<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>వాకిలి &#187; టి. చంద్రశేఖర రెడ్డి</title>
	<atom:link href="http://vaakili.com/patrika/?feed=rss2&#038;tag=%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B1%87%E0%B0%96%E0%B0%B0-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF" rel="self" type="application/rss+xml" />
	<link>http://vaakili.com/patrika</link>
	<description>సాహిత్య పత్రిక</description>
	<lastBuildDate>Tue, 18 Dec 2018 17:20:29 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.4.2</generator>
		<item>
		<title>కథాయణం ప్లస్ నాగరికథ=నాగరికథాయణం</title>
		<link>http://vaakili.com/patrika/?p=14552</link>
		<comments>http://vaakili.com/patrika/?p=14552#comments</comments>
		<pubDate>Sat, 01 Jul 2017 02:04:56 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[సమీక్ష]]></category>
		<category><![CDATA[టి. చంద్రశేఖర రెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=14552</guid>
		<description><![CDATA[ఈ సమీక్షావ్యాసం అనిల్ ఎస్. రాయల్ గారి కథాసంపుటి, ‘నాగరికథ’ మీద రాసింది.

సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. ఒక కథ స్వేచ్ఛానువాదం. మూల కథ All You Zombies. రచయిత రాబర్ట్ ఎ. హెయిన్లిన్.  మిగిలిన కథలు వివిధ]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ఉ</span>పోద్ఘాతం:</p>
<p>ఈ సమీక్షావ్యాసం అనిల్ ఎస్. రాయల్ గారి కథాసంపుటి, ‘నాగరికథ’ మీద రాసింది.</p>
<p>సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. ఒక కథ స్వేచ్ఛానువాదం. మూల కథ All You Zombies. రచయిత రాబర్ట్ ఎ. హెయిన్లిన్.  మిగిలిన కథలు వివిధ తెలుగు పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురించబడ్డాయి.</p>
<p>ఈ కథల రచయితదే ఆగస్ట్ 2015లోనే  ‘కథాయణం’ అనే వ్యాససంపుటి వెలువడింది. ఇందులో వ్యాసాలన్నీ ‘కథలు రాయటంలో మెళకువలు’  వివరిస్తూ రాసినవి. ఈ వ్యాససంపుటికి కొనసాగింపుగా కథన కుతూహలం పేరుతో ఇదే రచయిత రాసిన వ్యాసాలతో మరో శీర్షిక ఒక అంతర్జాలపత్రికలో మొదలైంది. మొదటి భాగంగా కథల్లో క్లుప్తత ఎందుకు?ఎలా సాధించాలి? అన్న ఒక వ్యాసం 17.12.2015 తేదీన వెలుగు చూసింది.</p>
<p>ఈ వ్యాసాల్లో ఉన్న సూచనలను ఇతర రచయితల కథలకు, అన్వయించి చూశాను. రెండిటి మధ్యా  పొంతన చాలావరకూ లేదనిపించింది. దాంతో కథాయణంలోనూ-కథనకుతూహలంలోనూ ఉన్న సూచనల ప్రకారం మిగిలిన రచయితల కథలు ఎందుకు లేవు? వాటి ప్రకారం రాసిన కథలు చదివించలేవని ఆ రచయితలు అలా రాయలేదా? లేక వాటి ప్రకారం కథలు రాయటం కష్టమైన పనా? అన్న అనుమానం వచ్చింది. ఆ పెనుభూతాన్ని తరమడం కోసం; ఈ వ్యాసాలను రాసిన రచయిత తాను ఇచ్చిన సూచనల్ని తాను రాసిన కథల్లో ఎంతవరకు, ఎలా పాటించారో తెలుసుకోవాలనిపించింది. అదే ఈ వ్యాసరచనకు ప్రేరణ.</p>
<p>కథాయణాన్ని నాగరికథలో కథలకీ-నాగరికథలో కథలని కథాయణంలో వ్యాసాలకీ  అన్వయించి రాయడం వల్ల ఈ వ్యాసం- ఒక రకంగా చూస్తే ఒక పుస్తకం మీద కాదు-రెండు పుస్తకాల మీద సమీక్ష.</p>
<p>వ్యాసంలో ఎర్రరంగులో ఉన్న వాక్యాలన్నీ కథాయణంలో వ్యాసరచయిత ఇచ్చిన సూచనలు. నలుపురంగులో ఉన్న వ్యాసభాగాలన్నీ సూచనల ఆధారంగా నాగరికథ కథలపై నేను చేసిన పరిశీలనలు.</p>
<p align="center"><strong>కథ</strong><strong> </strong><strong>శీర్షిక</strong><strong> </strong><strong>మీద</strong><strong> </strong><strong>కథాయణంలో</strong><strong> </strong><strong>ఇచ్చిన</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>నాగరికథలో</strong><strong> </strong><strong>అవి</strong><strong> </strong><strong>అమలయిన</strong><strong> </strong><strong>విధానం</strong></p>
<p><span style="color: #ff0000;">1. కథల విషయంలో శీర్షిక వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది.</span></p>
<p>నాగరికథ-కథ ఒక నాగరికత ఎలా అంతమైందో శాస్త్రీయంగా తెల్సుకోటానికి చేసిన ఒక ఊహ. ఈ కథ పేరును  నాగరికత అనో, అదే పదాన్ని నాగరి’కత’ గా చిన్న మార్పుతో రాసో, ‘కత’ ఇతివృత్తం నాగరికత అని అన్యాపదేశంగా తెలియచేయొచ్చు. అయితే కత కన్నా కథ ఎక్కువ వాడకంలో ఉన్న పదం. అందుకని, నాగరి’కత’ లో ‘కత’ ని, ‘కథ’ గా రాస్తే  ‘నాగరికథ’ అయింది. కథకి విభిన్నమైన టైటిల్ అమరింది.</p>
<p><span style="color: #ff0000;">2. శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది.</span></p>
<p>శీర్షిక రెండు విరుద్ధ పదాల మేళవింపు అయితే వెంటనే ఆకట్టుకుంటుంది.  వడ్డెర చండీదాస్ గారి నవల ‘హిమజ్వాల’ వెంటనే గుర్తొచ్చే ఒక ఉదాహరణ. ఈ సంపుటిలో ఒక కథకి పెట్టిన ప్రియశత్రువు అనే పేరు సైతం అలాంటి  మేళవింపు. కథలో ప్రధాన పాత్ర పేరు ‘ప్రియ’. శీర్షికలో ఆ పేరు ఇమడటంతో  కథాంశం ప్రతిఫలించింది.</p>
<p><span style="color: #ff0000;">3. కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే మంచిది.</span></p>
<p>మరో ప్రపంచం కథ,  పారలల్ యూనివర్సెస్ గురించి. తెలుగులో ఆ కథకి పెట్టిన పేరు ఆ ఇతివృత్తాన్ని  సూచించింది. అలానే మిగిలిన రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, మరపురాని కథ-కథల  పేర్లు కూడా.</p>
<p><span style="color: #ff0000;">4. శీర్షిక చూడగానే, అర్థమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి.</span></p>
<p>కుంతీకుమారి కథ, మహాభారతంలో కుంతీదేవిలానే కుమారిగానే తల్లిగా మారిన ఒక స్త్రీ కథ.  కనుక ఈ కథకి  ‘కుంతీదేవి’ అని పేరు పెట్టొచ్చు. అప్పుడు, కథ పెళ్లికి ముందే తల్లి అయిన ఒక స్త్రీ గురించి అనుకొని పాఠకులు ప్రక్కన పడేసేయొచ్చు. కుంతీకుమారి అని కథకి పేరు పెడితే, కుంతికి పుట్టిన కుమారి కథలో పాత్ర అనుకొని; మహాభారతంలో కుంతికి పుట్టింది కర్ణుడు-కుంతికి కొడుకు కాకుండా కూతురు పుట్టటమేమిటి? అన్న ఆలోచనతో కథలోకి పాఠకుడు ఆకర్షించబడొచ్చు. మహాభారతంలో కుంతీదేవి పెళ్లి కాకముందే తల్లి అయింది. కుంతీకుమారి కథలో, ప్రధానపాత్ర తల్లి అయినా కుమారిగానే మిగిలిపోయింది. ఆ దృష్ట్యా కథకి పెట్టిన పేరు, కథాంశాన్ని స్పృశించింది.</p>
<p><span style="color: #ff0000;">5. చాలా మంది ఔత్సాహిక కథకులు చేసే పొరపాటు:  కథలో ప్రధాన పాత్ర పేరునే కథ పేరుగా ఎంచుకోవటం.</span></p>
<p>నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఒక్క కల్కి కథకే, కథలో ప్రధానపాత్ర పేరు కథ పేరుగా ఉంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కథారచయిత తనకు తానే తన కథాయణంలో వివరణ ఇచ్చారు.</p>
<p><span style="color: #ff0000;">6. చప్పగా, సర్వ సాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం. ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంత వరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు.  </span></p>
<p>నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఏ కథకీ సామెతలు పేర్లుగా లేవు. నాకు తెలిసి కథలకి పెట్టిన పేర్లు  ప్రసిధ్ధకథల పేర్లు, ఇతర ప్రసిద్ధ సాహితీ ప్రక్రియల పేర్లు కూడా కావు.</p>
<p><span style="color: #ff0000;">7. కథ పేరు ఎంత పెద్దదిగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం.</span></p>
<p>నాగరికథ-లో ఉన్న కథల్లో; అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలు, రెండు పదాలు ఉన్న పేరు-‘మరపురాని కథ’.  మిగిలిన తొమ్మిది కథల్లో, ఆరు కథలకు ఒక పదమే పేరు. మిగిలిన మూడిటికీ ఒక పదబంధం శీర్షిక.</p>
<p><span style="color: #ff0000;">కొసమెరుపు:</span></p>
<p>8. నాగరికథ కథాసంకలనంలో ఉన్న పది కథల్లో అయిదు కథల పేర్లు అంతకుముందే కొన్ని సినిమాలకు పేర్లుగా వాడబడ్డాయి. రహస్యం (1967), మరపురాని కథ (1967)), మరో ప్రపంచం (1970), శిక్ష (1985), కల్కి (1997) ఆ కథలు ప్రచురించబడటానికి ముందే విడుదలైన తెలుగు చలనచిత్రాల పేర్లు. ఇది యాదృచ్ఛికం కావచ్చు-కాని గమనార్హం. కుంతీపుత్రుడు అనే తెలుగు సినిమా 1993 లో విడుదలైంది.  కథల సంపుటిలో ఒక కథకి పెట్టిన కుంతీకుమారి పేరు అలానే ధ్వనించే పదబంధం. ప్రళయం కథ 2013 లో ప్రచురించబడింది. అదే పేరుతో 2015 లో ఒక తెలుగు సినిమా విడుదలైంది. చిత్రంగా రీబూట్ కంప్యూటర్ కే కాదు చలనచిత్రరంగానికి కూడా చెందిన ప్రక్రియ.</p>
<p align="center"><strong>కథ</strong><strong> </strong><strong>ఎత్తుగడ</strong><strong> </strong><strong>పై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1. అత్యవసరమైతే తప్ప కథని వర్ణనలతో మొదలు పెట్టను. అత్యవసరమైనా కూడా కథని సర్వసాధారణమైన సన్నివేశంతో మొదలు పెట్టను.</span></p>
<p>కథల సంపుటిలో శిక్ష కథ  ఒకటే వర్ణనతో మొదలైంది. దానికి కారణం కథాయణంలో కథారచయిత తనకు తానే వివరించారు.  నాగరికథ, మరో ప్రపంచం, కల్కి,  ప్రియశత్రువు కథలు ఒక సంభాషణతో ఆరంభమయ్యాయి. ప్రళయం కథ ఒక గమనికతో, మరపురాని కథ ఒక భౌతిక చర్యతో మొదలయింది. రీబూట్, రహస్యం కథలు ఒక స్టేట్ మెంట్ తో ప్రారంభించబడ్డాయి. కుంతీకుమారి అనువాదకథ. దాని ఎత్తుగడ మీద అనువాదకుడికి స్వేచ్ఛ లేదు.</p>
<p><span style="color: #ff0000;">2. మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వీలైతే మూడు నాలుగు లైన్లకు మించకుండా. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది.  ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి చదవబోయే కథపై ఉత్సుకత కలిగించాలి.</span></p>
<p>ఒక్క నాగరికథ కథ మాత్రమే ఏడు లైన్లతో మొదలయింది. మరో ప్రపంచం, రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, కుంతీ కుమారి కథలు రెండు లైన్లతోనూ; కల్కి, ప్రియశత్రువు, మరపురాని కథ ఒక లైనుతోనూ మొదలయ్యాయి. ఎత్తుగడతో ఉత్సుకత ఎలా కలిగించవచ్చో అన్నదానికి, నాగరికథ కథ మొదలే ఒక ఉదాహరణ. కల్కి కథ అయితే మరీ క్లుప్తంగా రెండు పదాల్తోనే పాఠకుడ్ని కథలోకి లాక్కు వెళుతుంది. ఆ రెండు పదాలూ “ఇద్దర్ని చంపాలి.”</p>
<p align="center"><strong>కథ</strong><strong> </strong><strong>ముగింపుపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1.A. ఎత్తుగడ భాగంలో, ‘కథని ఎలా మొదలెట్టినా ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అన్న సూచన ఉంది. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి అని చెప్పబడింది. </span></p>
<p><span style="color: #ff0000;">1.B. అవి అరటిపండు వొలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెతుక్కోవటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి. </span></p>
<p>ఉదాహరణకు-నాగరికథ కథ తీసుకుందాం. దీనిలో ఇతివృత్తం టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణం చేయడం గురించి. హైస్కూలు విద్యార్థులకు ఓ అణుశాస్త్రవేత్త ఆ విషయంపై ఇస్తున్న గెస్ట్ లెక్చర్ తో కథ మొదలవుతుంది.  ఒక తాత గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కాలంలో వెనక్కెళ్లి ఆయన్ను చంపెయ్యడం గురించి  కథ మొదటి పేరాలో ప్రస్తావన ఉంటుంది. కాలయంత్రం ద్వారా కాలప్రయాణం  గురించి  పాఠం చెపుతున్న అణుశాస్త్రవేత్తకి వాళ్ల తాతగారి గురించి సెల్ ఫోన్ ద్వారా ఒక వార్త వస్తుంది. క్లాసు అర్ధాంతరంగా ఆగిపోతుంది. తాతయ్య దగ్గరకి హడావిడిగా మనవడి ప్రయాణం మొదలవుతుంది. దీంతో పాఠకుడిలో టైమ్ మెషీన్ గురించీ, అందులో వెనక్కి వెళ్లడం గురించీ, దాంతో పాటు తాతయ్య గురించి వచ్చిన వార్త ఏమిటనే దాని మీదా ప్రశ్నలు మొదలవుతాయి.</p>
<p>ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకుడు తప్పనిసరిగా మిగిలిన కథలోకి వెళతాడు. కథనంలో టైమ్ మెషీన్ ఉందా? లేదా? ఉంటే ఎలా తయారయింది? దాన్ని ఎవరు తయారు చేశారు? అందులో కాలంలో ఎవరైనా వెనక్కి ప్రయాణం చేశారా? వెళ్లింది ఎలా? వెళ్లింది ఎవరు? ఆ ప్రయాణఫలితం ఏంటి? అనే దాని మీద తగినంత సమాచారం ఒక దాని తర్వాత ఒకటి కథకుడు అందిస్తాడు.</p>
<p>ఈ ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు కథలో నేరుగా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి అవసరమైన ఆధారాలు కథలో ఉంటాయి. ప్రత్యక్షపద్ధతిలో తెలిసినవాటిని మనవడు నమ్మడు. కాని నమ్మక తప్పదు. పరోక్షంగా తెలిసిన వాటిని మనవడు నమ్ముతాడో లేదో రచయిత స్పష్టంగా చెప్పడు.  నమ్మాలో వద్దో విశ్లేషించి తెలుసుకోవాల్సింది మనవడూ, అతడితో పాటు మనమూ.</p>
<p><span style="color: #ff0000;">2. A. కథలకి రెండు రకాల ముగింపులుంటాయి. ప్రధానపాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ కథలకి వర్తిస్తుంది. </span></p>
<p><span style="color: #ff0000;">2.B. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధానపాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనావిధానంలో కలిగే పరిణతి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం&#8230;ఇలాంటి విషయంతో ముగుస్తాయి.   </span></p>
<p>నాగరికథ కథ పై రెండు వర్గాల్లో ఏ విభాగానికి చెందినది అనేది అప్రస్తుతం అనుకుంటే; ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో; లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం ఏమిటో; కథ ముగింపు చెప్పాలి.</p>
<p>ఈ కథలో ప్రధాన పాత్ర అణుశాస్త్రవేత్త. అతడిని వేధించే సమస్యా, పాఠకుడిని వేధించే ప్రశ్నల సారాంశం ఒకటే. సూచన 2-A ప్రకారం, ఆ పాత్ర తన సమస్యని పరిష్కరించుకోవటానికి ఆధారం, సూచన 1-B ప్రకారం ఇవ్వాల్సిన  సమాచారం. దాన్ని కథకుడు తాత ద్వారా, మనవడికి అందిస్తాడు. దాన్ని విశ్లేషించి మనవడు ఒక నిర్ధారణకి వస్తాడు. కాని, అదేంటో రచయిత పాఠకులకి చెప్పడు. దాన్ని కథ ముగింపిడికిట్లో పెట్టి, తెరిచి ఏముందో చూసే బాధ్యత పాఠకులకే వదిలేస్తాడు. అది సవ్యమా, సంభావ్యమా అన్నది ప్రశ్న. దానికిక్కడ జవాబు చెప్పటం భావ్యం కాదు.</p>
<p><span style="color: #ff0000;">3. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలో వదిలేస్తే కుదరదు.  కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి.  మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు.</span></p>
<p>నాగరికథ కథలో రచయిత కాడిని పాఠకులతో పాటు తాను కూడా మోసి కంచికి కూతవేటు దూరం దాకా  వచ్చాడు. ఊరు బయట తాను కాడిని వదిలేసి పాఠకులకి మిగిలిన ప్రయాణం ఎలా చెయ్యాలో, గమ్యస్థానం ఎలా చేరాలో చెప్పాడు. తమంతట తాము గమ్యం చేరిన తృప్తి కలగాలంటే ఆ కాస్త దూరం ప్రయాణించాల్సింది పాఠకులే.</p>
<p>కథ చివర్లో ప్రధానపాత్ర ఆలోచనాధోరణిలో ఏం మార్పు వచ్చిందో, ఇక్కడే చెప్పేస్తే, కథ ఇంకా చదవని పాఠకులకి కథ చదువుతున్నపుడు కలిగే ఉత్సుకత మిగలదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. కథకి ముగింపు ఇవ్వడం కోసం, రచయిత ప్రధాన పాత్ర స్వభావాన్ని పూర్తిగా మార్చేయనైతే మార్చేయలేదు.</p>
<p><span style="color: #ff0000;">4. ముగింపు ఎలా ఉండబోతోందో కథనిండా క్లూస్ వదులుతూనే, మరో వైపు పాఠకుడిని మాయచేసి పెడదారి పట్టిస్తూ, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే అసలు ఊహాతీతమైన  ముగింపు.</span></p>
<p>నాగరికథ కథలో మనవడికి కలిగిన అనుమానాల ద్వారా పాఠకులకు అలాంటి క్లూస్ అందాయి. అవి మనవడ్నే కాదు, పాఠకుల్ని కూడా పెడదారి పట్టిస్తాయి. చివర్లో కథ ముగింపు అసలు దారివైపు మళ్లుతుంది. అక్కడ ఏం ఎదురవుతుంది అనేది పాఠకులు ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.</p>
<p><span style="color: #ff0000;">తుది మాట:</span></p>
<p>మిగిలిన తొమ్మిది కథల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడాల్సింది పాఠకులే.</p>
<p align="center"><strong>కథన</strong><strong> </strong><strong>ధోరణులు</strong><strong>-</strong><strong>దృక్కోణం</strong><strong>-1 </strong><strong>లో</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p>              కథాయణం వ్యాససంకలనంలో దృక్కోణం-1, దృక్కోణం-2 అనే రెండు అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాల్లో కథని ఎన్ని ధోరణుల్లో చెప్పొచ్చు అనేది వివరించబడింది. అందులో మొదటి ధోరణి ‘ఉత్తమ పురుష’.</p>
<p>ఉత్తమపురుష కథనంలో కథకుడే స్వయంగా ఒక పాత్ర ధరించి ‘నేను’ రూపంలో కథ చెబుతాడు/చెబుతుంది. పాత్రలు అంతకన్నా ఎక్కువైతే ‘మేము’ కథ చెబుతారు. రచయిత స్వంత రచనలైన తొమ్మిది కథల్లో; రీబూట్, శిక్ష, మరపురాని కథ; కథలు తప్ప మిగిలిన ఆరు కథలూ ‘ఉత్తమపురుష’ లో చెప్పినవి.</p>
<p>వ్యాసంలో ‘ఉత్తమపురుష’ కథనం ఎలా సాగాలి అన్న విషయం మీద కొన్ని సూచనలు ఉన్నాయి.</p>
<p><span style="color: #ff0000;">1. ఉత్తమపురుషలో కథ చెప్పేప్పుడు ‘నేను’ అనబడే కథకుడు, తన గురించి తాను వర్ణించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ఆకార విశేషాల, వేషభాషల వివరణ కథనానికి అత్యంత అవసరమైతే తప్ప చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పరోక్షవర్ణనకి దిగటం మెరుగు (వేరే పాత్ర ద్వారా సంభాషణలో చెప్పించటం, అద్దంలో పరికించి చూసుకోవటం, వగైరా). </span></p>
<p>ఏడు కథల్లో, ‘ప్రియశత్రువు’ తప్ప; ఏ కథలోనూ ‘నేను’ గురించి వర్ణన లేదు. ‘ప్రియశత్రువు’ కథలో, తన కథ పాఠకులకు చెప్పే ‘నేను’ ప్రధాన పాత్ర.  ఆమె ఎలా ఉంటుంది? అనేది ఆ కథకు ఆయువుపట్టు.  ఆ దృష్ట్యా ఆ కథకి ఆ పాత్ర రూపురేఖల వర్ణన అత్యవసరమైంది. అయితే రచయిత ఆ పని నేరుగా చేయలేదు. పరోక్షమార్గంలో-డాక్టర్ లక్ష్మణ్ ద్వారా ప్రధాన పాత్ర కి అద్దం చూపించి ఆమె రూపురేఖలని వర్ణించాడు.</p>
<p>రహస్యం కథలో ప్రొఫెసర్ గురించి అన్ని వ్యక్తిగత/వృత్తిగత విషయాల్నీ (పేజీలు 70, 71) ‘నేను’-అనే ప్రధానపాత్ర పాఠకులకి తెలియపరుస్తుంది. అవి అతడికి సాధారణంగా తెలిసి ఉండకూడని విషయాలు. అతడికి ఎలా తెలుసు? అని పాఠకుడు ప్రశ్నించేలా చేసే విషయాలు. అందుకని, కథలో నేను ‘ఇదంతా నాకెలా తెలుసు?’ అని ప్రశ్నించుకుంటాడు. ‘నేనో ఇంటిలిజెన్స్ ఏజంట్ ని కాబట్టి.’ అని తనకి తానే జవాబిచ్చుకుంటాడు. అది అతడికే కాదు, ఆ అనుమానం వచ్చిన పాఠకులకు సైతం జవాబు.</p>
<p><span style="color: #ff0000;">2. ప్రధానపాత్రకి తెలిసిన విషయాలు, కథకి కీలకమైనవి, సస్పెన్స్ పోషించటానికో లేక ముగింపు దాకా పాఠకుల్ని మభ్యపెట్టటానికో ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టకూడదు.</span></p>
