‘ వెల్దండి శ్రీధర్ ’ రచనలు

ఒక ‘నది పలికిన వాక్యం’తో సంభాషణ

ఫిబ్రవరి 2017


ఒక ‘నది పలికిన వాక్యం’తో సంభాషణ

గుండె బద్దలు కొట్టుకొని వచ్చిన అక్షరాలకు, రక్తాన్ని అద్దుకొని గర్భం నుండి బయటపడిన అక్షరాలకు తెగువ ఎక్కువ. రాపిడి ఎక్కువ. నీటి తాకిడికి నలిగిపోయి నలిగిపోయి మొరటు రాళ్లు గులక రాళ్లుగా మారిపోయినట్టు విలాసాగరం రవీందర్ అక్షరాలు కూడా ఒక నిప్పును, ఒక దుఃఖపు పుప్పొడిని, చావు చివరి అంచును మోసుకు వస్తాయి. కాలం ఎలా కంపిస్తే అలా ప్రకంపించే కవులు తక్కువ. అందుకు విలాసాగరం రవీందర్ మినహాయింపు. దానికి నిదర్శనం అతడు ఇటీవలే వెలువరించిన ‘నది పలికిన వాక్యం’ కవితా సంపుటి. జీవితపు దిగుడు బావి నుండి ఒక నదిని భుజానికెత్తుకొని వచ్చి మన హృదయపు వాకిట్లో పరవళ్లు తొక్కిస్తాడు. నది ప్రయాణించినంత…
పూర్తిగా »