ఆ రోజు పొగ మబ్బులు ఆవరించిన తొలివేకువ ఝామున
పచ్చిక బయళ్ల పైన గడ్డి చామంతులు, లిల్లీ పూలు దిగులుగా తలలూపుతున్న ఆ క్షణాన్నే
ఏనాటిదో కాలం తెలియని ఆ పురాతన రావిచెట్టు పక్కన మట్టి దిబ్బ పైన
నిలిచిన మేం పుట్టిన ఆ ఒంటరి ఇంటిని వదిలి బయలుదేరాం
తల్లులం, పిల్లలం ఒక్కొక్కరుగా ఒకరి తరువాత ఒకరుగా
మా పాదాల చప్పుడుకి, ఉగ్గపట్టిన సన్నటి దుఃఖ రాగానికీ
చూరులో చలికి ముడుచుకు పడుకున్న ఉడుత ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగెత్తింది
అందరికన్నా చిన్న దాన్నేమో అమ్మమ్మ పక్కనుండి నక్కినక్కి చూసాను వెనక్కి
పలుచటి తెలుపు, లేత బూడిద వర్ణ మేఘాల మధ్య వెలసిన నీటి రంగు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?