<p>కథ చెబుతున్న ‘నేను’ అనబడే వ్యక్తి పురుషుడా, మహిళా, చిన్నపిల్లవాడా, ముదుసలా&#8230; ఇటువంటి వివరాలు వీలైనంత త్వరగా పాఠకులకి చేరవేయాలి (ఆ వివరం దాచటం కథకి కీలకమైతే తప్ప).</p>
<p>నాగరికథ లో ‘నేను’ అనబడే అణుశాస్త్రవేత్త పురుషుడనేది ‘మనవడా’ అనే తాత పిలుపుతో తెలుస్తుంది. మరో ప్రపంచంలో ‘నేను’ పురుషుడా, స్త్రీ యా అనేది ‘నేను నాస్తికుడిని కాను’ అనటంతో,  కల్కి లో ‘భారతీయుడివి కాబట్టి’ అనటంతో, రహస్యంలో ‘అపరిచితుడికి’ అనుకోవటంతో, ప్రళయంలో ‘నేనొక్కడినే బతికున్నానా’ అనే స్వగతంతో, ప్రియశత్రువు లో ‘మిస్ ప్రియా’ అనే పిలుపుతో, కుంతీ కుమారిలో ‘సరిగా నా ఎత్తుంటాడు’ అనటంతో తెలుస్తుంది.</p>
<p>మరో ప్రపంచం కథలో, ‘నేను’ ఎవరనేది ఆలస్యంగా చెప్పబడ్డా, కథకి గీసిన బొమ్మ ఆ ‘నేను’ మగా ఆడా అనేది ముందే చెప్పేసింది. కల్కి, రహస్యం, ప్రళయం కథల విషయంలో కూడా అదే జరిగింది.</p>
<p>ప్రియశత్రువు కథకి గీసిన బొమ్మలో, ఇద్దరు స్త్రీల/ఒక పురుషుడి బొమ్మలు ఉన్నాయి. అందుకని ‘నేను’ ఎవరనేది చెప్పటంలో ఆలస్యాన్ని బొమ్మ సర్దుబాటు చేయలేకపోయింది.</p>
<p>రహస్యం, ప్రళయం కథల్లో ‘నేను’ ఎవరో చెప్పటంలో జరిగిన ఆలస్యానికి;   ఒక ‘ఇంటిలిజెన్స్ ఏజంట్’, ఒక ‘దొంగ’ మగ కాకుండా ఆడ అయి ఉంటారా? అన్న ప్రశ్న ఒక సమాధానం కావచ్చు. అది సహేతుకం కాదు.</p>
<p>B) ఉత్తమపురుష కథనంలో ‘మేము’ తరహా కథనం గురించి వ్యాసరచయిత చెప్పింది నిజమే! ఆ ధోరణిలో వచ్చిన తెలుగు కథ ఏదీ నేను కూడా చదవలేదు. సాహితీమిత్రులెవరైనా ‘మేము’ పరంగా రాయబడ్డ  కథ ఏదైనా తెలుగులో ఉంటే దాని వివరాలు తెలియపరిస్తే ఆ కథనం తో సాగిన కథలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు.</p>
<p align="center"><strong>కథన</strong><strong> </strong><strong>ధోరణులు</strong><strong>-</strong><strong>దృక్కోణం</strong><strong>-2 </strong><strong>లో</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p>              రెండో రకం కథనం మధ్యమపురుష.  ఉత్తమపురుష కథనంలో కథ ‘నేను’ పరంగా చెప్పబడితే; మధ్యమ పురుష కథనంలో కథ ‘నువ్వు’ పరంగా చెప్పబడుతుంది. వ్యాసంలో చెప్పినట్లు ఈ పద్ధతిలో రాసిన కథలు ఎక్కువగా మనకు ఎదురుపడవు. నాకు తెలిసి ఆ పద్ధతిలో చెప్పబడ్డ కథ వి. ప్రతిమ గారు రాసిన ‘విత్తనం’.</p>
<p>మిగిలిన మూడో రకం కథనం-ప్రథమపురుష. అందులో 1. పరిమిత ప్రథమపురుష 2. సర్వజ్ఞ ప్రథమపురుష 3. బాహ్య ప్రథమపురుష అని మూడు ధోరణులున్నాయి.</p>
<p>నాగరికథ కథాసంకలనంలో ఉన్న-రీబూట్, శిక్ష, మరపురాని కథ; ఈ మూడు ధోరణులనీ ఉపయోగించి రాసినవి. దాంతో తాను రాసిన తొమ్మిది కథల్లోనే,  ‘మధ్యమపురుష’ తప్ప మిగిలిన అన్ని ధోరణుల్లో రచయిత తన కథల్ని చెప్పినట్లైంది.</p>
<p><span style="color: #ff0000;">పరిమిత ప్రథమ పురుష:</span></p>
<p><span style="color: #ff0000;">1. ఈ ధోరణిలో ఒక పాత్ర (సాధారణంగా ప్రధాన పాత్ర) కోణానికి పరిమితమై కథ నడుస్తుంది.  </span></p>
<p>ఈ ధోరణిలో చెప్పబడ్డ కథ ‘రీబూట్’ లో ప్రధాన పాత్ర విక్రమాదిత్య. కథని జాగ్రత్తగా చదివితే కథ మొత్తం ఈ పాత్ర ఆధారంగా నడవటం గమనించవచ్చు.</p>
<p><span style="color: #ff0000;">2. ఈ తరహా కథనంలో -ప్రధానపాత్ర బుర్రలో బంధించబడకపోవటం వలన, ఆ పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు కూడా, పరిమిత స్థాయిలో కథకుడికి తెలుస్తూ ఉంటాయి. ఆ వివరాలు అవసరమైనప్పుడు బయటపెడుతూ, అవసరం లేదనుకున్నప్పుడు తొక్కిపడుతూ కథనంలో ఉత్కంఠ నింపుతాడు రచయిత. </span></p>
<p>రీబూట్ కథలోకి ఐజక్ పాత్ర ప్రవేశించటానికి ముందు 54, 55 పేజీల్లో ఉన్న సమాచారమూ, కేథరిన్ పాత్ర ప్రవేశం జరిగిన తర్వాత ఆమెతో విక్రమాదిత్య 55 నుంచి 60 వ పేజీ వరకూ ప్రస్తావించిన వివరాలూ; కథకుడు విక్రమాదిత్య పాత్ర ద్వారా అవసరాన్ని బట్టి బయట పెట్టినవే.</p>
<p><span style="color: #ff0000;">సర్వజ్ఞ ప్రథమ పురుష:</span></p>
<p><span style="color: #ff0000;">3. ఈ విధానంలో-కథకుడు ఓ సర్వజ్ఞుడిలా వ్యవహరిస్తాడు. తన కథాపరిధిలో, తాను సృష్టించిన ఊహాలోకంలో, ఎక్కడ ఏమి జరుగుతుందో అన్నీ అతడికి తెలుస్తాయి.</span></p>
<p>శిక్ష-కథ, సర్వజ్ఞ ప్రథమపురుష విధానంలో రాసిన కథ. కథాస్థలం-బండరెడ్డి పోలీసుజీపులో నుంచి గమ్యం చేర్చే వాహనంలోకి ఎక్కించబడేంత వరకూ. కథలో సమాంతరంగా చిత్రించబడ్డ ఊహాలోకం పరిధి, శివారు గ్రామం నుంచి బండరెడ్డి చేరాల్సిన చోటు లోపలి వరకూ. అందులో ఏం జరుగుతోందీ రచయితకి తెలుస్తోంది. అవన్నీ కథకుడు కళ్లకు కట్టినట్లు వర్ణించగలగటానికి కారణం అదే.</p>
<p><span style="color: #ff0000;">4. ఈ తరహా కథనంలో ఏ పాత్ర మదిలో ఏముందో కూడా కథకుడికి తెలుస్తుంది. ఇక్కడ అతడు ఏ పాత్ర పక్షమూ వహించడు. కథ ఏదో ఒక పాత్ర కోణంనుండి మాత్రమే చెప్పడు. అతడికి అందరూ సమానమే.</span></p>
<p>అందువల్లే కథలో; రకరకాల వ్యక్తులు, ప్రేమజంటతో సహా కథకుడికి ఎదురవుతారు. వాళ్ల మనసులో ఏముందో కూడా  తెలుస్తుంది. అందుకే వాళ్లెలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది చెప్పగలుగుతాడు.</p>
<p><span style="color: #ff0000;">5. ఈ ధోరణిలో చెప్పిన కథల్లో కథకుడికి, పరిమితులు, హద్దులు ఉండవు. అతడు అన్ని ప్రదేశాల్లోనూ, అందరి మనసుల్లోనూ ఏక కాలంలో ఉండగలిగే సర్వేశ్వరుడి వంటివాడు.</span></p>
<p>కథకుడికి పరిమితులూ, హద్దులూ లేని మాట కూడా వాస్తవమే.  అందుకే కథలో డ్రైవరూ, మేజరూ ఏం మాట్లాడుకుంటున్నదీ, చనిపోయిన శ్రీను గురించి బండరెడ్డి ఏం ఆలోచిస్తున్నదీ, శ్రీను ఉరి తీసుకున్న  సంఘటనపై ఎలా ఆందోళన జరిగిందీ, అది ఎలా సమసిపోయిందీ, సంబంధిత మంత్రి ఏమనుకుంటోందీ, సీనియరు మోస్ట్ చకోర పక్షి మనసులో ఏముందీ అన్నీ కథకుడు గ్రహించగలడు. కూలంకషంగా పాఠకుడికి వినిపించగలడు.</p>
<p><span style="color: #ff0000;">6. ఈ విధానంలో కథ రాసినప్పుడు ఒక పాత్ర కోణం నుండి మరో పాత్ర కోణానికి మారే క్రమంలో జాగరూకత వహించక పోతే, Head Hopping అనే తలతిరుగుడు సమస్య వచ్చి పడుతుంది.</span></p>
<p>సూచనలో చెప్పిన జాగ్రత్త పాటించటానికే, కథలో ఒక బండరెడ్డిని మినహాయించి మిగిలిన ఏ పాత్ర గురించీ రచయిత ఎక్కువగా చిత్రీకరించడు. కథాక్రమంలో వాళ్లు కనపడ్డపుడు వాళ్ల గురించి భౌతికంగా, మానసికంగా తనకి ఏం తెలిసిందో, తెలుస్తున్నదో అంతవరకే చెప్పి వదిలేస్తాడు. అలాంటి పాత్రలకి కథలో పునఃప్రవేశం కల్పించే ప్రయత్నం సుతరామూ చేయడు. దానికి నిదర్శనం ప్రేమికుల జంటా, పోలీసుజీపు ప్రస్తావన వచ్చినప్పుడు కనపడ్డ జీపు డ్రైవరూ, కానిస్టేబులూ; కథలో తర్వాత కలికానిక్కూడా కనపడకపోవటం.</p>
<p><span style="color: #ff0000;">బాహ్య ప్రథమ పురుష:</span></p>
<p><span style="color: #ff0000;">7. ఈ పద్ధతిలోనూ కథకుడు సర్వజ్ఞుడే. అతడికి తెలియని విషయాలుండవు. కాకపోతే, వాటిని మన కళ్లకి కట్టే క్రమంలో అత్యంత సంయమనం పాటిస్తాడు. ఏ పాత్ర పట్లా పక్షపాతం చూపించడు. ఎవరి మనసుల్లోకీ తొంగిచూడడు. అందరికీ సమాన దూరంలో నిలబడి చూసింది చూసినట్లు మనకి చెప్పుకుపోతాడు. పాత్రల చర్యలకి, ప్రతిచర్యలకి ఉద్దేశాలు ఆపాదించడు. విలువలు కట్టడు. తీర్పులీయడు. జరిగిందిది. దీన్నెలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం-అంటూ పాత్రల చేతల్ని అంచనా వేసే భారం పాఠకుల పైకే నెట్టేస్తాడు.</span></p>
<p>మరపురాని కథ- బాహ్య ప్రథమపురుష విధానంలో రాయబడ్డ కథ. కథలో ఉన్నవి ముచ్చటగా మూడే మూడు పాత్రలు. వృద్ధుడూ, అతని భార్యా, యువకుడు. గోవా వనిత, యువకుడి భార్య గురించి సంబంధిత పాత్రలూ స్మరిస్తాయి. కాని, వాళ్లు కథలో ప్రత్యక్షమవ్వరు. వృద్ధుడి భార్య పాత్ర; కథ మొదట్లో కనపడి, ఆమె ఇంటికి యువకుడి రాకడతో నిష్క్రమించి, అతడు వెళ్లే సమయానికి పునఃప్రవేశం చేస్తుంది. ఆమె పోకడకీ, రాకడకీ మధ్య; వృద్ధుడికీ, యువకుడికీ మధ్య జరిగిన సంభాషణే కథకి ఆయువు పట్టు.  ముందుగా వృద్ధుడు ఏ గతసంఘటన తనను నిర్విరామంగా వేటాడుతున్నదీ యువకుడికి వివరిస్తాడు. ఆ తర్వాత యువకుడు తనని వెంటాడుతున్న సంఘటన గురించి చెప్పి దాంతో వృద్ధుడికేం సంబంధమో చెప్తాడు. ఈ క్రమంలో కథకుడు, జరిగిన దానికి ప్రత్యక్షసాక్షి అయినట్లు కథనం సాగిస్తూ, అంతవరకే పరిమితమవుతాడు. వృద్ధుడి మానసిక స్థితి పట్లా, యువకుడి సానుభూతి పట్లా మనకు ఒక అవగాహన కలిగించి, వాళ్ల పట్ల మనకు ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం అందించి, ఏం జరుగుతుందో జరగనీ అని నేపథ్యం నుంచి మనవైపు చూస్తుంటాడు. ఇలా అర్థం చేసుకో, అలా అపార్థం చేసుకోకు లాంటి సూచనలు మనకి అందించడు.  బాహ్య ప్రథమపురుష విధానంలో జరగాల్సింది అదే. కథకుడు జరిపిందీ అదే.</p>
<p><span style="color: #ff0000;">8. కథకుడు పాత్రల బుర్రల్లోకి ఎడాపెడా దూరేయకుండా వెలుపలే నిలబడి కథ చెబుతున్నాడు కాబట్టి ఇక్కడ Head Hopping సమస్య ఉండదు.</span></p>
<p>మరపురాని కథ-కథలో ఉన్నవి పైన చెప్పినట్లు మూడే పాత్రలు. వాటి ప్రవర్తన వాటి మనస్తత్వానికి అనుగుణంగా ఉంటుంది. రచయిత ప్రమేయం ఎక్కడా కనపడదు. అందుకే  Head Hopping సమస్యే ఉత్పన్నం కాదు.</p>
<p><span style="color: #ff0000;">9. రచయిత పాత్రల ఆలోచనల్ని ప్రత్యక్షంగా వెలిబుచ్చకుండా, వాటి చేతలు, శరీర భాష, సంభాషణ ద్వారా ఆయా పాత్రల చిత్రీకరణ చేస్తాడు. సన్నివేశాల రూపకల్పన, సంఘటనలు, వాటి వర్ణన ఇక్కడ కీలకమైనవి. అందువల్ల ఈ విధానంలో కథ చెప్పేటప్పుడు నాటకీయతకి పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. ఈ రకమైన కథని చెప్పటం కాదు, చూపటం ముఖ్యం.</span></p>
<p>మరపురాని కథ- కథ మొత్తంలో వృద్ధుడి వర్ణనకీ, యువకుడి పాత్రపోషణకీ వెరశి ఇద్దరి హావభావ వ్యక్తీకరణకి ఖచ్చితంగా అదే క్రమంలో కథకుడు వాడిన విశేషణాలని పరిశీలించండి. ఏడో పేరాలో చెప్పిన సంఘటనాక్రమాన్ని పాత్రపరంగా ఈ విశేషణాలకి అన్వయిస్తూ ముందుకు జరగండి.</p>
<p>మిగతా నేరేషన్ అంతా చదవకుండానే; కథ మొదలైనపుడు వాళ్ళిద్దరూ  ఏ మానసిక స్థితిలో ఉన్నారు, ఏ స్థితినుంచి ఏ స్థితికి స్విచ్ ఓవర్ అయ్యారు, తమ తమ నేరేషన్ ముగిసేసరికి ఏ దశలో ఉన్నారు అనేది కళ్లకు కట్టినట్లు మనముందు ప్రత్యక్షమవుతుంది. అలాగే  పాత్రల మధ్య సంభాషణ కొనసాగిన విధానం, ఎదుటిపాత్ర ప్రతిస్పందన కూడా కనపడతాయి. 127, 128 వ పేజీలో వృద్ధుడి నేరేషన్, 129 పేజీలో యువకుడి నేరేషన్ నిశిత దృష్టితో  చదవండి. జరిగిన సంఘటనల వర్ణనలో, ఎంత నాటకీయత (మెలో డ్రామా అనాలేమో) పాత్రల ద్వారా, కథకుడు చొప్పించాడో తెలుస్తుంది.  ఇవన్నీ సమపాళ్లలో సమకూడటం వల్ల  కథకుడు ఓ కథని మనకు చెప్పినట్లనిపించదు. ఒక సంఘటనని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.</p>
<p><span style="color: #ff0000;"><strong>కొసమెరుపు</strong><strong>: </strong></span><strong></strong></p>
<p>మరపురాని కథ, కథ నిర్మాణానికి వృద్ధుడి జీవితంలోనూ, యువకుడి గతంలోనూ జరిగిన సంఘటనలే పునాది. ఆ సంఘటనల్లో ఉన్న ఈ క్రింది సామ్యతలు, కథాంశం బలంగా ఉండటానికి కారణాలను చెప్పకనే చెపుతాయి.</p>
<p><span style="color: #000000;">             </span><span style="color: #ff0000;"><span style="color: #000000;"> 1.  ఒక ప్రాణాపాయస్థితిలో ఉండి తమ సహాయం కోసం ఎదురు చూసిన వ్యక్తి వృద్ధుడి గతంలోనూ, యువకుడి గడచిన జీవితంలోనూ ఉన్నారు. 2. సంబంధిత సంఘటనలు వాళ్లిద్దరినీ వెంటాడి వేటాడుతాయి. 3.  రెండు సంఘటనల్లోనూ సహాయం కోసం మొదట ఎదురుచూసింది స్త్రీలే. తర్వాత పురుషుడి రూపంలో వృద్ధుడు.  4. అవసరంలో ఉన్న వ్యక్తిని చూస్తున్నపుడు వృద్ధుడి మనసులోనూ, యువకుడి మనసులోనూ ఉంది; జీవిత భాగస్వామే!  5. రెండు సంఘటనలూ ఒక ఆక్సిడెంట్ తాలూకు ఫలితాలే. ఈ సామ్యతలవల్లనే వృద్ధుడి అవసరమేంటో యువకుడు సరిగ్గా గ్రహించగలిగాడు. తదనుగుణంగా ప్రవర్తించగలిగాడు.  </span>   </span></p>
<p align="center"><strong>సంభాషణలపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>: </strong><strong>అవి</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకూ</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1. A) సంభాషణలతో పాటుగా, ఆయా పాత్రలు ఏం చేస్తున్నాయి, వాటి ముఖాల్లో ఏమేం భావాలు పలుకుతున్నాయి, చుట్టూ ఏం నడుస్తుంది వంటి వివరాలు కూడా రాస్తే ఆ పాత్రలు మరబొమ్మల్లా కాకుండా మనుషుల్లా ప్రవర్తించినట్లనిపిస్తుంది. సందర్భానుసారంగా పాత్రల శరీరభాష, ముఖకవళికలు సూచించే వాక్యాలు వాడటం వల్ల; సన్నివేశానికి అభినయం జతపడి కథనం వేగవంతమైన భావన కలగచేస్తుంది.</span></p>
<p>ప్రియశత్రువు కథలో 111, 112 పేజీల్లో నేను, డాక్టర్ లక్ష్మణ్ మధ్య జరిగిన సంభాషణ గమనించండి.  కథలో- ‘నేను’ కి  వైద్యం చేసిన డాక్టర్ లక్ష్మణ్. ఆమె ఉన్న గదిలోకి వచ్చినప్పటినుంచీ ఎలా మాట్లాడాడు, మాట్లాడుతూ ఏం చేశాడు, ‘నేను’ రియాక్షన్స్ ఏంటి? కలగలిపి కథలో చెప్పబడ్డాయి. ఆ కారణంగానే ఆ సంభాషణ రెండు పాత్రల మధ్య కాకుండా, ఇద్దరు వ్యక్తుల మధ్య నిజంగా జరిగినట్లు అనిపిస్తుంది.</p>
<p><span style="color: #ff0000;">1. B) సంభాషణలన్నిట్నీ ‘అతను చెప్పాడు’, ‘ఆమె అన్నది’ వంటి tags తో ముక్తాయించటం బాగోదు.</span></p>
<p>ప్రియశత్రువు కథలో-తప్పకుండా-అనే పదంతో మొదలై, ర్యాంప్ వాక్స్ దశలోనే ఉన్నాను-తో ముగిసే మాటలవరకూ (పేజీలు 111,112); ఎలాంటి భౌతికచర్యలూ కథనంలో కనపడవు.</p>
<p>మరో విశేషం ఏంటంటే డాక్టర్ తన గదిలోకి వచ్చి చేసిన పనులు (పేజీ 111), ప్రతిరోజూ అతను ఆ గదిలోకి వచ్చినప్పుడు క్రమం తప్పక అలానే చేస్తాడు అనిపించేలా ఉండటం. దాంతో, డాక్టర్ ఒక నియమబద్ధమైనప్రవర్తనకి అలవాటు పడ్డ వ్యక్తి అనే అభిప్రాయం పాఠకుడికి తప్పనిసరిగా కలుగుతుంది. (ఈ రకంగా సూచించటం అనేది, అసలు సూత్రంలో చెప్పబడని అంతస్సూత్రం)</p>
<p><span style="color: #ff0000;">2. A) ఒకే పాత్రతో ఎక్కువసేపు మాట్లాడించకూడదు. మీ పాత్రలు ఒక్కో విడతలో పేరాలకి పేరాలు (ఇంకా ఘోరంగా, పేజీలకి పేజీలు) మాట్లాడేస్తూ పోతే పాఠకులు విసిగెత్తిపోతారు. అలాగే మీ పాత్రలు కూడా అదే పనిగా మాట్లాడుతూ పోకూడదు. రెండో పాత్ర కూడా నోరు విప్పుతుండాలి. లేదా, కనీసం తలాడించటమో, ప్రశ్నలేయటమో, ఊ కొట్టటమోనన్నా చేయాలి. ఒకే పాత్రతో ఎక్కువసేపు మాట్లాడించి తీరాల్సిన అవసరం పడితే ఆ సంభాషణని భాగాలుగా విడగొట్టి మధ్యమధ్యలో అభినయం, ఇతర వర్ణనలు జత చేయాలి.</span></p>
<p>ప్రియశత్రువు కథలో 116 వ పేజీ నుంచి 120 వ పేజీ దాకా జరిగింది; డాక్టర్-అతడి పేషంట్ మధ్యా జరిగిన సంభాషణ. ఈ సంభాషణ ద్వారా డాక్టర్, తన పేషంట్ ఏ సమస్యతో బాధపడుతుందో ఆమెకి వివరించాడు. ఆ వివరణ అంతా ఏకపక్షంగా సాగితే చదవటం పాఠకుడికి విసుగు కలుగుతుంది. అందుకనే  పేషంట్ ప్రశ్నలనీ, ఆమె ప్రతిచర్యలనీ మధ్యలో చొప్పించి డాక్టర్ ఇచ్చిన మొత్తం వివరణని రచయిత పఠనీయంగా మార్చాడు.</p>
<p><span style="color: #ff0000;">B)  ఇక, ప్రతి పాత్రా చెప్పే సంభాషణకీ ఒక పేరాగ్రాఫ్ కేటాయించాలి.</span></p>
<p>ప్రియశత్రువు కథలో డాక్టరుకూ, పేషంటుకూ మధ్య జరిగిన సంభాషణలో ఇద్దరి మాటలకూ కథ పొడుగూతా విడి పేరాగ్రాఫ్ లు ఉన్నాయి. ఇదే పద్ధతి మిగిలిన కథల్లో సైతం ఉంది.</p>
<p><span style="color: #ff0000;">3. A) పదేళ్ల పిల్లవాడు మాట్లాడే మాటలు, అరవయ్యేళ్ల వృద్ధుడు మాట్లాడే మాటలు ఒకేలా ఉండవనీ; ప్రపంచమ్మీద వాళ్లకుండే అవగాహనలోనే కాదు, వాళ్లిద్దరి vocabulary లో కూడా చాలా తేడా ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.</span></p>
<p>నాగరికథ కథలో, తాను ఎలా టైమ్ ట్రావెల్ చేశాడో, ఒక నాగరికతకి ఏమైందో, తాత మనవడికి వివరిస్తాడు. తాత అంటేనే వృద్ధుడు. మనవడంటే ఆయనకన్నా యువకుడు. తాత పురావస్తు శాఖలో ఇంజనీర్. మనవడు అణుశాస్త్రవేత్త. కథలో తాతయ్య, మనవడితో మాట్లాడుతూ వాడిన పదాలు చూడండి. అవన్నీ వారిద్దరి అనుబంధానికి అనుగుణంగా ఉంటాయి. (ఆ పదాలు  italics లో, underline చేసి ఉన్నాయి).  బ్రాకెట్లలో ఉన్నవి పేజీ నంబర్లు.</p>
<p>1. దేరార్ నో కోయిన్సిడెన్సెస్ <em><span style="text-decoration: underline;">మనవడా</span></em> (14) 2. నేను పోయాక నీకా రహస్యం తెలిసే ఏర్పాటు <em><span style="text-decoration: underline;">చేశాలేరా</span></em>&#8230;(15) 3. పేపర్లలోనూ పుస్తకాల్లోనూ చదివేది నిజం <em><span style="text-decoration: underline;">కాదురా</span></em> (16) 4. <em><span style="text-decoration: underline;">అవునోయ్</span></em><em><span style="text-decoration: underline;">.</span></em> పిరమిడ్స్ ని ఏలియన్స్ కట్టుండొచ్చు కదా (16) 5. మన నమ్మకాలకి విరుద్ధం అనిపించినంత మాత్రాన అన్ని ఐడియాలనీ కొట్టి <em><span style="text-decoration: underline;">పారేయకూడదోయ్</span></em>(16).</p>
<p>ఇదే తాత మరో చోట తన ‘పురావస్తుశాఖ ఇంజనీర్’ హోదా లోకి ప్రవేశిస్తాడు. తనకున్న పరిజ్ఞానంతో ఒక విషయాన్ని మనవడికి వివరిస్తాడు. అప్పుడు దానికి తగ్గ పదాలు ఉపయోగించి, సంభాషణ ధోరణి మారుస్తాడు. దాంతో, ఆ పాత్రకి ఉన్న మరో కోణం మన ముందు ఆవిష్కృతమవుతుంది. ఈ ఉదాహరణ చూడండి.</p>
<p>“యస్. భారీ నక్షత్రాలు పేలిపోవడాన్ని సూపర్ నోవా అంటారు. సూపర్ నోవా కేంద్ర స్థానంలో సూక్ష్మ పరిమాణంలో ఉండే పదార్థాన్ని డార్క్ మ్యాటర్ అంటారు. ఆ డార్క్ మ్యాటర్ చుట్టూ ఆవరించి ఉండేదే సింగ్యులారిటీ.  సింగ్యులారిటీ గాఢత కొంత తగ్గించి బ్లాక్ హోల్ బదులు మైక్రో స్కోపిక్ వర్మ్ హోల్-అంటే అతి సూక్ష్మమైన కాలబిలం-ఒకటి సృష్టిస్తే దాని ద్వారా కాలంలో ముందుకీ వెనక్కీ ప్రయాణించొచ్చు. ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం చెప్పే విషయం ఇది.”&#8230; పేజీ 18.</p>
<p><span style="color: #ff0000;">B) మీ పాత్ర నేపథ్యం, దాని వృత్తి ఇత్యాదివన్నీ పరిగణనలోకి తీసుకొని దానికో స్పష్టమైన స్వరం అమర్చాలి.</span></p>
<p>ప్రళయం కథలో శ్రీ చండీ అమ్మ వారి ఆలయంలో ఒక రాత్రి ఏం జరిగిందో పూజారి, దొంగకి వివరిస్తాడు.  ఈ సంభాషణలో పూజారి గారు వాడిన భాషా, ఆయనకే స్వంతమైన కొన్ని ఊతపదాలూ ఏంటో చూడండి.</p>
<p>“ఇంకా తెలీదా <em><span style="text-decoration: underline;">నాయనా</span></em>? ఆరో గదిలో బంగారుబొమ్మ రూపంలో <em><span style="text-decoration: underline;">అమ్మవారు</span></em><em></em><em><span style="text-decoration: underline;">వెలిశారు</span></em><em><span style="text-decoration: underline;">.</span></em>” ఆయన వింతగా చూస్తూ చెప్పారు&#8230;పేజీ 101</p>
