‘ వేణు ’ రచనలు

వెన్నెలరాత్రి వణికించిన అనుభవం

అక్టోబర్ 2013


వెన్నెలరాత్రి వణికించిన అనుభవం

కథను చక్కని శిల్పంగా చెక్కుతాడనీ, ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో నిర్దుష్టంగా మలుస్తాడనీ పేరు పొందిన రచయిత చాగంటి సోమయాజులు (చాసో) . ఆయన రాసిన కథల్లోనే విభిన్నమైనది ‘దుమ్ములగొండె’. అప్పటికే కుంకుడాకు, ఏలూరెళ్లాలి లాంటి రచనలతో పేరు తెచ్చుకున్న చాసో్ ఈ కథను ఆసక్తికరమైన నేపథ్యంతో అల్లాడు.

ఈ కథ మొట్టమొదట సాహిత్య మాసపత్రిక ‘భారతి’ లో 1943 జులైలో వచ్చింది. 70 సంవత్సరాల క్రితం రాసిందైనా ఇప్పటికీ వన్నె తరగలేదు. మానవ స్వభావంలోని ఒక వాస్తవాన్ని వెన్నెల వెలుగులో చూపించిన కథ ఇది!

కథాంశం చిన్నదే. ముగ్గురు జతగాళ్ళు సరదాగా కుమిలీ ఘాటీకి అర్థరాత్రి షికారుకు బయలుదేరటం, ఆ అనుభవం చివరికెలా పరిణమించిందీ అన్నది-…
పూర్తిగా »