
కథను చక్కని శిల్పంగా చెక్కుతాడనీ, ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో నిర్దుష్టంగా మలుస్తాడనీ పేరు పొందిన రచయిత చాగంటి సోమయాజులు (చాసో) . ఆయన రాసిన కథల్లోనే విభిన్నమైనది ‘దుమ్ములగొండె’. అప్పటికే కుంకుడాకు, ఏలూరెళ్లాలి లాంటి రచనలతో పేరు తెచ్చుకున్న చాసో్ ఈ కథను ఆసక్తికరమైన నేపథ్యంతో అల్లాడు.
ఈ కథ మొట్టమొదట సాహిత్య మాసపత్రిక ‘భారతి’ లో 1943 జులైలో వచ్చింది. 70 సంవత్సరాల క్రితం రాసిందైనా ఇప్పటికీ వన్నె తరగలేదు. మానవ స్వభావంలోని ఒక వాస్తవాన్ని వెన్నెల వెలుగులో చూపించిన కథ ఇది!
కథాంశం చిన్నదే. ముగ్గురు జతగాళ్ళు సరదాగా కుమిలీ ఘాటీకి అర్థరాత్రి షికారుకు బయలుదేరటం, ఆ అనుభవం చివరికెలా పరిణమించిందీ అన్నది-…
పూర్తిగా »
వ్యాఖ్యలు
dasaraju ramarao on కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని
Resoju Malleshwar on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
Yerriswamy Swamy on శైశవగీతి
Mani Sarma on కృతి
శ్రీధర్ చౌడారపు on సాక్షి