<p>“ఎవడో <em><span style="text-decoration: underline;">దొంగవెధవ</span></em><em></em><em><span style="text-decoration: underline;">నాయనా</span></em>. రాత్రి నేలమాళిగలో చొరబడి గది తలుపులు తెరిచాడు <em><span style="text-decoration: underline;">త్రాష్టుడు</span></em>. వాడి <em><span style="text-decoration: underline;">శ్రాద్ధం</span></em><em></em><em><span style="text-decoration: underline;">పెట్ట</span></em>. తెల్లారి సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూస్తే <em><span style="text-decoration: underline;">అమ్మవారి</span></em> విగ్రహం కనపడింది. <em><span style="text-decoration: underline;">అపచారం</span></em><em></em><em><span style="text-decoration: underline;">ఉపశమించటానికి</span></em><em></em><em><span style="text-decoration: underline;">శాంతి</span></em><em></em><em><span style="text-decoration: underline;">జరిపిస్తున్నాం</span></em><em><span style="text-decoration: underline;">. </span></em>“ &#8230;పేజీ 101.</p>
<p><span style="color: #ff0000;">4. మాటకి మాటే ఎప్పుడూ ప్రతిస్పందన కానవసరం లేదు. కొన్నిసార్లు మౌనం వంద మాటల పెట్టవుతుంది. పాత్రలు మాటల ద్వారానే కాదు, అప్పుడప్పుడూ మాట్లాడకుండా ఉండటం ద్వారా కూడా అర్థవంతంగా సంభాషించగలవని గుర్తు పెట్టుకోండి. </span></p>
<p>కుంతీకుమారి కథలో 137 వ పేజీలో కుంతీకుమారి తనకున్న అంగవైపరీత్యమేమిటో బార్ టెండర్ కి వివరిస్తుంది. ఆ వైనం విన్న బార్ టెండర్ తన విస్మయాన్నీ, దిగ్భ్రాంతినీ మాటల్లో వివరించలేడు. అందుకే దాన్ని  రచయిత చుక్కలతోనూ, ప్రశ్నార్థకాల్తోనూ, చివరికి అయ్యో అన్న ఒక్క పదంతోనూ వివరిస్తాడు.</p>
<p><span style="color: #ff0000;">5. A) సంభాషణలకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం-ఇండెంటేషన్. సరైన ప్రదేశాల్లో విరామ చిహ్నాలు వాడాలి. హైఫన్, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, మూడు చుక్కలు (&#8230;) వగైరా వాడకంలో ప్రామాణికత పాటించాలి.  </span></p>
<p><span style="color: #ff0000;">5. B) సంభాషణలు రాసేటప్పుడు సాధారణంగా అందరూ పాటించే పద్ధతి ఒకటుంది: సంభాషణల్ని (“) మధ్యలో ఉంచి, సంభాషణలో మరో సంభాషణ దొర్లితే దాన్ని సింగిల్ కొటేషన్స్ (‘) మధ్యలో ఉంచటం. </span></p>
<p>మరపురాని కథ-కథ 124వ పేజీలో: “సరిగా చెప్పావు. ‘బతుకుతుంటారు’ అని కాదు. అనుక్షణమూ&#8230;” దగ్గర్నుంచి ఆయన ముఖం వేదనా భరితమయింది-దాకా అన్న వాక్యాలు చూడండి.  వృద్ధుడి మాటలు ఇన్వర్టెడ్ కామాల్లో ఉన్నాయి. వృద్ధుడు కోట్ చేసిన యువకుడి మాటలు సింగిల్ కోట్స్ లో ఉన్నాయి.</p>
<p>ప్రియశత్రువు కథ 111 వ పేజీలో: “మీరేం చేస్తారు? మీ జీవనాధారం ఏమిటి?“ అన్న వాక్యాలు చూడండి. డాక్టర్ లక్ష్మణ్, ‘నేను’ ని అడిగిన ప్రశ్నలకి ప్రశ్నార్థకాలు తప్పనిసరిగా వాడబడ్డాయి.</p>
<p>రీబూట్ కథ 53 వ పేజీలో: బయట-కనుచూపు మేరంతా బూడిద వర్ణం అనే వాక్యం చూడండి. బయట అని, కథకుడు బయటికి చూడటానికి సమయం ఇచ్చేందుకు హైఫన్ ఉంది.</p>
<p>నాగరికథ కథ 13 వ పేజీలో: అప్పుడు మళ్లీ మీరు కాలప్రయాణం చేసి, మీ తాత గార్ని చంపేసే అవకాశం ఉంది. అంటే&#8230; అనే వాక్యం చూడండి. వాక్యం అసంపూర్ణంగా ఉంది. అందుకనే &#8230; ఉన్నాయి.</p>
<p><span style="color: #ff0000;">కథాయణంలో చెప్పని సూచన 1:</span></p>
<p>ఇండెంటేషన్ లో రెండు అంతకి మించి చిహ్నాలు కలిపి వాడొచ్చని కథాయణంలో ఎక్కడా చెప్పలేదు. కాని, నాగరికథ కథల సంపుటిలో ఉన్న కథల్లో ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం రెండూ కలిపి, లేదా మిగిలిన వాటితో కలిపి వాడిన సందర్భాలు కొన్ని కనబడతాయి.</p>
<p>ఉదాహరణకి నాగరికథ కథలో 21 వ పేజీ లో చివరి వాక్యం. అంటే&#8230;!? ఆశ్చర్యం, అనుమానం రెండూ కలిసున్నాయి కనక ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం రెండూ ఉన్నాయి. వాక్యం పూర్తి కానందుకు తోడుగా మూడు చుక్కలు&#8230;ఉంచబడ్డాయి.</p>
<p>ఆశ్చర్యం ద్విగుణీకృతమయిందని చెప్పడానికి మరో ప్రపంచం కథలో 29 వ పేజీలో  “తేడా అల్లా అందులో టాస్ ఫలితం బొమ్మ కాకుండా అచ్చు వస్తుంది.” అన్నపదాల తర్వాత రెండు ఆశ్చర్యార్థకాలు !! కనబడతాయి.</p>
<p>అనుమానం, రెట్టింపు అయిందనడానికి, మరోప్రపంచం కథలో 30 వ పేజీలో “ఫిక్షన్ కాదు. సిసలు సైన్సే. తేడా అల్లా అందులో టాస్ ఫలితం బొమ్మ కాకుండా అచ్చు వస్తుంది.” తర్వాత రెండు ప్రశ్నార్థకాలు ?? ఉంచబడ్డాయి.</p>
<p>ఆశ్చర్యం రెండొంతులూ, అనుమానం ఒక వంతూ అవడంతో; రెండు ఆశ్చర్యార్థకాలు, ఒక ప్రశ్నార్థకం !?! కల్కి కథలో 37 వ పేజీలో “అతను చనిపోయి రెండు శతాబ్దాలు దాటింది.” అన్న వాక్యం తర్వాత కనపడతాయి.</p>
<p>అనుమానం రెండొంతులూ, ఆశ్చర్యం ఒక వంతూ అయిన సందర్భాలు కథల్లో కనపళ్లేదు.</p>
<p align="center"><strong>ఇండెంటేషన్</strong><strong>-</strong><strong>నాగరికథ</strong><strong> </strong><strong>కథాసంకలనం</strong><strong> </strong><strong>ప్రచురణలో</strong><strong> </strong><strong>అమలు</strong><strong> </strong><strong>కాని</strong><strong> </strong><strong>కొన్ని</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong></strong></p>
<p>              1. Ellipsis, Marks of Omission (&#8230;): నిబంధన ప్రకారం, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాక్యం ముందు ఉండకూడదు. కాని, 14 వ పేజీలో “&#8230;ఇది తెగేది కాదు.” అని ఉంది. ఈ పదాలు అంతకు ముందు పేజీలో ఉన్న అంటే&#8230;” అన్న పదానికి పొడిగింపు. అక్కడ &#8230; చుక్కలు ఉన్నాయి. కనుక అవి ఇక్కడ ఉండకూడదు.</p>
<p>2. నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఈ చుక్కలని, ఒక సంపూర్ణ వాక్యం చివర వాడినపుడు నాలుగో చుక్క కూడా ఉంచాలి. నాగరికథ కథా సంకలనంలో చాలా చోట్ల అలా నాలుగో చుక్క కనపడటం లేదు. ఉదాహరణ: 24 వ పేజీలో ఉన్న వాక్యం-అది కలే, ప్రస్తుతం నేనున్నది వెలుపలే&#8230;</p>
<p>3. ఈ మూడు చుక్కలనీ సంభాషణ మధ్య విరామాన్ని సూచించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. కాని అలా వాడటం నాగరికథ కథా సంకలనంలో చాలా చోట్ల కనపడుతుంది. ఉదాహరణ: 31 వ పేజీలో ఉన్న వాక్యం-ఆ లోకంలో వాళ్లిద్దరూ ఒకరికొకరు ఏమయ్యుంటారు&#8230;ప్రేమికులా?</p>
<p>4.  చాలా చోట్ల ఆశ్చర్యార్థకం అవసరమైనా కూడా లేదు. “రెండో నెలలో పాపని ఎవరో కాజేశారు.” అన్నదానికి జవాబుగా ఉన్న “అయ్యో,” తర్వాత.</p>
<p>5.  సంభాషణలలో చాలా చోట్ల, ఇన్వర్టెడ్ కామాలలో వాక్యం పూర్తయినా, కామా ఉంది. ఎందుకో తెలీదు. కల్కి కథ 36 వ పేజీ. “నిజమే,” తల పంకించాను.</p>
<p align="center"><strong>పాత్రలపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>, </strong><strong>అవి</strong><strong> </strong><strong>ఎంతవరకు</strong><strong>, </strong><strong>ఎలా</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">1. కథల్లో మితిమీరిన సంఖ్యలో పాత్రలుండవు. ఒకటి లేదా రెండు ముఖ్యమైన పాత్రలు, వాటి చుట్టూ కాసిని సహాయ పాత్రలతోనే కథలన్నీ నడుస్తుంటాయి. చాలా కథల్లో ఏకైక ప్రధాన పాత్ర ఉంటుంది.</span></p>
<p>నాగరికథ-లో ఉన్న పది కథల్లో ఉన్న పాత్రలు 29. అందులో ప్రధాన పాత్రలు 19. సహాయపాత్రలు 5.  ఇక్కడ సహాయపాత్రలంటే కథలోకి భౌతికంగా ప్రవేశించినవి. పాత్రల సంభాషణల్లోనో, జ్ఞాపకాల్లోనో ప్రస్తావించబడినవి కావు.  ఉదాహరణకి నాగరికథలో తాతయ్య ఫ్రెండు, మరపురాని కథలో గోవా సుందరి, శిక్ష కథలో శ్రీను లాంటివి.</p>
<p><span style="color: #ff0000;">2. రూపురేఖా విలాసాల వివరణ అన్నీ పాత్రలకీ తప్పనిసరి కాదు. కథకి కీలకమైతే తప్ప.</span></p>
<p>కల్కి కథలో వైపర్ గుర్తు పట్టటానికి వీలుగా కల్కి రూపం, ప్రియశత్రువు కథలో, ‘నేను’ రూపం మాత్రమే ఆయా కథల్లో స్పష్టంగా వివరించబడ్డాయి. ప్రొఫెసర్, డాక్టర్ లక్ష్మణ్, వృద్ధుడి పాత్రల రూపురేఖలు రేఖామాత్రంగానే వర్ణించబడ్డాయి. గమనార్హమైన విషయం ఏంటంటే (A) రూపురేఖల వివరాలు ఇవ్వబడ్డ పాత్రలన్నీ ముఖ్య/ప్రధాన పాత్రలే కావటం (B) ఒక్క సహాయ పాత్ర రూపు రేఖలు కూడా వర్ణించబడకపోవటం.</p>
<p><span style="color: #ff0000;">3. చాలా సందర్భాల్లో ప్రధానపాత్ర పేరు, వయసు, జెండర్-ఈ మూడు వివరాల్తోనే కథ నడిపేయొచ్చు.</span></p>
<p>కథాయణంలో ఉన్న 24 ప్రధాన పాత్రల్లో/సహాయపాత్రల్లో,  ఏడు పాత్రలకు మాత్రమే పేర్లు ఉన్నాయి. అవి విక్రమాదిత్య, కేథరిన్, ఐజక్, బండరెడ్డి, ప్రియశత్రువు కథలో ‘నేను’, డాక్టర్ లక్ష్మణ్, కుంతీకుమారి.</p>
<p>వయసు చెప్పబడింది వైపర్, విక్రమాదిత్య, కేథరిన్, ప్రొఫెసర్, బండ రెడ్డి, ప్రియశత్రువు కథలో ‘నేను’, డాక్టర్ లక్ష్మణ్, వృద్ధుడు, యువకుడు, కుంతీకుమారికి మాత్రమే.</p>
<p>మరో ప్రపంచంలో డాక్టర్, రహస్యం కథలో ఇంటలిజెన్స్ ఏజెంట్, ప్రళయం కథలో దొంగకీ తప్ప, అన్నిటికీ జెండర్ చెప్పబడింది. దీని వల్ల ప్రధాన పాత్రలు ఏ జెండరో కూడా చెప్పకుండా కథని నడపొచ్చు అని  రుజువవుతోంది.</p>
<p><span style="color: #ff0000;">4. పాత్ర ఆకారం, ఆహార్యం గురించిన వివరాలు ఆ పాత్ర సాంఘిక స్థాయినో, అలవాట్లనో, మరే ఇతరగుణాన్నో వెల్లడించాలి. అంతే తప్ప కేవలం ఆ పాత్ర భౌతిక లక్షణాలు వివరించటానికి వాక్యాలు వృధా చేయరాదు.</span></p>
<p>పది కథల్లో ఉంది 19 ప్రధాన పాత్రలు. ఇంతకు ముందే అనుకున్నట్లు భౌతిక లక్షణాలు పూర్తిగానో, పాక్షికంగానో వివరించబడింది అయిదు పాత్రలకే. ఈ పాత్రల్లో కొన్నిటి ఇతర లక్షణాలు, అలవాట్లు ప్రత్యేకంగా కాకుండా; కథనంలో అంతర్భాగంగా కథాసంకలనంలో కనపడతాయి. ఉదాహరణకి నాగరికథ కథలో తాతయ్యకున్న లక్షణాలు; ఏ ప్రశ్నకీ సూటిగా సమాధానం ఇవ్వకపోవటం-పుస్తకాలు చదవడం,  అణుశాస్త్రవేత్తకి  ఉన్న అలవాట్లు గెస్ట్ లెక్చర్లివ్వటం-తాతతో సంభాషించటం లాంటివి.</p>
<p><span style="color: #ff0000;">5. ఒక పాత్ర భౌతిక వివరాలు చెప్పటం తప్పనిసరైన సందర్భాల్లో కథకుడు ప్రత్యక్ష చిత్రణ కన్నా పరోక్ష చిత్రణ మీద ఆధారపడటం మెరుగు. అంటే ఆ పాత్ర ఎలా ఉందో వ్యాఖ్యానించటం కాకుండా, ఆ పాత్ర గురించి ఇతర పాత్రలు ఏమనుకుంటున్నాయో చెప్పించటం, వగైరా అన్న మాట.</span></p>
<p>నాగరికథ కథ చెప్పబడింది ఉత్తమపురుషలో మనవడి దృక్కోణం నుంచి. దానివల్ల, మనవడు తనకు తెలిసిన విషయాలు మాత్రమే తాను చెప్పొచ్చు. అందుకనే ‘బి.ఎ.ఆర్. సి. లో అణుశాస్త్రవేత్తగా తీరికలేని ఉద్యోగంలో ఉన్నా, ఏదోలా వీలు చేసుకుని నెలకోసారన్నా హైస్కూల్ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్లివ్వటం నాకలవాటు.’ అని తన గురించి తాను చెప్పాడు.  కాని, తాతయ్య పాత్ర; కథలో ‘నేను’ కాదు. అందువల్ల తన భౌతిక వివరాలు తాను చెప్పుకోకూడదు. అందుకని ఆయన గురించి భౌతిక వివరాలు: పురావస్తుశాఖలో ఇంజనీరు, చిలిపి నవ్వే సమాధానం, బోసినోటితో నవ్వటం, ఏ ప్రశ్నకీ సూటిగా సమాధానం ఇవ్వకపోవటం ఆయన స్టైల్ అని తెలియపర్చటం, ఇవన్నీ మనవడి ద్వారానే అంటే ఒక పరోక్ష చిత్రణ ద్వారా మాత్రమే పాఠకుడికి తెలియపర్చబడ్డాయి.</p>
<p><span style="color: #ff0000;">6. పాత్రల ఆలోచనాధోరణి వాటి అనుభూతుల్ని, ఉద్వేగాల్ని పాఠకుల కళ్లకి కడుతుంది. వాటి చర్యల వెనకున్న ఉద్దేశాల్ని విశదీకరిస్తుంది. ఆ చర్యల్ని పాఠకులు మరింత సానుభూతితో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల పాత్రల అంతరంగావిష్కరణ కొన్ని సందర్భాల్లో కీలకమవుతుంది. అయితే కథకుడిగా మీరు ఏ స్థాయిలో పాత్రల మనసుల్లోకి చొరబడగలరు అనేది ఆ కథ చెప్పటానికి మీరెంచుకున్న దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి, బాహ్య ప్రథమ పురుష లో కథ చెప్పదల్చుకుంటే అంతరంగావిష్కరణ జోలికి వెళ్లకుండా పాత్ర చిత్రణ చేయాల్సుంటుంది.</span></p>
<p>ఈ సూచన అర్థం- ఒక పాత్ర తన మనసులో ఏమనుకుంటున్నదీ ఇంకో పాత్ర, చెప్పటం ఆ కథ చెప్పిన విధానం మీద ఆధారపడి ఉంటుందని.</p>
<p>నాగరికథ, మరోప్రపంచం, కల్కి, రహస్యం, ప్రళయం, ప్రియశత్రువు, కుంతీకుమారి కథలు; చెప్పింది ఉత్తమపురుష కథావిధానంలో. అందువల్ల ఒక పాత్ర మనసులో ఏముందో ఇంకో పాత్ర ఊహించుకోవచ్చు.</p>
<p>కనక  తాతయ్య మనసులో ఏముందో మనవడు (15వ పేజీ చివరిపేరా),  స్కూటీ సుందరి మనసులో ఏముందో పేషంటు (31వ పేజీ చివరి పేరా), కల్కి మనసులో ఏముందో వైపరు (49వ పేజీ మూడో పేరా), దొంగ స్వగతం ద్వారా కథకుడు (96వ పేజీలో కిందనుంచి రెండో పేరా), ‘నేను’ స్వగతాల ద్వారా కథకుడు (121వ పేజీ), కుంతీ కుమారి మనసులో ఏముందో బార్ టెండర్ (133వ పేజీలో రెండో పేరా) ఊహించుకోగలిగారు. ఆ వీలు ఉన్నా రహస్యం కథకి దాన్ని రచయిత వాడుకోలేదు. అదే వీలు సర్వజ్ఞ ప్రథమపురుష కథనానికి కూడా ఉంది. అందుకే బండరెడ్డి ఆలోచనలన్నీ కథకుడు చెప్పగలిగాడు. ఈ అవకాశం పరిమిత ప్రథమపురుష,  బాహ్య ప్రథమపురుష కథనాల్లో లేదు. అందుకే ఆ ధోరణుల్లో చెప్పబడిన రీబూట్, మరపురాని కథల్లో అంతరంగావిష్కరణ జరగలేదు.</p>
<p><span style="color: #ff0000;">7. పాత్రల గురించి కథకుడు చెప్పేది, తమ గురించి తాము పాత్రలు చెప్పుకునేది, ‘చూపేది’ మాత్రమే కాక, ఆయా పాత్రల గురించి కథలోని ఇతర పాత్రలు ఏమనుకుంటున్నాయనేది కూడా పాఠకులకి చాలా విషయాలు తెలియబరుస్తుంది. మీ ప్రధాన పాత్రంటే ఇతర పాత్రలకి గౌరవమా, భయమా, చిన్నచూపా; ఆ పాత్ర గురించి మిగతా పాత్రలు ఏం మాట్లాడుకుంటాయి; ఆ పాత్ర ప్రభావం ఇతర పాత్రల మీద ఎలా ఉంది; వగైరా వివరాలు చెప్పటం వల్ల పాఠకుడు కథలోని పాత్రల మధ్య బంధాలు, సమస్యలు, ఘర్షణ సరిగా అర్థం చేసుకుంటాడు.</span></p>
<p>ఈ సూచన అర్థం-ఒక పాత్ర మీద పాఠకుడికి ఏర్పడే అభిప్రాయం; ఆ పాత్ర గురించి మిగిలిన పాత్రలు ఏమనుకుంటున్నాయనే దాని మీద ఆధారపడుంటుందని; దాని ద్వారా పాత్రల స్వరూపస్వభావాలపట్ల పాఠకుడికి స్పష్టత ఏర్పడుతుందని. దీనికి నిదర్శనాలు: తాతయ్య మాటల మీద మనవడికి కలిగిన అపనమ్మకం (18 వ పేజీ 7 వ పేరా),  పేషంటుకి కుర్రాడి మీద సానుభూతి (29వ పేజీ రెండవ, మూడవ పూర్తి పేరా), కల్కికి వైపర్ మీద నమ్మకం (49వ పేజీ మూడో పేరా), విక్రమాదిత్యకి కేథరిన్ మీద గౌరవం (55వ పేజీ 8వ పేరా), ఇంటలిజెన్స్ ఏజంట్ కి ప్రొఫెసర్ మీద గౌరవం (70వ పేజీ 3వ పూర్తి పేరా), పోలీసు జీపు డ్రైవర్ మీద చులకన భావం (82వ పేజీలో 3వ పేరా), ప్రియశత్రువు లో ‘నేను’ కి ఆదిత్య దౌష్ట్యం (113వ పేజీ క్రిందనుంచి 3వ పేరా), వృద్ధుడికి  యువకుడిపై గౌరవం (124వ పేజీ 2వ పేరా),  బార్ టెండర్ కి  కుంతీ కుమారి మీద అయిష్టం (133వ పేజీ-మొదటి పేరా).</p>
<p align="center"><strong>కథన</strong><strong> </strong><strong>కుతూహలంలో</strong><strong> </strong><strong>క్లుప్తతపై</strong><strong> </strong><strong>సూచనలు</strong><strong>, </strong><strong>అవి</strong><strong> </strong><strong>ఎలా</strong><strong>, </strong><strong>ఎంతవరకు</strong><strong> </strong><strong>పాటించబడ్డాయి</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;">(1) కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే-పొడుగాటి వాక్యాలు చదివి అర్థం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు చదివి అర్థం చేసుకోవటం తేలిక కాబట్టి. అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి. అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు అనవసరమైన కొవ్వుని కరిగించేసి కథ సొగసు పెంచుతాయి కాబట్టి.</span></p>
<p>మొత్తం కథాసంపుటిలో అవసరానికి మించి పొడుగ్గా ఉన్న వాక్యాలు అతి తక్కువ. అలాంటి పొడుగాటి వాక్యం ఒకటి నాగరికథ కథ-15 వ పేజీ లో ఉంది. అది గీజా నాళికలు, అనే పదంతో ఆరంభమై; భావిస్తున్నారు అనే పదంతో అంతమవుతుంది. ఇది మొత్తం నాలుగు లైన్లు. ఈ వాక్యం, మనవడు ఒక పత్రికలో చదివిన వార్తలో భాగం. పత్రికలో వార్తలు అలాగే ఉంటాయి కనక కథారచయిత ఉద్దేశపూర్వకంగా దాన్ని చిన్నచిన్న ముక్కలుగా విడగొట్టలేదనిపించింది.  కల్కి కథలో-41 వ పేజీ లో మాతృదేశానికి అన్న పదంతో మొదలై, అగ్రగామిగా నిలిపాయి అన్న పదంతో ఆఖరైన వాక్యం మరో పొడుగాటిది. వాక్యప్రవాహవేగం ఏ మాత్రం తగ్గకుండా ఈ వాక్యాన్ని చిన్నచిన్న వాక్యాలుగా విడగొట్టటానికి ప్రయత్నించి చూశాను. కుదర్లేదు.</p>
<p>ఇంకా చిన్న చిన్న వాక్యాలుగా రాసే అవకాశం ఉన్నా, రాయబడని అతి కొద్ది వాక్యాల్లో ఒకటి కుంతీకుమారి కథ పేజీ 143 లో కనపడుతుంది. అదీ రెండు లైన్లే. కథల్లో మిగిలినవన్నీ చిన్న చిన్న వాక్యాలే.</p>
<p><span style="color: #ff0000;">(2) కథలో క్లుప్తత సాధించాలంటే కథకుడికి మొదటిగా కావాల్సింది చెప్పదలుచుకున్న దానిపై స్పష్టత. ఏం చెప్పాలో తెలీనప్పుడు ఎలా చెప్పాలో తెలిసే వీలు లేదు. అప్పుడే పదాడంబరం రంగప్రవేశం చేసి కథ పొడుగు పెంచుతుంది.</span></p>
<p>కథాయణంలో ఉన్న కథల్లో పదాడంబరం రంగప్రవేశం చేసి కథ పొడుగు పెంచిన సందర్భాలు నాకు కనపళ్లేదు.</p>
<p><span style="color: #ff0000;">(3) ఇక రెండోది. చెబుతున్న విషయమ్మీదనే దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి. ఇది కొరవడితే కథలోకి అనవసరమైన పాత్రలు, వాటి మధ్య సందర్భశుద్ధి లేని సంభాషణలు వగైరా ప్రవేశిస్తాయి.</span></p>
<p>అన్ని రకాల పాత్రలూ కలిపి మొత్తం 10 కథల్లో ఉన్న పాత్రలే 29. ఇక అనవసరమైన పాత్రలంటూ ఇవని చెప్పే అవకాశం లేదు. సందర్భశుద్ధి లేని సంభాషణల కోసం వెతికాను. దొరకలేదు.</p>
<p><span style="color: #ff0000;">(4) ఈ రెండిటి తర్వాత ముఖ్యమైనది-తక్కువ పదాల్లో ఎక్కువ భావం పలికించగలగటం.</span></p>
<p>దీనికి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఒకటి: ప్రళయం కథ- పేజీ 100 లో ఉన్న “తీతువు కూతలు గుండెలదరగొట్టేవేళ హేతువు తోక ముడిచి పారిపోతుందేమో” అనే వాక్యం.</p>
<p><span style="color: #ff0000;">(5) కథాగమనానికి దోహదపడని వర్ణనలకి దూరంగా ఉండటం.</span></p>
