
వాళ్లకు నేనేమీ తేను. బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే ఆకుల మాటున దాగిన పూవుల్లా తటాలున బయటపడి పకాలున నవ్వుతారు. ఆపై చుట్టూ చేరి అల్లుకుంటారు. ఈలోగా ఇంటి ముందు చీకటి తెరలు వాలుతాయి. వాళ్ళ కళ్ళల్లో వెన్నెల్లు వెలుగుతాయి. వెన్నెల్లో వాన జల్లులలో సీతాకోకచిలుకలు ఎగురుతాయి. రెక్కలపై నక్షత్రాలతో పూల పుప్పొడితో ఒక చల్లటి గాలి వీయగా నిదుర అంటిన వాళ్ళ కళ్ళల్లో కథలు మొలుస్తాయి. నేను వాళ్లకు పెద్దగా కథలు ఏమీ చెప్పను. బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే ఇదిగో ఇటువంటి ఒక గాథను వింటారు అల్లుకుపోయి.
పూర్తిగా »
వ్యాఖ్యలు
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
రాజేంద్రప్రసాద్ on ద్వంద్వపదాలు
N Rammohan on ద్వంద్వపదాలు