
పడిలేచే ప్రయత్నమే రాలిన ప్రతి చినుకుదీ. కదిలించే కన్నీరే రాలిన ప్రతి పూవుది. సాథారణ కవులెవరూ పసిగట్టలేని కదలికలు కూడా చూడగలిగే కవయిత్రే ప్రసూనా రవీంద్రన్. కాబట్టే, “మేఘానికి మరోవైపు” వ్రాయగలిగింది.
ప్రకృతి పారవశ్యంలో వ్రాసే కవితలు చాలానే ఉంటాయి. వానపాటల పకపకలు, మేఘమాల రెపరెపలు, పున్నమి వెన్నెల నవ్వులు, పూల రేకల గుసగుసలు, పిచ్చుకల కిచకిచలు, కప్పల బెకబెకలు. అందాన్ని అద్దంలా ఆవిష్కరించే కవితలే ఇవి. ఆకాశమంతా అలుముకున్న కవిత్వమే ఇది. చాలామందిని మెప్పించే కవిత్వమే ఇది. చాలామంది వ్రాస్తున్న కవిత్వమే ఇది.
“మేఘానికి మరోవైపు” మాత్రం కేవలం పరవశత్వంతో వ్రాసినది కాదు. తాదాత్మ్యం చెంది వ్రాసిన కవిత.
“మేఘానికి మరోవైపు“
ఆకాశం…
పూర్తిగా »
వ్యాఖ్యలు
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
రాజేంద్రప్రసాద్ on ద్వంద్వపదాలు
N Rammohan on ద్వంద్వపదాలు