మనుషులున్నాయంటావా ?
అడిగింది పిల్ల దెయ్యం తల్లిని .
“ఇంతవరకూ రాలేదు నా ఉనికిలోకి ”
మరి మనాళ్ళంటారే ?
“ఔను మన పెద్దాళ్ళు అంటుంటారు
మనలో కోర్కెలు చావని వాళ్ళు
మనుషులౌతాయని ”
అది నిజంకాదా మరి ?
“ఏమో నాకు తెలియంది ఏం చెప్పను ? ”
పాపం కదా మనుషులు !
తలూపింది తల్లిదెయ్యం
నిర్వికారంగా -
కృష్ణప్రసాద్ గారూ, మెరుపులా మెరిసింది మీ కవిత. చాలా బావుంది. అభినందనలు.
Too Good Made me smile. Do share your blog. Want to check your other works.