<p>వర్ణనలు చాలా తక్కువ. మినహాయింపు శిక్ష కథ. ఇందులో రకరకాల వర్ణనలు కనపడతాయి. మిగిలిన కథల్లో ఉన్న వర్ణనలు నాలుగు. ఉదాహరణలు: (1-2) కల్కి కథ-పేజీ 44, 45 ల్లో. ఈ రెండు వర్ణనలూ ఒకే వ్యక్తికి చెందినవి. మొదటి వర్ణన ఉన్నది, వైపర్ మొదటిసారి కల్కిని చూసినపుడు-రెండో వర్ణన ఉన్నది, కల్కి వేలికి ఉన్న ఉంగరం  మరింత పరీక్షగా చూసినప్పుడు. సందర్భం వేరు. వర్ణన కూడా వేరు. (3) ప్రియశత్రువు కథ-పేజీ 111 లో డాక్టర్ వర్ణన. కథలో ‘నేను’, డాక్టర్ నాకు బాగా నచ్చాడు అనుకుంటుంది. అతడి పేరు మీద ఫేస్ బుక్ ఖాతా తెరవాలనుకుంటుంది. ఆమెది అందమైన వాళ్లని ఇష్టపడే మనస్తత్వం. అందుకే డాక్టర్ ఎలా ఉన్నాడో వర్ణించటం అవసరం. అదీ సరిపడేంతవరకే. (4) ప్రియశత్రువు కథ-పేజీ 112 లో ప్రియ రూపురేఖల వర్ణన. కథకి కీలకాంశం అదే.</p>
<p><span style="color: #ff0000;">(6) పాత్రల సంఖ్యని పరిమితం చేయటం.</span></p>
<p>మొత్తం 10 కథల్లో ఉన్న పాత్రలు 29. అంటే కథకి సగటున మూడు. వాటిలో పదకొండింటికి మాత్రమే పేర్లున్నాయి. కథల్లో ప్రధాన స్త్రీ పాత్రలు కూడా రెండే రెండు.</p>
<p><span style="color: #ff0000;">(7) పునరుక్తులు పరిహరించటం.</span></p>
<p>కథల్లో నాలుగు చోట్ల మాత్రమే పునరుక్తులున్నాయి. మరో ప్రపంచం కథలో 27 వ పేజీలో ఈ లోకంలో మనకి అసంభవమైనవిగా అన్న పదంతో మొదలైన వాక్యం అదే పేజీలో ఉన్న చివరి పేరాలో మళ్లీ కనపడుతుంది. అలాంటివే మరో మూడు వాక్యాలు ఇదే కథలో 27, 28 పేజీల్లో సైతం కనపడతాయి. అయితే ఈ సందర్భాల్లో మొదట కనపడే ప్రతి వాక్యం, ఆ తర్వాత ప్రధానపాత్ర గుర్తుకు తెచ్చుకునే మొత్తం సంభాషణలో ఒక భాగం. అలాగే రీబూట్ కథలో 53 వ పేజీలో మొదటి వాక్యం ఇతివృత్తానికి సూచనగా కథ ప్రారంభంలో కనపడగా, 64వ పేజీలో ఆ సంఘటన కథలో నిజంగా జరిగినప్పుడు ఇంకోసారి ప్రత్యక్షమవుతుంది. రహస్యం కథ మొదట్లో 68 వ పేజీలో కథ ఎత్తుగడలో భాగంగా మొదలైన వాక్యం  79 పేజీలో ముగింపులో కనపడతుంది. అందువలన వీటిని పూర్తిగా పునరుక్తులు అనలేం.</p>
<p align="center"><strong> </strong></p>
<p align="center"><strong>మరికొన్ని</strong><strong> </strong><strong>విషయాలు</strong><strong></strong></p>
<p><span style="color: #ff0000;"><strong>కథల</strong><strong> </strong><strong>పరిమాణం</strong><strong>:</strong></span><strong></strong></p>
<p><strong>              </strong>ఈ మధ్య నేను చదివిన ఒక మెగా కథల సంపుటిలో ఒక కథ అచ్చులో సుమారుగా నాలుగు పేజీలు ఉంటే, ఇంకో కథ 48 పేజీలు ఉంది. మొత్తం సంపుటిలో ఉన్న 336 కథలని పరిశీలిస్తే  నాలుగు నుంచి 14 పేజీలు ఉన్న కథలు 213 ఉన్నాయి. కథల సంఖ్య, అవి ఆక్రమించిన పేజీల సంఖ్య ఆధారంగా ఒక్కో కథ సుమారుగా 11 పేజీలు ఉంది. ఈ కథలన్నీ సౌకర్యవంతంగా చదివే పరిమాణంలో ఉన్నాయని నాకనిపించింది. ఇదే దృష్టితో చూస్తే చిత్రంగా, నాగరికథ కథల సంపుటిలో 10 కథలూ 114 పేజీలతో పైన  చెప్పిన సగటు పరిమాణంలోనే ఉన్నాయి.</p>
<p><span style="color: #ff0000;">కథ విభజన:</span></p>
<p>పైన నేను చెప్పిన మెగా కథాసంకలనంలో ఒక 24 పేజీల కథ మొత్తం ఒకటే భాగంగా చెప్పబడింది. ఇంకో 26 పేజీల కథ 23 భాగాలుగా విడగొట్టబడింది. మొదటిది అనావృష్టి. రెండోది అతివృష్టి. కథలోకి ఒక పాత్ర ప్రవేశించినపుడు లేదా నిష్క్రమించినపుడు, సంఘటనాసమయం, స్థలం లేదా సందర్భం మారినప్పుడు కొత్త భాగం మొదలైన మిగిలిన కథల్తో పోలిస్తే, ఈ రెండు కథలూ, ఇలాంటివే మరికొన్ని కథలూ చదవటానికి ఇబ్బంది పెట్టాయి. ఈ రకమైన ఇబ్బంది నాగరికథ కథల సంపుటిలో ఉన్న కథల్లో ఎదురు కాలేదు. కారణం? ఏ కథలోని ఏ భాగం మధ్యలోనూ పాత్రల సంఖ్యా, సంఘటనాస్థలీ, కథాసమయమూ మారలేదు.</p>
<p>ఉదాహరణకు నాగరికథ కథనే తీసుకుంటే, కథలో మొత్తం 5 భాగాలున్నాయి.  మొదటి భాగంలో  సంఘటనా సమయం=వర్తమానం, సంఘటనాస్థలి=క్లాస్ రూమ్. రెండో భాగంలో  సందర్భం=విమానంలో ఉన్నపుడు ప్రస్తుతంలోంచి గతంలోకి ప్రధాన పాత్ర ప్రయాణం. మూడో భాగంలో సంఘటనా సమయం=వర్తమానం, స్థలం=తాతయ్య ఇల్లు. నాలుగో భాగంలో సంఘటనా సమయం=ప్రస్తుతంనుంచి గతంలోకి, తాతయ్యతో సంభాషణల స్మరణ. ఐదో భాగంలో సంఘటనా సమయం=గతంలోంచి వర్తమానంలోకి.</p>
<p align="center"><strong>కథ</strong><strong>-</strong><strong>ప్రయోజనం</strong><strong></strong></p>
<p>              చదివించగలగటం కథ ప్రాథమిక లక్షణం. ఆ లక్షణం పూర్తిగా లోపించిన లేదా ఆ ప్రామాణికతని అసమగ్రంగా సంతృప్తి పరచిన కథలు, ఇతివృత్తంగా ఏ సమస్యని స్వీకరించినా పాఠకుడితో చదివించలేవు. కథ-ప్రయోజనం అనే కొలమానంతో కొలిస్తే, అసలు చదివించలేకపోవటంవల్ల ప్రయోజనపరంగా వాటి లక్ష్యాన్ని  సిద్ధింపచేయలేవు.<strong></strong></p>
<p align="center"><strong>ముగింపు</strong><strong></strong></p>
<p>              సంపుటిలో ఉన్న పది కథల్లో ఒకటి అనువాద కథ. మిగిలిన వాటిలో, శిక్ష కథలో ఒక వర్తమానసమస్య ఇతివృత్తం. సమస్య తీవ్రతని  ఈ కథ ద్వారా పాఠకుల దృష్టికి తెచ్చి, రచయిత కథని ముగించాడు.  ఆ కథలో సమస్య వైయక్తికమైనది కాదు. వర్తమానసమాజానికంతటికీ సంబంధించినది.  ఈ కథలో ప్రస్తావించిన సమస్యకు పరిష్కారాన్ని సూచించే బాధ్యతని రచయిత తీసుకోలేదు. మిగిలిన ఎనిమిది కథలూ ప్రాథమికంగా వైజ్ఞానిక కల్పనలు. ప్రతి కథకీ ఒక శాస్త్రీయకోణం పునాది. మిగిలిన కథ- ఆ పునాదిపై తన కల్పన జోడించి రచయిత నిర్మించిన రమ్యహర్మ్యం.</p>
<p>కథాయణంలో కానీ, కథనకుతూహలంలో తాను చేసిన సూచనలు వ్యాసరచయిత; తన కథారచనలో పాటించాడు. కథలకీ, కథాయణానికీ మధ్య సమగ్ర సమన్వయం సాధించాడు.  ఆ దృష్ట్యా చూస్తే తాను చేసిన సూచనలు పాటించలేనివి, పాటించగూడనివి కావని నిరూపించాడు. అందుకే ఆ కథలు నేను ఒకటికి రెండు సార్లు చదవగలిగాను.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=14552</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>వాకిలి కథలపై విహంగవీక్షణం</title>
		<link>http://vaakili.com/patrika/?p=11745</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11745#comments</comments>
		<pubDate>Sun, 31 Jul 2016 16:45:33 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[గెస్ట్ ఎడిటోరియల్]]></category>
		<category><![CDATA[టి. చంద్రశేఖర రెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11745</guid>
		<description><![CDATA[<p>జనవరి 2013 లో మొదలైన వాకిలి అంతర్జాల మాసపత్రిక జూన్ 2016 సంచికతో 42 నెలలు పూర్తిచేసుకుంది. నవల, కథ, కవిత,వ్యాసం ఇలా రకరకాల సాహిత్యప్రక్రియలకి తనలో స్థానం కల్పిస్తోంది. కొన్ని గణాంకాలనీ, ఇంకొన్ని ప్రమాణాలనీ ఆధారం చేసుకున్న ఈ విశ్లేషణ; మూడున్నర సంవత్సరాలలో వాకిలిలో వచ్చిన కథల తీరుతెన్నులని విభిన్న కోణాల్లోనుంచి చూడటానికి ఒక ప్రయత్నం చేస్తుంది.</p> <p>కథల సంఖ్య: </p> <p>ఈ నలభై రెండు నెలల్లో వాకిలిలో వెలుగు చూసిన కథలు 120. ఇందులో అనువాద కథలు 3. మిగిలినవి 117. అంటే నెలకు సగటున సుమారుగా 3 కథలు వాకిలిలో ప్రచురితమయ్యాయి.</p> <p>కథల పేర్లు: </p> <p>చాలామంది రచయితలు కథకి సంబందించిన మిగిలిన విషయాల మీద పెట్టే శ్రద్ధ, కథకి పేరు పెట్టటం మీద పెట్టరు. ఈ విషయానికి నూతన రచయితలే కాదు, లబ్ధప్రతిష్ఠులయిన రచయితలు కూడా మినహాయింపు కాదు. దీనివల్ల కొన్ని కథలకి పెట్టే పేర్లు, చిరపరిచితమయినవిలా అనిపిస్తాయి. ఒక్కోసారి అవి కథ ఇతివృత్తాన్నీ, కొండొకచో కథ ముగింపునీ, కథని పూర్తిగా చదవకముందే బట్టబయలు చేస్తాయి. కథాయుద్ధంపై పాఠకభీష్ముడి ఆసక్తిని చంపటానికి అలాంటి పేర్లు శిఖండి పాత్ర ధరిస్తాయి.</p> <p>కథలు చదవటంలో విస్తారమయిన అనుభవం ఉన్న సంపాదకులూ, వారితో పాటు పాఠకులూ; కథ పేరుని బట్టి కథకుడి స్థాయినీ,  కథ నాడినీ పట్టేస్తారు. పక్కలో పెట్టుకోవాలా, పక్కకి నెట్టేయాలా అన్నది చిటికెలో నిర్ణయించేస్తారు. అందువల్ల పాఠకుడిని కథవైపు ఆకర్షించడానికి, ఇతివృత్తం విశిష్టంగా ఉంటే చాలదు. కథనం ఆసక్తికరంగా ఉంటే సరిపోదు. కథకి పెట్టిన పేరులో సైతం వైవిధ్యం ఉట్టిపడాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, వాకిలిలో వచ్చిన కథల పేర్లు, ఎంత విభిన్నంగా ఉంటున్నాయో చూద్దాం.</p> <p>కథలకి, సినిమా పేర్లు పెట్టటం అనేది ఒక ఆనవాయితీ. దీనికి నిదర్శనం నాలుగు స్తంభాలాట, దొరబాబు అనే కథలు. ప్రతి సినిమా పేరుకీ ఇవ్వాళా రేపూ ఒక టాగ్ లైన్ ఉంటోంది. [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">జ</span>నవరి 2013 లో మొదలైన వాకిలి అంతర్జాల మాసపత్రిక జూన్ 2016 సంచికతో 42 నెలలు పూర్తిచేసుకుంది. నవల, కథ, కవిత,వ్యాసం ఇలా రకరకాల సాహిత్యప్రక్రియలకి తనలో స్థానం కల్పిస్తోంది. కొన్ని గణాంకాలనీ, ఇంకొన్ని ప్రమాణాలనీ ఆధారం చేసుకున్న ఈ విశ్లేషణ; మూడున్నర సంవత్సరాలలో వాకిలిలో వచ్చిన కథల తీరుతెన్నులని విభిన్న కోణాల్లోనుంచి చూడటానికి ఒక ప్రయత్నం చేస్తుంది.</p>
<p><strong>కథల సంఖ్య: </strong><strong></strong></p>
<p>ఈ నలభై రెండు నెలల్లో వాకిలిలో వెలుగు చూసిన కథలు 120. ఇందులో అనువాద కథలు 3. మిగిలినవి 117. అంటే నెలకు సగటున సుమారుగా 3 కథలు వాకిలిలో ప్రచురితమయ్యాయి.</p>
<p><strong>కథల పేర్లు: </strong><strong></strong></p>
<p>చాలామంది రచయితలు కథకి సంబందించిన మిగిలిన విషయాల మీద పెట్టే శ్రద్ధ, కథకి పేరు పెట్టటం మీద పెట్టరు. ఈ విషయానికి నూతన రచయితలే కాదు, లబ్ధప్రతిష్ఠులయిన రచయితలు కూడా మినహాయింపు కాదు. దీనివల్ల కొన్ని కథలకి పెట్టే పేర్లు, చిరపరిచితమయినవిలా అనిపిస్తాయి. ఒక్కోసారి అవి కథ ఇతివృత్తాన్నీ, కొండొకచో కథ ముగింపునీ, కథని పూర్తిగా చదవకముందే బట్టబయలు చేస్తాయి. కథాయుద్ధంపై పాఠకభీష్ముడి ఆసక్తిని చంపటానికి అలాంటి పేర్లు శిఖండి పాత్ర ధరిస్తాయి.</p>
<p>కథలు చదవటంలో విస్తారమయిన అనుభవం ఉన్న సంపాదకులూ, వారితో పాటు పాఠకులూ; కథ పేరుని బట్టి కథకుడి స్థాయినీ,  కథ నాడినీ పట్టేస్తారు. పక్కలో పెట్టుకోవాలా, పక్కకి నెట్టేయాలా అన్నది చిటికెలో నిర్ణయించేస్తారు. అందువల్ల పాఠకుడిని కథవైపు ఆకర్షించడానికి, ఇతివృత్తం విశిష్టంగా ఉంటే చాలదు. కథనం ఆసక్తికరంగా ఉంటే సరిపోదు. కథకి పెట్టిన పేరులో సైతం వైవిధ్యం ఉట్టిపడాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, వాకిలిలో వచ్చిన కథల పేర్లు, ఎంత విభిన్నంగా ఉంటున్నాయో చూద్దాం.</p>
<p>కథలకి, సినిమా పేర్లు పెట్టటం అనేది ఒక ఆనవాయితీ. దీనికి నిదర్శనం <a href="http://vaakili.com/patrika/?p=11009" target="_blank">నాలుగు స్తంభాలాట</a>, <a href="http://vaakili.com/patrika/?p=11168" target="_blank">దొరబాబు</a> అనే కథలు. ప్రతి సినిమా పేరుకీ ఇవ్వాళా రేపూ ఒక టాగ్ లైన్ ఉంటోంది. కథల పేర్లపై కూడా ఆ ప్రభావం పడింది అనుకోవటానికి, <a href="http://vaakili.com/patrika/?p=2699" target="_blank">సౌభాగ్యం రోడ్డున పడింది (దానికి మనమేం చేస్తాం?)</a> కథ పేరు సిద్ధంగా ఉంది.  కథకుడి మీద కానీ, కథనం మీద కానీ పరభాషా ప్రభావం ఉన్నపుడు, కథ పేరు మీద ఆ ఛాయలు పడక మానవు. అందువల్లనే  ఇంగ్లీషు పదాల్తో కాని, ఉర్దూ లేదా హిందీ పదాల్తో కానీ పెట్టిన పేర్లు 18 కథలకి ఉన్నాయి. కథలో ఒకటికి మించి భాషలు ఉన్నపుడు, కథ పేరు అలా ఉండటంలో అనౌచిత్యం ఏమీ లేదు. <a href="http://vaakili.com/patrika/?p=10520" target="_blank">ఒల్వెరా స్ట్రీట్ పిచ్చి కవి</a>, <a href="http://vaakili.com/patrika/?p=9074" target="_blank">ది టెర్మినేటర్-ద్వైతము</a> లాంటి పేర్లు దానికో నిదర్శనం. కథనం మాండలికంలో ఉన్నపుడు, కథ పేరు మాండలికంలో ఉండటం సముచితం. <a href="http://vaakili.com/patrika/?p=5841" target="_blank">మేస్టృబాబు మరి నేరు</a> అనే కథ దీనికి ఉదాహరణ. కథలో ఒక పాత్ర పేరు; కథకి ఉంచటం ఒక అలవాటు. ఈ రీతిపై ఆకర్షణ ఇంకా తగ్గలేదనే విషయాన్ని మైథిలి, <a href="http://vaakili.com/patrika/?p=4443" target="_blank">యామిని</a> కథలు ధృవపరుస్తాయి.  ప్రముఖమైన పలుకుబడులు, కొంత మార్పుతో కథ పేరుగా పనికొస్తాయనటానికి <a href="http://vaakili.com/patrika/?p=8408" target="_blank">ధనం మూలం</a>, <a href="http://vaakili.com/patrika/?p=8243" target="_blank">పాత ఒక వింత</a> లాంటి కథల పేర్లు ఉదాహరణలు. ఒకప్పుడు సినిమా పాటల పల్లవులు యథాతథంగా కథల పేర్లుగా అమిరేవి. అవి కొంత రూపాంతరం చెంది, <a href="http://vaakili.com/patrika/?p=7825" target="_blank">గాలికే కులముందీ</a>&#8230;లా కథల పేర్లు అవుతున్నాయి. అంతే కాదు కొన్ని సినీ గీతాల  చరణాలు సైతం ఆ పాత్రని పోషిస్తున్నాయి. <a href="http://vaakili.com/patrika/?p=2986" target="_blank">పాలగుండెలో ఏదీ దాగుందో</a>, <a href="http://vaakili.com/patrika/?p=8238" target="_blank">ఎందుకు వగచేవో</a> అనే కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. ఒక ప్రసిద్ధి చెందిన నవల పేరు, చిన్న మార్పుతో కథ పేరుగా పనికొస్తుందా? అవునని <a href="http://vaakili.com/patrika/?p=788" target="_blank">అసమర్థుని ప్రేమయాత్ర</a> కథ చెపుతోంది. అమావాస్య చంద్రుడిలా, ఆకాశంలో భూకంపంలా; పొసగని రెండుపదాలని కలిపి కథ పేరుగా పెట్టి ఒక వైవిధ్యం సాధించవచ్చు. నలుపు అని అర్థం ఇచ్చే ‘కారు’ ని తెల్లటి పున్నమికి జోడించటం (<a href="http://vaakili.com/patrika/?p=3244" target="_blank">కారుపున్నమి</a>-జూలై 2013), కలపకి చెందిన <a href="http://vaakili.com/patrika/?p=8910" target="_blank">పెళుసుని అందానికి</a> ఆపాదించటం (సెప్టెంబర్ 2015) అలాంటి ప్రయోగాలే.</p>
<p><strong>అధ్యాయవిభజన: </strong><strong></strong></p>
<p>కథ అంటే ఒకప్పుడు ఒక సంఘటన. ఒక జీవితశకలం. ఇప్పుడు కథ నిర్వచనం మారింది. ఇతివృత్తం విస్తృతీ పెరిగింది. దాంతో కథలోకి విభిన్నపాత్రల ప్రవేశం, నిష్క్రమణా  జరుగుతోంది. సందర్భాన్ని బట్టి సంఘటనాస్థలి సైతం మారుతోంది. ఆ మార్పులకి అనుగుణంగా కథలో అధ్యాయవిభజన జరిగితే, అది; కథలో రాబోయే మార్పును స్వీకరించడానికి పాఠకుడిని మానసికంగా సంసిద్ధం చేస్తుంది. ఈ దృక్కోణాన్ని నిర్లక్ష్యాన్ని చేసిన కథ, ఎక్కడో ఒకక్కడ పాఠకుడిని అయోమయానికి గురిచేస్తుంది.</p>
<p>ఒక కథలో ఎన్ని అధ్యాయాలు ఉండాలనేది కథనం మీద ఆధారపడి ఉంటుంది. ఒక అధ్యాయం ఎన్ని పేజీలకి విస్తరించాలి అన్నది ఆ అధ్యాయం ద్వారా కథకుడు, కథకుడికి సంబంధించిన ఏ భాగం చిత్రీకరించాలనుకున్నాడనేదాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. వీటి దృష్ట్యా ఒక కథకి ఇన్ని అధ్యాయాలే ఉండాలనే నియమం, ఇన్ని పేజీలకి తప్పనిసరిగా అధ్యాయం మారాలనే పరిమితి; విధించడం విజ్ఞత కాదు. అలాగని,  పేజీలకు పేజీల కథని ఒకే అధ్యాయంగా రాయటం; ఒక చిన్నకథని ముక్కలుముక్కలు చేయటం పద్ధతి కాదు.</p>
<p>ఈ నేపథ్యంలో, వాకిలిలో వచ్చిన, వస్తున్న కథల్లో అధ్యాయవిభజన ఏ మేరకు జరుగుతోంది? అనే ప్రశ్న ఉదయించక మానదు. ఈ గణాంకాలు ఆ ప్రశ్నకి సమాధానమిస్తాయి.</p>
<p>ఒక అధ్యాయం ఉన్న కథలు 59, రెండు అధ్యాయాల కథలు 18, మూడు అధ్యాయాల కథలు 8, నాలుగు  అధ్యాయాల కథలు 12, అయిదు అధ్యాయాల కథలు 11, ఆరు అధ్యాయాల కథలు 2, ఏడు అధ్యాయాల  కథలు 4, ఎనిమిది అధ్యాయాల కథలు 1, తొమ్మిది అధ్యాయాల కథలు 1, పదమూడు అధ్యాయాల కథలు 1.</p>
<p>.         ఒకే అధ్యాయంతో రాసిన కథలు, మొత్తం 117 కథల్లో సగం. ఈ 59 కథల్లో; ఒకటి నుంచి మూడు  పేజీలలోపు ఉన్నవి 15, నాలుగు నుంచి ఆరు పేజీలలోపు ఉన్నవి 27, ఏడు నుంచి తొమ్మిదిపేజీల లోపు ఉన్నవి 15, పది నుంచి పన్నెండు పేజీల లోపు ఉన్నవి 02. అన్నిటికన్నా పెద్ద కథ 11 పేజీలది.</p>
<p>కొందరు కథకులు; అధ్యాయవిభజన గురించి ఇంత చర్చ (ఇది చాలా సున్నితమయిన పదం. దీనిలో అక్షరాల స్థానాన్నీ, గుణింతాల లేదా గుణితాల స్థానాన్నీ మారిస్తే రచ్చ అవుతుంది) అవసరమా? కథలో మరింత అధ్యాయవిభజనకి అవకాశం ఉంటే, అది మేమే చెయ్యమా? అలా వదిలేస్తామా? అని ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం; ఒకటే అధ్యాయం ఉన్న, రెండు పెద్ద కథలపై నేను జరిపిన పరిశీలన ఇస్తుంది.</p>
<p>మొదటి కథ డిసెంబర్ 2014 సంచికలో ప్రచురించబడ్డ <a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2" target="_blank">రాజేశ్ యాళ్ల</a> కథ-<a href="http://vaakili.com/patrika/?p=6826" target="_blank">కిటికీలోని బాల్యం</a>. ఇది 11 పేజీల కథ. ఈ కథలో తొమ్మిదో పేరా తర్వాత సందర్భం మారింది. పన్నెండో పేరా అనంతరం సంఘటనా సమయం మారి, ఒక కొత్త పాత్ర కథలోకి ప్రవేశించింది. నలభై అయిదో పేరా తర్వాత ప్రధాన పాత్ర గతంలోకి వెళ్లింది. నలభై ఆరో పేరా తర్వాత అదే పాత్ర వర్తమానంలోకి ప్రవేశించింది. డెభై ఎనిమిది, తొంభై ఒకటి, నూట ఆరు, నూట తొమ్మిది పేరాల అనంతరం సంఘటనాసమయం మారింది. నూట ఇరవై ఎనిమిదో పేరా మొదటి వాక్యం పిదప, సంఘటనాస్థలి ఇంకోటి అయింది (నిజానికి ఈ వాక్యం తర్వాత పేరా కూడా మార్చి ఉండాలి). వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కథని పది అధ్యాయాలుగా రాసి ఉన్నట్లైతే, కథనాన్ని అనుసరించటం మరింత సౌకర్యవంతమయేది.</p>
<p>రెండో కథ, జనవరి 2016 వాకిలి సంచికలో వచ్చిన <a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%85%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3-%E0%B0%AA%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81" target="_blank">అరుణ పప్పు</a> కథ- <a href="http://vaakili.com/patrika/?p=9884" target="_blank">పునర్నిర్మాణం</a>. ఇది ఏడు పేజీల కథ. మొదటి ఏడు పేరాలూ, కథలో రెండు పాత్రల మధ్య సంభాషణ. ఆ పేరాలతో సంభాషణ అంతమయి, ఎనిమిదో పేరానుంచి సంఘటనాస్థలి మారింది.  పన్నెండో పేరా తర్వాత కథలో పాత్ర కారు దిగుతుంది. సంఘటనాస్థలి, సందర్భం వేరవుతుంది. పదిహేడో పేరా తర్వాత, ఇరవయ్యో పేరా తర్వాత సంఘటనాసమయం మారింది.  నలభయ్యోయిదో పేరా తర్వాత, సంఘటనాస్థలి మారింది.  ఏభయ్యో పేరా తర్వాత, కథలో ప్రధానపాత్ర వర్తమానంలోనుంచి గతంలోకి ప్రయాణిస్తుంది. అరవై ఒకటో పేరా తర్వాత, ప్రధానపాత్ర వర్తమానం లోకి తిరిగొస్తుంది. డెబ్బయ్యో పేరా తర్వాత, ఒక పాత్ర తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఈ మార్పులకు అనుగుణంగా, కథ ఎనిమిది అధ్యాయాలుగా ఉండి ఉంటే, కథ చదవటం మరింత సులభతరమయేది.</p>
<p>కొన్ని కథల్లో అధ్యాయవిభజన అవకాశం ఉన్నంతమేరకు జరగటం లేదని నిరూపించటానికి, ఈ రెండు దృష్టాంతాలు సరిపోతాయి.</p>
<p><strong>కథల్లో కనపడుతున్న భాష:  </strong><strong></strong></p>
