం ధాన్యం దంచుకునేటప్పుడు, సాయంత్రం దీపం వెలిగించుకునేటప్పుడు మా స్త్రీలు మీ పేరే తలుచుకుంటారు. తప్పక తిరిగి రండి &#8221; అన్నారు.</p>
<p>దోవలో ప్రతి గ్రామంలో అబాలగోపాలం ఇలాగే వీడ్కోలు ఇచ్చారు. వారి బిడ్డలను ఆశీర్వదించుతూ తాకమన్నారు. ఒకచోట కొందరు &#8221; మేమంటే మీకెందుకంత ఇష్టం. మమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నారు ?&#8221; అని అడిగారు. దీనికి జవాబు లేదు. నేను పేరు కోసం ఏనాడూ తంటాలు పడలేదు. చేతనయినంతవరకు న్యాయం చేకూర్చటానికి ప్రయత్నం చేశాను. ప్రతి విన్నపాన్ని విన్నాను. నన్ను వచ్చి కలుసుకోవటానికి ప్రతివారికీ అవకాశం కల్పించాను. వారు చూసిన ఇంగ్లీషు మనిషిని నేనొక్కడినే. నా మీద ఎవ్వరూ ఏనాడూ ఫిర్యాదులు చేయలేదు. మామూలు మర్యాదలే వారిపట్ల చూపాను.</p>
<p>&#8221; ప్రజలకు ఇంత మేలు చేస్తున్నావు కదా -ప్రతిఫలం ఏమిటి? వారు ఏమయినా నీకు కృతజ్ఞత చూపెట్టారా ? &#8221; అని కొందరు స్నేహితులు అడిగారు.</p>
<p>ఇది సరియయిన ప్రశ్న కాదు. నేను ప్రజలకు చేయగలిగినదంత చేయలేదు. నాకు ఎక్కువ సహాయం లభించివుంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలిగి వుండేవాడిని. నాకు చేతనయినంత చేశాననటానికి భగవంతుడే సాక్షి. ఇంకా ఎంతో చెయ్యగలిగి వుండేవాడిని. ఆరోగ్యం లేదు.&#8217;</p>
<p>&#8216; నా ఆరోగ్యం బాగుంటే భారతదేశాన్ని వదిలిపోయ్యేవాడిని కాను. భారతదేశమన్నా, భారతీయులన్నా నాకు మక్కువ. ఒక్కసారి ఇంగ్లాండు వెళ్లి తిరిగి వచ్చి, పనిచేస్తూనే ప్రజల మధ్య చచ్చిపోవాలి. &#8216;<br />
అని అనుకుంటూ వెళ్లిన మెడోస్ టైలర్ అనారోగ్యం మూలాన తిరిగి రాలేకపోయాడు.</p>
<p>ఇంగ్లాండు తిరిగివెళ్లిన మెడోస్ టైలర్ &#8216; భారతదేశంలో ఒంటరి జీవితం గడిపిన నా ముఖాన, పెదవుల చివర, పడిన ముడతలన్నింటిని నా బిడ్డలు చదును చేశారు. ఇస్త్రీ చేశామని వారే చెప్పారు.&#8217; అని మురిసిపోయ్యాడు. అనారోగ్యం మూలాన తిరిగి రాలేక &#8216; నేను ప్రజల మధ్య బతికాను. వారితో నాకు ఆత్మీయత ఏర్పడింది. మళ్ళీ వారి మధ్యకు వెళ్లి సేవ చేసే భాగ్యం లేకుండా చేసాడు భగవంతుడు.&#8217; అని బాధ పడతాడు.</p>
<p>సురపురం లో నలదుర్గ్ లో వున్నప్పుడు టైమ్స్ పాత్రికకు దేశీయ భాషలలో విద్యా బోధన జరగాలని అనేక వ్యాసాలు రాసాడు. ఇంగ్లాండు వచ్చాక 1657 కాలానికి చెందిన మరాఠా రాజ్య అవతరణ కి సంబంధించి &#8216;తార&#8217; అనే నవల, 1757 కాలానికి సంబంధించి,&#8217; రాల్ఫ్ డార్నెల్ &#8216; అనే నవల,ఇందులో బ్రిటిష్ అధికారం ఎలా విస్తరించిందో రాస్తాడు.1857 కాలానికి సంబంధించి, బ్రిటిష్ అధికారాన్ని వదులుకోవటానికి భారతదేశంలో వివిధ వర్గాలు చేసిన ప్రయత్నం మూడవ నవల &#8216; &#8216;సీత&#8217; రాసాడు. చిత్రకారుడు కాబట్టి భారతదేశాన్ని గురించి ఎన్నో చిత్రాలు, స్టూడెంట్స్ మాన్యువల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా &#8216; అనే పుస్తకం రాసాడు. భారతదేశంలో సేద్యపు వనర్లు వాటికి గట్లు, తూములు అమర్చే పద్ధతి, వాన నీటిని ఉపయోగించుకునే కృషి వీటిని గురించి &#8216; ఐర్లాండ్ ఇంజినీర్ల &#8216; సంస్థ లో ఉపన్యసిస్తాడు. భారతదేశానికి వెళ్ళినప్పుడు మెడోస్ టైలర్ కి చదువు లేదు. స్వయంగా చదువుకున్నాడు. చెప్పుకోదగిన భోగభాగ్యాలు లేకపోయినా, దేవుని దయవలన తినటానికి ఉంది నా బిడ్డలు నన్ను ప్రేమిస్తున్నారు, నా మిత్రులు నన్ను ఆదరిస్తున్నారు, ఇంతకంటే కావలసింది ఏముంది అనుకుంటాడు.</p>
<p>భారతీయ జీవితాన్ని, కథలను గాధలను చక్కగా చిత్రీకరించవలసిన వారు భారతీయ విద్యావంతులే. హిందూ సంఘం లో నెలకొనివున్న దురాచారాల గురించే ఎందుకు రాయాలి. మంచి సంప్రదాయాల గురించి కూడా రాయొచ్చు కదా, సరళంగా, సహజంగా,ప్రజల మనస్సులను కదిలించే అనేక విషయాలపైన రాయండి. దేశీయమైన భాషలలో ప్రజలకు ఆప్యాయకరమైన సాహిత్యం వెలువడి జాతీయ సాహిత్యాభివృద్ధికి పునాదులు పడాలి &#8216; అంటాడు.</p>
<p>1875 లో మొదటి సారి వచ్చిన 51 సంవత్సరాల తరవాత మరలా భారతదేశాన్ని చూడాలనుకుని ఈసారి బొంబాయి నుండి హైదరాబాద్ కి 27 గంటల రైలు ప్రయాణం చేసి మిత్రులందర్నీ కలిసి తిరుగు ప్రయాణం లో &#8216; మెంటోస్ &#8216; దగ్గర ప్రశాంతంగా &#8216;విధి నిర్వహణకై కృషి చేసిన వ్యక్తిననే నన్ను భగవంతుడు సంభావించుకాక &#8216; అని కన్నుమూస్తాడు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14771</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>‘విలియం ఫాక్‌నర్’ నవల &#8216;ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ&#8217;</title>
		<link>http://vaakili.com/patrika/?p=14631</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14631#comments</comments>
		<pubDate>Sat, 01 Jul 2017 02:03:57 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[సురేష్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14631</guid>
		<description><![CDATA[<p></p> <p>ఒక రచయిత జీవితం మీద పదికి పైగా జీవిత చరిత్రలు వచ్చాయంటే ఆ రచయితలో ఎదో విశేషం ఉండి ఉండాలి. ఆనాటి సమాజాన్నీ, అక్కడి జీవితాల్నీ, తన సమకాలీనతనూ అతడు ఓ కొత్త కోణంలో ఆవిష్కరించి ఉండాలి. తన రచనల ద్వారా తన కాలపు సాహిత్య ప్రపంచాన్నే కాక తన తర్వాతి తరాల్నీ ప్రభావితం చేసి ఉండి ఉండాలి.</p> <p>తన తరం రచయితల కంటే భిన్నంగా ఒక కొత్త శైలితో, శిల్పంతో ఉత్తర అమెరికన్ సాహిత్యం మీద తనదైన ముద్ర వేసిన ఆ రచయిత విలియం ఫాక్‌నర్ (1897–1962).</p> <p>ఫాక్‌నర్ రచనా ప్రాభవం తన రాష్ట్రాన్నీ, దేశాన్నీ దాటి ఎన్నో వేల మైళ్ళ అవతలి ప్రాంతాల్లోని రచయితల్ని చేరింది. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్, కార్లోస్ ఫ్యూయెంటిస్, ఒనెట్టి వంటి లాటిన్ అమెరికన్ రచయితలు ఆయన నుంచి ప్రేరణ పొందామని వాళ్ళే స్వయంగా చెప్పారు.</p> <p>ఫాక్‌నర్ రాసిన &#8216;ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ&#8217;, &#8216;యాస్ ఐ లే డైయింగ్&#8217; , &#8216;లైట్ ఇన్ ఆగస్ట్&#8217; , &#8216;ది అన్‌వాన్‌క్విష్డ్&#8217; , &#8216;అబ్సలోం, అబ్సలోం!&#8217; నవలలల్లో మొదటి రెండింటినీ అతడి మాస్టర్ పీసెస్ గా పరిగణిస్తారు.</p> <p style="text-align: center;">***</p> <p>అబద్దాలు చెప్పొద్దనీ, మనసులో ఉన్నదే మాట్లాడమనీ, పొరుగు వాడికి సాయం చెయ్యమనీ, లౌక్యం కూడదనీ, పాపం చెయ్యొద్దనీ ప్రపంచంలోని అనేక మతాలూ , సిద్దాంతాలూ ప్రభోదిస్తాయి. తమ మార్గంలో నడిస్తేనే ముక్తి దొరుకుతుందని కూడా నమ్మిస్తాయి.</p> <p>ఆ ప్రభోధాలు వినేందుకు ప్రజలు లక్షల , కోట్ల సంఖ్యలో గుమి గూడతారు. చప్పట్లు కొడతారు. ఆయా మతాలకోసం, సిద్దాంతాల కోసం ప్రాణాలు విడుస్తారు. తీస్తారు. కానీ చెప్పినవేవీ ఆచరించరు.</p> <p>కానీ అబద్దాలు చెప్పని, లౌక్యం తెలీని మనుషులు సమాజంలో మనమధ్యే కొందరుంటారు.</p> <p>అయితే వారిని సమాజం, చివరికి తమ సొంత కుటుంబం కూడా తమలో కలుపు కోదు. గౌరవించదు. వారిని వీలయినంత దూరంగా తరుముతుంది. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/07/Sound-1.jpg"><img class="aligncenter size-full wp-image-14632" title="Sound 1" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/07/Sound-1.jpg" alt="" width="700" height="527" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఒ</span>క రచయిత జీవితం మీద పదికి పైగా జీవిత చరిత్రలు వచ్చాయంటే ఆ రచయితలో ఎదో విశేషం ఉండి ఉండాలి. ఆనాటి సమాజాన్నీ, అక్కడి జీవితాల్నీ, తన సమకాలీనతనూ అతడు ఓ కొత్త కోణంలో ఆవిష్కరించి ఉండాలి. తన రచనల ద్వారా తన కాలపు సాహిత్య ప్రపంచాన్నే కాక తన తర్వాతి తరాల్నీ ప్రభావితం చేసి ఉండి ఉండాలి.</p>
