హేమంతపు ఉదయం…
వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు
దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు
ఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలు
మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు
ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు
ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో.
***
కవిలాగే, ఆధునిక కవిత్వం కూడా ఏ ఇతరేతర ఛాయలూ, వాసనలూ లేకుండా ఒంటరిగా ఉండగలిగే వస్తువు కాదు (Just as the poet himself, modern Poetry is not an isolated entity in itself). కారణం, రచనా ప్రక్రియలో అంతర్లీనంగా అతని ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్య ప్రభావం పనిచేస్తూంటుంది. ఉపమలూ, రూపకాలూ, ధ్వనులూ, వ్యంగ్యోక్తులూ కవి కల్పనలైనప్పటికీ, ఆ కల్పనల ఎంపిక, సమకాలీనత, సందర్భమూ పూర్వంకంటే భిన్నంగా ఉండడానికి గలకారణం, ఇప్పటి కవిత్వ పరమార్థం పాఠకుడిని రంజింపజేయడానికి బదులు, ఆలోచింపజేసేవానిగా చెయ్యాలనుకోవడమే. ఈ దృష్టితో చూసినపుడు రాధిక గారి కవిత పైకి మనకి కనుమరుగైపోయిన లేదా దాదాపు కనుమరుగైపోయిన గ్రామీణ వాతావరణాన్ని చిత్రించడంలో ఒక Nostalgic Memory నిrecord చెయ్యడం కంటే, అలా కనుమరుగైపోవడానికిగల కారణాలని పాఠకుడు ఆలోచించుకోవాలనే…అని నా ఉద్దేశ్యం. కనుక ఆ మేరకు నా వ్యాఖ్యలు prejudicedగా గుర్తించవలసిందని మనవి చేస్తున్నాను.
(రాధిక)
మంచికవిత లక్షణం దానితో పాఠకుడు మమేకమవగలగడం. ఇప్పుడు సుమారు ముఫై ఏళ్ళు దాటినవారందరికీ ఈ కవిత నచ్చుతుంది. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క సమయంలో శోభ. ఈ కవితని వాక్యంలో చెపితే ఇలా ఉంటుంది: హేమంతం సూర్యోదయానికి ముందు అనుభూతి చెందవలసిన ఋతువు. వణికించేచలి. దేవాలయాల్లో పాశురాల పఠనం. వెచ్చవెచ్చగా మిరియాలు వేసిన కటిపొంగలి ప్రసాదం నైవేద్యం. దుప్పట్లు కప్పుకున్నా వదలని చలి;చలిమంటలకు కరుగుతున్న మంచుతెరలు; పొద్దుపొడిచినా వాడిలేని కిరణాలతో, వెండిబిళ్లలా కనిపించే సూరీడు. రాత్రి విరిసి గుట్టలుగా పోగుపడ్డ పారిజాతాలు.
ఈ కవితలో రెండు అందమైన వాక్యాలు ఉన్నాయి. అవి
ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో
అసలే రాత్రిప్రమాణం ఎక్కువకావడంతో, సూర్యోదయమయేటప్పటికే ఆరు గంటలు దాటుతుంది. పదిగంటలైనా పొగమంచుతెర తొలగదు. అసలే కిరణాలు ఏటవాలుగా పడటంతో వాటిలో వేడిమి తగ్గిపోతుంది. దానికి తోడు మంచుతెర ఒకటి. అందుకని సూర్యుడు ప్రయోజనం లేదని తనకిరణాలని దాచుకుంటున్నాడు. (బహుశా వేసవిలో వడ్డీతో సహా వడ్డించవచ్చునని)
రెండో దాంట్లో “చలిగిలి” అన్నప్రయోగం గమనించదగ్గది. చలికి ముడుచుకుపోయేది మనఒక్కళమేనేమిటి? తోటలోని రంగు రంగులపూలుకూడా చలికి భయపడి విచ్చుకోవటం లేదట.
అదే చమత్కారం. ఒక ప్రకృతి సహజమైన ధర్మానికి అందమైన కారణాన్ని ఉత్ప్రేక్షించడమే కవిత్వం.
మూర్తిగారూ నా కవితని ఎంచుకున్నందుకు థాంక్స్ అండి.చాలా చక్కగా,అందంగా విశ్లేషించారు.ఇవి నా జ్ఞాపకాల్లోంచి వచ్చిన అక్షరాలు.thanks once again sir.
