‘ ఇంద్రగంటి మాధవి ’ రచనలు

కృష్ణాష్టమి

అక్టోబర్ 2015


కృష్ణాష్టమి

'ఉన్న పళంగా ఇంటికి రండి.' 'అదేవిటి, ఇంకా ఇక్కడ బిల్లేయించాలి, పిండి మరలో బియ్యం పట్టించాలి. ఉన్న పళంగా ఎలా?' సూపర్ మార్కెట్ లోంచి శంకర్. 'ఆ బిల్లూ గిల్లూ, గిర్నీ వొద్దు. ఇంకేవీ కొనద్దు. వొచ్చేయండి.' ఫోనులో జమున హడావుడి వింటే శంకర్ కి ఏం కొంప ములిగిందోనని ఓ క్షణం ఏం అర్ధం అవలేదు. "కాశీ లో అమ్మా నాన్నా ఏమైనా… ఏమైందిప్పటికిప్పటికి? ఇంతవరకూ కృష్ణాష్టమీ, పూజా, అరిసెలూ, అప్పాలూ, పోకుండలూ అని నన్ను పరిగెట్టించి… ఈ జమునకి ఆ పేరెవరు పెట్టేరో కానీ, అందాన్నటుంచితే, అట్టహాసానికేం తక్కువ లేదు."
పూర్తిగా »