<p>తన తరం రచయితల కంటే భిన్నంగా ఒక కొత్త శైలితో, శిల్పంతో ఉత్తర అమెరికన్ సాహిత్యం మీద తనదైన ముద్ర వేసిన ఆ రచయిత విలియం ఫాక్‌నర్ (1897–1962).</p>
<p>ఫాక్‌నర్ రచనా ప్రాభవం తన రాష్ట్రాన్నీ, దేశాన్నీ దాటి ఎన్నో వేల మైళ్ళ అవతలి ప్రాంతాల్లోని రచయితల్ని చేరింది. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్, కార్లోస్ ఫ్యూయెంటిస్, ఒనెట్టి వంటి లాటిన్ అమెరికన్ రచయితలు ఆయన నుంచి ప్రేరణ పొందామని వాళ్ళే స్వయంగా చెప్పారు.</p>
<p>ఫాక్‌నర్ రాసిన &#8216;ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ&#8217;, &#8216;యాస్ ఐ లే డైయింగ్&#8217; , &#8216;లైట్ ఇన్ ఆగస్ట్&#8217; , &#8216;ది అన్‌వాన్‌క్విష్డ్&#8217; , &#8216;అబ్సలోం, అబ్సలోం!&#8217; నవలలల్లో మొదటి రెండింటినీ అతడి మాస్టర్ పీసెస్ గా పరిగణిస్తారు.</p>
<p style="text-align: center;">***</p>
<p>అబద్దాలు చెప్పొద్దనీ, మనసులో ఉన్నదే మాట్లాడమనీ, పొరుగు వాడికి సాయం చెయ్యమనీ, లౌక్యం కూడదనీ, పాపం చెయ్యొద్దనీ ప్రపంచంలోని అనేక మతాలూ , సిద్దాంతాలూ ప్రభోదిస్తాయి. తమ మార్గంలో నడిస్తేనే ముక్తి దొరుకుతుందని కూడా నమ్మిస్తాయి.</p>
<p>ఆ ప్రభోధాలు వినేందుకు ప్రజలు లక్షల , కోట్ల సంఖ్యలో గుమి గూడతారు. చప్పట్లు కొడతారు. ఆయా మతాలకోసం, సిద్దాంతాల కోసం ప్రాణాలు విడుస్తారు. తీస్తారు. కానీ చెప్పినవేవీ ఆచరించరు.</p>
<p>కానీ అబద్దాలు చెప్పని, లౌక్యం తెలీని మనుషులు సమాజంలో మనమధ్యే కొందరుంటారు.</p>
<p>అయితే వారిని సమాజం, చివరికి తమ సొంత కుటుంబం కూడా తమలో కలుపు కోదు. గౌరవించదు. వారిని వీలయినంత దూరంగా తరుముతుంది. చివరకి సమాజంలో అణగారిన వాళ్ళకు కూడా వాళ్ళు మరింత లోకువ.</p>
<p>వాళ్ళకు బుద్ది మాంద్యం ఉందని పైకి మాత్రమే జాలి పడతారు. క్రూరంగా ప్రవర్తిస్తారు.</p>
<p>అలా తన అయిదేళ్ళ వయసులో మనసు ఎదుగుదల ఆగిపోయిన ఒక వ్యక్తి &#8211; ముప్పై మూడేళ్ళు వచ్చాక- తన కుటుంబానికి సంబందించిన కథను తన జ్ఞానాజ్ఞానాలననుసరించి తన కోణంలోంచి చెప్తే?</p>
<p>అది సాహిత్య ప్రమంచంలో సంచలనమయితే?</p>
<p>అలాటి కథనాన్ని 1929లోనే నవలగా మలిచి- ఆ నవలను ప్రపంచ వ్యాప్తంగా గత శతాబ్దిలో వచ్చిన వంద ఉత్తమ నవలల్లో ఒకటిగా నిలిపిన రచయిత విలియం ఫాక్నర్. ఆ నవల &#8216;ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ&#8217;.</p>
<p>ఉత్తర అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన ధనికులయిన కాంప్సన్ కుటుంబ ఉత్థాన పతనాల కథ ఇది. ఆ ఇంట్లో అందరికంటే చిన్నవాడు బెంజమిన్.</p>
<p>అతడు తన ముప్పై మూడేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఒక రోజు (సరిగ్గా 1928 ఏప్రిల్ 7 వ తేదీ &#8211; అది తన పుట్టిన రోజు) తన చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చుకోవటంతో నవల ప్రారంభమవుతుంది. ఆ జ్ఞాపకాలు అతడికి తన మూడేళ్ళ వయసు నుంచీ అంటే 1898 సంవత్సరం నుంచీ ) మనసులో నిలిచి ఉంటాయి. అతని అన్నలు క్వింటిన్, జేసన్ లు, అతన్ని పట్టించుకొన్న ఒకే ఒక మనిషి అక్క కాండస్ .</p>
<p>చిన్ననాటి ఆటలు, దాగుడు మూతలు. ఓ రోజు కాడీ (కాండస్) పెద్ద చెట్టెక్కి పై అంతస్తులో గుమిగూడిన జనాన్ని చూస్తూ కింద నుంచీ పైకి చూస్తున్న సోదరులకు అమ్మమ్మ చచ్చిపోయిందనీ అందుకే వాళ్ళు వచ్చారన్న రహస్యాన్ని చెప్తుంది. కింద నిలబడి ఉన్న పిల్లల కళ్ళు మాత్రం కాడీ లోదుస్తుల మీద ఉంటాయి. అది అతడి అనేక జ్ఞాపకాల్లో ఒకటి.</p>
<p>ఐదేళ్ళ వయసులో తనకేదో అవటం, క్రమంగా తన పట్ల తల్లి తండ్రుల ప్రవర్తన మారటం, వారికి తను అవమానంగా అయ్యినట్టు తెలిసొస్తుండటం. తనను దూరం పెట్టటం.</p>
<p>అతడి బుద్ది మాంద్యం వల్ల అతడు చెప్పేది తిన్నగా , సహజంగా, పచ్చిగా ఉంటుంది. కానీ అదే బుద్ది మాంద్యం అతడు చెప్పె సంఘటనల క్రమాన్ని చిందర వందర చేస్తుంది. తరచుగా వాటి మధ్య కార్య కారక సంబంధాల్ని తెంపేస్తుంది. కాల చక్రం ముందుకే కాక ఒకేసారి వెనక్కి కూడా తిరుగుతుంది &#8211; పెండ్యులంలా మారి.</p>
<p>మొదటి సారి కాడీని చెట్టుమీద చూసిన జ్ఞాపకం వల్ల కాడీ అంటే చెట్టు అని అతడికి తెలుసు. ఆమె చెట్ల వాసన వేస్తుంటుంది. చెట్లు కూడా కాడీ వాసనే వేస్తుంటాయి. ఇంకా ఆమె 1905లో మొదటి సారి వాడిన సెంటు పరిమళం, 1909లో ఆమె ఓ యువకుడి దగ్గర కన్యాత్వాన్ని కోల్పోవటం (?), ఆ తర్వాత ఏడాది 1910లో ఆమె పెళ్ళి. తర్వాత ఆమె ఆ ఇంటికి దూరమవటంతో కాడీ వదిలిన చెప్పుల్ని అతడు దాచుకొన్నాడు. కొన్నాళ్ళకు అవి ఎవరివో అతను మర్చిపోయినా ఆ చెప్పులు మాత్రం గుర్తుండి పోతాయి.</p>
<p>అవేకాక ఇంకా తన గురించి కూడా తనకు కొన్ని తెలుసు. తన అసలు పేరు మౌరీ అయితే అది బెంజీ గా మారటం &#8211; అవమాన భారాన్ని తన వాళ్ళు అలా మరిచిపోచూశారు &#8211; వాళ్ళ కళ్ళు కప్పి ఎవరి ఇంట్లోనో జొరబడినప్పుడు అక్కడి అమ్మాయి కేకలు పెట్టటంతో తన వృషణాలను తొలగించిన గుర్తు ఇంకా పచ్చిగా వుంది- మనసుపై కూడా.<br />
1910 లో కాడీకి పెళ్ళి అయిన ఏడాదే అన్న క్వింటిన్ ఆత్మహత్య చేసుకోవటంతో అతడు చెప్పే కథనం ఆగుతుంది.</p>
<p>మరొక కథకుడి వైపు మళ్ళుతుంది.</p>
<p>1910 లో ఆత్మహత్య చేసుకొన్న రోజున క్వింటిన్ కి తన కుటుంబాన్ని గురించి వచ్చిన జ్ఞాపకాలతో కథ మరొక కోణంలో తిరిగి ప్రారంభమవుతుంది. తన చిన్నతనం నుంచీ తన ఆత్మహత్య వరకూ జరిగిన అనేక సంఘటనలు అతడికి గుర్తుకొస్తాయి. అతడి హార్వర్డ్ చదువు కోసం వాళ్ళ గోల్ఫ్ కోర్స్ ని అమ్మటంతో కాంప్సన్ కుటుంబ పతనం మొదలవుతుంది. హార్వర్డ్ లో చదివే క్వింటిన్ అక్క కాడీ లో వచ్చిన మార్పుల్ని జీర్ణించుకోలేకపోతాడు. ఆమె నైతిక తప్పిదం మీద తండ్రికి చెప్తే ఆయన పట్టించుకోకపోగా- &#8220;అసలు కన్యాత్వం మగవాళ్ళు కనిపెట్టిందే కానీ ప్రకృతి సహజం కాద&#8221; ని కొట్టివేస్తాడు. మిసిసిపీ లోని పురాతన సాంప్రదాయ భావాల్ని వంటపట్టించుకొన్న క్వింటిన్ దాన్ని జీర్ణించుకోలేడు. ఫలితం ఆత్మహత్య.</p>
<p>కథ ఇక్కడ మళ్ళీ ఆగి తిరిగి 1928 ఏప్రిల్ 6 న మరొక అన్న జేసన్ చెప్పే కథనంతో ఇంకొక కోణంలో మరల మొదలవుతుంది.</p>