<p>ఇపుడొస్తున్న తెలుగు కథల్లో, భాష మూడు రకాలుగా వినియోగించబడుతోంది. కొన్ని కథల్లో, కథంతా  ఒకప్పటి తెలుగుకథల్లో విస్తృతంగా ఉపయోగించబడిన వ్యావహారికభాషలో ఉంటోంది. మరికొన్ని కథల్లో కథ మొత్తం ఒక ప్రాంతపు మాండలికాల్తో/యాసతో కనపడుతోంది. ఇంకొన్ని కథల్లో, పాత్రలన్నీ లేదా కొన్ని పాత్రలూ ఒక ప్రాంతపు మాండలికాల్తో/యాసతో మాట్లాడుతుండగా, మిగిలిన కథంతా వ్యావహారికభాషలో రాయబడుతోంది.</p>
<p>వాకిలిలో ఇంతవరకూ వచ్చిన 117 కథల్లో, 97 కథలు పూర్తిగా వ్యావహారికంలో రాయబడ్డాయి. కథ మొత్తం ఒక ప్రాంతపు యాసతో/మాండలికాల్తో, 7 కథలు ఉన్నాయి.  మిగిలిన 13 కథల్లో, సంభాషణలు  ఒక ప్రాంతపు యాసతో/మాండలికాల్తో ఉండగా, తతిమ్మా కథంతా వ్యావహారికంలో ఉంది.</p>
<p>కథలో వాడిన భాష ఎలాంటిదయినా, చదివించగలగటం కథ ప్రాథమిక లక్షణం. కాని, కొన్ని కథల్లో ఉపయోగించిన మాండలికాల అర్థాలు, మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియక పోవటంతో; కథను పూర్తిగా అర్థం చేసుకోవటంలో కొంత అసౌకర్యం ఏర్పడుతోంది. దీన్ని అధిగమించటానికి ఒకటే మార్గం. అలాంటి కథల చివర, వాటిలో ఉపయోగించబడ్డ మాండలికాలూ, వాటికి అర్థాలూ ఇవ్వటం. కాని, అలాంటి ప్రయత్నమేదీ పైన చెప్పిన  20 కథల విషయంలో జరగలేదు (వాస్తవానికి, ఈ లోపం తెలుగులో వస్తున్న అనేక కథల్లో కొట్టవచ్చినట్లుగా కనపడుతోంది). భవిష్యత్తులో ఆ లోపాన్ని పూరించే ప్రయత్నం చేపడితే, మాండలికాల్తో రాసిన  కథలు సైతం, వాకిలి పాఠకులకి మరింత దగ్గర కాగలవు.</p>
<p>తన కథలో; మిగిలిన ప్రాంతాలవారికి అర్థం తెలియని మాండలికాలు ఏవి? అన్నది అదే కథారచయితకి పూర్తిగా తెలియటానికి అవకాశాలు తక్కువ. వాటిని మిగిలిన ప్రాంతాల కథకులు/లేదా పాఠకుల మాత్రమే పూర్తిగా గుర్తించగలరు. వారితో ఆ పని చేయించి, వాటి అర్థాలను కథకుడి ద్వారా ఇప్పించి, కథ చివర పొందుపర్చాలి.</p>
<p><strong>కథనరీతి:   </strong><strong></strong></p>
<p>వాకిలిలో ఇంతవరకూ వచ్చిన 117 కథల్లో; ఉత్తమపురుష లో రాయబడిన కథలు 64, బహుళ ఉత్తమపురుషలో చెప్పబడిన కథలు 2, ప్రథమపురుషలో వచ్చిన కథలు 51. సాధారణంగా ఉత్తమపురుషలో కథ ‘నేను’ పరంగా నడుస్తుంది.   దాన్ని ‘మేము’ తో కూడా నడపవచ్చు. కాని, అలా నడిచిన కథలేవీ వాకిలిలో రాలేదు. మధ్యమపురుషలో కథ; ‘నువ్వు’ పరంగా కానీ, ‘మీరు’ పరంగా కానీ చెప్పబడుతుంది. ఈ తరహాలో చెప్పబడే కథలు చాలా అరుదు. వాకిలిలో అలాంటి కథలు కూడా ఏవీ రాలేదు. కొందరు కథకులయినా, ఈ రెండు రీతుల్లో కథ రాసే  ప్రయత్నాన్ని చేపడితే బాగుండును అని వాకిలి పాఠకుడుగా నాకు అనిపిస్తోంది.</p>
<p><strong>కథ ప్రారంభం:   </strong><strong></strong></p>
<p>చదువుకోవటానికి కథని ఎన్నుకునే విషయంలో సహాయపడేది దాని ఆరంభం లేదా ఎత్తుగడ. కొన్ని దశాబ్దాల క్రితం తెలుగులో చాలా కథలు ఒక వర్ణనతో ప్రారంభమయ్యేవి. కథలో అంతర్భాగంగా, అనివార్యంగా కనపడే ఆ వర్ణనకీ; కథకీ సంబంధం ఉందా లేదా అనే విషయం పాఠకులు పెద్దగా  పట్టించుకునేవారు కాదు. కాలక్రమేణా ఈ ధోరణి తక్కువయింది. దాంతో           ఎక్కువభాగం తెలుగుకథలు ఇప్పుడు ఒక భావప్రకటనతోనో, భౌతికచర్యతోనో, సంభాషణతోనో మొదలవుతున్నాయి. కథపై, పాఠకుడికి ఉత్కంఠత కలిగించటానికి తద్వారా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాకిలిలో కథలు, ఎన్ని ఏ రకంగా మొదలయ్యాయి అంటే-</p>
<p>భావప్రకటనతో మొదలయిన కథలు 65 (ఉదాహరణ: ఇంత ఉద్వేగాన్ని జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు, నేను. కథ-<a href="http://vaakili.com/patrika/?p=177" target="_blank">చరిత్రహీనులు</a>/<a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BF" target="_blank">యాజి</a>/జనవరి 2013). సంభాషణతో ప్రారంభమయిన కథలు 20 (ఉదాహరణ: “ఇవాళ గేమ్ వుంది తెలుసుగా. తొందరగా తయారవు. ఏం తింటావు?” స్కూల్  నుంచి అప్పుడే వచ్చిన క్రిస్  కి గబ గబా చెప్పేస్తోంది సుచిత్ర. కథ-హోమ్ రన్/ <a href="http://vaakili.com/patrika/?tag=%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2">కల్పనా రెంటాల</a>/ఫిబ్రవరి 2013). భౌతికచర్యతో ఆరంభించిన కథలు 13 (ఉదాహరణ: కాలేజీ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో మా అమ్మ క్రింద కూర్చుని ఉన్నదల్లా లేచి నాకు ఎదురొచ్చి నా బుగ్గలు పుణుకుతూ “అదృష్టవంతురాలివే తల్లీ. మామయ్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు” అంది. కథ-<a href="http://vaakili.com/patrika/?p=4216" target="_blank">అనుబంధం</a>/<a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%E0%B0%B5-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A7" target="_blank">మండువ రాధ</a>/నవంబర్ 2013).</p>
<p>వర్ణనతో ఎత్తుకోబడిన కథలు 19 (ఉదాహరణ: అప్పుడే వర్షం పడిందేమో ఆకులన్నీ తడితడిగా పచ్చగా మెరుస్తున్నాయ్. వర్షం బరువుకు వాలిన గులాబీ నుండి నీటిచుక్క నేలమీదకు జారుతో౦ది. చూరు నుండి నీళ్లు ధారగా పడుతున్న చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఉండుండి వీస్తున్న గాలికి మేపల్ ఆకులు మెల్లగా కదులుతున్నాయ్. మేఘాల మాటునున్న సూరీడు ఒక్కో కిరణాన్ని గురిచూసి పంపుతున్నట్లుగా ఏటవాలుగా పడుతోంది నీరెండ. వర్షం వెలిసిన తరువాత మాత్రమే కనిపించే అరుదైన వెలుగుతో మెరిసిపోతోందా ప్రదేశం. కిటికీలోంచి ఆ సౌందర్యాన్ని చూస్తూ టీ తాగుతోంది రాధిక. కథ-<a href="http://vaakili.com/patrika/?p=1481" target="_blank">వికసించిన పువ్వు</a>/<a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%AF%E0%B0%BF" target="_blank">జ్యోతిర్మయి</a>/మార్చ్ 2013).</p>
<p><strong>కథకుల్లో పురుషులెంతమంది</strong><strong>? </strong><strong>మహిళలెంత మంది</strong><strong>? </strong></p>
<p>మొత్తం 117 కథల్లో; 62 కథలు పురుషుల కలంనుంచి జాలువారితే, 55 కథలు మహిళల చేతిలో రూపు దిద్దుకున్నాయి. 2013, 2014 సంవత్సరాల్లో పురుషులు రాసిన 16, 9 కథలకన్నా మహిళలు రాసిన కథలు  ఎక్కువగా అంటే 17, 14 వచ్చాయి. 2015, 2016 సంవత్సరాల్లో ఈ ధోరణి మారి పురుషుల కథలు ఎక్కువయ్యాయి. ఈ సంవత్సరాల్లో పురుషుల కథలు 25, 12 కాగా మహిళలు రాసిన కథలు 16, 8.</p>
<p><strong>ఎవరు ఏ భాష ఎక్కువగా వాడుతున్నారు</strong><strong>? </strong></p>
<p>వ్యావహారికం, ఒక ప్రాంతపు యాస/మాండలికాలు కలిపి పురుషులు రాసిన కథలు 6. మహిళలు రాసినవి 7. పూర్తిగా మాండలికం/ఒక ప్రాంతపు యాసలో పురుషులు రాసిన కథలు 05. మహిళలు రాసిన కథలు 2. పురుషులు 51 కథల్ని, మొత్తం కథని వ్యావహారికంలో రాయగా; అదే తరహాలో మహిళలు 46 కథలు రాశారు.</p>
<p><strong>ఎవరు ఏ కథనరీతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు</strong><strong>?</strong></p>
<p>ప్రథమ పురుషలో పురుషులు రాసిన కథలు 31. మహిళలు రాసినవి 20. ఉత్తమ పురుష లో పురుషులు రాసిన కథలు 31. మహిళలు రాసినవి 35. వీటిలో బహుళ ఉత్తమపురుషలో రాసిన కథలు 2. వీటిని ఒక్కొక్కటి చొప్పున పురుషకథకులూ, మహిళా కథకులూ రాశారు.</p>
<p><strong>ఎవరు కథని ఎలా ఆరంభిస్తున్నారు</strong><strong>?</strong></p>
<p>పురుషులు రాసిన కథలు భావప్రకటనతో ఆరంభమైనవి 30. ఈ ప్రారంభంతో మహిళలు రాసిన కథలు 35. పురుషులు రాసిన కథల్లో  భౌతిక చర్యతో ప్రారంభమయిన కథలు 7. ఈ ధోరణిలో మహిళలు రాసిన కథలు 6.  పురుషులు రాసిన కథల్లో వర్ణనతో మొదలయినవి 13. ఇదే పద్ధతిలో మహిళలు రాసిన కథలు 6. పురుషులు రాసిన కథలు సంభాషణతో ఆరంభమయినవి 12. ఇదే విధానంలో మహిళలు రాసిన కథలు 8.</p>
<p><strong>విరామచిహ్నాల వాడకం: </strong><strong></strong></p>
<p>ఒక కథని సౌకర్యవంతంగా చదివించే విషయంలో, విరామచిహ్నాలది అత్యంతప్రధానమయిన పాత్ర.  వాకిలిలో కొన్ని కథల్లో విరామచిహ్నాలు వాడిన విధానం ఇలా ఉంది.</p>
<p>కథ పేరు/<a href="http://vaakili.com/patrika/?p=9884" target="_blank">పునర్నిర్మాణం</a>/అరుణ పప్పు/జనవరి 2016:</p>
<p>కథలో పాత్రలు పరస్పరం పిలుచుకున్నపుడు, పాత్ర పేరు తర్వాత ఆశ్చర్యార్థకం ఉంచటం ఒక పద్ధతి. కాని 28, 42 పేరాల్లో పిలుపు తర్వాత కామా ఉంటే, 66 పేరాలో పిలుపు తర్వాత మూడు చుక్కలున్నాయి. ఆశ్చర్యార్థకం అవసరం లేదని రచయిత భావిస్తే, మూడు చోట్లా కామాయే ఉండాలి లేదా మూడు చుక్కలుండాలి. (పిలుపు పక్కన కామానో, మూడు చుక్కలో ఉండటం ఈ కథలోనే కాదు. మిగిలిన కథల్లో సైతం కనపడుతోంది.)</p>
<p>కథ రెండో పేరాలో నాలుగు సంపూర్ణవాక్యాలు ఉన్నాయి. వాటి చివర ఉండవలసిన ఫుల్ స్టాప్, ఒక వాక్యం చివర మాత్రమే ఉంది. మిగిలిన మూడు వాక్యాల చివర ఎలిప్సిస్ అనబడే మూడు చుక్కలు ఉన్నాయి.</p>
<p>విరామచిహ్నాల్లో ఫుల్ స్టాప్ రూపంలో ఒక చుక్కా, ఎలిప్సిస్ రూపంలో మూడు చుక్కలు మాత్రమే ఉన్నాయి. ఒక పాత్ర కానీ, కథకుడు కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పలేని సందర్భాల్లో మాత్రమే ఎలిప్సిస్ వాడాలి. ఒక వాక్యాన్ని ఆపి, కొనసాగించదల్చుకున్నపుడు కామా వాడాలి. కాని, కథలో అనేక చోట్ల రెండు చుక్కలూ, మూడు చుక్కలూ అవసరమైన దానికన్నా ఎక్కువ కనపడ్డాయి.</p>
<p>పదిహేడో పేరా ఒక సంభాషణ. అది ఒక పిలుపుతో అంతమయింది. పిలుపు చివర ఆశ్చర్యార్థకం బదులు నాలుగు చుక్కలు ఉన్నాయి. డెబ్భయ్యారో పేరాలో, ఒక పాత్ర మరో పాత్రని ఒక ప్రశ్న అడుగుతుంది. అడిగిందావిడ అనే పదంతో ఆ వాక్యం అంతమవుతుంది. అయినా ఆ ప్రశ్న చివర ప్రశ్నార్థకం లేదు.</p>
<p>సంభాషణని ఇన్వర్టెడ్ కామాల్లో ఉంచడం విధిగా ఒక పద్ధతి. అలా ఉంచిన సంభాషణ చివరి పదం తర్వాత ఆశ్చర్యార్థకం కానీ, ప్రశ్నార్థకం కానీ వాడవలసిన అవసరం లేకపోతే అవసరాన్ని బట్టి కామా లేదా ఫుల్ స్టాప్ మాత్రమే వాడాలి. కాని, సంభాషణలున్న పద్దెనిమిదో పేరా తుది పదం తర్వాత రెండు చుక్కలూ, ముప్పయ్యయిదో పేరా చివరి పదం  తర్వాత మూడు చుక్కలూ, ఏభైనాలుగో పేరా ఆఖరి పదం తర్వాత నాలుగు చుక్కలున్నాయి.</p>
<p>ఒక పాత్ర, మరో పాత్రతో జరిపిన సంభాషణలో; ఇంకో పాత్ర మాట్లాడిన మాటలు యథాతథంగా ఉటంకించినపుడు మాత్రమే, ఆ మాటలని సింగిల్ కోట్స్ లో ఉంచాలి. దీనికి పూర్తి భిన్నంగా; ఒక కథలో(<a href="http://vaakili.com/patrika/?p=795" target="_blank">రాజా వచ్చేశాడు</a>-మూలకథ/అళగిరి స్వామి-అనువాదం/రాజేంద్రకుమార్ దేవరపల్లి-ఫిబ్రవరి 2013); ఒక పేరాలో తప్ప, మిగిలిన చోట్ల ఉన్న అసలు సంభాషణలే, ఇన్వర్టెడ్ కామాల్లో బదులు సింగిల్ కోట్స్ లో ఉన్నాయి. అదే కథలో కొన్ని సంభాషణల ఆరంభంలోనూ ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగం బదులు, రెండో భాగం ఉంది. ఇది ముద్రారాక్షసమో, మరే ఇతర కారణం వల్ల దొర్లిన దోషమో తెలీదు.</p>
<p>ఒక కథని స్వగతం రూపంలో అయిదు పాత్రలు చెప్పాయి (<a href="http://vaakili.com/patrika/?p=11009" target="_blank">నాలుగు స్తంభాలాట</a>-మండువ రాధ-మే 2016). ఆడపావురం, పిల్లపావురం కథనాల్లో మొదటి పేరా, ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగంతో మొదలయితే, చివరి పేరా ఇన్వర్టెడ్ కామాల్లో రెండో భాగంతో అంతమయింది. తిక్కపావురం కథనంలో మొదటి పేరా ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగంతో మొదలయితే. ఆఖరి పేరా ఆశ్చర్యార్థకంతో/ప్రశ్నార్థకంతో అంతమయింది. మగపావురం  కథనంలో రెండు పేరాలుంటే, రెండూ ఇన్వర్టెడ్ కామాలతో మొదలయి, అంతమయాయి. గోపురం పావురం కథనంలో మొదటి పేరాకి ఇన్వర్టెడ్ కామాల్లో మొదటి భాగం ఉంటే, చివర ఏమీ లేదు. రెండు నుంచి పదిహేడో పేరా చివర వరకూ, ఇరవై మూడు నుంచి ఇరవై అయిదో పేరా వరకు ఎలాంటి ఇన్వర్టెడ్ కామాలు లేవు. చిత్రంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండో పేరా వరకూ; అన్ని పేరాలూ ఇన్వర్టెడ్ కామాతో మొదలయి, అంతమయాయి. ఆడపావురం, పిల్లపావురం చెప్పిన కథలో సంభాషణలు సింగిల్ కోట్స్ లో ఉండగా, గోపురం పావురం వినిపించిన కథలో సంభాషణలు ఇన్వర్టెడ్ కామాల్లో ఉన్నాయి.</p>
<p>వీటన్నిటి వలన, అయిదు పాత్రల కథనానికి ఇన్వర్టెడ్ కామాలు వాడిన పద్ధతి, ఈ క్రింద ఉటంకించిన ప్రమాణానికి లోబడి లేదు అనిపిస్తోంది.</p>
<p>“The convention is to give opening quotation marks to the first and each subsequent paragraph, using closing quotation marks only for the final paragraph of the question.”</p>
<p>రెండు అంతకు మించి భావాలని ఒక వాక్యంలో ఇమడ్చాలనుకున్నపుడు సెమికోలన్ వాడాలి. అలా కాకుండా అన్ని చోట్లా కామాలే వాడితే, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది. కామా స్వల్పవిరామాన్ని తెలిపితే, ఫుల్ స్టాప్ పూర్తి విరామాన్ని తెలుపుతుంది. సెమికోలన్ ది ఈ రెండిటి మధ్య స్థాయి. కొన్ని కథల్లో ఉన్న వాక్యాల్లో సెమికోలన్ వాడవలసిన అవసరం ఉన్నా, వాడని సందర్భాలు ఉన్నాయి. ఈ ఉదాహరణని చూడండి.</p>
<p><strong><em>            </em></strong><em>&#8220;</em><em>ప్రకృతిని</em><em>, </em><em>పచ్చటి పరిసరాలను గమనించడం</em><em>, </em><em>అందమైన దృశ్యాలను</em><em>, </em><em>స్థలాలను నా కెమెరాలో బంధించడం</em><em>…</em><em>ఇంకా ఎంతోమందిలో చూడాలన్న తపన కలిగేలా వాటి గురించి రాయడం&#8230;ఇదంతా నా వృత్తి.&#8221;</em><strong><em></em></strong></p>
<p><strong>(</strong><a href="http://vaakili.com/patrika/?p=9884" target="_blank">పునర్నిర్మాణం</a>/రచయిత అరుణ పప్పు/ జనవరి 2016). <strong><em></em></strong></p>
<p><strong><em>            </em></strong>ఈ వాక్యంలో ఉన్న భావవ్యక్తీకరణలో మూడు చర్యలున్నాయి. ఈ మూడు చర్యల మధ్య కామాలతో, చుక్కలతో విరామం ఇవ్వకుండా, ఒక చోట సెమికోలన్ తో మరింత పెద్ద విరామం ఇచ్చినట్లయితే అదే వాక్యం ఇలా మరింత అర్థవంతంగా ఉండి, అవగాహన ఇంకా సులభమయేది.</p>
<p><em>&#8220;ప్రకృతిని</em><em>, </em><em>పచ్చటి పరిసరాలను గమనించడం</em><em>;</em><em> </em><em>అందమైన దృశ్యాలను</em><em>, </em><em>స్థలాలను నా కెమెరాలో బంధించడం</em><em>,</em><em> </em><em>ఇంకా ఎంతోమందిలో చూడాలన్న తపన కలిగేలా వాటి గురించి రాయడం</em><em>,</em><em> </em><em>ఇదంతా నా వృత్తి.&#8221;</em><strong><em>     </em></strong></p>
<p>ఇప్పుడొస్తున్న కథల్లో కొంతమంది కథయితలు (ఈ పదం రచయితలకు పర్యాయ పదం. శబ్దార్థ చంద్రిక- 283 పేజీ) పెద్దపెద్ద వాక్యాలవైపు మొగ్గు చూపడంలేదు. కామాల వాడకం తగ్గించడానికి, అవకాశం ఉన్నంతవరకూ చిన్నచిన్న వాక్యాలే రాస్తున్నారు. సరయిన విరామచిహ్నాలు వాడి, అర్థాన్ని సరిగా అందించగలిగితే వాక్యం పెద్దగా ఉన్నా, అభ్యంతరకరం కాదు. దానికి భిన్నంగా ఉన్న ఈ పెద్ద వాక్యం చూడండి.</p>
<p><em>&#8220;అప్పుడు అత్తగారిని ఏహ్యంగా చూశాను కాని తానూ ఓ నిస్సహాయురాలేగా పాపం ఏం చేయగలదు సానుభూతి చూపించడం తప్ప&#8221; </em>( కృతి/<a href="http://vaakili.com/patrika/?tag=%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%b5-%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7">మండువ రాధ</a>/జనవరి 2016).<em> </em><strong><em></em></strong></p>
<p>అందుబాటులో ఉన్న విరామచిహ్నాలని సముచితంగా ఉపయోగించి పై వాక్యాన్ని ఈ విధంగా రాసి ఉండవచ్చు. కాని, అలా జరగలేదు.</p>
<p><em>&#8220;అప్పుడు అత్తగారిని ఏహ్యంగా చూశాను.  కాని</em><em>,</em><em> </em><em>తనూ ఓ నిస్సహాయురాలేగా! పాపం ఏం చేయగలదు</em><em>?</em><em> </em><em>సానుభూతి చూపించడం తప్ప.&#8221;</em><strong><em></em></strong></p>
<p><strong>వాక్యనిర్మాణం:</strong></p>
<p>కథని చదివించగలగడంలో వాక్యనిర్మాణానిది చాలా ముఖ్యమైన పాత్ర.</p>
<p>కథకుడి మనసులో భావం ఎంత క్లిష్టమయినదయినా, అది సులభంగా పాఠకుడికి చేరాలంటే సరయిన వాక్యనిర్మాణం, పదాల పొందిక ప్రధానం.  దానికి వ్యతిరేకంగా; వాక్యనిర్మాణమే క్లిష్టంగా ఉంటే సరళమయిన భావం కూడా పాఠకుడికి చేరదు.</p>
<p>చిన్నచిన్న వాక్యాలు చదవడానికి సౌకర్యంగా అనిపిస్తాయి. కారణం, వాటిని చదవటానికి పట్టే సమయం చాలా తక్కువ. చదవటం పూర్తికాగానే ఆ వాక్యం అందించిన భావాన్ని తన జ్ఞాపకంలో నిక్షిప్తం చేసుకోవటానికీ,  మరో వాక్యంలోకి పాఠకుడు సత్వరం వెళ్లటానికీ అవి దోహదిస్తాయి. పెద్ద వాక్యాల్లో ఆ సౌలభ్యం అంత సులభంగా లభించదు. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి. .</p>
<p><em>&#8220;కొన్నాళ్ళుగా ఆయన నన్ను విస్మరించి ఆమె మందిరంలోనే ఉంటూ నా దగ్గరకి రాకపోవడం వల్ల నేను దు:ఖిస్తున్నానని భావించి పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని నా గురువుగారే పూనుకుని ఆ గ్రంథం రాశారని ఎవరికి తెలుస్తుంది</em><em>?&#8221;</em> (కృతి/<a href="http://vaakili.com/patrika/?tag=%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%b5-%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7">మండువ రాధ</a>/జనవరి 2016).</p>
<p>నిజానికి ఈ వాక్యాన్ని, ఇంకా చిన్నచిన్న వాక్యాలుగా రాయవచ్చు. రాసి, భావాన్ని మరింత సులభంగా పఠితకు అందించి ఉండవచ్చు. ఎలాగంటే-</p>
<p><em> &#8221;ఆయన నన్ను విస్మరించి </em><em>కొన్నాళ్లుగా </em><em>ఆమె మందిరంలోనే </em><em>ఉంటున్నారు. ఆయన </em><em>నా దగ్గరకి రాకపోవడం వల్ల నేను దు:ఖిస్తున్నానని </em><em>గ్రహించి</em><em>,</em><em> </em><em>పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని నా గురువుగారే పూనుకుని ఆ గ్రంథం </em><em>రాసి ఉంటారు. కాని</em><em>, </em><em>ఆ నిజం </em><em>ఎవరికి తెలుస్తుంది</em><em>?&#8221;</em><strong><em></em></strong></p>
<p>ఒక పాత్ర ఒక పని చేసి ఉండటం, చేస్తూ ఉండటం, చేస్తుంది అని అనుకోవటంలో చాలా తేడా ఉంది. ఈ తేడాని గ్రహించకుండా కొందరు కథకులు ఆ చర్యని వర్ణిస్తారు. దాంతో పాఠకుడి మనసులో కొంత అయోమయం ఏర్పడుతుంది. ఈ ఉదాహరణ చూడండి.</p>
<p><em>&#8220;ఒక కెమికల్ ఫాక్టరీలో పని చేస్తూ</em><em>, </em><em>ఇంటరు చదువుతున్న కూతురుతో నెట్టుకొస్తుంది.&#8221;</em> (<a href="http://vaakili.com/patrika/?p=10116" target="_blank">చేదుపూలు</a>/<a href="http://vaakili.com/patrika/?tag=%e0%b0%ae%e0%b1%86%e0%b0%b9%e0%b1%86%e0%b0%b0%e0%b1%8d">మెహెర్</a>/<em>ఫిబ్రవరి </em><em>2016</em><em>). </em><strong><em></em></strong></p>
<p>కథనం ప్రకారం ఈ చర్య ఇంకా పూర్తి కాలేదు. జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు, పై వాక్యం ఇలా ఉంటే ఇంకా బాగుండేది.</p>
<p><em>&#8220;ఒక కెమికల్ ఫాక్టరీలో పని చేస్తూ</em><em>, </em><em>ఇంటరు చదువుతున్న కూతురుతో నెట్టు</em><em>కొస్తోంది.&#8221;</em></p>
