నా గుండెల్లో మునివేళ్లు ముంచి
రెండు అక్షరాల కోసం తడుముకున్నాను
తడిసిన రెండే రెండు అక్షరాలు
రెండు వేళ్లతో పట్టుకుని బయటికి తీసాను
అవి నిజానికి నేను నేలమీదకొచ్చాకా
పలికిన మొదటి రెండే రెండు అక్షరాలు
వాటిమీది అలలతో ఏకంగా
ఓ సముద్రమే బటకి వచ్చింది
వాటిని ఎవరో మట్టితో అలంకరించారు
మట్టికి ఎవరో ఆకుపచ్చని రెక్కలు తొడిగారు
భూమ్యాకాశాల రెక్కల్ని
రంగురంగుల పూలతో అలంకరించారు
పూలని గాలితరంగాలమీద ఊరేగించారు
గాలిని తేనెలో తడిపి దిక్కుల చివరి వరకూ
వినిపించేలా ఆలపించారు
పాటని సూర్య కాంతిలో మెరిసే
మంచుకొండల మధ్య ఆడుకోమని…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్