నాకు ఇష్టమైన అక్షరాలను పరిచయం చేసిన నౌడూరి మూర్తి గారికి,
నా మానసపుత్రిక రిమ్మలపూడి రాధికకు
అభినందనలు
రాధిక గారు రాయడం దాదాపుగా మానేయడం ఆమె కవితల్ని ఇష్టపడే నా లాంటి వారంతా విచారించే విషయం. ఎక్కడ ఉన్నా సరే, పిల్ల తెమ్మెర పలరించినట్లు …..నేటివ్ పరిమళాలతో, సుతి మెత్తగా చుట్టు ముట్టేసి సేద తీరుస్తాయి ఆమె కవితలు.
రాధిక గారూ, వింటున్నారా? మళ్ళీ రాయాల్సిందే మీరు…
మూర్తి గారూ, మంచి కవిత ఎంచుకుని మరో సారి ఆ వెచ్చ దనాన్ని పంచినందుకు ధన్యవాదాలు
రాధిక గారూ, సుజాత గారి మాట మీరు వింటున్నారో లేదో అని నేను రెట్టించి మరీ అడుగుతున్నా. ఈ కవిత ‘అనేక’లో వేయడానికి ముందు ఎన్ని సార్లు చదివానో, వేశాక కూడా అన్ని సార్లూ చదివాను. ఆ ‘హేమంతపు ఉదయం’ తరవాత మళ్ళీ మీరు కనిపించడం లేదే అని ఎదురుచూస్తూ వున్నా. కనీసం ఈ విధంగా అయినా మీరు వాకిలిలో కనిపించడం సంతసంగా వుంది. మళ్ళీ వాకిట్లో మీరు ఆ –ఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలు
మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు
ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు
- అన్నీ అక్షరాలా చూపించాలని కోరుకుంటున్నా.
మూర్తి గారికి, నమస్తే.
చక్కని పరిచయం. మీ లోతైన విశ్లేషణ చాలా బాగుంది. పోయెమ్ కూడా చాలా బాగుంది. వాకిట్లో నీరెండకు నిజమైన మెరుపు మీ పరిచయం.
ఒక సారి చదివినాక, మరెన్ని సార్లైనా చదువుకోవాలనిపించే కవితని పరిచయం చేసారు, రాసిన రాధిక గారికీ, పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు, అభినందనలు.
ఈ శీర్షిక ద్వారా కవితను పరిచయం చెస్తూ విశ్లేషించడం ద్వారా కవి అంతరంగాన్ని తెలియచేస్తూ రాసే వారితో పాటు చదువరులకు కూడా కవిత్వం పట్ల ప్రేమ కలిగేట్టు చేయడానికి తోడ్పడుతున్న వాకిలి సంపాదకులకు నమస్సులు. మూర్తి గారికి ధన్యవాదాలు.. రాధిక గారికి అభినందనలు..
రాధిక గారి బ్లాగ్ లో వారి ఊరి గురించి రాసిన కవిత (చివరి కవితేమో) గుర్తుకొచ్చింది,చాలా కాలం నుంచి ఎందుకనో ఏమి రాస్తున్నట్లులేదు, చాల సాధారణంగా భావన్ని వెల్లడించడంలో అసాధారణ ప్రజ్ఞ వారిది,మంచి పరిచయం,మూర్తి గారికి ధన్యవాదాలు,రాధిక గారికి అభినందనలు,.
“మీ కవిత-మూర్తి గారి విశ్లేషణ” బంగారానికి తావి అబ్బినట్లు ఉంది.
జాన్ గారూ మానస పుత్రికా? ఎంత అదృష్టం!
సుజాత గారూ వింటున్నానండి
అఫ్సర్ గారూ ట్రై చేస్తానండి
రవి గారూ,క్రాంతి గారూ,వర్మ గారూ కవిత నచ్చిందన్నందుకు ఆనందంగా వుంది.
the tree గారూ,ఇస్మాయిల్ గారు thanks.
అందరి అభిప్రాయాలకి,అభిమానానికి చాలా థాంక్స్ అండి.
ఎన్నల్లలెన్నాళ్ళకు రాధిక గారు తిరిగి వచ్చారు…”స్నేహమా” తొ నాకు blogs ని పరిచయం చేసిన వనిత,కవితల్లో భావాలు ఎలా పండించాలొ చూపించిన విరిత తిరిగి కవితావనంలోకి వచ్చారని తెలిసి ఆనంద వర్షంలో తడిసి ముద్దవుతున్నా..మలి పరిచయం చేసిన “వాకిలి” కి అభినందనలు
chinukullo thadisina chivurakula undi…