<p>కొన్ని వాక్యాల్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పదాలు ఉంటాయి. ఈ వాక్యం దానికి ఒక నిదర్శనం. <strong><em>            </em></strong><em>&#8220;</em><em>&#8230;సతీత్వమూ పటాపంచలుగా</em><em>, </em><em>చెల్లాచెదురుగా విరిగి పడిపోయింది.&#8221; </em>(కృతి/<a href="http://vaakili.com/patrika/?tag=%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%b5-%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7">మండువ రాధ</a>/జనవరి 2016).</p>
<p>ఇక్కడ రచయిత భావం, సతీత్వం విరిగి పడిపోయిందని, చెల్లాచెదురయిందని. పటాపంచలయిందని. పటాపంచలు అంటే అర్థం చెల్లాచెదరులు (శబ్దార్థ చంద్రిక-పేజీ 814). ఇక చెల్లాచెదరంటే మిక్కిలి చెదరినది (శబ్దార్థ చంద్రిక-పేజీ 513). ఇంచుమించుగా ఈ రెండు పదాల అర్థం ఒకటే. చెప్పదలుచుకున్న భావం ఒకటే అయినపుడు, ఒకే అర్థం వచ్చే రెండు పదాలను వాక్యంలో ప్రయోగించటం వలన అదనపు ప్రయోజనం ఏమీ సమకూరదు. ఇది దృష్టిలో పెట్టుకుంటే, ఈ వాక్యాన్ని ఈ రెండు రకాల్లో ఏదో ఒక రకంగా రాసి ఉండవచ్చును.</p>
<p><em>&#8220;సతీత్వం విరిగి పటాపంచలుగా పడిపోయింది.&#8221;  లేదా &#8220;</em><em>సతీత్వం విరిగి చెల్లాచెదరుగా పడిపోయింది.&#8221;</em><strong><em>  </em></strong></p>
<p>అలాంటిదే అదే కథలో ఉన్న<em>‘</em><em>సంఘర్షణ పడీ పడీ మనసు జీవాన్ని కోల్పోయి మరణించింది.</em><em>’</em> అనే వాక్యం కూడా. మనసు జీవాన్ని కోల్పోవటమంటేనే మరణించడం. అందువల్ల మనసు జీవాన్ని కోల్పోయిందన్నా, కాదూ నిర్జీవమయిందన్నా, లేదా మరణించిందన్నా సరిపోయి ఉండేది.</p>
<p>ఒక వాక్యంలో ఒక బహువచనం ఒక పనికి కారణభూతమయింది. అదే వాక్యంలో మరో ఏకవచనం అదే పనికి దారితీసింది. ఆ పని ఫలితాన్ని చెప్పేప్పుడు ఏకవచనంతో అంతం చెయ్యాలా? బహువచనంతో అంతం చెయ్యాలా అనే సమస్య ఏర్పడుతుంది.</p>
<p>ఈ సమస్యనుంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం. పనికి కారణమయిన రెండిటినీ, ఏకవచనమో బహువచనమో చెయ్యటం. ఈ వాక్యం పరిశీలించండి.</p>
<p><strong><em>            </em></strong><em>&#8220;</em><em>కూలీల కోలాహలం</em><em>, </em><em>ట్రాక్టరు చప్పుళ్లు కొండ మీది నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడూ పగలగొడుతున్నాయి</em> &#8221;(పునర్నిర్మాణం/అరుణ పప్పు/జనవరి 2016).</p>
<p>ఇక్కడ కూలీల కోలాహలం ఏకవచనం. ట్రాక్టరు చప్పుళ్లు బహువచనం. పగలగొడుతున్నాయి బహువచనానికి వర్తింపచేయాల్సినది. అది కూలీల కోలాహలం అనే ఏకవచనానికి ఇమడదు. పై వాక్యాన్ని ఈ రెండిట్లో ఏదో ఒక రకంగా రాసి ఉంటే, అన్వయకాఠిన్యత ఏర్పడి ఉండేది కాదు.</p>
<p><strong><em>            &#8220;</em></strong><em>కూలీల కోలాహలం</em><em>, </em><em>ట్రాక్ట</em><em>ర్ల</em><em> చప్పు</em><em>డూ</em><em> కొండ మీది నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడూ పగలగొడుతున్నాయి. కూలీల కోలాహ</em><em>లాలూ </em><em>, </em><em>ట్రాక్ట</em><em>ర్ల </em><em> చప్పు</em><em>ళ్లూ</em><em> కొండ మీది నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడూ పగలగొడుతున్నాయి.&#8221;</em> కొన్ని వాక్యాల్లో పదం ఉండగూడని చోట ఉంటే, రావాల్సిన అర్థం రాదు. కాగా, ఒక్కోసారి అది విపరీతార్థాన్ని కూడా ఇవ్వవచ్చు. ఈ వాక్యాన్ని చూడండి. <strong><em>     </em></strong><strong><em></em></strong></p>
<p><strong><em>            </em></strong><em>&#8220;</em><em>బుద్ధుడి శరీరంలోని ఎముకనొకదాన్ని భరిణలో పెట్టి బొజ్జన్నకొండ స్తూపంలో భద్రపరిచారని</em><em>, </em><em>దాంతో పాటు ఎన్నో ఏళ్ల కిందటి మట్టిపాత్రలు దొరికాయని చెబుతోంది అక్కడ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెచ్చులూడుతున్న బోర్డు&#8221; </em>(పునర్నిర్మాణం/అరుణ పప్పు/జనవరి 2016)<strong><em>.</em></strong><strong><em></em></strong></p>
<p>ఇక్కడ అసలు ఉద్దేశం భారతప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు, పెచ్చులూడిపోయిందని. కాని, వాక్యం ఆ అర్థం ఇవ్వటం లేదు. భారతప్రభుత్వం పెచ్చులూడిపోయిన బోర్డు ఏర్పాటు చేసిందన్న అర్థం ధ్వనిస్తోంది. అదే  వాక్యాన్ని ఈ రకంగా రాసి ఉంటే మరింత అర్థవంతంగా ఉండేది.</p>
<p><strong><em>            </em></strong><em>&#8220;</em><em>బుద్ధుడి శరీరంలోని ఎముకనొకదాన్ని భరిణలో పెట్టి బొజ్జన్నకొండ స్తూపంలో భద్రపరిచారని</em><em>, </em><em>ఎన్నో ఏళ్ల కిందటి మట్టిపాత్రలు దాంతో పాటు దొరికాయని చెబుతోంది అక్కడ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు. </em><em>ఆ బోర్డు కూడా </em><em>పెచ్చులూ</em><em>డిపోయి ఉంది.&#8221;</em><strong><em></em></strong></p>
<p><strong><em>            </em></strong>ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. భరిణ అనే పదం శబ్దార్థచంద్రికలో కానీ, శబ్దరత్నాకరంలో కానీ లేదు. దీన్ని బరణి అని రాయాలి. బరణి అంటే కాటుక మొదలగునవి యుంచుకొనెడు పాత్రము, కరాటము (శబ్దార్థ చంద్రిక-పేజీ 949).</p>
<p>చివరగా ఈ వాక్యం కూడా చూడండి.</p>
<p><strong><em>            &#8220;</em></strong><em>నా ఆలోచనలు తనదాకా వెళ్లినట్టు</em><em>, </em><em>నా మోకాలిమీద వారిస్తున్నట్టుగా తట్టింది ప్రతిమ.&#8221;</em><strong><em></em></strong></p>
<p>ఇదే వాక్యం ఇలా ఉంటే మరింత అర్థవంతంగా ఉండేది కదా? <strong>    </strong><strong></strong></p>
<p><strong><em>            &#8220;</em></strong><em>నా ఆలోచనలు తనదాకా వెళ్లిన</em><em>ట్టుంది. </em><em>వారిస్తున్నట్టుగా నా మోకాలిమీద తట్టింది ప్రతిమ.&#8221;</em><strong><em></em></strong></p>
<p><strong>సంభాషణా శైలి: </strong><strong></strong></p>
<p>కథల్లో సంభాషణలని సాధారణంగా మూడు రకాలుగా రాస్తుంటాము. ఒక పద్ధతి, ఒకటికి మించి పాత్రల సంభాషణని ఒకే పేరాగా రాయటం. రెండోది, ప్రతి పాత్ర సంభాషణనూ విడి పేరాల్లో రాయటం. మూడో పద్ధతి, కథనంతో సంభాషణలని కలిపి రాయటం.</p>
<p>పై నేపథ్యంలో 2016 సంవత్సరంలో వచ్చిన 20 కథలని (ఒక అనువాదకథని మినహాయించి) సంభాషణల ధోరణి ఆధారంగా విశ్లేషిస్తే ఫలితం ఇది.</p>
<p>అసలు సంభాషణలు లేని కథలు=3; సంభాషణలు కథనంతో కలిసిన కథలు=2; సంభాషణలను విడి పేరాల్లో రాసిన కథలు=14. ఒక కథలో, మొదటి నాలుగుపేజీల్లో సంభాషణలే లేవు. చివరిపేజీలో మాత్రం సంభాషణలకు విడిగా పేరాలున్నాయి.</p>
<p>పై మూడు పద్ధతుల్లో ఏ పద్ధతిలో రాయటం అనేది సరైనది అన్న ప్రశ్నకు జవాబు చెప్పటం కష్టం. కాని, చదవటానికి ఏది సౌకర్యవంతంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. కథనంతో కలిపి, ఒక కథలో ఒకే పేరాగా రాయబడిన సంభాషణలని మొదట చూసి; దాన్నే ఉదాహరణగా తీసుకుని అందులో సంభాషణలని విడిగా రాసిన ప్పుడు ఎలా ఉంటుందో చూడండి. నేను చెప్పాలనుకున్నది, చెప్పకుండానే మీకు అవగతమవుతుంది.</p>
<p><strong>ఉదాహరణ 01: (కథ-<a href="http://vaakili.com/patrika/?p=10111" target="_blank">చెదరిన ప్రతిబింబం</a>/<a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B5%E0%B1%87%E0%B0%A3%E0%B0%BF" target="_blank">క్రిష్ణవేణి</a>/ఫిబ్రవరి 2016)</strong><strong></strong></p>
<p>“హలో రాధికా, రేపటి డిన్నర్ మా ఇంట్లోనే అని గుర్తుందిగా?”  ప్రతిమకి గుర్తు చేశాను. ‘వాట్ ఈజ్ యువర్ పాయిసన్!’ అని నిన్ను అడగక్కరలేదుగా! వోడ్కా, ఆరెంజ్ జ్యూసేనా?” నిన్న సాయంత్రం రేణుక ఫోన్. ఈ మధ్య ఇంగ్లీష్ తెగ వాడుతోందే! కాక్‌టెయిల్స్ గురించి కూడా బట్టీ పట్టినట్టుంది.నిజం చెప్పాలంటే, ఈ నెలవారీ డిన్నర్ల ఏర్పాటు గురించి ఆఫీసు పనుల్లో పడి మరిచేపోయాను. అలా అని ఒప్పుకోడానికి సిగ్గేసి, “ఆ, గుర్తుందిలే. ఏదన్నా వండి తీసుకు రమ్మన్నావా?” ఫార్మాలిటీ పూర్తి చేస్తూ అడిగాను.“నిన్ను నువ్వు తెచ్చుకో, చాలు. వండడానికి రామూ ఉన్నాడు.”- రక్షించింది. మా ఆయన విక్రమ్ అయితే,”మనమే వంటకాలు పట్టికెళ్తే, మరి వాళ్ళింట్లో డిన్నరేమిటింక! నా మొహం.” అని విసుక్కుంటాడు.ప్రతిమకి ఫోన్ చేసాను.“మూడు రోజుల తరువాత రేణుక పుట్టినరోజు. మనందరికీ ఆఫీసుంటుంది కదా అని, పనిలో పనిగా ఆదివారమే పిలిచిందంతే.“ అంది. నాకున్న మతిమరపుతో, “ఓహో, తన పుట్టినరోజా!”-అనబోయి, నాలుక్కరచుకుని,“గిఫ్టేం కొంటున్నావు?” అడిగాను.“బాబోయ్, తనకి గిఫ్టు కొనడమా! కిందటిసారి నేను సిల్కు చీర కొన్నానా? ఎంత శ్రద్ధగా ఎంచి మరీ కొన్నాను! బాగుందని కానీ థేంక్సు చెప్పడం కానీ లేకపోగా, ఈనాటివరకూ దాని ఊసే ఎత్తలేదు. తనకి ఆ మర్యాదలు తెలిస్తే కదా? ఇంటికి పనికొచ్చే వస్తువేదో తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వూ అలాంటిదే ఏదో కొనియ్యి.”- సలహా పడేసింది.</p>
<p><strong>ఉదాహరణ 02: (ఉదాహరణ 1 ని మార్చి రాసినది) </strong><strong></strong></p>
<p>“హలో రాధికా! రేపటి డిన్నర్ మా ఇంట్లోనే అని గుర్తుందిగా?” ప్రతిమకి గుర్తు చేశాను.</p>
<p>‘వాట్ ఈజ్ యువర్ పాయిసన్!’ అని నిన్ను అడగక్కరలేదుగా! వోడ్కా, ఆరెంజ్ జ్యూసేనా?” నిన్న సాయంత్రం రేణుక ఫోన్.</p>
<p>ఈ మధ్య ఇంగ్లీష్ తెగ వాడుతోందే! కాక్‌టెయిల్స్ గురించి కూడా బట్టీ పట్టినట్టుంది. నిజం చెప్పాలంటే, ఈ నెలవారీ డిన్నర్ల ఏర్పాటు గురించి ఆఫీసు పనుల్లో పడి మరిచేపోయాను. అలా అని ఒప్పుకోడానికి సిగ్గేసి, “ఆ, గుర్తుందిలే. ఏదన్నా వండి తీసుకు రమ్మన్నావా?” ఫార్మాలిటీ పూర్తి చేస్తూ అడిగాను.</p>
<p>“నిన్ను నువ్వు తెచ్చుకో.  చాలు. వండడానికి రామూ ఉన్నాడు,”</p>
<p>-రక్షించింది. మా ఆయన విక్రమ్ అయితే, “మనమే వంటకాలు పట్టికెళ్తే, మరి వాళ్ళింట్లో డిన్నరేమిటింక! నా మొహం.” అని విసుక్కుంటాడు. ప్రతిమకి ఫోన్ చేసాను.</p>
<p>“మూడు రోజుల తరువాత రేణుక పుట్టినరోజు. మనందరికీ ఆఫీసుంటుంది కదా అని, పనిలో పనిగా ఆదివారమే పిలిచిందంతే,“ అంది.</p>
<p>నాకున్న మతిమరపుతో, “ఓహో, తన పుట్టినరోజా!” అనబోయి, నాలుక్కరచుకుని,“గిఫ్టేం కొంటున్నావు?” అడిగాను.</p>
<p>“బాబోయ్! తనకి గిఫ్టు కొనడమా! కిందటిసారి నేను సిల్కు చీర కొన్నానా? ఎంత శ్రద్ధగా ఎంచి మరీ కొన్నాను! బాగుందని కానీ, థేంక్సు చెప్పడం కానీ లేకపోగా; ఈనాటి వరకూ దాని ఊసే ఎత్తలేదు. తనకి ఆ మర్యాదలు తెలిస్తే కదా? ఇంటికి పనికొచ్చే వస్తువేదో తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వూ అలాంటిదే ఏదో కొనియ్యి,” సలహా పడేసింది.</p>
<p>అసలు కథలో ఉన్న పంక్తుల బదులు, మార్చి రాసిన దాంట్లో నాలుగు పంక్తులు ఎక్కువ ఉన్నాయి. ఏడు పేరాలూ పెరిగాయి. కథ చదవటంలో పెరిగిన సౌలభ్యంతో పోలిస్తే, ఇవి పట్టించుకోదగినవి కావు.</p>
<p><strong>కథల్లో పేరాలు: </strong><strong></strong></p>
<p>తరచుగా తెలుగు కథలని చదువుతున్న నన్ను, కొన్ని కథల్లో ఉన్న పెద్దపెద్ద పేరాలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటితో పోలిస్తే, చిన్నచిన్న వాక్యాలూ, పేరాలు ఉన్న కథలు తక్కువ కష్టపెడుతున్నాయి. దీనికి నేననుకునే కారణం; చదివే వేగాన్ని పెద్ద పేరాలు తగ్గించటం, చిన్న పేరాలు పెంచటం. వేగం మరీ తగ్గినా ఇబ్బందే, పెరిగినా ఇబ్బందే. పాఠకుడిగా నా సౌకర్యాన్ని పక్కన పెడితే, అసలు పేరాగ్రాఫు అంటే ఏవిటి? అనేది చూద్దాం.</p>
<p>-Paragraphs are comprised of sentences, but not random sentences. A paragraph is a group of sentences organised around a central topic. In fact, the cardinal principle of paragraph writing is to focus on one idea. A solidly written paragraph takes its readers on a clear path, without detours.</p>
<p>ఒక అభిప్రాయాన్ని కలిగించే, లేదా ఒక భావాన్ని వ్యక్తీకరించటం మీద దృష్టి కేంద్రీకరించే వాక్యాలు ఒక పేరాగా రూపు దిద్దుకోవాలి. ఒకటికి మించి అభిప్రాయాన్ని ప్రతిఫలించే వాక్యాలు ఒకే పేరాలో ఉండకూడదు. ఒకే భావాన్ని ప్రతిబింబించే వాక్యాలు ఒకటికి మించి పేరాలుగా కనపడకూడదు. అందుకే, ఒక పాత్ర తన మాటల ద్వారా చెప్పదలుచుకున్న తన ఆలోచనని/ఆలోచనలని ఒక పేరాగా ఉంచాలనటం.</p>
<p>ఈ ప్రమాణాన్ని దృష్టిలో ఉంచుకుని; అయిదున్నర పేజీలున్న; <a href="http://vaakili.com/patrika/?p=10692" target="_blank">నాక్కూడా</a>…/<a href="http://vaakili.com/patrika/?tag=%e0%b0%95%e0%b0%be%e0%b0%b6%e0%b1%80%e0%b0%ad%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a3%e0%b1%81%e0%b0%97%e0%b1%8b%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d">కాశీభట్ల వేణుగోపాల్</a>/ఏప్రిల్ 2016 కథలో పేరాలని పునర్విభజన చేస్తే, 79 పేరాలు కాస్తా 53 కి పడిపోయాయి.</p>
<p><strong>ముక్తాయింపు: </strong><strong></strong></p>
<p>చదివించగలగటం కథకుండాల్సిన ప్రాథమికలక్షణం. ఈ పరిశీలన కొరకు నేను ఎన్నుకున్న అంశాలన్నీ ఆ లక్ష్యసాధనకు  దోహదించేవే.</p>
<p>కథలు ఈ అంశాల మీదే రాస్తున్నారు, ఆ అంశాల మీద రాయటం లేదు అనటం; వాటి మీదే రాయాలి, వీటిమీద రాయకూడదు అని నిబంధనలు విధించటం; నా దృష్టిలో రచయిత పరిధిలోకి చొరబడకూడని విధంగా చొచ్చుకుపోవటం. కథ ఏ ఇతివృత్తం మీద రాశారు అనేదాని కన్నా, దేనిమీద రాసిన కథయినా నన్ను చదివించగలిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. వాకిలిలో కథలు స్పృశించిన ఇతివృత్తాల మీద, నేనేమీ మాట్లాడకపోవటానికి అదే కారణం.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
<hr/>
<p style="text-align: center;"><strong><span style="color: #ff0000;">Editors&#8217; Note</span></strong></p>
<p><em>ఇప్పటివరకూ వాకిలిలో వచ్చిన కథలపై ఒక విశ్లేషణ ఈ వ్యాసం. పదాల వాడకం, వాక్య నిర్మాణం, పేరాల, అధ్యాయాల విభజన, కథకుడి గొంతుకల్లో వ్యత్యాసం, ఇంకా అనేక అంశాలను ప్రస్తావిస్తూ సాగిన అతిధి వ్యాసం. ఇందులో పాఠకులకి ఆసక్తి కలిగించేవి, రచయితలకి సహాయపడేవి, ఎడిటర్లుగా మేము నేర్చుకుని తీరవలసినవి చాలా విషయాలే ఉన్నాయి. ఈ అంశాలపై పాఠకుల/రచయితల అభిప్రాయాలు, మరిన్ని మంచి చర్చలు జరగాలని ఆశిస్తూ&#8230;</em></p>
<hr/>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11745</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>ద్వంద్వపదాలు</title>
		<link>http://vaakili.com/patrika/?p=11695</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11695#comments</comments>
		<pubDate>Sun, 31 Jul 2016 16:39:15 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[టి. చంద్రశేఖర రెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11695</guid>
		<description><![CDATA[<p>ద్వంద్వపదాల వినియోగం తెలుగు భాషలో ఉన్న విశిష్టతల్లో ఒకటి. విద్యార్థి కల్పతరువు అను ఆంధ్రభాషా విషయసర్వస్వం పేరుతో, వేంకట్రామ అండ్ కో వారు 1979 లో ప్రచురించిన గ్రంథంలో, వీటికోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉంది.  1980 లో వెలువడ్డ అయిదో ముద్రణలో, 686-687 పేజీల్లో ఈ ద్వంద్వపదాల పట్టికని వాటి అర్థాలతో సహా చూడవచ్చు. ఈ పట్టికలో ఏకంగా 102 ద్వంద్వపదాలున్నాయి. దీనితో పాటు జంట పదాల పట్టిక కూడా వాటి అర్థాలతో 672-682 పేజీలవరకూ చూడవచ్చు.</p> <p>జంట పదాలంటే ఒకేరకంగా ధ్వనిస్తూ, వేరే అర్థం ఇచ్చే పదాలు. తెలియక మరోరకంగా రాస్తే అపార్థం ధ్వనించే పదాలు. ఉదాహరణకు అంకిలి, అంగిలి. అంకిలి అంటే విఘ్నము (672). అంగిలి అంటే అంతర్గళము (672). ద్వంద్వపదాలంటే, రెండు విడిపదాలుగా అనిపించి ఒక అర్థం వచ్చేలా వాడబడే పదాలు. అండదండలు అలాంటివాటిల్లో ఒకటి. దీనికి అర్థం, సహాయం అని విద్యార్థి కల్పతరువు (686) చెపుతోంది. అండ  అనే పదానికి ఆశ్రయం అనీ, ఆశ్రయానికి సహాయం అనీ అర్థాలున్నాయి. దండకి ప్రాపు అనీ, ప్రాపుకి ఆశ్రయం అనీ అర్థం ఉంది.  ఆశ్రయానికి సహాయం అనే అర్థం ఉండటంతో అండ అన్నా దండ అన్నా సహాయం అని అర్థం ఉన్నట్లే. దీని రీత్యా ఒకే అర్థం ఉన్న రెండు పదాలని కలిపి, మళ్లీ మనం అదే అర్థంతో వాడుతున్నామన్నమాట! ఇలా ఎందుకు?భావాన్ని మరింత శక్తిమంతంగా చెప్పటానికా? అంటే అవుననే అనుకోవాలి.</p> <p>ద్వంద్వపదాల పట్టికలో ఉన్న కొన్ని పదాలు, విద్యార్థి కల్పతరువులో ఉన్న తెలుగు జాతీయాలు అనే అధ్యాయంలో కూడా చోటు చేసుకున్నాయి. ముందు పేరాలో ఉదహరించబడ్డ అండదండలు అన్న పదం అలాంటివాటిలో ఒకటి (643).  ఇవి కాక ద్వంద్వపదాల్లా అనిపించి, ద్వంద్వ పదాల పట్టికలో చేరని అలాంటి పదాలు మరికొన్ని కూడా తెలుగు జాతీయాల్లో కనపడుతున్నాయి. అంటు సంటు వాటిల్లో ఒకటి (643). దీని అర్థం స్నేహసంబంధములు, భేదభావములు. [...]]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">ద్వం</span>ద్వపదాల వినియోగం తెలుగు భాషలో ఉన్న విశిష్టతల్లో ఒకటి. విద్యార్థి కల్పతరువు అను ఆంధ్రభాషా విషయసర్వస్వం పేరుతో, వేంకట్రామ అండ్ కో వారు 1979 లో ప్రచురించిన గ్రంథంలో, వీటికోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉంది.  1980 లో వెలువడ్డ అయిదో ముద్రణలో, 686-687 పేజీల్లో ఈ ద్వంద్వపదాల పట్టికని వాటి అర్థాలతో సహా చూడవచ్చు. ఈ పట్టికలో ఏకంగా 102 ద్వంద్వపదాలున్నాయి. దీనితో పాటు జంట పదాల పట్టిక కూడా వాటి అర్థాలతో 672-682 పేజీలవరకూ చూడవచ్చు.</p>
<p>జంట పదాలంటే ఒకేరకంగా ధ్వనిస్తూ, వేరే అర్థం ఇచ్చే పదాలు. తెలియక మరోరకంగా రాస్తే అపార్థం ధ్వనించే పదాలు. ఉదాహరణకు అంకిలి, అంగిలి. అంకిలి అంటే విఘ్నము (672). అంగిలి అంటే అంతర్గళము (672). ద్వంద్వపదాలంటే, రెండు విడిపదాలుగా అనిపించి ఒక అర్థం వచ్చేలా వాడబడే పదాలు. అండదండలు అలాంటివాటిల్లో ఒకటి. దీనికి అర్థం, సహాయం అని విద్యార్థి కల్పతరువు (686) చెపుతోంది. అండ  అనే పదానికి ఆశ్రయం అనీ, ఆశ్రయానికి సహాయం అనీ అర్థాలున్నాయి. దండకి ప్రాపు అనీ, ప్రాపుకి ఆశ్రయం అనీ అర్థం ఉంది.  ఆశ్రయానికి సహాయం అనే అర్థం ఉండటంతో అండ అన్నా దండ అన్నా సహాయం అని అర్థం ఉన్నట్లే. దీని రీత్యా ఒకే అర్థం ఉన్న రెండు పదాలని కలిపి, మళ్లీ మనం అదే అర్థంతో వాడుతున్నామన్నమాట! ఇలా ఎందుకు?భావాన్ని మరింత శక్తిమంతంగా చెప్పటానికా? అంటే అవుననే అనుకోవాలి.</p>