<p>క్వింటిన్ లా కాక జేసన్ వర్తమాన విలువలని అందిపుచ్చుకొంటాడు. అక్క కాడీ గురించి &#8220;ఒక్కసారి బిచ్ అయితే అదెప్పటికీ బిచ్. ఇంకేం చెయ్యగలం&#8221; అన్నది అతడి మొదటి వాక్యం. అతడు చెప్పే కథనంలో అంతకు ముందు ఎవరికీ తెలీని వళ్ళు గగుర్పొడిచే కొన్ని సంగతులు బయటపడతాయి.</p>
<p>బెంజీకి వృషణాలు తొలగించటం వెనుక కారణం అతడు పెళ్ళి చేసుకొంటే బుద్ది మాంద్యం కలిగిన పిల్లలు తమ వంశంలో మళ్ళీ పుడతారన్న అనుమానం అనీ, క్వింటెన్ నదిలో మునిగి చని పోయాడనీ. ఈలోగా కాడీకి ఒక కూతురు పుడుతుంది- ఆమె పేరు కూడా క్వింటెనే. చిన్న క్వింటిన్ లైంగికత మీద జేసన్ కన్ను వేస్తాడు. కాడీ భర్త నుంచీ విడిపోవటంతో ఆమెని ఇంట్లోంచి తరిమి వేస్తారు. తండ్రి కాంప్సన్ మరణం తర్వాత ఇంటి యజమాని అయిన జేసన్ డబ్బు సంపాదన మీద పడతాడు. చిన్న క్వింటిన్‌కి గార్డియన్ గా ఉండి ఆమెకు కాడీ పంపే డబ్బుని తన జేబులో వేసుకొంటాడు.</p>
<p>ఇక్కడ కథ ఆగి &#8211; కాంప్సన్ కుటుంబానికి తరతరాలుగా సేవ చేస్తున్న డిస్లీ అనే నల్ల జాతి స్త్రీ చెప్పే కథనంతో &#8211; మరొక మలుపు తిరుతుంది.</p>
<p>జేసన్ (మేనమామ) తనవెంట పడటంతో అతన్నించీ తప్పించుకొనేందుకు చిన్న క్వింటిన్ ఇంట్లోంచి పారి పోతుంది &#8211; అతడి దోచుకున్న తన తల్లి డబ్బుని అతడి నుంచీ దొంగిలించి. ఆ డబ్బుకోసం ఆమెను వెతుక్కుంటూ జేసన్ తిరుగుతుంటాడు .</p>
<p>చివరికి ఒక టవున్ హాల్ దగ్గర బెంజీ, జేసన్ లు కలవటంతో , బెంజీ తన అన్నని చూసి పాత రోజులు మళ్ళీ వచ్చాయన్న సంతోషాన్ని పొందటంతో కథ ముగుస్తుంది.</p>
<p>కథ ఇలా కాలంలో ముందుకీ వెనక్కూ జరుగుతూ, కథ చెప్పే వ్యక్తి మారుతూ, ఒకే విషయాన్ని అనేక దృష్టి కోణాలనుంచి చెప్తూ, మానవ సంబంధాల లోని ఉదాత్తతనీ, ఉన్మత్తతనీ , బలాలనూ, బలహీనతలనూ ఓ కొత్త వెలుగులో రచించి కాల్పనిక సాహిత్యానికి గాఢతనూ నవ్యతనూ ఇచ్చిన రచయిత విలియం ఫాక్నర్.</p>
<p>1929లోనే అచ్చయిన ఈ నవలను మొదట ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు ఐదేళ్ళ తర్వాత ఫాక్నర్ రచించిన ఇతర నవలలతో పాటు &#8216;ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ&#8217; సాహిత్య ప్రపంచపు దృష్టికి చేరింది.</p>
<p>ప్రముఖ విమర్శకులెందరో ఈ నవలను మానసిక శాస్త్రం, వినిర్మాణ వాదం, స్త్రీవాదం వంటి అనేక కోణాలలోంచి విశ్లేషించారు. అక్కడ ఫ్రాన్స్‌లో జేమ్‌స్ జాయిస్ లా అమెరికాలో ఫాక్‌నర్ &#8216;స్ట్రీం ఆఫ్ కాన్షియస్‌నెస్ &#8216; శైలిని ప్రతిభావంతంగా చిత్రించాడన్నారు.</p>
<p>ఒక కొత్త శైలికి నాంది పలికి, తనదైన నూతనత్వాన్ని ఇంకా అనేక ఇతర రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన విలియం ఫాక్నర్ కు పులిట్జర్ , నేషనల్ బుక్ అవార్డ్ లతో పాటు 1949లో నోబెల్ బహుమతి వచ్చింది.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14631</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>స్టైన్బెక్ &#8211; &#8216; గ్రేప్స్ ఆఫ్ రాత్ &#8216; నవల</title>
		<link>http://vaakili.com/patrika/?p=14349</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14349#comments</comments>
		<pubDate>Wed, 31 May 2017 21:52:49 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[సురేష్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14349</guid>
		<description><![CDATA[<p></p> <p>హైవేని క్రాస్ చేయబోతున్న తాబేలు. దాని వీపుమీదగా దొర్లిన భారీ కంటైనర్ టైర్లు. టైరు వెంటే ఎగిరిన తాబేలు వెల్లకిలా మళ్ళీ హైవే మీదే పడింది. ఇంకో వాహనం వచ్చేలోపు అది గిల గిలా కొట్టుకొని ఎలాగో మళ్ళీ బోర్లా పడి ఆ పక్కకు పాక గలిగింది.</p> <p>ముప్పై పేజీల తర్వాత వచ్చే ఈ తాబేలుకీ పది పేజీలముందు పెరోల్ కింద విడుదలయ్యి ఒక్లాహోమా లోని తన స్వంత ఊరికి బయలుదేరిన టాం జోడ్ కీ ఏమిటి సంబంధం?</p> <p>నాచురలిస్ట్ రచనల్లో సహజంగా కనబడే పదులకొద్దీ పేజీల వర్ణనల తర్వాత వచ్చే ఇలాంటి ఒక చిన్న &#8216;ఘటన &#8216; కోసం నవలంతా చదవాలా అని తలపట్టుకొనే నేటి తరం పాఠకులని కూడా చదివించగల సమర్ధత కొద్దిమంది రచయితలకే సాధ్యం. అదికూడా పుస్తకాన్ని దింప నివ్వకుండా.</p> <p>అలాంటి ఒకానొక గుదిబండే జాన్ ఎర్నెస్ట్ స్టైన్బెక్ 1939 లో రాసిన &#8216;గ్రేప్స్ ఆఫ్ రాత్ &#8216; నవల.</p> <p>ఓ హత్యానేరం కింద నాలుగేళ్ళ పాటు జైలు జీవితం గడిపిన టాం జోడ్, పెరోల్ కింద విడుదలయ్యి ఒక్లాహోమా లోని తన స్వంత ఊరికి బయలుదేరటంతో కథ మొదలవుతుంది.</p> <p>మండే ఎర్రని ఎండ, దుమ్ముకొట్టుకుపోయిన కాలిబాటలు, ఎండిపోయిన పంటల మధ్య ఊరు చేరిన టాం జోడ్ కి అక్కడ బాంకు స్వాధీనం చేసుకొన్న రైతుల భూములు, అయిన కాడికి ఉన్న వస్తువులన్నీ అమ్మి ఇళ్ళు ఖాళీ చేసి వలసపోతున్న రైతులూ కూలీలు కనిపిస్తారు. అక్కడ కలిసిన మత బోధకుడు జిమ్ కేసీ తనకి మతం మీదా దేవుడి మీదా నమ్మకం పోయిందనీ, ఇప్పుడు మనిషినీ విశ్వమానవ ప్రేమనీ మాత్రమే నమ్ముతున్నాననీ చెప్తాడు.</p> <p>ఓ డొక్కు వానులో వందల మైళ్ళ రోడ్డు మార్గంలో పని వెతుక్కుంటూ కాలిఫోర్నియాకి ప్రయాణమవుతుంది జోడ్ కుటుంబం. జిమ్ కేసీ కూడా వాళ్ళతోనే కలుస్తాడు. దుర్భిక్ష ప్రాంతాల్లో ఎడారి వడ గాడ్పుల మధ్య దారిలోనే [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/05/Grapes-of-Wrath.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/05/Grapes-of-Wrath.jpg" alt="" title="Grapes of Wrath" width="326" height="499" class="alignright size-full wp-image-14354" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">హై</span>వేని క్రాస్ చేయబోతున్న తాబేలు. దాని వీపుమీదగా దొర్లిన భారీ కంటైనర్ టైర్లు. టైరు వెంటే ఎగిరిన తాబేలు వెల్లకిలా మళ్ళీ హైవే మీదే పడింది. ఇంకో వాహనం వచ్చేలోపు అది గిల గిలా కొట్టుకొని ఎలాగో మళ్ళీ బోర్లా పడి ఆ పక్కకు పాక గలిగింది.</p>
<p>ముప్పై పేజీల తర్వాత వచ్చే ఈ తాబేలుకీ పది పేజీలముందు పెరోల్ కింద విడుదలయ్యి ఒక్లాహోమా లోని తన స్వంత ఊరికి బయలుదేరిన టాం జోడ్ కీ ఏమిటి సంబంధం?</p>
<p>నాచురలిస్ట్ రచనల్లో సహజంగా కనబడే పదులకొద్దీ పేజీల వర్ణనల తర్వాత వచ్చే ఇలాంటి ఒక చిన్న &#8216;ఘటన &#8216; కోసం నవలంతా చదవాలా అని తలపట్టుకొనే నేటి తరం పాఠకులని కూడా చదివించగల సమర్ధత కొద్దిమంది రచయితలకే సాధ్యం. అదికూడా పుస్తకాన్ని దింప నివ్వకుండా.</p>
<p>అలాంటి ఒకానొక గుదిబండే జాన్ ఎర్నెస్ట్ స్టైన్బెక్ 1939 లో రాసిన &#8216;గ్రేప్స్ ఆఫ్ రాత్ &#8216; నవల.</p>
<p>ఓ హత్యానేరం కింద నాలుగేళ్ళ పాటు జైలు జీవితం గడిపిన టాం జోడ్, పెరోల్ కింద విడుదలయ్యి ఒక్లాహోమా లోని తన స్వంత ఊరికి బయలుదేరటంతో కథ మొదలవుతుంది.</p>
