సమీక్ష

కొత్త పుస్తకాల సమీక్షలు

‘లోపలి స్వరం’ జీవితకథల రంగులరాట్నం

మార్చి 2013


‘లోపలి స్వరం’ జీవితకథల రంగులరాట్నం

సాహిత్యమంటేనే సాహసం.

ఒకసారి సాహసాలు మొదలుపెట్టాక ఇక ఏదైనా ఒకటే అనుకోడానికి వీల్లేదని ఈ మధ్యనే తెలిసొచ్చింది. ముఖ్యంగా రేణుకా అయోలా లాంటి సీనియర్ కవుల కవితా సంకలనాలపై సమీక్ష రాయాలంటే చాలా ధైర్యం, పరిణతీ కావాలి. అది సాహసంకంటే ఎక్కువే అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఆమె “లోపలి స్వరం” వినడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా ఆ పుస్తకం హార్డ్ కాపీ దొరక్కపోయినా, సమయానికి కినిగె వారు ఆదుకోవటం శుభసూచకం. అయితే ఈ రోజుల్లో వస్తున్న మిగతా సాహిత్యంలా కాక మనసుపెట్టి చదవాల్సిన కవిత్వం కావటంతో ఈ సమీక్ష మీముందుకు రావటానికి అనుకున్నదానికంటే చాలా ఆలస్యమయింది.

 

(రేణుకా అయోలా)


పూర్తిగా »

పాటల పినలగర్రా… పాడూ!

ఫిబ్రవరి 2013


పాటల పినలగర్రా… పాడూ!

ఆర్. రామకృష్ణ గారి, పినలగర్ర కవితా సంపుటి 1986 నుండి 1999 ల మధ్య వ్రాసిన 36 కవితల సమాహారం. పినలగర్ర అంటే (ఉత్తరాంద్ర లోని బొబ్బిలి ప్రాంతానికి చెందిన మాండలికం ప్రకారం) పిల్లనగ్రోవి.  మూగ వారు లేదా మురళి-ఊదే-కళాకారులు తమ హృదయ-భాషని లేదా హృదయ-ఘోషని పంచుకోడానికి ఉపయోగించే పిల్లనగ్రోవిని శీర్షికగా తీసుకోవడంతోనే ఈ కవితలలో హృదయాంతరాల సందేశమేదో కవి దాచి ఉంచారని అనిపిస్తుంది.

పొలం దున్నుతున్నప్పుడు వచ్చే మట్టి వాసన లో మాధుర్యం;  దుక్కి దున్నే రైతు చిందించే స్వేదజలం వెనుక వున్న విలువ, అందులోని శ్రామిక సౌందర్యం;  పొలం పనికి పసి బిడ్డను ఇంటిదగ్గర వదిలి వచ్చిన తల్లిపడే మానసిక వేదన;  పల్లె…
పూర్తిగా »

అంతరంగం వొక అడివి…ఆ అడివిలో ఇరుకు దారి కాశీభట్ల నవల

జనవరి 2013


అంతరంగం వొక అడివి…ఆ అడివిలో ఇరుకు దారి కాశీభట్ల నవల

” I CAN CONNECT NOTHING WITH NOTHING ” అంటాడు టి.ఎస్. ఇలియట్ తన ” వేస్ట్ లాండ్ ” కవితలో. ఆ  కవిత ఆధునిక కవిత్వానికి ఆదిమూలమైన కవిత అని మనమందరమూ భావిస్తాము. ఒక బీజ కణం నుండి ఆవిర్భవించి , ఒక రూపం తో జన్మించి , ఏమిటో ఎందుకో ఈ భూమి మీదకి వచ్చామో తెలీక కొట్టుమిట్టాడుతూ ఉన్న జీవి వేదన కు ప్రతిబింబం ఆ కవిత .ఆ కవిత చదవడం ఒక అపూర్వానుభవం. కాశీభట్ల వేణుగోపాల్ ని చదవడం కూడా అటువంటి ఒక అపూర్వానుభవమే అని చెప్పాలి .

మనసులోని భావాన్ని అక్షరంగా ఆవిష్కరించే ధైర్యం చాలా తక్కువమందికి ఉండచ్చు .…
పూర్తిగా »

మనిషితనపు ఆనవాళ్ళు, మట్టివేళ్ళు

జనవరి 2013


మనిషితనపు ఆనవాళ్ళు, మట్టివేళ్ళు

“పత్రనేత్రాల పరిశీలనతో ప్రపంచపు
నలుదిశలూ పరికిస్తూ మెదిలినా
నాకో గమనింపు ఉంది
వేళ్ళెప్పుడు నేలలోనే ఉండాలని” (2)

“మట్టివేళ్ళు” పేరు వినగానే మొదట స్పురించే వాక్యాలివి. “మట్టివేళ్ళు” కవి కట్టాశ్రీనివాస్ మొదటి కవితా సంకలనం.మట్టిపరిమళాన్ని గుండెల్లో నింపుకొని,గమనింపునెప్పుడూ మర్చిపోకుండా,పచ్చని చెట్టుగా ఎదుగుతూ వచ్చిన  కవి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.కాంతిని ఆవహించుకోగల శక్తితోపాటే చలించడం అతని సహజ స్వభావం.అయితే వ్యక్తిగా ఎంత పారదర్శకంగా చలిస్తాడో,కవిగాను అంతే పారదర్శకంగా చలిస్తాడతడు.

జీవితంలో నిత్యం తారసపడే సందర్భాలే కట్టా శ్రీనివాస్‌కి కవిత్వ వస్తువులు.తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది.ఊహాతీత ఇమేజరీతో ఇబ్బందిపెట్టడు.అర్ధంలేని abstractని ఉపయోగించడు.కొన్నిసార్లు మనసు,కొన్నిసార్లు స్నేహం,చాలసార్లు మానవత్వం అతని కవితల్లో ప్రదర్శింపబడతాయ్. అందరికి అనుభవంలో…
పూర్తిగా »