<p>ద్వంద్వపదాల పట్టికలో ఉన్న కొన్ని పదాలు, విద్యార్థి కల్పతరువులో ఉన్న తెలుగు జాతీయాలు అనే అధ్యాయంలో కూడా చోటు చేసుకున్నాయి. ముందు పేరాలో ఉదహరించబడ్డ అండదండలు అన్న పదం అలాంటివాటిలో ఒకటి (643).  ఇవి కాక ద్వంద్వపదాల్లా అనిపించి, ద్వంద్వ పదాల పట్టికలో చేరని అలాంటి పదాలు మరికొన్ని కూడా తెలుగు జాతీయాల్లో కనపడుతున్నాయి. అంటు సంటు వాటిల్లో ఒకటి (643). దీని అర్థం స్నేహసంబంధములు, భేదభావములు. కాని, వ్యవహారంలో దీన్ని అంటూ సొంటూ అని రాస్తున్నాం.</p>
<p>జాతీయాల్లో ఉన్న ద్వంద్వపదాల్లాంటివి,  ద్వంద్వపదాల పట్టికలో ఎందుకు చేరలేదు? మన సంభాషణల్లోనూ, వివిధ తెలుగు సాహిత్యప్రక్రియల్లోనూ, ద్వంద్వపదాల్లా కనిపించే మరికొన్ని ప్రయోగాలు వినియోగంలో ఉన్నాయి. అవి ద్వంద్వపదాల పట్టికలో లేవు.  ఇవి  ద్వంద్వపదాలు కావా? కాకపోతే ఎందుకు కావు? ద్వంద్వపదాలే అయితే, ఇవి పై గ్రంథంలో ఎందుకు చోటుచేసుకోలేదు? అనేవి మన ముందున్న ప్రశ్నలు.</p>
<p>ఈ ప్రశ్నలకి సమాధానాలని విజ్ఞులైన భాషాశాస్త్రవేత్తలకి వదిలేసి, అలా వాడకంలో ఉన్న ద్వంద్వ పదాలను సరైన రూపంలో రాస్తున్నామా? రాయకుండా ఉంటే వాటి అసలు స్వరూపం ఏమిటి? ఆ ద్వంద్వపదాల అర్థాలు ఏమిటి? ఏ అర్థంతో మనం వాడుతున్నామో, వాటి అసలు అర్థం ఆదేనా? మరి ఇంకేదయినానా? అనే విషయం మీద రవంత వెలుగు ప్రసరించటానికి ఈ వ్యాసం శబ్దార్థ చంద్రిక ఆధారంగా ఒక ప్రయత్నం చేస్తుంది. కుండలీకరణాల్లో ఇచ్చినవి నా దగ్గర ఉన్న ప్రతిలోని పేజీల సంఖ్యలు.</p>
<p>వీటిలో కొన్నిటికి నేరుగా నిఘంటువులో అర్థం ఉంది.  ఆ అర్థాలేమిటో చూద్దాం.</p>
<p>1. ఇరుగుపొరుగులు: దీని అర్థం ఇంటికి ఇరుపక్కననున్నవారు, ఇరుగుననుపొరుగునను ఉన్నవారు (157). ఇరుగు అంటే పక్క ఇల్లు (157). పొరుగు అంటే ప్రక్క, ఇరుగునకు ప్రక్క(907). అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి కొంచెం విస్తృతార్థంతో వైవిధ్యం ధ్వనించేలా మనం వాడుతున్నాం.</p>
<p>2. ఉచ్చనీచములు: ఉచ్చనీచములు=ఎక్కువతక్కువలు, మంచిచెడ్డలు, మెరకపల్లములు. ఉచ్చము (ఉచ్ఛము అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు)=ఉన్నతమయినది. నీచము=క్రిందది. రెండు వ్యతిరేకార్థాలు ఉన్న పదాలని కలిపి శబ్దార్థ చంద్రిక అదే వ్యతిరేకార్థం ఇవ్వగా, అదే అర్థంతో మనం వాడుతున్నాం.</p>
<p>3. చిల్లు పొల్లు: దీనిని వ్యవహారంలో చిల్లూపొల్లూ అని రాస్తున్నాం. రెండు పదాలుగా కనపడుతున్న ఈ పదానికి/పదాలకి, శబ్దార్థ చంద్రిక సంక్షోభం, చిరాకు, తుత్తునియలు అని అర్థం చెప్తోంది. చిల్లు అనే పదం విడిగా కూడా ఉంది. దాని అర్థం, చిమ్ముటలోనగువానియందు ధ్వన్యనుకరణం. చిల్లును తూటు, కంత అనే అర్థంలో మనం ఉపయోగిస్తున్నాం. కాని, దాని అసలు రూపం చిల్లి. పొల్లు అంటే వ్యర్థం, నిస్సారం. కనక ఈ రెండు పదాలు విడిగా ఇస్తున్న అర్థానికీ, కలిసి ఉన్నట్లు కనపడే పదానికి/పదాలకీ ఎలాంటి పొంతనా లేదు.</p>
<p>4. దరి దాపు: దీనికి అర్థం ఆశ్రయం, ఆధారము, హద్దు, సమీపం (682). దరిదాపుల్లో లేడు అంటే సమీపంలో లేడని. చిత్రంగా దరి, దాపు అనే రెండు విడిపదాలు కూడా ఉన్నాయి. దరి=గట్టు, మేర, సమీపము(682). దాపు=సమీపము, ఆధారము (687). అందువల్ల విడి పదాలకు ఉన్న అర్థంతోనే దరిదాపు అనే ద్వంద్వపదాన్నీ ఉపయోగిస్తున్నాం.</p>
<p>5. మీదు మిక్కిలి: దీని అర్థం కడు మిక్కిలి, పైగా (1031). అవే అర్థాలతో దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. మీదు=ఉపరిభాగం(1031)=పైన. మిక్కిలి=ఎక్కువ(1027). ఈ రెండిటికీ ఉన్న విడి అర్థాలను కలిపే, ఈ ద్వంద్వపదం వినియోగంలో ఉంది.</p>
<p>6. వంకర టింకర: వంకరటింకర=నానావిధవక్రము (1112) అని శబ్దార్థ చంద్రిక చెపుతోంది. అదే అర్థంతో ఈ పదం/పదాలు వ్యవహారంలో ఉన్నాయి. వంకరటొంకర, వంకరకొంకర అనేవి దీనికి రూపాంతరాలు. వంకర అనే పదానికి వక్రత్వం, వక్రం అని అర్థం. టింకర అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు.</p>
<p>7. యోగ క్షేమం: దీని అర్థం క్షేమలాభములు (1074). అదే అర్థంతో దీన్ని ఉపయోగిస్తున్నాం. యోగం అంటే వస్తులాభం అని అర్థం ఉంది(1074). క్షేమం అంటే కుశలం (404). ఈ రెండిటి అర్థాలతో పొంతన ఉండేలాగానే, రెండిటినీ కలిపి వాడుతున్నాం.</p>
<p>ద్వంద్వపదాలుగా కనపడే ఈ క్రిందివాటికి వేటికీ, నేరుగా నిఘంటువులో ఎలాంటి అర్థం లేదు. అందువల్ల, వీటిలో ఉన్న పదాలన్నీ నిఘంటువులో ఉన్నాయా? ఉంటే, వీటిలోని ఒక్కొక్క పదమూ ఏం అర్థం ఇస్తోంది. రెండిటినీ కలిపితే వచ్చే అర్థం మనం వ్యవహారంలో సూచిస్తున్న అర్థానికి సరిపోతున్నదా లేదా అనేది చూద్దాం.</p>
<p>1. అంచెలంచెలు: అంచె=వరుస(5). అంచెలంచెలుగా అంటే వరుసగా అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.</p>
<p>2. అజా పజా: అజ=ప్రకృతి, ఆడు మేక (22). అజము=చావుపుట్టుకలు లేనిది (22). పజ=జనము, ప్రజా (814). ఎక్కడున్నదో/ఎక్కడున్నాడో తెలీదు అనే అర్థంలో ఈ రెండిటినీ కలిపి వాడటం. అజ, పజ అనే పదాల అర్థాలకూ; అజాపజా అని వాటిని కలిపి వాడే సందర్భానికీ మధ్య పొంతన లేదు.</p>
<p>3. అడుగు బొడుగు: అడుగు=క్రిందు (26). బొడుగు అనే పదం లేదు. అడుగూబొడుగూ అని, క్రింద లేదా చివరకి మిగిలింది అనే అర్థంలో వాడతాం. అడుగు అనే పదానికి ఉన్న అర్థం, ఈ వ్యవహారానికి సరిపోతోంది. మరి, బొడుగు అనేది అడుగుకు ఊతంగా కలిపినట్లా?</p>
<p>4. అడ్డూ ఐపూ: అడ్డు=అడ్డగించు, అడ్డగింత, చాటు (28). ఐపు=తప్పు, దోషము, జాడ, అయిపు(245). అతడికి అడ్డూ ఐపూ లేదంటే; ఏ ఆటంకమూ లేదనీ, ఏదీ తప్పూ కాదని. ఇదే అర్థంతో ఈ రెండు పదాలని కలిపి వాడటం జరుగుతోంది.</p>
<p>5. అతీ గతీ: అతి=ఎక్కువ (29). అతీ అనే పదం లేదు. గతి=ఆధారం, ఫలితం (422). అతీ గతీ లేదు అని ఆధారం లేదు, ఫలితం లేదు అనే అర్థంలో వాడుతున్నాం. గతి అనే పదానికున్న అర్థం, ఈ వ్యవహారానికి సరిపోతోంది. మరి అతి, లేదా అతీ దానితో జత ఎందుకు కలిసినట్లు?</p>
<p>6. అమీతుమీ: ఈ పదాలు నిఘంటువులో లేవు. అమ్హీ, తుమ్హీ అనే ఉర్దూ/హిందీ పదాలు కావు కదా ఇవి?</p>
<p>7. అర్థం పర్థం: అర్థం అంటే అర్థం, అర్థమే (79). అతడు చేసే పనులకి అర్థం పర్థం ఉండదు అంటే అర్థం ఉండదని. అంతవరకూ బాగుంది. పర్థం ఎందుకు కలిసింది-అర్థం పర్థం లేకుండా?!</p>
<p>8. అలసి సొలసి: అలసి సొలసి నిఘంటువులో లేదు. అలయు=అలసిపోవు (84), సొలయు=అలయు (1254). వీటి రూపాంతరాలా అలసిసొలసి?</p>
<p>9. అలుపు సొలుపు: అలుపు అనే పదం లేదు. అలపు అనే పదం ఉంది (83). దీనికి అలసట, బడలిక, శ్రమము అని అర్థం. సొలుపు అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. సొలపు=వైముఖ్యం (1254). సొలయు= అలయు, వెనుదీయు(1254). కావాల్సిన అర్థం, అలపు ఇస్తున్నపుడు; సొలుపు అవసరం ఏమిటో బోధపడదు.</p>
<p>10. ఆకలి దప్పులు: ఆకలి అంటే అందరికీ తెలిసినదే. దీని అర్థం క్షుత్తు (100) అని చెప్పటం; పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్లవుతుంది. దప్పి=దప్పిక అనగా దాహం(680). అందువల్ల వీటి రెండు అర్థాలనూ కలిపి, వాటి అర్థంతోనే ఆకలిదప్పులని మనం ఉపయోగిస్తున్నాం.</p>
<p>11. ఆగమేఘాల మీద: వేగంగా అనే అర్థంతో దీన్ని ఉపయోగిస్తున్నాం. ఆగము=తప్పు, పాపం (111). ఇది మేఘాలతో ఇమడటం లేదు. ఆగమేఘాలు ఏ పదాల కూడిక, లేదా పొందిక?</p>
<p>12. ఆలనా పాలనా: ఆలన=రక్షణము(133). పాలన=రక్షణము(857). అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి అదే అర్థంలో మనం వాడుతున్నాం.</p>
<p>13. ఇల్లూ వాకిలీ: ఇల్లు=గృహం (159). వాకిలి=గృహద్వారం, తలుపు (1131). ఎవరికయినా ఇల్లు లేదనవచ్చు. ఆ ఇంటికి వాకిలి లేదనవచ్చు. ఇల్లూ వాకిలీ లేదంటే, కనీసం వాకిలి ఉన్న ఇల్లు లేదనా?</p>
<p>14. ఉరుకులు పరుగులు: ఉరుకు=దాటు, దుముకు, పరుగెత్తు (206), పరుగు=శీఘ్రగమనం (835). ఈ రెండు పదాలకి విడిగా ఉన్న అర్థంతోనే, రెండిటినీ మనం కలిపి వాడుతున్నాం.</p>
<p>15. ఉలుకు పలుకు: ఉలుకు=భయం(208). పలుకు=మాట(839). ఈ రెండు పదాల్లో పలుకు అనే పదానికి ఉన్న అర్థంతో, ఉలుకు అనే పదానికి ఉన్న అర్థంతో సంబంధం లేకుండా; రెండిటినీ కలిపి పలుకుకి ఉన్న అర్థంతోనే మనం వాడుతున్నాం.</p>
<p>16. ఎక్కీ తక్కీ: ఈ రెండు పదాలూ ఆ రూపంతో లేవు. సరిపడినంత అనే అర్థంతో వీటిని వాడుతున్నాం. నేననుకోవటం ఇది ఎక్కువకీ తక్కువకీ ఉచ్చారణ ఫలితంగా ఏర్పడిన నూతనరూపం అని.</p>
<p>17. ఎదురు బొదురు: ఎదురు=అభిముఖం (228). బొదురు అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. ఈ రెండు పదాల్లో ఎదురు అనే పదానికి ఉన్న అర్థంతో, అర్థం లేని బొదురు అనే పదం కలిపి మనం వాడుతున్నాం.</p>
<p>18. ఏతా వాతా: ఏతా=అసత్యం(239). వాతా అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. మొత్తం మీద అనే అర్థంలో ఈ పదాన్ని/పదాలని ఉపయోగిస్తున్నాం. ఈ పొందికకి, కూడికకి మూలం ఏమిటో?</p>
<p>19. ఐపూ అంతూ: ఐపు=తప్పు, దోషము, జాడ, అయిపు(245). అంతు=చివర (9). ఐపూ, అంతూ లేడు అంటే జాడ లేదు అని అర్థంలో వాడుతున్నాం. ఐపు అనే పదానికి ఉన్న అర్థం, ఈ వినియోగాన్ని సమర్థిస్తోంది. అంతు అనే పదానికి ఉన్న అర్థం ఇందులో పొసగటం లేదు.</p>
<p>20. ఒడి దుడుకులు: ఒడి=ఒడుపు (249). దుడుకు=చెడ్డపని (700). ఒడిదుడుకులు లేకుండా అని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనే అర్థంతో వాడుతున్నాం. మరి ఈ రెండు పదాల మిశ్రమం మనం వాటిని వాడుతున్న తీరుకు సరిపోతోందా? లేదనే చెప్పాలి.</p>
<p>21. ఒడ్డూ పొడుగూ: ఒడ్డు=స్థూలం, పెద్ద, అధికం, విశాలం (250). పొడుగు=ఎత్తు(904). ఈ రెండు పదాలకీ విడిగా ఉన్న అర్థాలని కలిపి, ఎత్తయిన, విశాలమయిన అనే అర్థంతో రెండిటినీ కలిపి మనం వాడుతున్నాం.</p>
<p>22. కక్షా కార్పణ్యాలు: కక్ష=కచ్చ లేదా కసి (273). కార్పణ్యం=కృపణత్వం (325). కృపణుడు అంటే కుత్సితుడు (360) అంటే కుత్సితబుద్ధి గలవాడు. కక్షాకార్పణ్యాలు అంటే ఈ రెండిటి అర్థంతో ఒక సమ్మిశ్ర భావన వ్యక్తమవుతోంది.</p>
<p>23. కరువు కాటకాలు: కరువు, కరవు అనే పదాలు శబ్దార్థ చంద్రికలో లేవు. కఱవు=క్షామం, కాటకం=కఱవు. ఈ రెండు పదాలు విడివిడిగా ఇచ్చే అర్థంతోనే, కలిపి; కించిత్ అక్షరభేదంతో, వ్యవహారంలో మనం వాడుతున్నాం.</p>
<p>24. కల్లా కపటం: కల్ల=అసత్యం, తప్పు, మోసం, హాని, కఠినపు మాట(309). కపటము=కైతవము, కవుడు, మాయ (289). కైతవం=కపటం (366). కవుడు అన్నా కపటమే (310). కల్లాకపటం లేని వాడు అంటే మొదటి పదానికి అర్థమయిన మోసం/అబద్ధం, రెండో పదానికి ఉన్న మాయ వెరసి మాయామోసాలు/అబద్ధాలు లేనివాడనా?</p>
<p>25. కొండా కోనా: కొండ=పర్వతం (369). కోన=కొండలయందలి మరుగుచోటు (382). ఈ రెండు పదాల అర్థాలని కలిపి కొండాకోనల్లో అంటే పర్వతాల్లో, వాటి మరుగు ప్రదేశాల్లో అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.</p>
<p>26. కోప తాపాలు: కోపము=క్రోధము, కినుక (382). తాపం=సంతాపం, బాధ(621). కోపతాపాలు లేవు అంటే ఈ రెండు పదాల అర్థాలూ కలిపి; క్రోధమూ, బాధా లేవు అని వ్యవహారం.</p>
<p>27. గడ్డీ గాదం: గడ్డి=కసవు(421), తృణము=గడ్డి(645), గాదము=పైరులోని కసవు, ఆకు(432). ఇంచుమించు సమానార్థం ఉన్న ఈ రెండు పదాలను కలిపి కూడా, మనం అదే అర్థంలో వ్యవహరిస్తున్నాం.</p>
<p>28. గొడ్డూ గోదా: గొడ్డు=సంతతి లేని ఆవు, ఆవు, ఎద్దు(459), గోద=ఎద్దు (468). ఎవరికయినా గొడ్లు ఉంటే ఎద్దుతో కలిపి అన్నిరకాల పశుసంపద ఉన్నట్లే. అందువలన ఆ విషయం చెప్పదలుచుకున్నపుడు గొడ్డుకి గోద కలపవలసిన అవసరం లేదు. కాని, ఈ రెండు పదాలను ఒకే భావం వ్యక్తీకరించటానికి కలిపి చెప్పటం జరుగుతోంది.</p>
<p>29. చడీ చప్పుడు: ఇది కానీ, చడి అనే పదం కానీ నిఘంటువులొ లేవు. చప్పుడు=ధ్వని (526). సడి= ధ్వని (1218). దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చడీ చప్పుడులో చడి అవసరమే లేదు. ఉంటే సడి ఉండాలి. మరి దాని బదులు చడీ అనే పదం చడీ చప్పుడు లేకుండా, చడీచప్పుడులో ఎందుకు చేరినట్లు?!</p>
<p>30. చదువూ సంధ్యా: చదువు=పఠనం (524). సంధ్య=ప్రొద్దుపొడుచుటకు ముందు అయిదు గడియలవరకు, ప్రొద్దు గ్రుంకిన వెనుక మూడు గడియల వరకును గల కాలం. ఈ అర్థం చదువూ సంధ్యా లేదు అనే దానిలో చదువుతో పొసగటం లేదు. ఇది కాకుండా, సంధ్యకు, సంధ్యాకాలమందు చేయు ఉపాసన అనే అర్థం కూడా ఉంది (1212). చదువూ, సంధ్యా లేదు అంటే పఠనమూ, ఉపాసన ఈ రెండూ లేవనా?</p>
<p>31. చిత్తూ బొత్తూ: చిత్తు=దిద్ది చక్కపరుపని మొదట వ్రాసిన వ్రాత, జ్ఞానం, చైతన్యం, ప్రోగుచేసినవాడు, చయనము చేసినవాడు, సమిధ. బొత్తు అనే పదం లేదు. బొత్త=తామ్రాదిపాత్రముల బొంద(973). బొత్తి=మడత, పొర (973). నాణేనికి రెండువైపులను చిత్తూ, బొత్తూ అని అంటాం. కాని, చిత్తుకు ఉన్న అర్థాలు కాని, బొత్తు అనే పదం లేకపోవటం కానీ, ఈ వ్యవహారాన్ని సమర్థించలేకపోతున్నాయి.</p>
<p>32. చిన్నా చితకా: వ్యవహారంలో దీన్ని/వీటిని ఒక పరిమాణాన్ని సూచించటానికి ఉపయోగిస్తున్నాం. చిన్న =అల్పం, కనిష్టం (497). చితక అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. చితిక=ప్రోగు(494). ఈ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుంటే, చిన్నాచితకాలో, చితక-వ్యవహారరీత్యా, చితికకి రూపాంతరం అనిపించదు.</p>
<p>33. చిల్లర మల్లర: చిల్లర అంటే కొంచెంపాటి నాణెం, సామాన్యం, అల్పం అని అర్థం (502). మల్లర అనే పదం, శబ్దార్థ చంద్రికలో లేదు. మల్లరము=మదించినది, గర్వం (1018). అందువల్ల ఈ రెండు పదాల్లో ఒక పదం విడిగా ఇస్తున్న సామాన్యం, అల్పం అనే అర్థంతోనే, అర్థం లేని మల్లర అనే ఇంకో పదం కలిపి మనం ఉపయోగిస్తున్నాం.</p>
<p>34. చీకూ చింతా: చీకు=నిస్సారం (503). చింత=వగపు (489). చీకు లేకపోతే నిస్సారం కానట్లు, సారం ఉన్నట్లు. చింత లేకపోతే సంతోషం. మరి ఇవి రెండూ లేకుండా అంటే? వ్యతిరేకార్థం ఉన్న రెండుపదాలను జత చేసి అపార్థం కలిగిస్తున్నామన్నమాట.</p>
<p>35. డబ్బూ దస్కం: డబ్బు=ధనం (588). దస్కం అనే పదం నిఘంటువులో లేదు. డబ్బుతోనే చెప్పదలుచుకున్నది చేరుతున్నపుడు, డబ్బుతో దస్కం ఎందుకు చేరింది?</p>
<p>36. తప్పొప్పులు: తప్పు, ఒప్పు అనే రెండు పదాలూ విడిగా శబ్దార్థ చంద్రికలో ఉన్నవే. రెండు వ్యతిరేకార్థాలు ఉన్న పదాలని, కలిపి కూడా సరయిన అర్థం వచ్చేలానే వాడుతున్నాం.</p>
<p>37. తిండీ తిప్పలు: తిండి=ఆహారం(626). తిప్పలు=కష్టములు, బాధలు (628). తిండి లేకపోతే కష్టం. తిప్పలు లేకపోతే సుఖం. మరి తిండీతిప్పలు లేకుండా అంటే? విభిన్న అర్థాలు ఉన్న రెండు పదాలను జత చేసి అపార్థం కలిగిస్తున్నామన్నమాట.</p>
<p>38. తీరూ తెన్నూ: తీరు=విధం (634). తెన్ను=దారి, మార్గం, విధి (647). రెండు విభిన్నార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, ఒక పద్ధతి లేకుండా అనే అర్థంతో తీరూతెన్నూ లేకుండా అని వాడుతున్నాం.</p>
<p>39. తుక్కూ దూగరా: తుక్కు=వ్యర్థము, త్రుప్పు, పనికిమాలిన గడ్డి మొదలగునది (637). దూగఱ= ధాన్యాదులలోనుండు దుమ్ము (706). ఈ రెండు పదాలకూ విడిగా ఉన్న అర్థాలను దృష్టిలో పెట్టుకుని పారేయాల్సిన వాటిని తుక్కూ దూగరా అని చెపుతున్నాం.</p>
<p>40. దరి దాపులు: దరి=గట్టు, మేర, సమీపం (682). దాపు=సమీపం, ఆధారం(687). దరిదాపుల్లో లేడు అంటే సమీపంలో లేడు అనే అర్థంతో వాడుతున్నాం. రెండిటికీ ఒకటే అర్థం ఉన్నపుడు, కావాల్సింది అదే అర్థం అయినపుడు రెండిటినీ కలిపి వాడటం దేనికి?</p>
<p>41. దారీ తెన్నూ: దారి=రీతి, మార్గం, దిక్కు (688). తెన్ను=దారి, మార్గం, విధి (647). రెండు సమానార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, అదే అర్థం వచ్చేలా దారీతెన్నూ లేకుండా అని వాడుతున్నాం.</p>
<p>42. దిక్కూ దెసా: దిక్కు=దిశ, శరణము, మార్గము, వైపు, నెలవు (691). దెస=దిక్కు, అవస్థ, ప్రాపు, కాపు, శరణము, చోటు (708). దిక్కూ, దెసా తెలీకుండా అన్నా దిక్కూ, దెసా లేకుండా అన్నా మార్గమూ, చోటూ తెలీకుండా లేదా లేకుండా అనా?</p>
<p>43. దుమ్మూ ధూళీ: దుమ్ముదూలి అనే పదం శబ్దార్థచంద్రికలో ఉంది. దాని అర్థం చిన్నాభిన్నమయినది(701). అంతే కాదు దూలి అనే పదం విడిగా లేదు. మనం ఏ అర్థంలో దుమ్మూ ధూళీ అనే పదాలను ఉపయోగిస్తామో, అది ఈ అర్థానికి సరిపడదు. వీటి అసలు మూలాలు; దుమ్ము=దుమారం, ధూళి(701). ధూళి=దుమ్ము, పరాగం (730). ఈ రెండు పదాల అర్థాలూ ఒకటే. మనకు కావాల్సిన అర్థాన్ని ఏదో ఒక పదం ఇస్తున్నపుడు, రెండిటినీ కలిపి వాడటంలో ఔచిత్యం, అవసరం బోధపడవు.</p>
<p>44. ధూళి ధూసరితం: ధూళి=దుమ్ము, పరాగం (730). ధూసరము=బూడిదవర్ణము, బూడిదవర్ణము గలది (731). అందువల్ల ధూసరితము అంటే బూడిదవర్ణము కమ్మినది అని అనుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే ఒకటి దుమ్ము. రెండోది దాని రంగు. ధూళిధూసరితము అంటే బూడిదరంగు కల దుమ్ము అని. కొంతమంది అనుకుంటున్నట్లు ధూసరము అంటే ఇంకోరకం దుమ్ము కాదు.</p>
<p>45. నగా నట్రా: నగ=ఆభరణం (735). నట్ర, నట్రా అనే పదాలు లేవు. నగానట్రా అన్నపుడు నగలు మొదలయినవి అన్న అర్థంలో వీటిని వాడటం జరుగుతోంది.</p>
<p>46. నదీ నదాలు: నది=ఆమడ దూరానికి మించి పారే ఏరు, లేదా ఏరు(739). నదం=పడమరగా పారెడి ఏరు, సముద్రం (739). రెండిటినీ కలిపి రెండు రకాల జలప్రవాహాలు అన్న అర్థంలో ఉపయోగిస్తున్నాం.</p>
<p>47. నదురూ బెదురూ: నదురు, నదరు అనే పదాలు లేవు. బెదరు=భయం, జంకు, సంకోచం, అధైర్యం (968). బెదరు అనే పదానికి ఉన్న అర్థంతో, అర్థం లేని నదురు అనే పదం కలిపి మనం వాడుతున్నాం.</p>
<p>48. నిక్కు నీలుగు: నిక్కు=గర్వం (758). నీలుగు అన్నా గర్వమే (787). రెండు సమానార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, అదే అర్థం వచ్చేలా నిక్కు నీలుగు అని వాడుతున్నాం.</p>
<p>49. నియమ నిష్ఠలు: నియమము=కట్టు, వ్రతనిష్ఠ (766). నిష్ఠ=ఎడతెగని శ్రధ్ధ(781). ఈ రెండిటినీ కలిపి కట్టుబాటుతో, శ్రధ్ధతో పనిచేయటం అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.</p>
<p>50. నీతి నియమాలు: నీతి=న్యాయం, సత్ప్రవర్తనం(784). నియమము=కట్టు, వ్రతనిష్ఠ (766). నీతి నియమాలతో పనిచేస్తున్నాడంటే ఈ రెండిటికీ కట్టుబడి ఉంటున్నాడని.</p>
<p>51. నోరూవాయీ: గట్టిగా మాట్లాడలేని వాళ్లని ఉద్దేశించి అతడు నోరూ వాయీ లేని వాడు అని అంటుంటాం. నోరు=ముఖద్వారం (803). వాయి=నోరు, ముఖము(1136). ఇక్కడ ఒకే అర్థం ఉన్న రెండు పదాలని కలిపి, అదే అర్థం వచ్చేలా వాడుతున్నాం.</p>
<p>52. పనీ పాటా: పని=కార్యం(824). పాట=గీతం (846). అతడికి పనీపాటా లేదు అనటంలో పని లేదు అని ఒక అర్థం ధ్వనిస్తోంది. పాట లేదని ఎందుకు అనటం? పాటు=కష్టం (847). పనీ, పాటూ వ్యవహారంలో పనీ, పాటగా మారిందా?</p>