<p>మండే ఎర్రని ఎండ, దుమ్ముకొట్టుకుపోయిన కాలిబాటలు, ఎండిపోయిన పంటల మధ్య ఊరు చేరిన టాం జోడ్ కి అక్కడ బాంకు స్వాధీనం చేసుకొన్న రైతుల భూములు, అయిన కాడికి ఉన్న వస్తువులన్నీ అమ్మి ఇళ్ళు ఖాళీ చేసి వలసపోతున్న రైతులూ కూలీలు కనిపిస్తారు. అక్కడ కలిసిన మత బోధకుడు జిమ్ కేసీ తనకి మతం మీదా దేవుడి మీదా నమ్మకం పోయిందనీ, ఇప్పుడు మనిషినీ విశ్వమానవ ప్రేమనీ మాత్రమే నమ్ముతున్నాననీ చెప్తాడు.</p>
<p>ఓ డొక్కు వానులో వందల మైళ్ళ రోడ్డు మార్గంలో పని వెతుక్కుంటూ కాలిఫోర్నియాకి ప్రయాణమవుతుంది జోడ్ కుటుంబం. జిమ్ కేసీ కూడా వాళ్ళతోనే కలుస్తాడు. దుర్భిక్ష ప్రాంతాల్లో ఎడారి వడ గాడ్పుల మధ్య దారిలోనే జోడ్ ముసలి తాత, అమ్మమ్మలు మరణిస్తారు. ఆగిన చోట తిండి కోసం పళ్ళతోటల్లో పత్తిచేలల్లో పని చేస్తారు.</p>
<p>చీమల్లా దండులా వచ్చిపడుతున్న వలస కార్మికుల్ని దోచుకునేందుకు కూలీ తగ్గించి పనులు చేయించుకుంటారు అక్కడి ధనిక రైతులు. ఆకలితో చచ్చిపోతున్న జనానికి మిగులు ఆహార ధాన్యాలని పంచితే వాటి ధరలు పడిపోతాయని వారి కళ్ళముందే పంటల్ని తగలబెడతారు ఆ ధనిక రైతులు. కూలీ పెంపుకోసం సమ్మె చేసిన శ్రామికులకు నాయకత్వం వహిస్తాడు ఒకప్పటి మత బోధకుడు జిమ్ కేసీ. అతడిమీద దాడి చేసిన భూస్వాముల నుంచీ కాపాడే ప్రయత్నంలో మరొక హత్య చేస్తాడు టాం జోడ్.</p>
<p>జ్జిమ్ కేసీ లా పీడిత ప్రజల పక్షాన నిలబడతానని కుటుంబాన్ని వదిలి టాం జోడ్ వెళ్ళిపోతాడు. అలా జోడ్ కుటుంబం చెల్లా చెదురవుతుంది. నిండుగర్బిణి టాం జోడ్ చెల్లెలు రోస్ షెరాన్ ఒక మృతశిశువుని ప్రసవించి, తన చనుబాలతో ఆకలితో మరణించబోయే ఒక వృద్ధుడిని బతికించటంతో కథ ముగుస్తుంది.</p>
<p>అమెరికన్ శ్రమ జీవుల ఆకాంక్షలనూ, వారి ఆరాటపోరాటాలనూ కళ్ళకు కట్టినట్టు స్టైన్బెక్ చిత్రించిన ఈ నవలకు ఓ పెద్ద సామజిక చారిత్రిక నేపథ్యముంది. </p>
<p>1930 దశాబ్దం &#8211; అమెరికా చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం. ప్రపంచాన్ని కుదిపివేసిన గ్రేట్ డిప్రెషన్ 1929లో స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చింది. పారిశ్రామిక రంగం కుదేలయ్యింది. దాని ప్రభావం దశాబ్దానికి పైగా ప్రపంచ మానవాళిని కుదిపివేసి 1939లో రెండవ ప్రపంచయుద్ధానికి కారణమయింది.</p>
<p>పెట్టుబడి దారీ వ్యవస్థ సృష్టించిన ఆ విలయం అమెరికాలోని రైతుల పాలిట మాత్రం యమపాశంగా మారింది. ఆ కాలంలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ప్రకృతి పగబట్టినట్టు ఆకాశాన్నంటిన దుమ్ముమేఘాలు ఆవరించాయి. డస్ట్ బౌల్ అనే ఆ దుమ్ము కింద కప్పబడిపోయిన పొలాలూ, పంటలూ. మొక్కజొన్న పొలాలనిండా అడుగుల ఎత్తున పేరుకుపోయిన దుమ్ము. అలా ముంచుకొచ్చింది అతి పెద్ద కరువు. ఫలితంగా మధ్యతరగతి, సన్న కారు రైతాంగం బాంకుల రుణాలకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి.</p>
<p>అన్నిచోట్లా జరిగినట్టే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలనుంచీ రుణాల్ని వసూలు చెయ్యలేని బాంకులు, రైతాంగం మీద మాత్రం నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడ్డాయి. అప్పులిచ్చిన బాంకులు ఆ నిస్సహాయ రైతాంగం నుంచీ వేలాది హెక్టార్ల భూముల్ని స్వాధీనం చేసుకొని వాటిని కారుచౌకగా ధనిక ఆసాములకి కట్టబెట్టాయి. అలా అమెరికాలో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు అవి దారులు వేశాయి.</p>
<p>ఈ నేపథ్యంలో సొంత భూములని కోల్పోయి ఒక్లాహోమా నుంచీ కాలిఫోర్నియాకు వలస పోయిన రైతు కుటుంబాల వ్యధాభరిత కథా చిత్రణే &#8216;జాన్ ఎర్నెష్ట్ స్టైన్బెక్&#8217; రచించిన ఈ &#8216; గ్రేప్స్ ఆఫ్ రాత్ &#8216; నవల.</p>
<p>స్టైన్బెక్ 1939లో రాసిన ఈ నవల ఆనాటి అమెరికన్ వాస్తవిక సాహిత్యంలో పెద్ద సంచలనమయ్యింది. అమెరికాలో ఇలాంటి పీడిత ప్రజలూ, దుర్భర జీవితాలూ ఉన్నాయన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి , అచ్చయిన ఏడాదిలోనే లక్షలాది ప్రతులు అమ్ముడు బోయి , అక్కడి కులీన వర్గాలకు దిగ్భ్రమ కలిగించింది.</p>
<p>ఇప్పటికీ ప్రపంచ సాహిత్యంలో వ్యవసాయ సమాజాలమీద, భూమి సంబంధాల మీద, వారి ఆరాట పోరాటాల మీద చాలా తక్కువ నవలలే వచ్చాయి. వాటిలో మంచి రచనలుగా ప్రాచుర్యం పొందినవి మరీ తక్కువ. రష్యాలో మైకేల్ షోలకోవ్, ఫ్రాన్స్లో ఎమిలీ జోలా, చైనా లో పెర్ల్ బక్, గాటిమాలాలో ఆష్ట్రియాస్, ఆడ్రైన్ బెల్ వంటి రచయితల సరసన, ఉత్తర అమెరికా నుంచీ జాన్ ఎర్నెష్ట్ స్టైన్బెక్ భుమి సంబంధాల మీదా, ఆ శ్రమజీవుల భావోద్వేగాల మీద ప్రతిభా వంతమయిన రచనలెన్నో చేశాడు.</p>
<p>జాన్ ఎర్నెస్ట్ స్టైన్బెక్ 1902లో ఉత్తర అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో పుట్టాడు. 16 నవలలు, 5 కథా సంకలనాలు, 6 వ్యాస సంకలనాలు మొత్తం 27 పుస్తకాలు రచించాడు.</p>
<p>1929లో రాసిన &#8216;కప్ ఆఫ్ గోల్డ్&#8217; అతడి మొదటి నవల. ఆఫ్ మైస్ అండ్ మెన్, గ్రేప్స్ ఆఫ్ రాత్ , ఈస్ట్ ఆఫ్ ఈడెన్, ది రెడ్ పోనీ, టు ఎ గాడ్ అన్నోన్ వంటి 16 నవలలు, లాంగ్ వాలీ, పాస్చర్స్ ఆఫ్ హెవెన్ కథా సంకలనాలతో పాటు ఎన్నో వ్యాసాలూ, నాటికలూ రచించాడు. ఆఫ్ మైస్ అండ్ మెన్, గ్రేప్స్ ఆఫ్ రాత్ నవలలు అతడికి ప్రపంచ స్థాయి నవలాకారుడిగా పేరుతెచ్చిపెట్టటమే కాక హాలీవుడ్ సినిమాలుగా ప్రజలకు చేరువయ్యాయి.</p>
<p>మహా రచయితలుగా పేరుపొందిన వారిలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు స్టైన్బెక్ లో కూడా కనపడతాయి. వైవిధ్యమయిన జీవితానుభవాలు, వాటిని సాహిత్యంగా మలచగలిగే ప్రతిభ, హృదయ సంస్కారం, ప్రపంచ సాహిత్యంతో గాఢమయిన సంబంధం.</p>
<p>స్టైన్బెక్ బాల్యం కాలిఫోర్నియా దగ్గర శాలినాస్ లోయలోని ఒక చిన్న గ్రామంలో గడిచింది. అక్కడ అతడు పశువులు, గొర్రెలు, గుర్రాలను పెంచే పెద్ద పెద్ద గడ్డి మైదానాల్లో, పొలం పనుల్లో, చెరకు కొట్టే పనివాళ్ళతో కలిసి పనిచేశాడు. అప్పుడే సుదూర ప్రాంతాల నుంచీ తరలి వచ్చి అత్యంత కఠినమయిన పనుల్లో మునిగితేలే వలసకూలీలతో కార్మికులతో అతడికి పరిచయమయింది. వారి జీవితాన్ని అత్యంత సన్నిహితంగా, ఆసక్తిగా పరిశీలించేవాడు.</p>
<p>స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువు మధ్యలోనే వదిలేసి టూర్ గైడ్గా , కేర్ టేకర్ గా, జర్నలిస్ట్ గా , రెండవ ప్రపంచ యుద్దంలో వార్ కరస్పాండెంట్ గా, సినిమా స్క్రిప్ట్ రచయితగా అనేక రకాల పనులు చేశాడు.</p>
<p>ఈ అన్ని జీవితానుభవాలూ అతడి సాహిత్యానికి ముడిసరుకుగా పనికొచ్చాయి.</p>
<p>1935 ప్రాంతంలో &#8216;ఆఫ్ మైస్ అండ్ మెన్ &#8216; నవల రాస్తున్న సమయంలో &#8216;శాన్ఫ్రాన్సికో న్యూస్ &#8216; పత్రికలో స్టైన్బెక్ పనిచేస్తున్నాడు. (వరికోతల / చెరుకు కొట్టే సీజన్ లో కోస్తా జిల్లాలకు పటమటనుంచీ కూలీలు వచ్చినట్టు) పంటల కాలంలో కాలిఫోర్నియాకి చీమల్లా వలస వస్తున్న వేలాది కార్మికుల మీద విశ్లేషణాత్మక కథనం రాసే పనిని అతనికి పురమాయించింది ఆ పత్రిక.</p>
