
తెలుగు వాళ్ల కిప్పుడు రెండు రాష్ట్రాలు యేర్పడ్డాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోని తెలుగువాళ్ల సంఖ్య యెంతో, అంతమంది తెలుగువాళ్లు రెండు రాష్ట్రాల బయట వున్నారు. తొలిరోజుల్లో చాలా చిన్న గొంతుగా ప్రారంభమైన వాళ్ల సాహితీస్వరం క్రమంగా పెరిగి 2000 నాటికి స్పష్టంగా వినబడసాగింది. తమిళనాడులో హోసూరు నుంచి తెలుగు సాహిత్యం వెలువడడం ప్రారంభించాక గానీ, అక్కడి తెలుగువాళ్ల వునికీ, మనికీ, యితరులకు తెలియలేదు. యిప్పుడు రాష్ట్రేతర ఆంధ్రులు తమదైన జీవితాన్ని సాహిత్యీకరించే పనిని నిర్దుష్టంగా చేసుకుపోతున్నారు. సమకాలీన సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ బలంగా వున్న కథానిక వాళ్ల వ్యక్తీకరణకు బాగా దోహదం చేస్తోంది. గత అయిదారేళ్లుగా అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు రాస్తున్న కథలు తెలుగు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?