<p>53. పరువు ప్రతిష్ఠ: పరువు=గౌరవం (836). ప్రతిష్ఠ=గౌరవం, కీర్తి (920). ఈ రెండిటికీ గౌరవం అని అర్థం ఉంది. అందువల్ల మొదటి పదానికున్న గౌరవం, రెండో పదానికున్న కీర్తి అనే అర్థాలతో కీర్తి గౌరవాలు అనే అర్థం వచ్చేలా పరువు ప్రతిష్ఠ అని వాడుతున్నామా?</p>
<p>54. పిల్లా జెల్లా: పిల్ల=ఆడపడుచు(867). జెల్ల=పిల్ల. ఈ రెండు అర్థాలతోనే, రెండిటినీ కలిపి మనం ఉపయోగిస్తున్నాం.</p>
<p>55. పుల్లా పుడకా: పుల్ల=పుడుక (842). పుడుక=సన్నపుల్ల, కట్టెపుల్ల (875). రెండు సమానార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, అదే అర్థం వచ్చేలా దారీతెన్నూ లేకుండా అని వాడుతున్నాం.</p>
<p>56. బాగోగులు: బాగు=క్షేమం=శుభము(954), ఓగు=చెరుపు, కీడు, అశుభం (257). రెండిటినీ కలిపితే శుభాశుభములు. ఆ అర్థంతోనే మనం వ్యవహరిస్తున్నాం.</p>
<p>57. బొచ్చే బోలే: బొచ్చె=కుండలోనగువాని పెంకు(972). బోలె=ఓటికుండ, కుండబొచ్చె అని అర్థం(977). వీటిని ఏదో ఒక లోహంతో తయారు చేసినవి అనుకొని, వ్యవహారంలో ఈ పదాలని వంటపాత్రలు అనే అర్థం వచ్చే విధంగా వాడటం జరుగుతోంది. కాని, నిజానికి వీటిని; మట్టిపాత్రలకే వాడాలి.</p>
<p>58. మంచీ సెబ్బర: మంచి=మంచి (994), సెబ్బర=చెడుగు, చెడ్డది(1250). రెండూ కలిపి మంచీ, చెడూ. ఈ రెండిటికీ కలిపి మూడో అర్థం ఏదీ లేదు. ఉన్న రెండు పదాల అర్థంతోనే, మంచీ సెబ్బర ఉపయోగంలో ఉంది.</p>
<p>59. మందూ మాకూ: మందు=ఔషదము (997), మాకు=మ్రాను, వృక్షం (1018). సామాన్యంగా ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తిని వశపరచుకున్నపుడు, మందో మాకో పెట్టాడా అని అంటుంటారు. అయితే, దీని వ్యవహారాన్ని, శబ్దార్థ చంద్రికలో ఉన్న మందులమారి=వశక్రియావేది (998) అన్వయించుకుంటే, మందూ మాకూ అనే ద్వంద్వపదాల అర్థం అవగతమయే అవకాశం ఉంది.</p>
<p>60. మన్నూమశానం: అతడి దగ్గర ఏముంది? మన్నా, మశానమా అని ఏమీ లేదనటాన్ని సూచిస్తున్నాం. మన్ను=మట్టి, నేల (1008). మశానం అనే పదం కానీ, మసానం అనే పదం కానీ లేవు. మసనం=శ్మశానం. మసనం వ్యవహారంలో మసానం అయి, మట్టితో కలిసి వాడకంలోకి వచ్చింది అనిపిస్తోంది.</p>
<p>61. మాటా మంతీ: మాట=పదం(1019). మంతి=ప్రసంగం, ప్రస్తావన(996). ఈ రెండు పదాలకి విడిగా ఉన్న అర్థంతోనే, కొంచెం విస్తృతార్థం వచ్చేలా మనం కలిపి వాడుతున్నాం.</p>
<p>62. మానూ మాకూ: మ్రాను అనే పదానికి మాను అనేది రూపాంతరం. మాను=చెట్టు, వృక్షం(1066). మాకు అన్నా అవే అర్థాలు(1018). సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి అదే అర్థంలో మనం వాడుతున్నాం.</p>
<p>63. మూటాముల్లే: మూట=బట్టలు లోనగువాని ముడియ (1045). ముల్లె=మూత, ధనము ముడి(1042). ఈ రెండిటినీ కలిపి, మూటా ముల్లే అంటే బట్టలూ డబ్బూ అనే అర్థంతో వాడుతున్నాం.</p>
<p>64. మేళ తాళాలు: మేళము అంటే మనం అనుకునే ధ్వనిసంబంధమయిన అర్థం లేదు. దాని అర్థం వాద్యగాండ్ర గుంపు. (1056). మేళముచేయు అంటేనే వాద్యములను వాయించు అని మనం అనుకునే అర్థం (1056). తాళము అంటే పాడునపుడు చేతులతో చఱచెడి చఱపు లేదా పాడునపుడు జరిగెడు కాలపరిమాణం. ఈ అర్థాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పదాలను మనం వాటి అర్థాలతో ప్రమేయం లేకుండా ఉపయోగిస్తున్నట్లు.</p>
<p>65. రాయీ రప్పా: రాయి=శిల, పాషాణం(1085). రప్ప=రాయివంటి గట్టి వస్తువు(1079). అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి అదే అర్థంలో మనం వాడుతున్నాం.</p>
<p>66. వన్నె చిన్నెలు: వన్నె=అందం, రంగు (1121). చిన్నె=చిన్నియ అనగా గురుతు లేదా విలాసం(497) =స్త్రీల శృంగార చేష్టా విశేషం (1158). విభిన్న అర్థాలున్న ఈ రెండు పదాలని కలిపి అందం, విలాసం అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.</p>
<p>67. వర్తక వ్యాపారాలు: వర్తకం=వాణిజ్యం, క్రయవిక్రయ వ్యాపారం(1125). వ్యాపారం=వర్తకం, పని, ఉద్యోగం, వృత్తి, యత్నం అనే అర్థాలు (1184)ఉన్నాయి. రెండిటినీ కలిపి, ఆ రెండు పదాల అర్థాలు విడిగా ఇస్తున్న అర్థంతోనే వాడుతున్నాం.</p>
<p>68. వాగూ వంకా: వాగు=సెలయేరు (1131). వంక=వాగూ, కాలువా (1112) అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి కొంచెం విస్తృతార్థంతో వైవిధ్యం ధ్వనించేలా మనం వాడుతున్నాం.</p>
<p>69. వావీ వరుసా: వావి=బంధుత్వం, బంధు వరుస (1140). వరుస=బంధుత్వక్రమం (1124). ఈ రెండు పదాలని కలిపి వాడుతూ; అతడికి వావీ, వరుసా లేదంటున్నాం అంటే సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో కానీ, ప్రవర్తించటంలో కానీ, బంధుత్వాన్ని పాటించటం లేదని అర్థం.</p>
<p>70. సిగ్గూ ఎగ్గూ: సిగ్గు=లజ్జ (1240). ఎగ్గు=కీడు, తప్పు, అవమానం (224). సిగ్గూ ఎగ్గూ లేకుండా అంటే; లజ్జ లేకుండా అనటం వరకూ సముచితమే. ఎగ్గు లేకుండా అంటే కీడు తేకుండా, తప్పు లేకుండా, అవమానం లేకుండా అన్నట్లు. మరి ఇవి రెండూ లేకుండా అనటం అనుకున్న అర్థం ఇస్తున్నాయా? అనుమానాస్పదమే!</p>
<p>71. సోయీ సొంపూ: సోయి అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. సొంపు=సౌందర్యం(1253). ఈ రెండు పదాల్లో సొంపు అనే పదానికి ఉన్న అర్థంతో, అర్థం లేని సోయి అనే పదంతో దాన్ని కలిపి మనం వాడుతున్నాం.</p>
<p>72. హద్దూ పద్దూ: హద్దు=ఎల్ల, మితి(1268). పద్దు=పంతం, ప్రతిజ్ఞ, నేర్పు(823). రెండిటినీ కలిపి మితిమీరి ప్రవర్తిస్తున్న అన్న అర్థంలో ఉపయోగిస్తున్నాం. కాని, రెండు పదాలకి ఉన్న అర్థం కలిపితే, మనం అనుకునే అర్థం రావటం లేదు.</p>
<p>73. హద్దూ ఐపు: హద్దు=ఎల్ల, మితి (1268). ఐపు=తప్పు, దోషము, జాడ, అయిపు(245). ఈ రెండు పదాలకీ ఉన్న అర్థాలని కలిపి, హద్దూ ఐపూ లేదు అని; అంటే మితి మీరి ప్రవర్తించటం అనే అర్థంలో వాడుతున్నాం. కాని, ఐపు అనే పదానికి ఉన్న అర్థం ఈ వినియోగాన్ని సమర్థించటం లేదు.</p>
<p>చివరగా ఒక మనవి. ఇవి కాక, ఇలా వాడబడే పదాలు మరికొన్ని ఉండవచ్చు. అవి నా దృష్టిలో లేనందునే వాటి విషయంలో నేను ఏ ప్రయత్నమూ చేయలేకపోయాను. ఔత్సాహికులు ఎవరైనా ఇలాంటి ప్రయత్నాన్ని తమ ఎరుకలో ఉన్న పదాలతో కొనసాగించవచ్చు. మరో మాట. ఈ పరిశీలన నా అవగాహన అనుమతించిన మేరకు చేశాను. ఇందులో ఏదైనా పొరపాటు దొర్లితే విజ్ఞులు దానిని సవరించవచ్చు. అంతేకాకుండా తమ దగ్గర ఉన్న అదనపు సమాచారంతో, కొన్ని పదాల విషయంలో నేను వ్యక్తం చేసిన అనుమానాలని సైతం నివృత్తి చేయవచ్చు. కావాల్సిందల్లా, మనం వాడుతున్న పదాలకు సరయిన రూపం, అసలయిన అర్థం; అవసరం ఉన్న అందరికీ చేరటమే. అది ఎంత మేరకు జరిగితే ఈ వ్యాసం అంత మేరకు దాని ప్రయోజనాన్ని సాధించినట్లు.</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11695</wfw:commentRss>
		<slash:comments>9</slash:comments>
		</item>
		<item>
		<title>తెలుగు కథలో భాష</title>
		<link>http://vaakili.com/patrika/?p=11394</link>
		<comments>http://vaakili.com/patrika/?p=11394#comments</comments>
		<pubDate>Thu, 30 Jun 2016 19:03:12 +0000</pubDate>
		<dc:creator>వాకిలి</dc:creator>
				<category><![CDATA[వ్యాసాలు]]></category>
		<category><![CDATA[టి. చంద్రశేఖర రెడ్డి]]></category>

		<guid isPermaLink="false">http://vaakili.com/patrika/?p=11394</guid>
		<description><![CDATA[ఏ సాహిత్యప్రక్రియలో వాడిన పదాలయినా, పదబంధాలయినా పాఠకుడు సులభంగా చదవగలగాలి. అది సౌకర్యంగా జరిగితేనే; తెలిసిన అర్థాన్ని, తెలుసుకున్న అర్థాన్ని వాక్యానికి అన్వయించుకుని అంతర్లీన భావాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఈ మధ్య నేను చదివిన ఒక తెలుగు కథలో 769 ఇంగ్లీషు పదాలు ఉన్నాయి. దీనికి తోడు ఒక ఇంగ్లీషు పదానికి మరో తెలుగు పదాన్ని ముడెయ్యటం. టేబిల్మీద అలాంటి ప్రయోగాల్లో ఒకటి.  అదే పెద్ద ఇబ్బంది అనుకుంటున్న దశలో, నాలుగు ఇంగ్లీషు పదాలకి పీటముడి వేసి, సంథింగీజ్రాంగ్ అని కొందరు మాత్రమే పలికేలా రాయటం, మూలిగే నక్కమీద తాటిపండే కాగలదు.]]></description>
			<content:encoded><![CDATA[<div style="text-align: justify; text-indent: 50px; font-size: 16px; line-height: 25px;">
<p><span style="font-size: 30px;">వా</span>కిలి అంతర్జాలమాసపత్రిక పాత సంచికలు తిరగేస్తుంటే; <a href="http://vaakili.com/patrika/?page_id=2754&amp;sanchika=May" target="_blank"><strong>మే 2013</strong></a> సంచికలో,  <a href="http://vaakili.com/patrika/?tag=%E0%B0%B8%E0%B1%81%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4" target="_blank"><strong>సుజాత</strong></a> గారి వ్యాసం ‘<a href="http://vaakili.com/patrika/?p=2693" target="_blank"><strong>రచయితలు సరైన భాష వాడకపోతే, అది భాష మీద కుట్రే</strong></a>’ అన్న వ్యాసం కనపడింది. విషయం ఆసక్తికరంగా అనిపించటంతో వెంటనే చదివాను. చదివిన తర్వాత అందులో ఉన్న విషయాలమీదనే కాకుండా, మన కథల్లో  కనపడుతున్న తెలుగు భాష మీద ఇంకొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందని అనిపించింది.</p>
<p><span style="color: #000000;"><strong>1.</strong></span> సుజాత గారి వ్యాసంలో వడ్డెర చండీదాస్ గారి నవల ‘అనుక్షణికం’ లో ఉన్న తెలుగు భాష గురించి ప్రస్తావన ఉంది. ఆయన  రాసిన నవల ‘హిమజ్వాల’, రాసిన కథల్తో వెలువడ్డ కథల సంపుటి ‘చీకట్లోంచి చీకట్లోకి&#8230;” కూడా చదివితే, ‘అనుక్షణికం’లో ఆయన వాడిన తెలుగు భాష తులనాత్మకంగా ఎంత తక్కువ ఇబ్బంది పెడుతుందో తెలుస్తుంది. ఈ రెండు పుస్తకాలూ, ‘అనుక్షణికం’ కన్నా ముందువి. మామూలుగా తెలుగు కథల్లో, నవలల్లో వాడని పదాలు వాడటమే కాకుండా; విస్తృతంగా వాడకంలో ఉన్న కొన్ని ఇంగ్లీషు పదాలకు, ఆయన తన రచనల్లో తనదైన శైలిలో తెలుగు పదాలు వాడే ప్రయత్నం చేశారు. పంకా మీట, బూడిద బుడ్డి అలాంటివే.</p>
<p><strong>2.</strong> చండీదాస్ గారు వాడిన భాష గురించి రాస్తూ, కాశీభట్ల వేణుగోపాల్ గారు తన కథల్లో వాడే భాష గురించి  సుజాత గారు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. వాటితో ఏకీభవిస్తూనే, అంతకుముందు కొందరు రచయితలు అంతకుముందు వాడినట్లుగా కనపడని కొన్ని పదాలను ఆయన వాడుతున్నారన్న నిజాన్ని సైతం మనం  అంగీకరించాల్సి ఉంది. సుజాత గారి వ్యాసంలో ఉటంకించబడ్డ ఉన్న నికషం (ఒరగల్లు, ఒరయిక, గీటురాయి మీద గీచిన బంగారపు గీత) అలాంటి పదాల్లో ఒకటయితే, ఆయన మరో కథ ‘నిశ్శబ్ద స్వరం’ లో వాడిన ‘సుషిరాలు” అనే పదం మరొకటి. దీని అర్థం, వేణువుకి ఉండే రంధ్రాలు. అవి, వేణువు వాడే ప్రాంతాన్ని బట్టి ఆరు, ఎనిమిది, పదకొండు, వీటిలో ఎన్నయినా కావచ్చు.</p>
<p><strong>3.</strong> ఏ సాహిత్యప్రక్రియలో వాడిన పదాలయినా, పదబంధాలయినా పాఠకుడు సులభంగా చదవగలగాలి. అది సౌకర్యంగా జరిగితేనే; తెలిసిన అర్థాన్ని, తెలుసుకున్న అర్థాన్ని వాక్యానికి అన్వయించుకుని అంతర్లీన భావాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఈ మధ్య నేను చదివిన ఒక తెలుగు కథలో 769 ఇంగ్లీషు పదాలు ఉన్నాయి. దీనికి తోడు ఒక ఇంగ్లీషు పదానికి మరో తెలుగు పదాన్ని ముడెయ్యటం. టేబిల్మీద అలాంటి ప్రయోగాల్లో ఒకటి.  అదే పెద్ద ఇబ్బంది అనుకుంటున్న దశలో, నాలుగు ఇంగ్లీషు పదాలకి పీటముడి వేసి, సంథింగీజ్రాంగ్ అని కొందరు మాత్రమే పలికేలా రాయటం, మూలిగే నక్కమీద తాటిపండే కాగలదు.</p>
<p><strong>4.</strong> ఏ రచన అయినా తనకు తెలీని ఒక విషయాన్ని తెలిసేలా చెప్పటానికి ప్రయత్నిస్తోందన్న నమ్మకం పాఠకుడికి కలిగించగలిగాలి.  ఆ నమ్మకం వమ్మయేలా రచన ఉంది అన్న అనుమానం కలిగినపుడు, ఏ పఠితా దానిలోకి ఇష్టపూర్తిగా, పూర్తిగా  ప్రవేశించడు. కాగా, అయిష్టంతో దాన్ని దూరంగా నెడతాడు. అప్పుడు కథ ప్రాథమికప్రయోజనం అయిన చదివించగలగటం  దెబ్బతింటుంది. అది, తన కథ పాఠకుల్లోకి వెళ్లాలి అన్న ఉద్దేశం ఉన్న కథకులెవరూ ఆహ్వానించదగిన పరిణామం కాదు.</p>
<p><strong>5.</strong> సుజాత గారి వ్యాసంలో కొడవటిగంటి కుటుంబరావు గారు వాడిన అయిష్టత అనే పదం గురించి ఒక అభ్యంతరం ఉంది. శబ్దార్థచంద్రికలో అయిష్టం అనే పదమే లేదు. ఇష్టానికి నకారం జోడించి, ఇష్టం లేకపోవటాన్ని వ్యక్తీకరించటానికి, సృష్టించబడ్డ పదం అది. ఇష్టంగా చెప్పాలనుకున్నదాన్ని అయిష్టం చెపుతున్నపుడు, అయిష్టతని సృష్టించటం మీద ఇష్టం ఎందుకో బోధపడదు.</p>
<p><strong>6.</strong> వీటితో పాటు, వ్యాసంలో; రంగనాయకమ్మ గారు తన రచనలో వాడిన ‘గడియ’ అనే పదం గురించి కూడా వ్యాసకర్త అభిప్రాయం ఉంది.  గడియ అంటే అర్థం, ఇరవై నాలుగు నిమిషాల (దీన్ని కొందరు నిముషం అని రాస్తారు, అది తప్పు. నిమిషం అని కానీ, నిముసం అని కానీ రాయాలి) కాలం అని చెపుతూ, ఆ అర్థం రచనలో సందర్భానికి ఎలా అన్వయిస్తుందని సుజాతగారు అనుమానం వ్యక్తపరిచారు. నా దగ్గర ఉన్న శబ్దార్థచంద్రిక  (ప్రచురణ-1969-పేజీ 420) ప్రకారం, గడియకి ఉన్న అర్థాలు; ఇరువదినాలుగు నిమిషాల కాలము, అల్పకాలము, ముహూర్తము(పండ్రెండు క్షణాల కాలము). ఈ అర్థాల దృష్ట్యా రంగనాయకమ్మ గారు ఆ పదాన్ని వాడటం రచనాసందర్భానికి సరిపోతుందని నా అభిప్రాయం. కొందరు తరచుగా వాడే ఘడియ అనే పదం కానీ, విఘడియ  అనే పదం శబ్దార్థచంద్రికలో లేదు. విగడియ అనే పదం మాత్రం ఉంది. దాని అర్థం, గడియలో అరవయ్యో భాగం. నేననుకోవటం, గడియారం అనే పదానికి గడియ అనే పదం మాతృక అని.</p>
<p><strong>7.</strong> ఇది కాక, వ్యాసంలో అల్లం శేషగిరిరావు గారు తన కథలో వాడిన కర్ణాకర్ణిగా అనే పదం గురించి సైతం ప్రస్తావన ఉంది. దీని గురించి రాస్తూ సుజాత గారు, రచయిత ఆ పదం అర్థం ”అస్పష్టం’ అనుకొని వాడినట్లుగా ఉంది అన్నారు. ముందు పేరాలో నేను పేర్కొన్న శబ్దార్థచంద్రికలోనే (పేజీ 299) ‘కర్ణాకర్ణి’ అంటే ‘వినికివరుస’ అని చెప్పబడింది. అదే పేజీలో ‘వినికి’ అంటే ‘వినుట’ అని కూడా అర్థం ఉంది. అందువల్ల ‘కర్ణాకర్ణి’ అంటే ‘వినపడిన వరుస’ అని అర్థం చేసుకోగలిగితే, శేషగిరిరావు గారి ప్రయోగం కూడా అభ్యంతరకరం కాదు.</p>
<p><strong>8.</strong> సుజాత గారి వ్యాసం నాలుగో పేరాలో ‘వాళ్ళకి’ అనే పదప్రయోగం ఉంది. నాకు తెలిసి తెలుగు పదాలు రాస్తున్నపుడు; ‘ళ’ కి ‘ళ’ ఒత్తు ఇవ్వగూడదు. ఆ అవసరం ఉన్నచోట ‘ల’ఒత్తు వాడాలి. అందువల్ల ‘వాళ్ళకి’ అని రాయకుండా, ‘వాళ్లకి’ అని మాత్రమే రాయాలి. 1277 పేజీలు ఉన్న శబ్దార్థచంద్రిక (1969 ప్రచురణ);  234, 256, 313, 331, 354, 363, 366, 380, 394, 395, 396, 397, 430, 453, 461, 468, 475, 541, 618, 670, 787, 788, 844, 869, 897, 1018, 1030, 1044, 1174, 1232, 1242, 1254 పేజీల్లో ఉన్న విభిన్న పదాల ద్వారా అదే విషయం మనకు స్పష్టంగా తెలియచెపుతుంది.</p>
<p><strong>9.</strong> ఈ రకమైన పొరపాట్లు దొర్లడానికి కారణం ఒకటే. మన జ్ఞానంలోంచి కాకుండా, ఒక పదం మనకు మొదటిసారి పరిచయమయిన జ్ఞాపకంలోంచి, వాడటం. నా దృష్టిలో దీనికి మంచి ఉదాహరణ విభ్రమ అనే పదం.. ‘విభ్రమం’ అంటే ‘భ్రాంతి’ అనీ, ‘విభ్రమ’ అంటే ‘ముసలితనం’ అనీ అర్థం. దీన్ని ‘భ్రాంతి’ అనే అర్థంలో చాలా మంది ఉపయోగిస్తారు. అలా ఉపయోగించిన కథకులొకరికి, ఈమెయిల్ ద్వారా ఇదే విషయాన్ని తెలియపరిస్తే, నేను ‘భ్రాంతి’ అనే అర్థంలోనే ఆ పదం వాడాను అని జవాబు వచ్చింది. అర్థం బట్టి పదప్రయోగం ఉండాలి కాని, వాడిన విధం బట్టి పదం అర్థం మారుతుందా? కథ లేకపోయినా భాష ఉంటుంది. భాష లేకపోతే కథ ఉంటుందా? అన్నది అలాంటి కథకులు అవశ్యం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.</p>
<p><strong>10.</strong> ఈ రోజు ఉదయం ఒక కథ చదివాను. అందులో ఒక పురుష పాత్ర; నేనూ, మా ఆవిడా ఇద్దరం అనాథలమే అని మరో పాత్రకి తెలియపరుస్తుంది. అనాథ అంటే నాథుడు లేనిది అనీ; అనాధ అంటే నాధుడు లేనిది, దిక్కు లేనిది అనీ అర్థం.  కాబట్టి ఆ పురుషపాత్ర వాడాల్సిన పదం అనాధ. అంతే కాని అనాథ కాదు.</p>
<p><strong>11.</strong> ఒక రచయిత తన కథలో స్త్రీ పాత్రకి వర్ధని అని పేరు పెట్టాడు. వర్ధనము అంటే పెరుగునది. వర్ధిల్లు అంటే వృద్ధి పొందునది. బహుశా, వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ పేరుని ఎన్నుకుని ఉంటాడు. కాని, వర్ధని అంటే చీపురుకట్ట, పాడె అని ఆయనకి తెలిసుండదు.</p>
<p><strong>12.</strong> మా మాట తీరు స్వచ్ఛంగా ఉంటుంది, మిగిలినవాళ్లతో పోలిస్తే మా మాటలు స్పష్టంగా ఉంటాయి అన్న నమ్మకంతో కొందరు కొన్ని పదాల్లో మొదటి అక్షరాలని ఒత్తి పలుకుతుంటారు. అయితే వారు పలికిన విధంగా ఉండే పదాలు తెలుగు భాషలో ఉండవు. ఘడియ అలాంటి పదాల్లో ఒకటయితే, ఖర్మ రెండోది. తప్పుగా రాసిన పదానికి వేరే అర్థం ఏదీ లేకపోతే, పెద్దగా ముప్పు ఉండదు. ఉచ్చారణలో సామ్యత బట్టి, ముద్రారాక్షసమేమో అని సర్ది చెప్పుకొని, సరిగా అర్థం చేసుకోవచ్చు. సమస్యల్లా తప్పుగా రాసిన పదానికి వేరే అర్థం ఉంటేనే. శతాబ్దాలు అంటే కొన్ని వందల సంవత్సరాలు. శతాబ్ధాలు అంటే వంద  సముద్రాలు. ఈ సున్నితమయిన తేడాలని మనసులో పెట్టుకుని పదప్రయోగం చేస్తే, అపార్థాలకి తావుండదు. అనర్థాలూ వాటిల్లవు.</p>
<p>అనుబంధం: తెలుగులో రాయబడుతున్న రచనల్లో తరచుగా తప్పుగా వాడబడుతున్న పదాల పట్టిక. బ్రాకెట్లలో ఇవ్వబడింది సరైన పదం.</p>
<p>అంతర్థానం(అంతర్ధానం), అగాథం(అగాధం), అథోలోకం(అధోలోకం), అర్ధం(అర్థం), అర్థంతరంగా, అర్థాంతరంగా, అర్ధాంతరంగా(అర్ధంతరంగా), ఆదిమధ్యంతాలు(ఆదిమధ్యాంతాలు), కధారచన (కథారచన), ఖచ్ఛితం(ఖచ్చితం, కచ్చితం), గ్రంధి(గ్రంథి), చామనఛాయ(చామనచాయ), నేపధ్యం(నేపథ్యం), పరిణితి(పరిణతి), ప్రధమంగా(ప్రథమంగా), ప్రార్ధన(ప్రార్థన), బేధం(భేదం), మధన(మథన), మన్మథుడు (మన్మధుడు), యధాతథం, యధాతధం, యథాతధం(యథాతథం), యదార్ధం(యథార్థం), రధం(రథం), వృధా(వృథా), వ్యథ(వ్యధ), నిముషం(నిమిషం, నిముసం), నిశీధి(నిశీథి),  శతాబ్ధం(శతాబ్దం), శిధిలం(శిథిలం), సామర్ధ్యం(సామర్థ్యం), స్తబ్దత(స్తబ్ధత), స్పర్థ(స్పర్ధ), స్మశానం(శ్మశానం), స్వాంతన(సాంత్వన).</p>
<p style="text-align: center;">**** (*) ****</p>
</div>
<p>సుజాత గారి వ్యాసం: <a href="http://vaakili.com/patrika/?p=2693" target="_blank">రచయితలు సరైన భాష వాడకపోతే, అది భాష మీద కుట్రే</a></p>
<p>Related Articles:<br />
<a href="http://vaakili.com/patrika/?cat=402" target="_blank">భాషాసవ్యతకు బాటలు వేద్దాం (ఎలనాగ)</a></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://vaakili.com/patrika/?feed=rss2&#038;p=11394</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
	</channel>
</rss>