<p>ఓ మారుపేరుతో ఆ వలస శ్రామికులతో కలిసిపోయి, వాళ్ళ డొక్కు ట్రక్కుల్లో వందలకొద్దీ మైళ్ళు ప్రయాణించి , చిరిగిన గుడారాల్లో పడుకొని, గంజి కేంద్రాల్లో పొట్టనింపుకొని వాళ్ళ జీవితాల్లోని నిష్ట దారిద్ర్యాన్నీ, హింసనూ ప్రత్యక్షంగా చూసి &#8216;జిప్సీస్ ఆఫ్ హార్వెస్ట్ &#8216; అనే వ్యాసాల పరంపర రాశాడు. అలా &#8216;ఆఫ్ మైస్ అండ్ మెన్ &#8216; నవలను ముగించే లోపే అతడి మనసులో &#8216; గ్రేప్స్ ఆఫ్ రాత్ &#8216; నవలకు అంకురం పడింది.</p>
<p>గ్రేప్స్ ఆఫ్ రాత్ నవలలో వలస కార్మికుల దుర్భరమయిన స్థితి గతుల్ని చిత్రించినందువల్ల అతడు పెట్టుబడిదారీ విధానపు చీకటి పార్శ్వాన్ని బట్టబయలు చేశాడనీ, శ్రామికుల పక్షాన తిరుగుబాటుని సమర్ధించాడనీ స్టైన్బెక్ ను విమర్శిస్తూ ఆ పుస్తకాన్ని రెండేళ్ళ పాటు పబ్లిక్ లైబ్రరీలలో, విద్యా సంస్థల్లో నిషేధించారు.</p>
<p>అతడి రచనలకు నేషనల్ బుక్ అవార్డ్, ప్యూలిట్జర్ ప్రైజ్ వంటి అవార్డులతో పాటు 1962లో ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయినా చివరి వరకూ అమెరికన్ విధానాలను వ్యతిరేకించే రచయితగా అతడిని ఆ సమాజం విమర్శిస్తూనే వచ్చింది. కానీ తలతిప్పుకోకుండా చదివించగలగే శక్తివంతమయిన రచయితగా పాఠకులకూ, వాస్తవిక చిత్రణలో ఆదర్శప్రాయుడుగా రచయితలకూ ప్రపంచ వ్యాప్తంగా స్టైన్బెక్ ఎంతో ఆప్తుడయాడు.</p>
<p>అమెరికన్ సాహిత్యంలో, ఆనాటి రచయితలలో శిఖరసమానుడుగా పేరుపొందిన స్టైన్బెక్ 1968లో మరణించాడు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14349</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>ఆధ్యాత్మికంగా మేల్కొల్పే “Only love is real “ by Dr. Brian Weiss</title>
		<link>http://vaakili.com/patrika/?p=14035</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14035#comments</comments>
		<pubDate>Sun, 30 Apr 2017 18:07:31 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[ప్రసూన రవీంద్రన్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14035</guid>
		<description><![CDATA[<p></p> <p>&#8220;అంతా ప్రేమే&#8230; అంతా ప్రేమే. ఆ ప్రేమ ద్వారానే అవగాహనా శక్తి, తద్వారానే ఏర్పడే సహనం. అక్కడే&#8230; సరిగ్గా అప్పుడే సమయం ఆగిపోతుంది. అంటే అంతా వర్తమానమే అయిపోతుంది. యదార్థమే వర్తమానం. మానసికంగా భూతకాలంలోకో, భవిష్యత్తులోకో ప్రయాణించేసి అక్కడే తిరగాడుతూ ఉండటం ఎప్పటికైనా బాధనీ, అనారోగ్యాన్నీ మాత్రమే కలిగిస్తుంది. అలా మన కాలం మన చేతుల్లోంచి ఒలికిపోకుండా ఒక్క సహనం మాత్రమే ఆపగలదు.</p> <p>అన్ని ప్రశ్నలకీ ప్రేమే అంతిమ సమాధానం. ప్రేమ నైరూప్యమైనది కాదు. అది నిన్ను నిర్మించి నీ ఉనికిని కాపాడే ఓ దివ్య శక్తి. అందుకే ప్రేమమయమైపో. ప్రేమని అనుభూతించు. ప్రేమని దాచుకోకుండా వ్యక్తపరుచు. ప్రేమ భయాన్ని పోగొడుతుంది. ప్రేమని అనుభూతించేటప్పుడు భయం ఉండదు. సృష్టిలో ప్రతీదీ శక్తే. ప్రేమ అన్ని రకాల శక్తులనీ మించినది.&#8221;</p> <p>ఇవే కాక ప్రేమ గురించి ఇంకా ఎన్నో రహస్యాల్ని తెలుసుకున్నాడు అమెరికాలో ప్రఖ్యాత సైక్రియాట్రిస్ట్, డాక్టర్ బ్రియాన్ వెయిస్. తన ప్రాక్టీస్ ద్వారా ఎందరికో మనోవ్యాకులతను దూరం చేసే క్రమంలో అనుకోకుండా అతనికి పూర్వజన్మల మీదా, వాటి కర్మ ఫలాల మీదా అతనికి మునుపు ఉన్న నమ్మకాలన్నిటినీ సవాలు చేసే పరిస్థితి ఎదురవుతుంది. తన పేషంట్లను హిప్నటైజ్ చేసి, వారి మానసిక, శారీరక బాధలకి కారణాలు తెలుసుకోవడం కోసం వారిని కొన్ని సంవత్సరాల వెనుకటి స్థితికి తీసుకువెళతాడాయన. ఆ సమయంలో కాథరిన్ అనే పేషంట్ అనుకోకుండానే తన ఇప్పటి జన్మకి ముందు సమయం అంటే, తను తల్లి కడుపులో పడకముందు ఉన్న పరిస్థితుల్ని అలా ట్రాన్స్ లో ఉండే వివరిస్తుంది. అలా తను నమ్మని ఒక నిజాన్ని కళ్ళ ఎదుట తన ప్రమేయం తోనే జరిగిపోవడాన్ని చూసి విస్తుపోతూనే క్షుణ్ణంగా మరిన్ని విషయాలు తెలుసుకుంటాడు ఆయన.</p> <p>అలా “పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ని” నమ్మక తప్పని పరిస్థితి మొదలవుతుంది. రోగుల వివరాలతో పాటు తన ఉనికికే సంబంధించిన ఎన్నో విషయాలు, ఎన్నో [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/OnlyLoveisReal.jpg"><img src="http://vaakili.com/patrika/wp-content/uploads/2017/04/OnlyLoveisReal.jpg" alt="" title="OnlyLoveisReal" width="296" height="475" class="alignleft size-full wp-image-14040" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">&#8220;అం</span>తా ప్రేమే&#8230; అంతా ప్రేమే. ఆ ప్రేమ ద్వారానే అవగాహనా శక్తి, తద్వారానే ఏర్పడే సహనం. అక్కడే&#8230; సరిగ్గా అప్పుడే సమయం ఆగిపోతుంది. అంటే అంతా వర్తమానమే అయిపోతుంది. యదార్థమే వర్తమానం. మానసికంగా భూతకాలంలోకో, భవిష్యత్తులోకో ప్రయాణించేసి అక్కడే తిరగాడుతూ ఉండటం ఎప్పటికైనా బాధనీ, అనారోగ్యాన్నీ మాత్రమే కలిగిస్తుంది. అలా మన కాలం మన చేతుల్లోంచి ఒలికిపోకుండా ఒక్క సహనం మాత్రమే ఆపగలదు.</p>
<p>అన్ని ప్రశ్నలకీ ప్రేమే అంతిమ సమాధానం. ప్రేమ నైరూప్యమైనది కాదు. అది నిన్ను నిర్మించి నీ ఉనికిని కాపాడే ఓ దివ్య శక్తి. అందుకే ప్రేమమయమైపో. ప్రేమని అనుభూతించు. ప్రేమని దాచుకోకుండా వ్యక్తపరుచు. ప్రేమ భయాన్ని పోగొడుతుంది. ప్రేమని అనుభూతించేటప్పుడు భయం ఉండదు. సృష్టిలో ప్రతీదీ శక్తే. ప్రేమ అన్ని రకాల శక్తులనీ మించినది.&#8221;</p>
<p>ఇవే కాక ప్రేమ గురించి ఇంకా ఎన్నో రహస్యాల్ని తెలుసుకున్నాడు అమెరికాలో ప్రఖ్యాత సైక్రియాట్రిస్ట్, డాక్టర్ బ్రియాన్ వెయిస్. తన ప్రాక్టీస్ ద్వారా ఎందరికో మనోవ్యాకులతను దూరం చేసే క్రమంలో అనుకోకుండా అతనికి పూర్వజన్మల మీదా, వాటి కర్మ ఫలాల మీదా అతనికి మునుపు ఉన్న నమ్మకాలన్నిటినీ సవాలు చేసే పరిస్థితి ఎదురవుతుంది. తన పేషంట్లను హిప్నటైజ్ చేసి, వారి మానసిక, శారీరక బాధలకి కారణాలు తెలుసుకోవడం కోసం వారిని కొన్ని సంవత్సరాల వెనుకటి స్థితికి తీసుకువెళతాడాయన. ఆ సమయంలో కాథరిన్ అనే పేషంట్ అనుకోకుండానే తన ఇప్పటి జన్మకి ముందు సమయం అంటే, తను తల్లి కడుపులో పడకముందు ఉన్న పరిస్థితుల్ని అలా ట్రాన్స్ లో ఉండే వివరిస్తుంది. అలా తను నమ్మని ఒక నిజాన్ని కళ్ళ ఎదుట తన ప్రమేయం తోనే జరిగిపోవడాన్ని చూసి విస్తుపోతూనే క్షుణ్ణంగా మరిన్ని విషయాలు తెలుసుకుంటాడు ఆయన.</p>
<p>అలా “పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ని” నమ్మక తప్పని పరిస్థితి మొదలవుతుంది. రోగుల వివరాలతో పాటు తన ఉనికికే సంబంధించిన ఎన్నో విషయాలు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ట్రాన్స్ లోకి వెళ్ళి గత జన్మలలోకి ప్రవేశించి అప్పటి విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా చెబుతున్న తన పేషంట్ల ద్వారా తెలుసుకుంటాడు.</p>
<p>ఆ తరువాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రస్థుత జన్మల్లో రోగులు పడుతున్న ప్రతి బాధకీ వారి పూర్వ జన్మల్లో ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకున్నాక, అతనికి చికిత్స మరింత సులభమైపోతుంది.</p>
<p>ఎలిజబెత్ అనే యువతి చిన్నతనమంతా తండ్రి యొక్క నిరాదరణ, తాగుడుకి బానిసైన అతను తన తల్లిని పెట్టిన క్షోభ చూస్తూ పెరుగుతుంది. ఆమె తన తల్లికి మూడో సంతానమైనా, అత్యంత ఆత్మీయ స్నేహితురాల్లా పెరుగుతుంది. తనకు చదువు పూర్తయి దూరంగా ఉన్న ఊరిలో ఉద్యోగం వచ్చాక, తల్లికి ప్రమాదకరమైన కాన్సర్ వ్యాధి శోకిందని తెలిశాక విపరీతమైన భయానికి లోనవుతుంది. ఆమె ఎందరినో ప్రేమించేంత వరకూ వెళ్ళి ఎవరితోనూ బంధం నిలవకపోవడం కూడా ఆమెను తీవ్రమైన వేదనకు గురిచేస్తుంది. కొన్నాళ్ళకి తల్లి దూరమైపోవడంతో భరించలేని నైరాశ్యానికి లోనయి, అనారోగ్యంపాలవుతుంది. ఆ డిప్రెషన్ భరించలేక డాక్టర్ బ్రెయిన్ వెయిస్ ని కలుస్తుంది. ఆమెకు చికిత్స మొదలుపెట్టడం కోసం, ఆమె యొక్క మానసిక వేదనకి కారణాలు సేకరించడం కోసం, ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ ద్వారా మెల్ల మెల్లగా హిప్నటైజ్ చేస్తూ ఆమెను కొన్ని జన్మల వెనుకకి తీసుకువెళతాడు.</p>
<p>అదే సమయంలో పెడ్రో అనే ఓ ధనవంతుడు కూడా డాక్టర్ బ్రియాన్ ని కలుస్తాడు. అతను ఎంత గొప్ప ధనవంతుడైనా కొద్ది నెలల క్రితమే అతను అమితంగా ప్రేమించే తమ్ముడిని కోల్పోవడం, జీవితంలో అతను గాఢంగా ప్రేమించగల యువతి దొరక్కపోవడంతో నిరాశకు గురైన మనిషి. వీటితో పాటుగా ఏ డాక్టరూ నయం చేయలేకపోతున్న భుజం నొప్పి కూడా అతన్ని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తుంది.</p>
<p>బ్రెయిన్ వెయిస్ అతనికీ ‘పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ’ మొదలుపెడతాడు.</p>
<p>వాళ్ళిద్దరూ తమ ప్రస్థుత జీవితాల్లో ఇంకా సరయిన తోడు దొరకలేదని వేదన చెందుతున్న వాళ్ళే. థెరపీ సెషన్లు పూర్తయ్యేకొద్దీ పూర్వ జన్మల్లో జరిగిన అత్యంత వేదనా భరిత సంఘటనలు తెలుసుకునేకొద్దీ, వారిలో మెల్ల మెల్లగా మార్పు వస్తుంది. ఎందరో పేరొందిన డాక్టర్లు సైతం తగ్గించలేకపోయిన పెడ్రో భుజం నొప్పి, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఆ జన్మలో తను అనుభవించిన ఒక విషాదకర సంఘటన థెరపీ ద్వారా తిరిగి అనుభూతించాక అతి విచిత్రంగా మాయమైపోతుంది.</p>
<p>అటు పెడ్రో, ఇటు ఎలిజబెత్ కూడా, రిగ్రెషన్ థెరపీలో వెనుకటి జన్మల స్థితికి చేరుకునే కొద్దీ, ప్రతి జన్మలోనూ తాము ఎంతగానో అభిమానించే/ప్రేమించే అదే వ్యక్తి ఆ మునుపటి జన్మలో కూడా అత్యంత ఆప్తుడిగా/ఆప్తురాలిగా తమతోనే ఉండటం గమనిస్తూ వస్తారు. కానీ, అది వారిద్దరే అని విడి విడిగా బ్రియాన్ దగ్గరకి కౌన్సిలింగ్ కి వస్తున్న వారికి తెలియదు. వారిద్దరి థెరపీ చేస్తూ, సెషన్స్ ని, రికార్డ్ కూడా చేస్తున్న బ్రియాన్ కీ చివరి వరకూ తెలియదు.</p>
<p>ఇక పెడ్రో బాధ చాలా వరకూ తీరిపోయి అతను ఆ ఊరి నుంచి వేరే దూర నగరానికి శాశ్వతంగా వలసపోయే ముందు జరిగిన సెషన్ లో బ్రియాన్ కి ఒక క్లూ దొరుకుతుంది. పెడ్రో వెతుకుతున్న ప్రేమ ఎలిజబెతే అని, ఎలిజబెత్ తను చేరుకోవాలని తపించిపోతున్న ఆత్మ బంధువు పేడ్రోనే అనీ, అతనూ, ఎలిజబెత్ ఇద్దరూ కూడా జన్మ జన్మలుగా ఆప్తులుగా ఉంటున్న వ్యక్తులని. సోల్ మేట్స్ అని అర్థమవుతుంది. కానీ, అది తను చెప్పలేడు. వాళ్ళిద్దరూ ఎదురుపడాలి. ఒకరినొకరు గుర్తుపట్టాలి. అందుకు అతనేం చేస్తాడు, అలా ఎదురు పడ్డాక వారిద్దరూ ఎలా ప్రవర్తిస్తారు? చివరికి ఏమవుతుంది అనేదే ముగింపు.</p>
<p>ఇది నిజంగా జరిగిన కథ. ఇందులో ఒక పదం కూడా కల్పితం కాదని నవల మొదట్లోనే చెబుతారు బ్రియాన్ వెయిస్. ఈ నవల మొత్తం వీరిద్దరి రిగ్రెషన్ థెరపీ సెషన్లతో అత్యంత ఉత్కంఠంగా సాగడం మాత్రమే కాదు, వారి వారి పూర్వ జన్మల్లోని అనుభవాల ద్వారా వారిద్దరిలో ఒక్కొక్కటిగా ఆజ్ఞానపు పొరలు చిరిగిపోయి జ్ఞానం వికసించినట్టే మన లోపల కూడా అతి ముఖ్యమైన తలుపులేవో తెరుచుకుంటాయి. ఈ నవల చదివాక మన జీవిత దృక్పధమే మారిపోతుంది. ఏ తలుపు శాశ్వతంగా మూసివేయాలో, ఏ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచాలో తెలుస్తుంది. అన్నిటికీ మించి జీవన గమనానికి అత్యంత అవసరమైన సహనం ఏర్పడుతుంది. అందువల్లే, మనం మాట్లాడే పధ్ధతితో సహా, మన ప్రవర్తన, జరిగే సంఘటనలకి మనం స్పదించే తీరు, అన్నీ మారిపోతాయి. జీవితంలో ప్రతి ఒక్క క్షణమూ ఎంత విలువైనదో తెలుస్తుంది. ఇంత గొప్పగా జీవితాల్ని ప్రభావితం చేసే పుస్తకాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇటువంటి పుస్తకాల్ని చదవకుండా వదలకూడదు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14035</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నించిన &#8220;చాగంటి సోమయాజులు కథలు&#8221;</title>
		<link>http://vaakili.com/patrika/?p=11668</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11668#comments</comments>
		<pubDate>Sun, 31 Jul 2016 16:38:22 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[పుస్తక పరిచయం]]></category>
		<category><![CDATA[కొల్లూరి సోమ శంకర్]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11668</guid>
		<description><![CDATA[ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్న పుస్తకం అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా వారు ప్రచురించిన "చాగంటి సోమయాజులు కథలు". చాసోగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు విశిష్ట కథకులు. వాసి కన్నా రాశి మీద దృష్టి నిలిపిన రచయిత. వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిటిలోనూ ఆయన చింతనా, దృక్పథం అంతర్లీనంగా వ్యక్తమవుతాయి. ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతిపరుల్ని చేస్తుందో, మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో సునిశితంగా పరిశీలించి పాత్రల సృష్టి చేశారు చాసో.]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/ChasoKathalucover.jpg"><img class="alignleft  wp-image-11671" title="ChasoKathalucover" src="http://vaakili.com/patrika/wp-content/uploads/2016/07/ChasoKathalucover.jpg" alt="" width="271" height="416" /></a></p>
<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">తె</span>లుగు కథది దాదాపు నూట అయిదేళ్ళ వయస్సు. ఎంతోమంది గొప్ప కథకులు అద్భుతమైన కథల్ని రచించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు.</p>
<p>&#8220;కథానిక పాఠకుల హృదయానికి సన్నిహితమైన వర్తమాన సాహితీ ప్రక్రియ&#8221; అంటూ &#8211; అలనాటి మేటి కథకులను ప్రతి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో, వారి కథాకాంతులను ఎల్లవేళలా ప్రసరింపజేయడానికి పూనుకుంది <strong>గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం</strong>. ఈ క్రమంలో &#8220;<em>ఈతరం కోసం కథాస్రవంతి</em>&#8221; పేరిట సుప్రసిద్ధ కథకుల గొప్పకథలను పుస్తక రూపంలో తెచ్చారు అరసం వారు. అభినందనీయం వీరి కృషి.</p>
<p>ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్న పుస్తకం అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా వారు ప్రచురించిన &#8220;<a href="http://www.anandbooks.com/Chaganti-Somayajulu-Kathalu"><strong>చాగంటి సోమయాజులు కథలు</strong></a>&#8220;. చాసోగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి సోమయాజులు విశిష్ట కథకులు. రాశి కన్నా వాసి మీద దృష్టి నిలిపిన రచయిత. వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిటిలోనూ ఆయన చింతనా, దృక్పథం అంతర్లీనంగా వ్యక్తమవుతాయి. ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతిపరుల్ని చేస్తుందో, మానవత్వాన్ని ఎలా నాశనం చేస్తుందో, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో సునిశితంగా పరిశీలించి పాత్రల సృష్టి చేశారు చాసో.</p>
<p>&#8220;<em>చాసో కథ ప్రారంభం నుంచి చివరిదాక ఒకే ఊపుతో నడుస్తుంది. ఎక్కడా బెసగదు</em><em>, </em><em>పట్టు సడలదు.</em>&#8221; అంటారు ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన ఆయన కుమార్తె, ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డా. చాగంటి తులసి. &#8220;<em>చాసో కథలు ఎక్కువగా బుద్ధిని తాకుతాయి. హృదయంలోకి చొచ్చుకుపోవడం తక్కువే అయినా కొన్ని చోట్ల కథ హృదయదఘ్నంగానే ఉంటుంది.</em>&#8221; అని అంటారావిడ.</p>
<p>ఈ పుస్తకంలో పదహారు కథలున్నాయి. వాటిని పరిచయం చేసుకుందాం.</p>
<p align="center">***.</p>
<p>కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా విశ్వసించే పేరక్క తోటివారందిరికీ నీతులు చెబుతుంది. పురాణ ప్రవచనాల వైపు తోటి స్త్రీలని లాగడానికి ప్రయత్నిస్తుంటూంది. శాస్త్రం పేరు చెప్పి వారి అమాయకత్వం మీద భయప్రయోగం చేస్తుంది. తిన్న విస్తరి పారేయడానికి వెళ్ళి ఓ పంది పిల్ల చావుకు కారణమవుతుంది పుల్లమ్మ. ఆమె విపరీతంగా భయపడిపోయి నిద్రలో కలవరింతలు పెడుతుంది. తెలిసి చేసిన తెలియక జేసినా పాపకర్మం అనుభవించక తప్పదని కొడుకుతో అంటుంది. బదులుగా ఆ కొడుకు &#8211; &#8220;ఈ ప్రపంచంలో పాపం చేసినవాడికి భగవంతుడు శిక్ష వెయ్యడం లేదు. ఖూనీలు చేసిన వాళ్ళు, కొంపలు కూల్చిన వాళ్ళు బాగానే ఉన్నారు. దేముడు శిక్ష వేస్తున్నది, అమాయకత్వాన్ని, తెలివితక్కువతనాన్ని.&#8221; అని అంటాడు. ఎంతో నచ్చజెప్పిన మీదట పుల్లమ్మ తెరిపిన పడుతుంది. &#8220;<strong>కర్మ సిద్ధాంతం</strong>&#8221; అనే ఈ కథ 1942లో ప్రచురితమైంది.</p>
<p>పేదరికం చిన్నారుల బాల్యాన్ని ఎలా చిదిమేస్తుందో చెప్పిన కథ &#8220;<strong>కుంకుడాకు</strong>&#8220;. తల్లీ తండ్రీ పొయ్యిమీదకి తేగలిగినా, తేలేకపోయినా గవిరి పొయ్యి లోకి తెచ్చితీరాలి. పొయ్యి వెలగాలంటే చెత్త కావాలి. చెత్త ఏరుకొచ్చే బాధ్యత ఎనిమిదేళ్ళ గవిరిది. ఆ కుటుంబంలో కూతురు గవిరి తెచ్చి పెట్టే చెత్తకి ఆర్ధికంగా ఎంతయినా విలువ ఉంది. తోటి పిల్లలు బడిలో ఎక్కాలు వల్లె వేస్తుంటే, గవిరి మాత్రం కామందు చేతితో తన్నులు తింటూ చెత్త మోసుకుంటూ ఇంటికి నడుస్తుంది. ఈ కథ 1943లో ప్రచురితమైంది.</p>
<p>ఓ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని రాత్రి వేళలో చూడాలని బయల్దేరిన మిత్రబృందానికి ఏమయింది? భయం ఆవహించింది! ఎలా ఉంటుందా భయం? శరీరం నిండా వేలకొద్ది టన్నుల బరువుతో ఆవహించింది. &#8220;<em>భయం శరీరాన్నంతా ఆవహించడం అందరి అనుభవంలోనూ ఉండదు. సాధారణంగా భయం గుండెల్లో ఒక భాగాన్ని మాత్రమే పట్టుకొట్టుంది. ఇంకో భాగం ధైర్యాన్ని ఉపాసన చేసి భయపిశాచిని గెంటేస్తుంది. పిచికని పట్టుకుని పావుగంట సేపు చేతుల్లో ఉంచి చూడండి. అది చచ్చి ఊరుకుంటుంది. దాని గుండెలు భయంచేత ఆగిపోతాయి. భయం అంటే అదీ. అదీ నన్ను ఆవహించింది.</em>&#8221; అంటాడు గిరిరావు అనే పాత్ర. ఈ మిత్రబృందాన్ని అంతగా భయపెట్టినదేదో తెలుసుకోవాంటే &#8220;<strong>దుమ్ములగొండె</strong>&#8221; కథ చదవాలి. ఈ కథ జూలై 1943లో &#8216;భారతి&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>లేమి ఎంతటివాళ్ళలోనైనా మానవత్వాన్ని చంపి, అమానుషత్వాన్ని పెంచుతుంది అంటుంది &#8220;<strong>బొండు మల్లెలు</strong>&#8221; కథ. మన సంబంధ బాంధవ్యాలు ఎంత చిత్రంగా ఉంటాయో ఈ కథ చెబుతుంది. “సారంవతమైన గంజిని కాలువపాలు చేసి, పిప్పిని &#8216;అన్నం&#8217; అనుకొని నాగరీకులం తింటాం” అంటాడు ప్రధానపాత్ర. తాను చేసేది న్యాయమైన దోపిడీ అని మొదట భావించిన అతను &#8211; తాను కూడా ఓ అసహాయుడిని దోపీడీ చేశానని గ్రహిస్తాడు. ఈ కథ సెప్టెంబరు 1943లో &#8216;ప్రజాశక్తి&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>పేదరికం కారణంగా చదువు మానేయాల్సిన పరిస్థితి కృష్ణుడిది. అటెండెన్స్ రిజిస్టర్‌లో తన పేరు కొట్టేసి &#8216;డిస్‌కంటిన్యూడ్&#8217; అని వ్రాస్తారేమోనన్న భయం వాడిది. తండ్రి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చి పంపితే, బడిలో ఓ స్తంభాన్ని ఆనుకుని నిలబడి, దుఃఖంలోకి జారుకుంటాడు కృష్ణుడు. కొడుకు రాలేదని తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. బడి వరండాలో పిల్లాణ్ణి చూసి ఇంటికి వెడదాం రమ్మంటాడు. &#8220;బడి నాది, నే న్రాను&#8221; అంటూ గట్టిగా దుఃఖంతో కేకపెడతాడు కృష్ణుడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడుతుంది. ఓ నిశ్చయానికొస్తాడు. కనీసం ఒక్క పుస్తకమైనా కొనిపెట్టమన్న కొడుకుని &#8220;చుట్టలకిచ్చిన డబ్బులున్నాయా, పారేశావా?&#8221; అని అడుగుతాడు. &#8220;ఎందుకు పారేస్తాను నాన్నా?&#8221; అంటాడు కృష్ణుడు. చాసో కథల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ &#8220;<strong>ఎందుకు పారేస్తాను నాన్నా</strong><strong>?</strong>&#8221; అనే కథ మే 1944లో &#8216;భారతి&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>అనేక విషయాలలో సమాధానాలు పడుతూంటేనే జీవితం ఎవరికైనా గడుస్తుందని చెబుతుంది &#8220;<strong>లేడీ కరుణాకరం</strong>&#8221; కథ. ఈ కథ మార్చి 1945లో &#8216;ఢంకా&#8217;లో ప్రచురితమైంది. నిండా వ్యంగ్యం నిండిన కథ ఇది.</p>
<p>&#8220;<em>చిట్టికింకా పెళ్ళికాకపోవడం, </em><em>జీర్ణించిపోయి, </em><em>నాలో దురుద్దేశాలని రేపుతున్నది. చిట్టికింకా పెళ్ళికాకపోవడం తెనుగు యువకుల రసజ్ఞతా దారిద్ర్యాన్ని వెల్లడిస్తున్నాది.</em>&#8221; అంటాడు <strong>&#8216;</strong><strong>ఊహా ఊర్వశి</strong>&#8216; కథలోని ప్రధానపాత్ర. “<em>కోర్కెలు అణచివేస్తే మనోవికారాల కింద తేలుతాయి. కోర్కెలు సాఫల్యం చెయ్యడమో లేక జయించడమో మనం చేస్తూ వుండాలి</em>.” అంటాడు. మనిషిలోని దిగజారుడుతనాన్ని కళ్ళకు కడుతుందీ కథ. ఈ కథ మార్చి 1945లో &#8216;భారతి&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>భాషలో పదజాలానికి అతీతమైన ప్రతిభతో అనేక భావాలని సూక్ష్మంగా ఓ నవ్వు వ్యక్తపరుస్తుంది. అయితే ఆ నవ్వు అతనిలో పొరపాటు అభిప్రాయం కలిగించిది. ఆ నవ్వుకు కారణం ఏమిటో, అది &#8216;ఓ వర్గజీవితాన్ని దులపవలసిన రీతిగా దులిపిన&#8217; కథకి ఎలా కారణమైందో &#8220;<strong>బూర్జువా కుక్క</strong>&#8221; కథ చెబుతుంది. సాహితీ భజనపరులపై విసిరిన వ్యంగ బాణం ఈ కథ. ఇది ఏప్రిల్ 1945లో &#8216;ఢంకా&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>కుంటిబిచ్చగాడికి, గుడ్ది బిచ్చగాడికీ తేడాలు చెబుతూ ఓ తండ్రి తన కూతుర్ని గుడ్ది బిచ్చగాడినే పెళ్ళిచేసుకోమంటాడు. సమాజంలోని ఏ స్థాయి వ్యక్తులకయినా ముందు తమ అవసరాలే ముఖ్యమని &#8220;<strong>ఎంపు</strong>&#8221; కథ మరోసారి చాటుతుంది. ఈ కథ సెప్టెంబరు 1945లో &#8216;అరసం ప్రత్యేక సంచిక&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>ధనం ఆశజూపి నిస్సహాయ స్త్రీలను కబళించడం అనాదిగా జరుగుతున్నదే. బ్రతుకుతెరువు కోసం రంగూన్ వెళ్ళిన అల్లుడు ఇక తిరిగిరాడని చెప్పి తన కూతురిని పరపురుషుడికి అప్పగిస్తోందో తల్లి. వాడిచ్చే డబ్బులతో అప్పులు తీరుస్తానంటూ కూతుర్ని బ్రతిమాలుతుంది. తప్పక, లొంగిపోతుంది కూతురు. ఉన్నట్టుండి ఓ రోజు రంగూన్ నుంచి తిరిగొస్తాడు అల్లుడు దాలిగోడు. ఏడుస్తున్న భార్యని ఓదారుస్తాడు. సమాజంలోని నైచ్యానికి అద్దం పట్టిన కథ &#8220;<strong>ఆఁవెఁత</strong>&#8220;. ఈ కథ రచనాకాలం 1951.</p>
<p>జీవితంలో సంగీతం ఎంత ప్రయోజనకరమో తెలిపే కథ &#8220;<strong>వాయులీనం</strong>&#8220;. పాడలేకపోయినా, అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది. వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయంటుందీ కథ. &#8220;<em>పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి. స్వభావసిద్ధంగా సంగీతం సమ్మోహనపరుస్తుంది. చిన్న వయస్సునుంచి కాస్తంత రాగతాళ జ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనందహేతువు అవుతుంది</em>&#8221; అని చెబుతుంది. సంసార బాధ్యతలలో పడి, సంగీతానికి దూరమైనందుకు విలపిస్తోందో గృహిణి. ఈ కథ 1952లో &#8216;భారతి&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>తన కొడుకు చెమటోడ్చి గడించుకున్న డబ్బుతో బియ్యం కొనుక్కుని రైల్లో వస్తున్న ఓ ముసలమ్మని రైల్వే ఉద్యోగి అటకాయిస్తాడు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మడానికి తీసుకువెడుతోందని వాదిస్తాడు. రైలు అన్నవరం స్టేషనులోంచి పోతుంటే ముసలామే, ఉద్యోగి ఇద్దరూ సత్యనారాయణ స్వామిని చూడడానికి ప్రయత్నిస్తే, ఉద్యోగికి ఆలయం కనిపిస్తుంది, ముసలామెకి ముళ్ళచెట్లు మాత్రమే కనబడతాయి. చివరికి మరో స్టేషన్‌లో నలుగురు అధికారులు ఎక్కుతారు. ముసలామెని గుర్తు పట్టి తర్వాతి స్టేషన్‍లో దింపి కేసు పెట్టేందుకు తీసుకుపోతారు. గోదావరి మండలం సరిహద్దు దాటించి, ప్రభుత్వపు శాసనాన్ని ధిక్కరించి, హద్దు తప్పి, ఐదేసి కుంచాలు చొప్పున బియ్యం తరచు తరలించుకుపోతున్న ముద్దాయి పట్టుబడింది. &#8220;<strong>కుక్కుటేశ్వరము</strong>&#8221; కథ 1952లో &#8216;భారతి&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>కొండని బ్లాస్ట్ చేసే పని చేస్తుండగా ఓ పెద్ద బండరాయి వచ్చి రామిగాడి తలమీద పడుతుంది. అక్కడికక్కడే చచ్చిపోతాడు. తోటి కూలీలందరూ కాంట్రాక్టర్ చేత నష్టపరిహారం ఇప్పించాల్సిందేనని పట్టుబడతారు. మేస్త్రీ సత్యం మూడు వందల రూపాయలు తెచ్చి రామిగాడి పెళ్ళాం పార్వతికి ఇస్తాడు. కోడలికి డబ్బు ముట్టిందని తెలియగానే రామిగాడి తల్లి వాటా కోసం వస్తుంది. మేస్త్రీని న్యాయమడుగుతుంది. అప్పుడు మేస్త్రీ సత్యం అసలయిన న్యాయమేమిటో చెబుతాడు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలనేనని ఆనాడే చెప్పిన కథ &#8220;<strong>బండపాటు</strong>&#8220;. ఈ కథ 1968లో &#8216;జ్యోతి &#8211; దీపావళి సంచిక&#8217;లో ప్రచురితమైంది.</p>
<p>పరమేశ్వరుడి నిర్ణయాలు పామరులకు బోధపడవని చెప్పే కథ &#8220;<strong>వజ్రహస్తం</strong>&#8220;. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఓ అధికారి తిరుమలకి వెళ్ళి భగవంతుని క్షమాపణ కోరుకుంటాడు. తనని కాకుండా తన మిత్రుడిని కాపాడమని కూరుకుంటాడు. ఈ కథ 1974లో &#8216;ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి సంచిక&#8217;లో ప్రచురితం.</p>
<p>అందమైన బతుకే అందరికీ కావాలని చెప్పే కథ &#8220;<strong>గుడిసె &#8211; దీర్ఘరోగి</strong>&#8220;. ఓ చిత్రకారుడు తను చిత్రించలచిన దీర్ఘరోగి చిత్రం కోసం ఓ ముసలమ్మని మోడల్‌గా ఉండమంటాడు. డబ్బిస్తానంటే ఒప్పుకుంటుందామె. నీడలు, ఎండ వెలుగులూ పడి ఆమె మొహంలో ఎనభై ఏళ్ళ జీవితపు బాధ, మరణ వేదన దేదీప్యమానంగా దివ్యజ్యోతులై వెలుగుతూ కనబడతాయి చిత్రకారుడికి. <em>&#8216;</em><em>దివ్యత్వం అన్నిటా ఉంది, </em><em>వేదనలోనే చూశా!</em>&#8216; &#8211; అనుకుంటాడతను. ఈ కథ 1975లో &#8216;ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి సంచిక&#8217;లో ప్రచురితం.</p>
<p>వర్షాన్ని నమ్ముకుని వ్యవసాయం చేసే కుటుంబం కథ &#8220;<strong>వఱపు</strong>&#8220;. <em>&#8216;</em><em>దిక్కుమాలిన ఆకాశాన్ని నమ్ముకుని తరతరాలు బతుక్కొస్తున్నాము</em>&#8216; అంటుందో పాత్ర ఈ కథలో. సకాలంలో వానల కోసం రైతులు ఎంతగా ఎదురుచూస్తారో, ఎంతగా ఆశపడతారో; అకాలంలో కురిసే వానయినా కాస్తోకూస్తో మేలు చేస్తుందని వాపోతుందా పాత్ర. ఈ కథ 22.1.1988 నాటి &#8216;ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక&#8217;లో ప్రచురితం.</p>
<p align="center">***</p>
<p>ఆయా కథలు ప్రచురితమైన కాలాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. ఈ కాలక్రమంలో తెలుగునేలలో వచ్చిన మార్పులు, సామాజిక సంబంధాలు చెదరడం, అవినీతి రాజ్యమేలడం, వ్యక్తి నైతికత పతనమవడం మొదలైనవాటినన్నీ ఈ కథలు రికార్డు చేశాయి.</p>
<p>ఇవి ఏ ఒక్క కాలానికో, ప్రాంతానికో మాత్రమే పరిమితం కాక, విశ్వజనీనమైన కథలు. వ్యవస్థలోని అవకతవకలని ప్రశ్నిస్తూ వ్యవస్థ మారాలి, మారడానికి వీలుగా వ్యక్తి ఆలోచన సాగాలి, వృద్ధి చెందాలని కళాత్మకంగా చెప్పిన కథలివి. మాండలీకాన్ని కథలలో చొప్పించిన రచయిత చాసో.</p>
<p>కాలాన్నీ, మనుషుల్నీ, సమాజాన్ని సన్నిహితంగా పరిశీలిస్తూ వ్రాసిన కథలివి. ఈ కథల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఏది రాయాలో ఏది రాయకూడదో అర్థమవుతుంది. కొత్త, ఔత్సాహిక రచయితలకు స్ఫూర్తినిచ్చే రచనావిధానం ఇది.</p>
<p>105 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 50/- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ వారి అన్ని కేంద్రాలలోనూ ఈ పుస్తకం లభిస్తుంది. http://www.anandbooks.com నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11668</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
	</channel>
</rss>
